sachin tendulkar warning to team india south africa world cup cricket

సచిన్ వార్నింగ్

  మొన్నటి వరకు వరల్డ్ కప్ క్రికెట్ విషయంలో ఇండియా టీమ్ విషయంలో ఎవరికీ ఏమంతగా అంచనాలేమీ లేవు. ఈసారి ఇండియా డెఫినెట్‌గా ఓడిపోతుందని దేశభక్తులు కూడా అనుకున్నారు. అలాంటిది మొదటి మ్యాచ్‌లోని పాకిస్థాన్ మీద ఇండియా టీమ్ గెలవటంతో ఇప్పుడు జట్టు మీద అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 22 ఆదివారం నాడు భారత జట్టు ముందు పెద్ద గండం వుంది. మాంఛి ఊపు మీద వున్న దక్షిణాఫ్రికా జట్టును భారతజట్టు ఢీకొనాల్సి వుంది. ఈ మ్యాచ్‌లో గనుక ఇండియా గెలిచిందంటే మనవాళ్ళ ఆత్మవిశ్వాసం బాగాపెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు కొన్ని వార్నింగులు ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో లీగ్ మ్యాచ్‌ల ఇండియా జట్టు గెలవటానికి కృషి చేయాలని అన్నాడు. పాకిస్థాన్ టీమ్ కంటే దక్షిణాఫ్రికా టీమ్ బౌలింగ్ బలంగా ఉంటుందన్న విషయాన్ని భారత బ్యాట్స్ మన్ గుర్తు పెట్టుకోవాలన్నాడు. పాకిస్థాన్ మీద సింగిల్స్ తీసినంత సులువుగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో చేయడం కుదరదన్న విషయాన్ని ఆటగాళ్లు గ్రహించాలన్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్... ఈ మూడు అంశాల్లో దక్షిణాఫ్రికా క్రీడాకారులు జమాజ్జెట్టీలని గుర్తుంచుకోవాలన్నాడు.

90 percent Of Men In Bihar Date Other Men Wives Jitan Ram Manjh

పరాయి మహిళతో డేటింగ్ తప్పుకాదట...

  పరాయి మహిళతో డేటింగ్ తప్పుకాదట.. ఈ విషయాన్ని అన్నది మరెవరో కాదు.. ఇటీవలి కాలంలో బాగా వార్తల్లోకి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ. ఈమధ్యకాలంలో ఆయన సంచలన వ్యాఖ్యలు బాగా చేస్తు్న్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయేమోగానీ జనానికి మాత్రం చిరాకు పుట్టి్స్తున్నాయి. సమాజంలో ఉన్న పురుషులలో 10 శాతం మంది పురుషులు మాత్రమే సొంత భార్యతో బయట తిరుగుతున్నారట.. మిగతా 90 శాతం మంది మగాళ్ళు పరాయి వాళ్ళ భార్యలతో తిరుగుతున్నారట. అది కూడా బీహార్‌లో అయితే ఈ ధోరణి చాలా ఎక్కువగా వుందట... ఈయన ఇక్కడితో ఆగాడా... భార్యాభర్తల మధ్య పరస్పర అంగీకారం వుంటే ఇలా తిరగటం తప్పుకూడా కాదట. మొత్తానికి భలేవాడే... నరేంద్రమోడీ గెలిచినందుకు ఫీలైపోయిన నితిష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవి మీద ఈయనగార్ని కూర్చోపెట్టాడు. ఇప్పుడు ఈయన ఏకు కాస్తా మేకులా మారి నితిష్ కుమార్‌కే గుచ్చుకున్నాడు. బీహార్ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపుకుదిపి.. జేడీయు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన త్వరలో బీహార్ అసెంబ్లీలో బల పరీక్షకు నిలవబోతున్నారు.

telangana Cm Kcr Maharastra Cm Meeting Ends With Fadnavis

నమస్తే మహారాష్ట్ర.. కేసీఆర్...

  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ భేటీ అయ్యారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, ప్రాణహిత-చేవెళ్ల, లెండి, పెన్‌గంగ ఇచ్చంపల్లి చెక్‌డ్యాంలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జోగురామన్న ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.

family killed in china

ఫ్యామిలీలో ఏడుగుర్ని చంపేసి...

  చైనాలో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన భార్య, పిల్లలతో సహా ఏడుగురిని చంపేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చైనా‌లో రెండు రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్త చైనాని కుదిపేసింది. చైనాలోని హైబై ప్రావిన్స్‌లోని గ్జియాంగౌ గ్రామంలో నివసించే వ్యుషౌగువా అనే వ్యక్తి కుటుంబంలో గత కొంతకాలంగా కలహాలు రేగుతున్నాయి. దాంతో అతను తన భార్యని, ఆమె తల్లిదండ్రులను, తన ఇద్దరు పిల్లల్ని, మరో ఇద్దరు బంధువులను సుత్తి లాంటి ఆయుధంతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత తాను కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో అతను రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తాను వీళ్ళందర్నీ ఎందుకు చంపాల్సి వచ్చిందీ వివరంగా రాశాడు. ఆ లేఖలో తనను తాను చాలా మంచివాడిగా, శాంతిదూతగా అభివర్ణించుకున్నాడు.

gandhiji mandela kcr

1. గాంధీజీ... 2. మండేలా... 3. కేసీఆర్...

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం నాడు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ బర్త్‌డేని వైభవంగా జరుపగా, ప్రస్తుతం ముంబై పర్యటనలో వున్న కేసీఆర్ అక్కడ రాజ్ భవన్‌లో బర్త్ డే కేక్ కట్ చేశారు. కేసీఆర్‌కి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ని గాంధీజీ, నెల్సన్ మండేలాతో పోల్చారు. గాంధీజీ, నెల్సన్ మండేలా తర్వాత అహింసా మార్గంలో తాను అనుకున్నది సాధించిన వ్యక్తి కేసీఆర్ అని ఈ సందర్భంగా మంత్రిగారు చెప్పారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరబోతోందని వార్తలు వస్తున్నాయని, అవన్నీ ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి ఇప్పటి వరకు అలాంటి ఆలోచనే లేదని, ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన వివరించారు.

husband try  kill wife marriage day

పెళ్ళయినరోజే పెళ్ళాం పీక నొక్కాడు

  అమెరికాకి చెందిన అమీ డాసన్ అనే ఇరవై ఏళ్ళ అందగత్తె గావిన్ గోలిట్లీ అని కుర్రాణ్ణి చూసీ చూడగానే మనసు పారేసుకుంది. అతన్ని పెళ్ళి చేసుకుంటే తన జీవితం అద్భుతంగా వుంటుందని ఆశపడింది. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెళ్ళి కూడా చేసేసుకున్నారు. అయితే పెళ్ళి జరిగిన తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. పెళ్ళిలో ఆమె భారీగా వున్న వెడ్డింగ్ గౌన్ వేసుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గౌనును మార్చుకోవాలని అనుకుంది. అయితే ఆమెకు ఆ గౌనుకు ఉన్న హుక్స్ తీయడం ఇబ్బందిగా మారింది. దాంతో అప్పుడే తన భర్త హోదా పొందిన గోలిట్లీని పిలిచి కాస్త హుక్స్ తీయవా అని గోముగా అడిగింది. మామూలుగా మెడకాయ మీద తలకాయ వున్న ఎవడైనా భార్య అంత గోముగా అడిగితే మురిసిపోతాడు. కానీ గోలిట్లీ వెంటనే ఆమె దగ్గరకి వెళ్ళి ఈడ్చి ముఖం మీద కొట్టడంతో ప్రారంభించి, ఆ తర్వాత ఆమెను ఎడాపెడా చావబాదాడు. చివరికి ఆమె గొంతు నొక్కేస్తుంటే ఆమె ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది. వెంటనే విడాకుల నోటీసు కూడా ఇచ్చింది. ఈ ఘటన జరిగి ఏడాది అయింది. ఇప్పుడు ఈ కేసు కోర్టులో తీర్పుకు వచ్చింది. కోర్టు వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేయడంతోపాటు గోలిట్లీ రెండేళ్ళపాటు సమాజ సేవ చేయాలని ఆదేశించింది. గోలిట్లీ మాత్రం చేసిందంతా చేసి ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. తాను స్వతహాగా చాలా మంచోడినని, కాకపోతే డ్రగ్స్ వాడినప్పుడు మాత్రం అలా రాక్షసుడిలా బిహేవ్ చేస్తుంటానని చెప్పాడు. మంచోడే!

