కాంగ్రెస్ నేతల సస్పెన్షన్.. నల్లబ్యాడ్జీలతో నిరసన
పార్లమెంట్ వర్షాకల సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడిపోతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ సమావేశాలకు ముందే ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీ నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమ డిమాండ్ లు వినకపోతే సభ సజావుగా సాగనివ్వబోమని అప్పుడే తేల్చి చెప్పారు. వారు చెప్పినట్టుగానే మాటనిలబెట్టుకుంటున్నారు ఇప్పుడు సభను సజావుగా సాగనివ్వకుండా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా లలిత్ మోదీ వ్యవహారంపై సుష్మాస్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా ఆందోళనలు చేపట్టారు.. స్పీకర్ సభ సజావుగా సాగాలని.. దానికి సహకరించాలని కోరినా వినకపోవడంతో కాంగ్రెస్ 27 మంది ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేసింది.
ఇప్పుడు స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆపార్టీ నేతలు దర్నాకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహులు గాంధీ, మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ లు, గులాం నబీ అజాద్ లు ధర్నా చేపట్టారు. వీరంతా నల్ల బాడ్జీలు ధరించి తమ నిరసన తెలియచేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నాకు సమాజవాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జెడి యు, వామపక్షాలు మొదలగు పలు ఇతరపార్టీలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ న్యాయసమ్మతమైనది కాదని.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడేమని అన్నారు.