Jammu

జమ్మూలో ఉగ్రవాది దాడి, ఒక బి.యస్.యఫ్. జవాను మృతి

  గత మూడు దశాబ్దాలుగా భారతదేశం మీద పాకిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది. అక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ పైకి పంపిస్తూ అనేక వందల మందిని బలిగొంటోంది. అయినా దాని రక్తదాహం తీరడం లేదు. మళ్ళీ ఈరోజు ఉదయం జమ్ములో ఉదంపూర్ జిల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై నరసు నాలా వద్ద సరిహద్దు భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఒక బి.యస్.యఫ్.జవాను మరణించగా మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే జవాన్లు కూడా ఎదురుదాడి చేసి తమపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు.   ఈ ఘటనపై స్పందించిన జమ్మూ&కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా “ఈ దాడి జరిగిన జాతీయ రహదారిలో ఉగ్రవాదుల దాడి జరిగి చాలా కాలమే అయ్యింది. ఎందుకంటే ఆ ప్రాంతాల నుండి ఉగ్రవాదులను ఎరివేయబడ్డారు. కానీ మళ్ళీ ఇప్పుడు దాడి జరగడం చాలా ఆందోళన కలిగిస్తోంది,” అని ట్వీట్ మెసేజ్ చేశారు.

Madhyapradesh

మధ్యప్రదేశ్ లో రెండు ఘోర రైలు ప్రమాదాలు

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి 11.45 గంటలకు ఒకేచోట రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి.ముంబై నుండి వారణాశికి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్, జబల్ పూర్ నుండి ముంబై వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ రైళ్ళు హర్దా జిల్లాలో ఖిర్కియా -బిరంగీ రైల్వే స్టేషన్ల మధ్య మాచక్ నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయాయి.   మొదట కామయాని ఎక్స్ ప్రెస్ రైలు వంతెనపై పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా 6 బోగీలు నదిలో పడిపోయాయి. మరికొన్ని నిమిషాలకి రెండవ వైపు నుండి వస్తున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా అదే వంతెనపైకి రాగానే పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా నాలుగు బోగీలు నదిలో పడిపోయాయి.   మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వానల కారణంగా మాచక్ నదికి వరద వచ్చి పట్టాల క్రింద రాళ్ళు, మట్టి కొట్టుకుపోవడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంతవరకు 12మంది మరణించగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. కానీ రెండు రైళ్ళకి చెందిన బోగీలు నదిలో పడిపోవడం వలన ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయి ఉండవచ్చును. నదిలో రెండు రైళ్ళకు చెందిన మొత్తం 15బోగీలు పడిపోయినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే నిజమయితే మృతుల సంఖ్య చాలా భారీగా ఉండవచ్చును.   ఈ ప్రమాదం సంగతి తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అర్ధరాత్రి చీకటిలో చాలా జోరుగా వాన కురుస్తున్న సమయంలో ఉదృతంగా ప్రవహిస్తున్న మాచక్ నది మీద ఉన్న రైల్వే వంతెనపై సహాయ కార్యక్రమాలు చేప్పట్టడం చాలా కష్టం అయినప్పటికీ అధికారులు, సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి ఇంతవరకు సుమారు 300 మందిని రక్షించగలిగారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరుతో సహా ఉన్నతాధికారులు, పోలీసులు అందరూ ప్రమాద స్థలానికి తరలివచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు సహాయ కార్యక్రమాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఒకేసారి, ఒకేచోట రెండు రైళ్ళు పట్టాలు తప్పి నదిలో పడిపోవడం వెనుక మరేవయినా కారణాలున్నాయా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ramgopal varma tweets on modi

ఆయన చేతులూ తినేయడం ఖాయం... మోదీపై వర్మ ట్వీట్లు

  ఇతరులను విమర్శించడం అనేది విమర్శల వర్మ రాంగోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన విమర్శల బాణాలకు ఎవరైనా బలవ్వాల్సిందే. ఆఖరికి ఆయన దేవుడినే వదలలేదు పాపం మనుషులను ఏం వదులుతాడు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్సలు విసిరారు. అంటే ప్రత్యక్షంగా ఎక్కడా మోదీ పేరు వినిపించకపోయినా పరోక్షంగా మాత్రం మోదీనే విమర్శించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫోర్న్ సైట్లను నిషేదించిన సంగతి తెలిసిందే. దీనిపై రాంగోపాల్ వర్మ విమర్శిస్తూ ట్వీట్టర్ లో ట్వీట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు మోదీ పై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆయన హీరో అయ్యారని.. సోషల్ మీడియా ఆయనను హీరో చేసిందని.. తనకు కూడు పెట్టిన సోషల్ మీడియా చేతులనే ఆయన తినేశారని వర్మ విమర్శించారు. ఇప్పుడు ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆయన రెండు చేతులనూ తినేయడం ఖాయమని ఆయన అన్నారు.