jawan killed in firing after fight at BSF camp in Malda

సైనికుల గొడవ.. ఒకరి మృతి

  సరిహద్దుల్లో వుండి శత్రు సైనికులను, చొరబాటుదారులను, ఉగ్రవాదులను ఎదుర్కొండయ్యా అని నియమించిన సైనికులలో కొంతమంది ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వాళ్ళలో ఒక సైనికుడు తనమీద తాను అదుపు కోల్పోయాడు. అంతే తన దగ్గరున్న గన్‌తో తోటి సైనికుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక సైనికుడు మరణించగా, మరికొంతమంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడో, ఏదో దేశంలోనో జరిగింది కాదు... ఇలా కాల్పులు జరిపింది మన భారత జవానే. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా సైనిక శిబిరంలో ఈ ఘటన జరిగింది. ఇలా కాల్పులు జరిపిన సైనికుడిని మిలటరీ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

akkineni akhil fake facebook account

అఖిల్ పేరుతో అమ్మాయిలతో ఛాటింగ్

  హైదరాబాద్‌లో కూకట్‌పల్లికి చెందిన ఓ అమ్మాయికి ఫేస్‌బుక్ అకౌంట్ వుంది. సరే, ఈరోజుల్లో అందరికీ ఫేస్‌బుక్ అకౌంట్ కామనే అనుకోండి.. ఆ అమ్మాయి ఓరోజు ఫేస్‌బుక్ చూస్తూ వుండగా అక్కినేని అఖిల్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె అబ్బ... అక్కినేని అఖిల్ అనుకుంటూ అతనితో ఛాటింగ్ చేయడం మొదలుపెట్టింది. అవతలి నుంచి అక్కినేని అఖిల్ కూడా ఆమెతో మస్తుగా ఛాటింగ్ చేస్తున్నాడు. అఖిల్ లాంటి హీరో తనతో ఛాటింగ్ చేయడం తన అదృష్టం అనుకుంటూ ఆ అమ్మాయి కూడా అఖిల్‌తో ముచ్చటిస్తోంది. అయితే అవతలి నుంచి ఛాటింగ్ చేస్తోంది అక్కినేని అఖిల్ కాదు.. అతని పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసిన అభినవ్ అనే కుర్రాడు. అయితే ఛాటింగ్ చేసే సమయంలో అఖిల్ ఎలాంటి సమాధానాలు చెబుతాడో అలాగే చెప్పేవాడు. తన అకౌంట్లో అక్కినేని వంశం ఫొటోలు పెట్టేవాడు. టోటల్‌గా బిల్డప్ అంతా అక్కినేని అఖిల్ తరహాలోనే వుండేది. ఇలా ఆ ఒక్క అమ్మాయితో మాత్రమే కాకుండా చాలామంది అమ్మాయితో ఛాటింగ్ చేస్తూ వుండేవాడు. చివరికి ఈ అమ్మాయిని డబ్బులు అడగటం మొదలుపెట్టాడు. నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలంటూ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. వందల కోట్లకు వారసుడైన అక్కినేని అఖిల్ ఏంటీ... అప్పు అడగటం ఏంటని ఆ అమ్మాయికి డౌటొచ్చింది. వెంటనే ఆమెలోని భారత వీరనారి నిద్రలేచింది. ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పంది. దాంతో అతన్ని ట్రాప్ చేసి పట్టుకుని, ఆ చెంపా ఈ చెంపా వాయించి పోలీసులకు అప్పగించారు. తనలాగా మరెవరూ మోసపోకూడదన్న ఉద్దేశంతోనే అతన్ని పట్టించానని ఆ వీర యువతి చెబుతోంది.

