గొల్లపూడి మారుతీరావు గారికి "జీవన సాఫల్య పురస్కారం"
ప్రఖ్యాత సినీ నటులు, రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావు గారిని "జీవన సాఫల్య పురస్కారం" తో డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ మార్చి 12 వ తేది సాయంత్రం 6 గం. లకు పాలకొల్లు లో జరిగే జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస చౌదరి, కార్యదర్శి శ్రీ మానాపురం సత్యన్నారాయణ లు తెలిపారు.
ఈ సభకు ముఖ్య అతిధి గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప , విశిష్ట అతిధులుగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ఎస్. సి కార్పోరేషన్ చైర్మన్ శ్రీ జూపూడి ప్రభాకరరావు, డా. గజల్ శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ. ముర్రు ముత్యాల నాయుడు, శాసన మండలి సభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్, శాసన మండలి సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చలనచిత్ర ప్రముఖులు శ్రీ కోడి రామకృష్ణ, శ్రీ ఆర్. పి . పట్నాయక్, హీరో శ్రీ నిఖిల్ , శ్రీ భాస్కర భట్ల, శ్రీమతి అనితా చౌదరి లు పాల్గొంటారని తెలిపారు.
మేడికొండ శ్రీనివాస చౌదరి
అధ్యక్షులు