pawan kalyan sardar movie

పవన్ కళ్యాణ్ గడ్డం సీక్రెట్

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన తాజా సినిమాకు సర్ధార్ అనే పేరును ఖరారు చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా తరువాత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని.. రాజకీయ క్షేత్రంలో తడాఖా చూపించడానికి సిద్దమవుతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు కూడా సర్దార్ పాపారాయుడు సినిమా తీసిన తరువాతే రాజకీయాల్లోకి వచ్చి ఒక ఊపు ఊపేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో సర్దార్ సినిమా తీసిన తరువాత రాజకీయాల్లో ఒక ఊపు ఊపుతారని అంటున్నారు. ఈ చిత్రం కోసమే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గడ్డం పెంచారని.. ఈ సినిమాలో పాత్రకు.. సర్దార్ పాపారాయుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు దగ్గర పోలికలున్నాయని అంటున్నారు. కాగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసే ముందు సర్దార్ పాపారాయుడు వచ్చింది.. అదే విధంగా సర్దార్ చిత్రం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి పనికి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

telngana leaders fire on kcr

కేసీఆర్ పాలనను గాలికొదిలేశారు

  ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షనేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష నాయకులు వరుసపెట్టి కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తానని మాటలైతే చెప్పారు కాని చేతలు మాత్రం నిల్లని విమర్శిస్తున్నారు. అసలు ఆయన సచివాలయానికే వెళ్లనిది పాలన ఎక్కడ నుండి చేస్తారని.. పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. మరోవైపు అధికారంలోకి రావడానికి హామీల హామీల మీద ఇచ్చారని.. ఇప్పుడు సరిగా ఒక్కటి కూడా నెరవేర్చట్లేదని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది పైన అవుతున్నా ఇంత వరకూ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఎద్దేవ చేశారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కారని మండిపడ్డారు. కెసిఆర్ అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చాక మరో మాట చెబుతున్నారన్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తీర్చాలంటే ఇంకో 25 ఏళ్లు పడుతుందని.. ప్రస్తుతం తెలంగాణ ఖజానా ఖాళీ అయింది ఇంక ఎలా హామీలన్నీ తీర్చుతారని.. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని అన్నారు.

venkaiah naidu about high court

హైకోర్టు కూడా విడిపోవాల్సిందే.. వెంకయ్యనాయుడు

  ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల్లో హైకోర్టు వివాదం కూడా ఒకటి. ఈ విషయంపై తెలంగాణ వాదులు వాదనలు జరుపుతూనే ఉన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా లోక్ సభులో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును తప్పక విభజించాలని.. ఇప్పటికే ఈ విషయంపై చాలాసార్లు కేంద్ర మంత్రులతో చర్చించామని సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజేశారని చెప్పారు. అయినా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఏపి సిఎం, సచివాలయం, డిజిపి ఉన్నప్పుడు హైకోర్టు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పుడు హైకోర్టు కూడా విడిపోవాల్సిందే.. అయితే హైకోర్టు విభజన పై ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని.. దీనిపై న్యాయశాఖ కసరత్తు చేస్తోందని చెప్పారు.