Oil train derails in West Virginia america

అమెరికాలో భారీ పేలుడు

  అమెరికాలో భారీ పేలుడు జరిగింది. అయితే ఈ పేలుడు ఏ బాంబు కారణంగానో కాదు... గూడ్స్ రైలు ప్రమాదం కారణంగా జరిగింది. అదృష్టవశాత్తూ ఈ పేలుడు కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అమెరికాలోని వర్జీనియా రాష్ల్రంలో ముడి చమురు తరలిస్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఈ పేలుడు జరిగింది. ముడి చమురును తరలిస్తున్న వంద ట్యాంకులు పట్టాలు తప్పాయి. దాంతో పేలుడు జరిగి ఇవన్నీ అంటుకున్నాయి. భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో అత్యవసరస్థితిని ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా దుర్ఘటన స్థలానికి ఒక కిలోమీటరకు దూరం వరకు ఉన్న నివాసితులు ఇళ్ళు ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు.

New Zealand beat Scotland world cup cricket

స్కాట్లాండ్ మీద గెలవటానికి న్యూజిలాండ్ తంటాలు

  ఇప్పుడు మంచి ఫామ్ మీద వున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మొన్న జరిగిన ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక మీద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నాడు న్యూజిలాండ్ - స్కాట్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మాత్రం న్యూజిలాండ్ దారుణంగా ఓడిపోయేదే. అయితే చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు ఎలాగో గెలిచింది. లేకపోతే సోమవారం నాడు పసికూన ఐర్లండ్ చేతిలో వెస్టిండీస్ ఓడినట్టుగా పరిస్థితి తయారయ్యేది. ఆతిథ్య దేశంగా వున్న న్యూజిలాండ్ పరువు పోయేది. వరల్డ్ కప్ ఫేవరేట్‌గా కనిపిస్తున్న న్యూజిలాండ్‌కి ఇలాంటి పరిస్థితి వస్తుందని క్రికెట్ పండితులెవరూ ఊహించలేదు. స్కాట్‌లాండ్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు వుంచింది. అయితే న్యూజిలాండ్ ముక్కుతూ మూలుగుతూ బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లు పోగొట్టుకుని విజయ లక్ష్యాన్ని చేరుకుంది. అయితే మిగతా మూడు వికెట్లు కూడా పోయినట్టయితే న్యూజిలాంట్ జట్టు కొంప కొల్లేరయ్యేది.

kcr met modi delhi trs in nda cabinet

మోడీతో కేసీఆర్ భేటీ

  భారత ప్రధాని నరేంద్రమోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో కేసీఆర్ మోడీని కలిశారు. ప్రధానితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలు, రాయితీలు, ప్యాకేజీల మీద చర్చించడానికే కేసీఆర్ ప్రధానిని కలిశారని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ, మోడీ - కేసీఆర్ భేటీ వెనుక వున్న ప్రధానోద్దేశం ఎన్డీయే ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి కావడమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో టీఆర్ఎస్‌కి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం వుందని, దాని గురించి చర్చించడం కోసమే కేసీఆర్ మోడీని కలిశారని అంటున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఎన్టీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరడం ఖాయమని జాతీయ మీడియా చెబుతోంది.

yuvaraj singh yogaraj singh dhoni world cup team

ఎస్... అంతా ధోనీయే చేశాడు...

  ఐపీఎల్ వేలంలో క్రికెటర్ యువరాజ్‌సింగ్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్ సంస్థ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్ వరల్డ్ కప్‌ టీమ్‌కు ఎంపిక కాలేదన్న బాధ ఆయన అభిమానుల్లో వుంది. ఈ నేపథ్యంలో ఆయన ఐపీఎల్‌లో ఆడటానికి భారీ మొత్తం పొందటం ఆయన అభిమానులకు ఊరట కలిగిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ధోనీ మీద మాటల దాడి చేశారు. యువరాజ్ సింగ్‌కి భారత జట్టులో స్థానం దక్కకపోవడానికి ధోనీ నడిపిన రాజకీయాలే కారణమని విమర్శించారు. యువరాజ్ సింగ్‌కి వ్యతిరేకంగా రాజకీయాలు నడపడానికి గల కారణాన్ని తనకు ధోనీ నుంచి తెలుసుకోవాలని వుందని ఆయన అన్నారు. యువరాజ్ క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా దేశం కోసం శ్రమించి ఆడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత ప్రపంచ కప్‌లో యువరాజ్ ఆల్ రౌండ్ ప్రతిభను కనబరిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడని, కానీ ఈసారి వరల్డ్ కప్‌లో యువీకి ధోనీ అసలు స్థానమే లేకుండా చేశాడని యోగ్‌రాజ్ సింగ్ ఆరోపించారు.

