గ్యాస్ సిలిండర్ పేలి, 82మంది మృతి
posted on Sep 12, 2015 @ 5:26PM
మధ్యప్రదేశ్ లోని జబువాలో జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఊహించినదానికంటే...చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఇద్దరే చనిపోయారని అనుకున్నా, శిథిలాల కింద చిక్కుకుని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వార్తలు అందుతున్నాయి. ఇఫ్పటివరకూ అందిన సమాచారం మేరకు 82మంది మృతిచెందారని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలి మరణించిన వారి కంటే, ఆ భవనం కింద చిక్కుకుని చనిపోయినవారే ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి రెండంతస్తుల బిల్డింగ్ కూలిపోయిందని, ఆ సమయంలో దాన్లో ఉన్నవారంతా దాదాపు మృత్యువాత పడ్డారని జాతీయ ఛానళ్లు చెబుతున్నాయి.