Boss gave his employees Rs 1.5 Crore bonus

గ్రేట్ బాస్.. ఒక్కో ఉద్యోగికి కోటిన్నర బోనస్

  ఒక కంపెనీ ఉన్నత స్థాయికి చేరాలంటే ఆ కంపెనీ యాజమానే కాదు అందులో పనిచేసే ఉద్యోగులది ఎంతో కీలక పాత్ర ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లంటూ అప్పుడప్పుడు పార్టీలంటూ ఏర్పాటు చేసి వారిని ఉత్తేజపరుస్తారు. అయితే ఇక్కడ ఓ వ్యాపార వేత్త ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల డాలర్లు అంటే కోటిన్నర రూపాయలు బోనస్ గా ఇచ్చి ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ వివరాలు చూద్దాం..   టర్కీకి చెందిన నెవ్‌జాత్ అదియాన్ వ్యక్తికి యెమక్‌సేపతి.కామ్ అనే ఆన్‌లైన్ కంపెనీ ఉంది. అయితే అతను తన కంపెనీని జర్మనీకి చెందిన ‘డెలివరీ హీరో అనే వ్యాపారవేత్తకు ఈ ఏడాది మేలో 589 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. అయితే నెవ్‌జాత్ తన కంపెనీని అమ్మగా వచ్చిన డబ్బులో కొంత డబ్బున ఉద్యోగులకు అందించాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతే తన కంపెనీ ఇంత పైకి రావడానికి తన ఉద్యోగులే కారణమని అందులోనే 27 మిలియన్ డాలర్లు అంటే 173 కోట్లను ఉద్యోగులకు కేటాయించాడు. దీంతో ఆ కంపెనీలు పని చేసిన ఒక్కో ఉద్యోగీ దాదాపు కోటిన్నర దక్కించుకున్నారు. ఇంకేముంది తన యాజమాని చేసిన ఈ పనికి ఉద్యోగులు ఉబ్బితబ్బిబయ్యారంట. కొంతమందైతే ఆనందంతో ఏడ్చేశారంట కూడా. ఇలాంటి బాస్ అందరికి ఉంటే ఎంత బావుండో..

 venkaiah naidu

తెలుగు రాష్ట్రాల ఎంపీలకు వెంకయ్య మద్ధతు

  దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ చెప్పిన సంగతి తేలిసిందే. దీనిపై ఏపీలో కూడా నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏంపీలు కూడా పార్లమెంట్ లో ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పై మంగళవారం పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా చాలా సున్నితమైన అంశమని.. ఇది విభజన చట్టంలో లేదని.. కాని దీనిపై ఆర్ధిక శాఖ చర్చలు జరుపుతుందని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు చేసే ఆందోళనలో అర్ధం ఉందని ఎంపీలకు మద్దతుగా నిలిచారు.

aap mla somnath bharti

ఆడవాళ్లు అర్ధ్రరాత్రి తిరగాలంటే.. ఆప్ ఎమ్మెల్యే

  ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకూ పలువురు నాయకులు పలు వివాదాల్లో చిక్కుకొని జైలుకు ఆఖరికి పదవులు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా సోమనాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి. గతంలో ఒకసారి ఈ ఎమ్మెల్యే మీద తన భార్య గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన గాంధీ తరహాలో వ్యాఖ్యానించినా అది పలు విమర్శలకు దారితీసింది. అయితే గాంధీ గారు అర్ధ్రరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెపితే ఈ ఎమ్మెల్యేగారు దాని కాస్త కొంచం వ్యంగ్యంగా అందమైన అమ్మాయిలు అర్ధ్రరాత్రి స్వేచ్ఛగా తిరగాలంటే పోలీసు వ్యవస్థ ఆప్ చేతిలో ఉండాలని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు దీంతో సోమనాథ్ భారతి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగాయి. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు స్పందించి సోమనాథ్ వ్యాఖ్యలు వికారం తెప్పిస్తున్నాయని.. ప్రతి అక్షరం మహిళను అగౌరపరిచేదిగా ఉందని విమర్శించారు. అటు బీజేపీ కూడా సోమనాథ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.   ఇదిలా ఉండగా ఈ విమర్శలకు స్పందించిన సోమనాథ్ పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉంటే మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని.. ఓ మహిళ ఒంటినిండా నగలు ధరించి నడిరాత్రి స్వేచ్ఛగా బయట తిరగడం మహిళా రక్షణకు సంబంధించినంతవరకూ గొప్ప విషయం కాదా.. అలాంటి భద్రతే మేం కల్పిస్తామని చెపుతున్నామని.. పైగా అదే తన ఉద్దేశమని తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకున్నా

