ప్రతి పౌరుడు గర్వపడేలా రైలు ప్రయాణం..
కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన ఆయన పలు రైల్వేలో పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రసంగంలో అంశాలు..
* ప్రతి పౌరుడు గర్వపడేలా రైలు ప్రయాణం తీర్చి దిద్దాలన్నదే లక్ష్యం
* 2016-17 వ్యయం 1.21కోట్లు.. 2016-17 ఆదాయం 1.87 కోట్లు
* రైల్వేలో 1.5 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎల్ఐసీ అంగీకరించింది.
* సగటు వేగం 50 కి.మీ నుండి 80 కి.మీ వరకూ పెంపు
* ఈ ఏడాదికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు విద్యుదీకరణ.. వచ్చే ఏడాదికి 50 శాతం రైల్వే లైన్లను విద్యుదీకరిస్తాం
* రక్షణ లేని లెవల్ క్రాసింగ్ లు తొలగింపునకు ప్రయత్నిస్తున్నాం
* రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్ట్ విటీని పెంచుతాం
* అన్ని స్టేషన్లో డిస్పోసబుల్ బెడ్ సౌకర్యం
* మహిళల భద్రత, వైద్య సౌకర్యాల పెంపునకు ప్రాధాన్యత
* సమయ పాలన వసతులకు ప్రాధన్యం
* మేకింగ్ ఇండియాలో భాగంగా రెండు కొత్తం లోకో ఫ్యాక్టరీలు
* రాజధాని, శతాబ్ది రైళ్ల ఫ్రిక్వెన్సీని పెంచుతున్నాం
* సీనియర్ సిటిజన్స్ కోటా 50 శాతం పెంపు.. వారికోసం లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం
* పెండింగ్ ప్రాజెక్టులన్నీ మూడేళ్లలో పూర్తి
* రైల్వే టెండరింగ్లో పేపర్ రహిత పద్దతి.. ఎలక్ట్రానికి పద్దతిలో రైల్వే టెండరింగ్ పద్దతి