హైదరాబాద్ లో స్వైన్ ప్లూ స్వైరవిహారం
హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ మళ్లీ స్వైరవిహారం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి 2015లో ఇప్పటివరకూ 63మంది మ..త్యువాత పడగా, తాజాగా మరో పది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా నగరంలో కురుస్తోన్న వర్షాలకు,వాతావరణం అనుకూలంగా మారి, వైరస్ మళ్లీ పంజా విసురుతోందని అంటున్నారు. గత పది రోజుల్లో 31 కేసులు నమోదు కాగా, ఇద్దరు మ..త్యువాడ పడ్డారని వైద్యులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజూ రెండు కేసులు నమోదవుతుండగా, చాలామంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే వైరస్ వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా మారిందని, రానున్నది చలికాలం కావడంతో స్వైన్ ఫ్లూ మరింత విజం..భించే అవకాశముందని వైద్యులు అంటున్నారు. మధుమేహం, రక్తహీనత, గుండెజబ్బులు, టీబీ, హెచ్ఐవీ, న్యుమోనియో, ఆస్తమా వంటి జబ్బులున్న వారే ఎక్కువగా దీని బారిన పడుతున్నందున, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.