అలీ తమ్ముడికి జలగండ్రి అయ్యింది
ప్రముఖ హాస్య నటుడు అలీ తమ్ముడు, సినీ హాస్య నటుడు మహ్మద్ ఖయ్యూం పెళ్ళి జరిగింది. ఆదివారం నాడు గుంటూరులోని సన్నిధి కళ్యాణ మంటపంలో ఖయ్యూం పెళ్ళి వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ నయాబ్ రసూల్ పెద్ద కుమార్తె ఆర్షియాతో ఖయ్యూం పెళ్ళి (అలీ భాషలో జలగండ్రి) అయింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు, రాజకీయ ప్రముఖులు, గుంటూరు నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాంత్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, కృష్ణవంశీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, నటుడు, ఎంపీ మురళీ మోహన్, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఖయ్యూమ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.