Suspension of 25 Congress MPs

కాంగ్రెస్ నేతల సస్పెన్షన్.. నల్లబ్యాడ్జీలతో నిరసన

  పార్లమెంట్ వర్షాకల సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడిపోతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ సమావేశాలకు ముందే ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీ నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమ డిమాండ్ లు వినకపోతే సభ సజావుగా సాగనివ్వబోమని అప్పుడే తేల్చి చెప్పారు. వారు చెప్పినట్టుగానే మాటనిలబెట్టుకుంటున్నారు ఇప్పుడు సభను సజావుగా సాగనివ్వకుండా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా లలిత్ మోదీ వ్యవహారంపై సుష్మాస్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా ఆందోళనలు చేపట్టారు.. స్పీకర్ సభ సజావుగా సాగాలని.. దానికి సహకరించాలని కోరినా వినకపోవడంతో కాంగ్రెస్ 27 మంది ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేసింది.   ఇప్పుడు స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆపార్టీ నేతలు దర్నాకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహులు గాంధీ, మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ లు, గులాం నబీ అజాద్ లు ధర్నా చేపట్టారు. వీరంతా నల్ల బాడ్జీలు ధరించి తమ నిరసన తెలియచేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నాకు సమాజవాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జెడి యు, వామపక్షాలు మొదలగు పలు ఇతరపార్టీలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ న్యాయసమ్మతమైనది కాదని.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడేమని అన్నారు.

ap telangana university admissions

రెండు రాష్ట్రాల మధ్య చదువుల రగడ

    రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉద్యోగుల రిలీవింగ్ పై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అది ఒక కొలిక్కి రాలేదు.. ఇప్పుడు మళ్లీ రెండు రాష్ట్రాల మధ్యం చదువుల వివాదం మరింత పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధి వరకే అడ్మిషన్లు జారీ చేసేందుకు నోటీఫికేషన్ తయారుచేయనుంది. అయితే ఈ విషయంలో గతంలో గవర్నర్ జోక్యం చేసుకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా ఏపీ విధ్యార్దులకు అడ్మిషన్లను నిలిపివేసింది. దీంతో పదో షెడ్యూల్‌ పరిధిలోని యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులకు ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోయాయి. తెలంగాణ యూనివర్సిటీ అయితే ఏకంగా ఒక మెట్టక్కి ఆ యూనివర్శిటీలో పని చేసే ఏపీ ఉద్యోగులకు ఈ నెల నుండి జీతాలు కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపింది.   అసలు ఏటా ఏపీకీ చెందిన అనేక మంది విద్యార్ధులు యూనివర్శిటీల నుండి లక్షల సంఖ్యలో చదువుకుంటారు. ఓపెన్‌ వర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు ప్రధానమైన కోర్సులను అందిస్తుండడంతో అనేక మంది వస్తుంటారు. ఒక్క అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో వివిధ కోర్సుల్లో 70వేల మంది ఏపీ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు తాము కూడా కేవలం తెలంగాణ వరకే అడ్మిషన్లు ఇస్తున్నామని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ తెలంగాణ ముఖ్యకార్యదర్శిని కలిసి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.   మరోవైపు ఇదే విషయంపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై మండిపడింది. ఏ చట్టాన్ని అనుసరించి ఏపీ విద్యార్ధులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయు) అందిస్తున్న సేవలను నిలిపి వేశారని ప్రశ్నించింది. అలా నిలిపివేయాలని ఏ చట్టంలో ఉందో చూపాలని మండిపడింది. ఒక రాష్ట్రంలో ఉన్న యూనివర్శిటిలో ఆ రాష్ట్ర విద్యార్ధులే చదవాలని లేదు.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో విద్యార్ధులు చదువుకునే అవకాశం ఉందని.. అందులోనూ అదీ ఓపెన్‌ వర్సిటీలో ఇలాంటి ఆంక్షలేంటి? అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బీ భోసాలే, జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం వర్సిటీ తరపు న్యాయవాదిని నిలదీసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు వర్సిటీ రిజిస్ర్టార్‌ను కోర్టుకు హాజరవ్వాలని ఆదేశిస్తామని హెచ్చరించింది.

note for vote case

ఏసీబీ కోర్టులో రేవంత్.. రోజూ సంతకం చేస్తున్నా వేధిస్తున్నారు

  ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హజరయ్యారు. అయితే గతంలోనే రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో హాజరవ్వాలి కానీ హైకోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఇదే విషయాన్నిరేవంత్ రెడ్డి కూడా తెలయజేశారు. తనను కోర్టు తన నియోజకవర్గం అయిన కొడంగల్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని చెప్పిన నేపథ్యంలో తాను కోర్టుకు హాజరుకాలేదని తెలియజేశారు. అయితే తదుపరి విచారణకు మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయమూర్తి చెప్పడంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఇంకా ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా కోర్టుక హాజరయ్యారు. అయితే చార్జిషీట్ విచారణ తర్వాత కోర్టుకు హాజరుకావాలని చెప్పినా ఎందుకు వచ్చారంటూ న్యాయమూర్తి వారిని ప్రశ్నించగా ఏసీబీ అధికారులు ముందు విచారణకు హాజరుకావాలని... కోర్టుకు వెళ్లాలని సూచించడంతో కోర్టుకు వచ్చామని చెప్పారు. కాగా.. రోజూ ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి సంతకం చేస్తున్నా వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఉదయసింహా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 14వ తేదికి వాయిదా వేశారు.

