పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ కొట్లాట
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయి అనుమానిత వ్యక్తుల ఇళ్లపై దాడికి తెగబడ్డారు. వారి ఇళ్ళు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ దాడి చేసిన వారిలో ప్రభాస్ అభిమానులు కూడా ఉండటంతో వారు కూడా తిరిగి దాడులు చేపట్టారు. దీంతో ఇద్దరు హీరోల ఆభిమానులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కాస్త చివరికి రెండు కులాల మధ్య గొడవగా మారిపోయింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 144 సెక్షన్ను అమలు చేస్తూ ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని, వారి చదువు నాశనమవుతుందని హెచ్చరించారు. అయితే ఇంత గొడవ జరుగుతున్నాఅటు పవన్ కళ్యాణ్ గానీ, ఇటు ప్రభాస్ గానీ ఇంతవరకూ స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది.