బడ్జెట్ సాగుతోంది..
రైతు సంక్షమంతో కూడిన వ్యవసాయం, గ్రామీణ రంగం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు, ఆర్థిక రంగంలో సంస్కరణలు, వ్యాపారాన్ని సరళీకృతం చేయడం, ఆర్థిక క్రమశిక్షణ, తేలికగా ఆదాయపు పన్నుని దాఖలు చేసేందుకు సంస్కరణలు... వంటి విషయాలకు తాను ఈసారి బడ్జెట్లో అధిక ప్రాధాన్యతని ఇస్తున్నట్లు అరుణ్ జైట్లీ తన ప్రసంగం ఆరంభంలో పేర్కొన్నారు. ఇంకా...
- దారిద్ర్య రేఖకు దిగువునున్న కుటుంబాలకు నూతనంగా గ్యాస్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టారు.
- ప్రధానమంత్రి మనసుకి దగ్గరైన స్వచ్ఛ భారత్ పథకానికి 9,000 కోట్లు కేటాయించారు.
- గ్రామపంచాయితీలకు 2.87 లక్షల కోట్లను అందచేస్తున్నట్లు తెలిపారు.
- గ్రామీణ రంగానికి మరింత జవసత్వాలు కల్పించేందుకు 87,769 కోట్లను కేటాయించారు.
- ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని కల్పించేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.