election commissioner bhanwarlal

ఆధార్ అనుసంధానం.. ఓటు తొలగించం

  ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తున్నామని.. ఒకవేళ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం లేకపోయినంత మాత్రాన ఓటు తొలగించబోమని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. కరీంనగర్ లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తిచేస్తామని.. ఆగష్ట్ 15 లోపు ఈ అనుసంధానం పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణలో తెలంగాణలో ఇప్పటికి వరకు 80శాతం అనుసంధాన ప్రక్రియ పూర్తి చేశామని నిజామాబాద్‌ జిల్లాలో వందశాతం అనుసంధానం పూర్తయిందని భన్వర్‌లాల్‌ తెలిపారు. ఆధార్ అనుసంధానం మొబైల్‌పాయింట్ల ద్వారా చేసుకోవచ్చని ఆయన వివరించాడు.

ap cabinet

మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్న చంద్రబాబు!

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం మంత్రివర్గంపై అసంతృప్తితో ఉన్నారా అంటే ఉన్నారనే వార్తలే వినిపిస్తున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. అసలు ఏపీ ప్రభుత్వంలో మంత్రులు ఎంత వరకూ పని చేస్తున్నారు అన్న నేపథ్యంలో చంద్రబాబు సర్వే చేయించారట. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు త్వరలో మంత్రివర్గం మార్చే దిశగా ఆలోచనలో ఉన్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో దసరా తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని రాజకీయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి.   ఈ వార్తలు అలా వచ్చాయో లేదో అప్పుడే మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. కాగా ఇప్పటికే ఇద్దరు మంత్రుల పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఏపీ మంత్రివర్గంలో ఇప్పటి వరకూ ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు.. అయితే ఇప్పుడు ముస్లిం వర్గం నుండి ఎవరూ లేకపోవడంతో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంఎ షరీఫ్‌కు మంత్రివర్గంలో చోటు ఖాయం కాబోతుందని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు కూడా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్టీల నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ కోటాలో పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఎమ్మెల్సీగా గుమ్మడి సంధ్యారాణిని ఎంపిక చేశారు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇటీవలె ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటుగా గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పయ్యావుల కేశవ్ విషయంలో పార్టీ కేడర్‌లో మొదటి నుంచి సానుకూలత ఉంది. అయితే మంత్రివర్గంలో ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు? ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు? అనేది త్వరలో తెలుస్తోంది.

parliament 27 mps

27 మంది ఎంపీల సస్పెన్షన్

  పార్లమెంట్ ఉభయ సభలు వాడీవేడీగా జరుగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునుండే విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ సభలు అట్టుడికిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు సభను సరిగా జరగకుండా ఆరోపణలు చేస్తూనేఉన్నారు. లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభ ప్రారంభమైన దగ్గర నుండి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రెండు సార్లు సభ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన కూడా తిరిగి అదే పరిస్థితి కొనసాగింది. మంత్రులు రాజీనామా చేసే వరకూ సభను సాగనివ్వబోమని.. విపక్ష ఎంపీలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. సభకు అందరూ సహకరించాలని కోరినా కూడా వినకపోవడంతో 377 రూల్‌ ప్రకారం 27 మంది ఎంపీలను 5 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఫోన్లు ట్యాపింగ్ చేశారా? చేస్తే ఎవరు చెప్పారు?

