ఇస్లాంలోకి మారతామంటున్న బ్రాహ్మణులు
బ్రాహ్మణులేంటి? ఇస్లాం మతంలోకి మారతాననడం ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే? ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో 150మంది బ్రాహ్మణులు... తామంతా ఇస్లాంలోకి మారిపోతామంటున్నారు? అయితే ఇస్లాంపై ప్రేమతోనే, ఆ మత సంప్రదాయాలు నచ్చో...అందులో చేరతామనడం లేదు, పోలీసులపై కోపంతోనే ఆ పని చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు
తమ బాలికను దళిత యువకుడు కిడ్నాప్ చేశాడని ఫిర్యాదుచేసి, పదిరోజులు కావొస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న సింఘావలీ అహిర్ గ్రామ బ్రాహ్మణులు... ఖాకీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించకపోతే, తామంతా ఇస్లాం మతంలోకి మారిపోతామంటూ పోలీసులకు విచిత్రమైన హెచ్చరిక జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేపట్టిన బ్రాహ్మణులు...తమ ఫిర్యాదుపై అధికారులు స్పందించకపోతే, ఇస్లాంలోకి మారిపోతామంటూ కలెక్టర్ కు వినతిపత్రం కూడా ఇచ్చారు. అయితే బాలిక ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఏఎస్సీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు.