జగన్ మీటింగ్ కు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా.. గుడ్ బై చెబుతారా..?

ఏపీలో వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైనట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. నిన్ననే మరో ఎమ్మెల్యే డేవిడ్ రాజు కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇలా వరుస వలసలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవైపు టీడీపీతోనే పడలేకపోవడంతో మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా జగన్ కు తలనొప్పిగా తయారైనట్టు తెలుస్తోంది.   పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార పార్టీలోకి జంప్ అవుతున్న నేపధ్యంలో జగన్ కాస్త జాగ్రత్తగా ఉంటూ.. పార్టీ నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు పార్టీ నేతలే డుమ్మా కోడుతున్నారు. ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. అందరు ఎమ్మెల్యేలు హాజరుకావాలని ఆదేశించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం జగన్ మాటను పెడచెవిన పెట్టి సమావేశానికి  గైర్హాజరయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పలు ఆసక్తికర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పదిమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారా.. అందుకే సమావేశానికి హాజరు కాలేదా అంటూ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   అయితే మరోపక్క ఈ ఎమ్మెల్యేలు మాత్రం తమ వ్యక్తిగత కారణాలవల్లే సమావేశానికి రాలేకపోతున్నామని చెబుతున్నారు. కానీ వీరిలో కొందరు మాత్రం పార్టీని వీడటం పక్కా అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

రంగు, రుచి, వాసన లేని బడ్జెట్.. జైట్లీ బడ్జెట్ పై పలువురి స్పందనలు

అందరూ ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు జైట్లీ. అయితే ఇప్పుడు ఆయన వేసిన బడ్జెట్ అకౌంట్స్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్..   అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను గ్రామీణ, రైతుల, పేదల బడ్జెట్ గా రాధామోహన్ సింగ్ అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా పేదలు, రైతులు, గ్రామీణులకు పెద్ద పీట వేసిన బడ్జెట్ ఇదని ఆయన అన్నారు. కమల్ నాథ్ దేశ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక సుస్థిరతకు ఏది ఉండాలో అదే బడ్జెట్ లో లోపించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు. అరుణ్ జైట్లీ దశ, దిశ లేని బడ్జెట్ ను ప్రవేశపెట్టారని విమర్శించారు. ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరీక్ష పాసయ్యారని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా అన్నారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లబ్ధి ఒనగూరిందని ఆయన అన్నారు. శశిథరూర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఏమాత్రం రంగు, రుచి, వాసన లేని అతి సాధారణ బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అన్నారు. యుపిఎ హయాంలోని పలు పథకాలనే మ‌ళ్లీ జైట్లీ పేర్కొన్నారని శశిథరూర్‌ అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు మరీ ఇంత తక్కువా..

ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ఈసారి కూడా  అనుకున్నంత నిధులు రాలేదనే అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కేటాయించమని కోరినప్పటికీ కేంద్రం మాత్రం ఏదో నామమాత్రపు నిధులే కేటాయించింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పోలవరానికి రూ.100 కోట్లు కేటాయించారు. అయితే దీని నిర్మాణ పనులకు గాను ఏపీ ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.. కేంద్రం మాత్రం 100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. మరి ఈ వంద కోట్లతో ఏపీ ప్రభుత్వం ఏం నిర్మాణం చేపడుతుందో చూడాలి. మొత్తానికి కేంద్రం ఇలా కొసరి, కొసరి ఇస్తే పోలవరం నిర్మాణం ఎప్పుడయ్యోనో ఏమో..

మొత్తం బడ్జెట్ 19.78.. ప్రణాళిక వ్యయం 5.5 లక్షల కోట్లు

  కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 ఏడాదికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఏడాదికి గాను మొత్తం బడ్జెట్ 19.78 లక్షల కోట్లు కాగా.. ప్రణాళిక వ్యయం 5.5 లక్షల కోట్లు.. ప్రణాళికేతర వ్యయం 14.28 లక్షల కోట్లు ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. ఇంకా పలు అంశాలు.. * బ్యాంకుల మూలధన సమీకరణకు రూ.25వేల కోట్లు * ముద్రా బ్యాంక్‌ ద్వారా రూ.లక్షా 80 వేల కోట్ల మేర రుణాలు * పంటల బీమా పథకాలకు గత బడ్జెట్‌ కంటే నిధులు రెట్టింపు * రూ.900 కోట్లతో పప్పు ధాన్యాలకు మార్కెట్‌ స్థిరీకరణ నిధి * రోడ్లు, జాతీయ రహదారులపై ప్రణాళికా వ్యయం 28శాతం పెంపు * ఆర్థిక సేవల విషయంలో ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ చట్టం * సాగరమాల ప్రాజెక్టు కోసం రూ.8వేల కోట్లు *రూ35లక్షల లోపు ఇల్లు కొనుక్కొనే వారికి మినహాయింపు * పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ 10నుంచి 15శాతం పెంపు * రూ.10లక్షల పైబడ్డ కార్ల కొనుగోలుపై 1శాతం సర్వీస్ ఛార్జి విధింపు * బీడీలపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు

బడ్జెట్‌- రహదారుల కోసం కోట్లకి కోట్లు!

  దేశంలో మౌలిక సదుపాయాలను కల్పించడం తన తొలి ప్రాధాన్యతలలో ఒకటని పేర్కొన్ని జైట్లీ తదనుగుణంగా కేటాయింపులను అందచేస్తున్నారు.   - రహదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 70,000 ప్రాజెక్టులలో 85 శాతం ప్రాజెక్టును తిరిగి పట్టాల మీదకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మంత్రిగారు.   - కేవలం రహదారుల అభివృద్ధి కోసమే 97,000 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు తెలిపారు.   - రహదారి మీద రవాణాకు సంబంధించిన ‘మోటారు వాహనాల చట్టం’లో యాజమాన్య హక్కులకు సంబంధించి తగిన మార్పులను చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.   - రాష్ట్రీయ రహదారులకు సంబంధించిన 50,000 కిటోమీటర్ల మేర రహదారులను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు ప్రకటించారు.

జైట్లీ బడ్జెట్ అకౌంట్స్.. ప్రధానాంశాలు ఇవే.

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ గురించి ప్రసంగం కొనసాగుతోంది. ఈయన ప్రసంగంలో అంశాలు.. * ఈ ఏడాది ప్రణాళిక వ్యయాన్ని పెంచుట. * రైతుల కోసం బీమా పథకం * పంటల బీమాకు 5500 కోట్లు * మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం * రైతుల కోసం ఏప్రిల్ 14 నుండీ ఈ మార్కెటింగ్ సదుపాయం * 2022 కల్లా వ్యవసాయాధారిత ఆదాయం రెట్టింపు * స్వల్ప ప్రీమియం ఎక్కువ పరిహారంతో పంటలకు పీఎం ఫసల్ బీమా యోజన * వ్యవసాయం రైతు సంక్షేమానికి 35964 కోట్లు * రైతుల కోసం బీమా పథకం * వ్యవసాయం రైతు సంక్షేమానికి 35964 కోట్లు * బీపీఎల్ కుటుంబాలకు వంట గ్యాస్ కొత్త పాలసీ * ప్రతి కుటుంబానికి లక్ష బీమా కల్పించేలా కొత్త ఆరోగ్య పథకం * ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజకను 19 వేల కోట్లు * నా బార్డ్ కింద నీటి పారుదల కోసం 20 వేల కోట్లు * వ్యవసాయం ఉపాధి హామి పథకాల అనుసంధానం * మార్చ్ 31 నాటికి 23 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యం * నిరు పేదలకు వంట గ్యాస్ కోసం 2వేల కోట్లు * దేశ వ్యాప్తంగా కొత్తగా 62 నవోదయ విద్యాలయాలు * గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు * గ్రామీణ ప్రాంతాలకు అదనపు వనరుల కల్పన * భూగర్భ జలాల పెంపునకు 60 వేల కోట్లు * ఆథార్ కార్డు కింద అందరికీ పథకాలు * వయో వృద్ధులకు రూ.30వేలు అదనంగా ఆరోగ్య బీమా * అంబేద్కర్‌ 125వ జయంతికి నివాళిగా ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతుల పెంపు * ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి రూ.1700 కోట్లు * రాబోయే మూడేళ్లలో కోటి మంది యువతకు నైపుణ్యాల పెంపు * బహుముఖ నైపుణ్యాల శిక్షణకు దేశవ్యాప్తంగా 5700 పాఠశాలల ఏర్పాటు * కొత్త ఉద్యోగులకు మొదటి మూడేళ్లు 8.33 శాతం ఈపీఎఫ్‌ ప్రభుత్వమే చెల్లిస్తుంది. * పంచాయతీలు, పురపాలక సంఘాల ఆర్థిక సాయం కోసం రూ.2.87లక్షల కోట్ల గ్రాంటు * స్టార్టప్‌ ఇండియా స్టాండప్‌ ఇండియా కోసం రూ.500 కోట్లు

బడ్జెట్‌ సాగుతోంది..

  రైతు సంక్షమంతో కూడిన వ్యవసాయం, గ్రామీణ రంగం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు, ఆర్థిక రంగంలో సంస్కరణలు, వ్యాపారాన్ని సరళీకృతం చేయడం, ఆర్థిక క్రమశిక్షణ, తేలికగా ఆదాయపు పన్నుని దాఖలు చేసేందుకు సంస్కరణలు... వంటి విషయాలకు తాను ఈసారి బడ్జెట్లో అధిక ప్రాధాన్యతని ఇస్తున్నట్లు అరుణ్‌ జైట్లీ తన ప్రసంగం ఆరంభంలో పేర్కొన్నారు. ఇంకా...   - దారిద్ర్య రేఖకు దిగువునున్న కుటుంబాలకు నూతనంగా గ్యాస్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టారు.   - ప్రధానమంత్రి మనసుకి దగ్గరైన స్వచ్ఛ భారత్‌ పథకానికి 9,000 కోట్లు కేటాయించారు.   - గ్రామపంచాయితీలకు 2.87 లక్షల కోట్లను అందచేస్తున్నట్లు తెలిపారు.   - గ్రామీణ రంగానికి మరింత జవసత్వాలు కల్పించేందుకు  87,769 కోట్లను కేటాయించారు.   - ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని కల్పించేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట!

  వ్యవసాయానికి ఈసారి పెద్ద పీట వేస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే చెప్పారు. అందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగానికి అనేక వరాలను ప్రకటించారు. వాటిలో ముఖ్యమైనవి...   - వచ్చే ఏడాది వ్యవసాయానికి 9 లక్షల కోట్ల రుణాలను అందించాల్సిందిగా లక్ష్యాన్ని ప్రకటించారు.   - సేంద్రీయ పద్ధతులలో సాగు చేసేందుకు ‘పరంపరాగత్‌ కృషి వికాస్ యోజన’ పేరుతో 5 లక్షల ఎకరాలకు సాయం.   - అప్పులతో చితికిపోతున్న రైతుల ఆదాయాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసే విధంగా చర్యలు.   - 28.5 లక్షల హెక్టార్లను సాగు చేసేందుకు తగిన నీరు అందించబోతున్నట్లు తెలిపారు.

సీతారాం ఏచూరికి బెదిరింపులు

  సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరికి కొద్ది రోజులుగా బెదిరింపుతో కూడిన ఫోన్లు వస్తున్నాయట. ఈ మేరకు ఆయన దిల్లీ పోలీసుల వద్ద ఫిర్యాదుని కూడా చేశారు. జేఎన్‌యూలో జరిగిన వివాదానికి సంబంధించి, పార్లమెంటులో స్మృతీ ఇరానీ, సీతారాం ఏచూరికి మధ్య వాడివేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే! జేఎన్‌యూలో దుర్గాదేవిని నిందిస్తూ, రాక్షసుడైన మహిషాసురుని కీర్తిస్తూ వేడుకులు చేసుకుంటారంటూ సంబంధిత కరపత్రాలను స్మృతీ ఇరానీ చదివి వినిపించారు.   కరపత్రాలను చదవడం విషయమై ఏచూరికీ, స్మృతీ ఇరానీ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ‘నువ్వు దుర్గాదేవిని తక్కువ చేస్తూ మాట్లాడతావా?’ అంటూ ఏచూరికి గత కొద్ది రోజులుగా బెదిరింపులు వస్తున్నాయట. పోలీసులు ఈ ఫిర్యాదుని స్వీకరించి, ఏచూరికి వచ్చిన ఫోన్‌ నెంబర్లను కూడా గుర్తించినట్లు సమాచారం. గతంలో ఇలాగే సీపీఐకి చెందిన మరో నేత డి.రాజాకు కూడా బెదిరింపు ఫోన్లు విషయం రావడం గమనార్హం. జేఎన్‌యూలో ఒక విద్యార్థి సంఘానికి నేత అయిన డి.రాజా కుమార్తెను అంతమొందిస్తామంటూ వచ్చిన సదరు ఫోన్‌కాల్స్‌ వార్తల్లో నిలిచాయి.