  ఓటు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై సర్వీసు ప్రొవైడర్లను కాల్ డేటా ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించగా వారు మళ్లీ హైకోర్టును ఆశ్రయించి ఏపీ అధికారులు కాల్ డేటా ఇవ్వాలనం సబబుకాదని వాదించారు. కాని హైకోర్టు మాత్రం కోర్టుకు కాల్ డేటా ఇవ్వాలని.. వారితో పాటు మాకు కూడా ఇవ్వాలని చెప్పింది. దీంతో ఎట్టకేలకు సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు కాల్ డేటాను సమర్పించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేశామని పత్యక్షంగా చెపుతున్నా మాత్రం చర్యలు తీసుకునేవాళ్లు మాత్రం లేరు. అయితే గతంలో ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏపీ అధికారుల ఫోన్లు ట్యాప్ చేశారని లాయర్ల జెఏసి జూన్ 28న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశాల ఆధారంగా పోలీసులు టెలిగ్రాఫిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు.   ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నేర పరిశోధన విభాగం పోలీసు అధికారులు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారా? చేస్తే ఎవరు ఇలా ట్యాపింగ్ చేయాలంటూ ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని నోటీసులు జారీ చేశారు. కానీ తమ ఫిర్యాదులో సర్వీస్ ప్రొవైడర్లు, కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటూ ప్రస్తావించారని, ప్రజాప్రతినిధుల పేర్లు లేకపోవడంతో దర్యాఫ్తు ఆలస్యమవుతుందని సిసిఎస్ అధికారులు చెబుతున్నారు.

మోహన్ బాబుకు పద్మశ్రీ ఊరట

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు ఎట్టకేలకు పద్మశ్రీ వివాదంలో ఊరట లభించింది. ఒక చిత్రంలో మోహన్ బాబు పేరుతో పద్మశ్రీ కూడా కలిపి వేశారని.. పద్మశ్రీ అవార్డును మోహన్ బాబు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై మోహన్ బాబు చిత్ర నిర్మాత తన ప్రమేయం లేకుండా టైటిల్స్ లో పద్మశ్రీని వేశారని.. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయబోమంటూ గతంలో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చి మోహన్‌బాబుకు పద్మశ్రీ యథాతథంగా కొనసాగుతుందని తీర్పునిచ్చింది. సుప్రీం ఇచ్చిన తీర్పుతో మోహన్ బాబుకు కొంత ఊరట లభించింది.

ఆ పరిస్థితికి కారణం తనే అంటున్న ఇలియానా

  గోవా భామ ఇల్లీ భామ దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన నడుము సోయగాలతో కుర్రకారును మత్తెక్కించి టాప్ పొజిషన్ దక్కించుకుంది. టాలీవుడ్ లో మొట్టమొదట అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నభామ కూడా ఈ గోవా బ్యూటీనే. అయితే గత కొంత కాలంగా ఈ అమ్మడు సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. బర్ఫీ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇలియానాకి ఆసినిమా విజయం సాధించిన తరువాత ఇంకేముంది టాలీవుడ్ నుండి పాగా ఎత్తేసి.. బాలీవుడ్ లో కూడా దున్నేయెచ్చు అనుకుంది. కానీ బర్ఫీ సినిమా తరువాత రెండు మూడు సినిమాలు చేసిన తరువాత ఆఫర్లు కరువయ్యాయి. అయితే ఇప్పుడు ఈఅమ్మడు తన ఈ పరిస్థితి కారణం తనే అంటుంది. బర్ఫీ విజయం తరువాత చాలా ఆపర్లు రావల్సింది కానీ బాలీవుడ్ కి కొత్త కావడం వల్ల ఆసినిమా విజయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను.. ఆ విషయంలో తప్పు నాదే.. ఇప్పటి నా పరిస్థితికి నేనే కారణం అంటూ బాధ వెల్లకక్కిందట. పాపం ఉన్నదీ పోయింది.. ఉంచుకున్నదీ పోయింది అన్నట్టు ఉంది ఇలియానా పరిస్థితి.

పోర్న్ సైట్ల నిషేదం.. స్పందించిన వర్మ

  కేంద్ర ప్రభుత్వం సుమారు 5000 పైగా అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అన్నిటిపై స్పందించి విమర్శలు చేసే విమర్శల వర్మ రాంగోపాల్ వర్మ యధావిధిగానే దీనిమీద కూడా తన శైలిలో స్పందించి ట్వీట్లు పడేశారు. కేంద్ర ప్రభుత్వ పోర్న్ సైట్లపై నిషేదం విధించడమన్నది తిరోగామి చర్య అంటూ.. లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైబ్ సైట్లను నిషేదించినంత మాత్రాన నేరాలు జరగకుండా ఆపలేమని అన్నారు. ఇలా నిషేదించడం వల్ల అది ఇంకా బలం పుంజుకుంటుందని.. వ్యక్తుల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తే అది ఆ దేశ సామాజిక పురోగతిని తిరోగమించేలా చేస్తుందని అన్నారు. పోర్న్‌ సైట్లపై నిషేధం విధించడం కన్నా.. ఆ కంటెంట్‌ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రభుత్వం చూడాలన్నారు.