వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడుతోంది..!
టి 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడబోతోంది. ఇప్పటి వరకూ తమ ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో, పాకిస్థాన్ టి 20 టోర్నీలో ఆడేది లేనిది అనుమానంగా మారింది. ఇండియాలో పాక్ టీం కు భద్రత లేదన్న నెపంతో, ఇప్పటి వరకూ అనుమతి నిరాకరించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఎట్టకేలకు అనుమతినిచ్చింది. కానీ పాక్ టీం కు స్పెషల్ సెక్యూరిటీ ఎరేంజ్ చేయాలని ఐసీసీని కోరింది. ఒకవేళ పాక్ ఈ టోర్నీలో ఆడకపోతే, ఐసీసీకి పెనాల్టీ చెల్లించాల్సి వచ్చేది. పాకిస్థాన్ క్వాలిఫైర్ మ్యాచ్ ను మార్చి 16 న ఆడుతుంది. మార్చి 20న ధర్మశాలలో భారత్ తో ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ చూడటం కోసం, వందలాది పాకిస్థాన్ పౌరులు పౌరులు ఇండియా రావాలనుకుంటున్నారని, వారందరికీ భారత ప్రభుత్వం వీసాలు ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నామని పిసీబీ అంటోంది.