nagam case high court chest hospital

తుస్సుమన్న నాగం కేసు

  భారతీయ జనతా పార్టీ నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన కేసును కోర్టు కొట్టేసింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో వున్న చెస్ట్ ఆస్పత్రిని హైదరాబాద్ నగర శివార్లకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. అయితే ఇది విధానపరమైన నిర్ణయమని, దీనికి ప్రభుత్వం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అంటు వ్యాధులకు చికిత్స చేసే వైద్యాలయం నగర శివార్లకు తరలిస్తే మంచిదేకదా అంటూ వ్యాఖ్యానిస్తూ నాగం దాఖలు చేసిన కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసు విషయం ఇలా వుంటే, చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరో కేసు దాఖలైంది. చెస్ట్ ఆస్పత్రిలోని చారిత్రక కట్టడాలను కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభాకర్ అనే వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఈ చారిత్రక కట్టడాలకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది.

actress manorama ill health

మనోరమ మరణించారని పుకార్లు

  ప్రముఖ తమిళ నటి, తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించిన మనోరమ మరణించారంటూ కొన్ని ప్రముఖ దినపత్రికలు పుకార్లను వ్యాపింపజేశాయి. అయితే మనోరమ ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన మాట వాస్తవమే.. అయితే ఆమె బాగానే వున్నారు. ఇటీవలి కాలంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బతికి వున్నవాళ్ళని కూడా చంపేస్తోంది. ఈమధ్య ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ విషయంలో కూడా అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా ఆయన్ని మూడు రోజుల ముందే చంపేసింది. రామ్‌గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా ఆయనకు సంతాపాన్ని ప్రకటించారు. అయితే ఆ తర్వాత మీడియా, రామ్ ‌గోపాల్ వర్మ నాలుకలు కరుచుకున్నారు. ఇప్పుడు మనోరమ విషయంలో కూడా అలాగే జరిగింది.

tirupati assembly elections results sugunamma win tdp

తిరుపతిలో సుగుణమ్మ విజయం

  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఘనవిజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రుద్రరాజు శ్రీదేవి మీద 1,16,524 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ సుగుణమ్మ ఆధిక్యంలోనే వున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేసరికి భారీ మెజారిటీతో విజయం సాధించారు. సుగుణమ్మ భర్త, టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ మరణంతో తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా సుగుణమ్మను గెలిపించాలని తెలుగుదేశం అభ్యర్థించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, లోక్ సత్తా పార్టీ రంగంలో నిలిచాయి. ఇండిపెండెంట్లతో కలసి మొత్తం 13 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. అయితే ముందుగా అందరూ ఊహించినట్టే ఈ ఎన్నికలలో సుగుణమ్మ విజయం సాధించారు.

ఆ నటిది ఆత్మహత్యే

  పలు సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో నటించిన దీప్తి అలియాస్ రామలక్ష్మి ఇటీవల హైదరాబాద్ ఫతేనగర్‌లోని తన ఫ్లాట్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె ఉరి వేసుకుని చనిపోయే ముందు తన సెల్ఫీ తాను తీసుకుని మరణించింది. రామలక్ష్మి మరణాన్ని మొదట అందరూ ఆత్మహత్య అనుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అందరిలా నమ్మేయకుండా ఈ మరణం హత్య కూడా కావొచ్చని అనుమానించారు. ఎందుకంటే, ఆమె గత కొంతకాలంగా ఒక టీవీ దర్శకుడితో సహజీవనం చేస్తోంది. అతనితో గొడవల కారణంగా హత్య కూడా జరిగే అవకాశం వుందని పోలీసులు అనుమానించారు. అయితే దీప్తి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆమెది హత్య కాదని... ఆత్మహత్యేనని స్పష్టత ఇచ్చారు. అయితే ఇంతవరకూ ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఆమె ఫోన్‌లో, లాప్‌టాప్‌లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని పోలీసులు శోధిస్తున్నారు. దీప్తి సహజీవనం చేస్తున్న కిరణ్ అనే వ్యక్తి ఇంకా పోలీసుల అదుపులోనే వున్నాడు.

వెస్టిండీస్ టెంకె పగిలింది

  క్రికెట్‌లో సీనియర్లం, వీర బాదుడుగాళ్ళం, భారీ పర్సనాలిటీలం అని చెప్పుకునే వెస్టిండీస్ క్రికెట్ జట్టు డిప్ప పగిలింది. ఈమధ్యే క్రికెట్‌లోకి ఎంటరైన ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రపంచ కప్ క్రికెట్ సందర్భంగా సోమవారం నాడు వెస్టిండీస్ - ఐర్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. పిల్లకూన ఐర్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచానని మురిసిపోయింది. అయితే ఐర్లండ్ క్రీడాకారులు చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోయారు. 46 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని ఛేదించి, వెస్టిండీస్ డిప్ప పగులగొట్టారు. గతంలో కూడా పెద్ద పెద్ద దేశాలం, తురుంఖాన్‌లం అనుకునే దేశాలను కూడా ఐర్లండ్ ఓడించింది. ఒకసారి ఇంగ్లండ్‌ని కూడా ఓడించింది. ఇలాంటి వింతలు ఈ ప్రపంచ కప్‌లో ఇంకెన్ని చూస్తామో.

అతని ఖరీదు 16 కోట్లు

  ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ మంచి ఫామ్‌లో వున్న సమయంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. అయినప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మంచి ఫామ్‌లోకి వచ్చి క్రికెట్‌లో అదరగొట్టాడు. చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు. అయితే ఈసారి ప్రపంచకప్‌కి యువరాజ్ ఎన్నికవుతాడని, ఎన్నిక కావాలని అందరూ భావించారు. అయితే ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. కానీ, ఆయన్ని లక్ మరోరకంగా వరించింది. ఐపీఎల్ కోసం ఆయన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గత ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్ రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడాడు. ఈసారి రాయల్ ఛాలెంజెర్స్ యువరాజ్‌కి పెద్ద డిమాండ్ ఏముందిలే అనుకుని అతన్ని వదులుకుంది. అయితే అనూహ్యంగా అతని కోసం అనేక ఐపీఎల్ సంస్థలు పోటీ పడటంతో మళ్ళీ తాను కూడా వేలంలోకి దిగింది. గతంలో చెల్లించిన మొత్తంకంటే ఎక్కువ మొత్తానికి... అంటే 12 కోట్ల రూపాయలకు యువరాజ్‌ని కొనాలని ప్రయత్నించింది. అయితే హోరాహోరీగా జరిగిన వేలంలో యువరాజ్ సింగ్ 16 కోట్ల రూపాయలకు ఢిల్లీకి సొంతమయ్యాడు.

పూరి జగన్నాథ్ కొడుకు గొడవేంటి?

  సినిమావాళ్ళతో ఓ ఎస్.ఐ. ఓవర్ యాక్షన్ చేశాడు. దాంతో అనవసరమైన గొడవలో ఇరుక్కుపోయి ఇప్పుడు అల్లాడుతున్నాడు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా ‘ఆంధ్రాపోరి’ అనే సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లా పాల్వంచలో జరుగుతోంది. సినిమా యూనిట్ మెంబర్లు అందరూ భద్రాచలం రోడ్‌లోని ఒక హోటల్లో బస చేశారు. ఒకరోజు అర్ధరాత్రివేళ పాల్వంచ ఎస్.ఐ. షణ్ముఖాచారి ఈ హోటల్‌కి వచ్చాడు. అక్కడ బస చేసిన సినిమా యూనిట్ సభ్యులతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. పూరి జగన్నాథ్ కొడుకుతో కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ఖమ్మం జిల్లాకు వెళ్ళి అక్కడి ఉన్నతాధికారులకు జరిగిన ఘటన మొత్తాన్నీ పూస గుచ్చినట్టు వివరించాడు. దాంతో పోలీసు అధికారులు సదరు ఎస్.ఐ.ని జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. దాంతో ఇప్పుడు ఆ ఎస్.ఐ. షణ్ముఖాచారి లబోదిబో అంటున్నాడు.