modi fire on sonia

మోడీకి కోపమొచ్చింది

ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందంటూ సోనియాగాంధీ చేసిన విమర్శలను ప్రధాని నరేంద్రమోడీ తిప్పికొట్టారు. సోనియా వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన మోడీ...కాంగ్రెస్ ను అవినీతి పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ మనీపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిందని, అందుకే తమపై బురద చల్లుతున్నారని మోడీ ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడుగడుగునా అడ్డుకుని, కాంగ్రెస్ నేతలు చీప్ గా బిహేవ్ చేశారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమిని సోనియా ఇంకా జీర్జించుకోలేకపోతున్నారని, అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. ప్రజల నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వమ్ముచేయబోమన్న మోడీ... ఏ ఆశయంతో తమను గెలిపించారో...దాన్ని సాధించి చూపిస్తామన్నారు మోడీ.

Mahesh babu Village Adoption

మహేశ్ అందుకే దత్తత తీసుకున్నాడు.. తేజ

  శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహేశ్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకొని రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడయ్యాడు. ప్రకాశ్ రాజ్ కూడా తెలంగాణలో ఒక గ్రామాన్ని.. ఏపీలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నా ఏపీలో తీసుకోవాల్సి ఉంది. అయితే మహేశ్ బాబు.. ప్రకాశ్ రాజ్ లు చేసిన ఈ పనిని శ్రీమంతుడు సినిమా ఆదర్శంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు. కాని వారు గ్రామాన్ని దత్తత తీసుకున్నది అందుకు కాదంటం దీనివెనుక వేరే కారణముందట. అది ఏంటనేగా మీ డౌట్.. దర్శకుడు తేజ సెలబ్రిటీలు గ్రామాలు దత్తతపై సంచలమైన కామెంట్లు చేశారు. తేజ దర్మకత్వం వహించిన హోరాహోరీ సినిమా రిలీజ్ సందర్బంగా జరిగిన ప్రెస్ మీట్ లో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ గ్రామాల్ని దత్తత తీసుకోవడంపై మీ స్పందన ఏంటని అడుగగా దానికి ఆయన సమాధానం చెప్పకపోగా వారు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితోనే గ్రామాల్ని దత్తత తీసుకున్నారా అని ఎదురుప్రశ్న వేశారు? వారు కేవలం ఐటీ డిడక్షన్ కోసమే గ్రామాలను దత్తత తీసుకున్నారని... సామాజిక సేవ చేసే సంస్థలకు పన్ను రాయితీ ఉండదని అందుకే అందరూ ఆపనిలో పడ్డారని కామెంట్స్ చేశారు. మహేష్ బాబు గ్రామాల దత్తత కార్యక్రమం కూడా ఇదే కోవకు చెందిందేనని తేజ కామెంట్ చేశారు. నిజంగా సేవ చేయాలని వుంటే ఒక్కడు సినిమా తర్వాతే గ్రామాన్ని దత్తత తీసుకుని చేసి వుండొచ్చు కదా అని తేజ ప్రశ్నించారు. అయితే తేజ నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఎటువంటి మొహమాటం లేకుండా చెపుతాడు అని అందరూ అనుకుంటారు. మరి తేజ చెప్పినట్టు సెలబ్రిటీల దత్తత వెనుక కారణం అదేనా?

cm kcr

తెలంగాణకి "లియో" వెయ్యి కోట్ల పెట్టుబడులు

  తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే నేపథ్యంలో సీఎం కేసీఆర్ చైనాలో బిజీబిజీ అయిపోయారు. ఇప్పటికే ఆయన పలు రకాల పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. నిన్న ఒక్కరోజే ఆయన 3 గంటల్లో 30 మీటింగులు నిర్వహించారంటేనే తెలుస్తోంది ఆయన ఎంత బిజీగా ఉన్నారో. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు నెలకొన్న పరిస్థితులు అందుకు అనువైన వసతుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రముఖ లియోగ్రూప్ ఆఫ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల గురించి వివరించాలని ఈనేపథ్యంలోనే తమ కంపెనీలను కూడా ఒకసారి సందర్శించాలని పలు కంపెనీల నుండి కేసీఆర్ బృందానికి ఆహ్వానాలు వచ్చాయి.

prof k s bhagwan

ముగ్గురిని చంపాం.. ఇప్పుడు నువ్వే.. ప్రొఫెసర్ కు బెదిరింపు లేఖ

  ప్రొఫెసర్ కే.ఎస్ భగవాన్ కు తీవ్రమైన స్థాయిలో బెదిరింపు లేఖ వచ్చింది. మైసూర్ దారుడవాడలోని కల్యాణ నగర్ లో ఉంటున్న కే.ఎస్. భగవాన్ ఇంటికి ఒక ఉత్తరం రాగా అందులో తనను బెదిరిస్తూ రాశారు. అందులో ఏముందంటే నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరని అనుకోవద్దు.. ఇప్పటికే మా చేతిలో ముగ్గురు హతమయ్యారు.. నిన్నుఅంతం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము.. రోజులు  లెక్కపెట్టుకో పోలీసులు కూడా నిన్ను కాపాడలేరని రాసి ఉంది. వెంటనే భగవాన్ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే అనేక విషయాలలో భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. అందులోనూ భగవద్దీతను చులకన చేస్తూ  "భగవద్దీతను అగ్నికి ఆహుతి చెయ్యాలి అని.. నిండు గర్బిణిని అడవులకు పంపించిన శ్రీరాముడిని మీరు ఆదర్శంగా తీసుకుంటారా, 16,000 మందిని పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు పాపాత్ముడు" అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేయడంవల్లే దీంతో ఒక వర్గం వారు తనను బెదిరిస్తూ ఇలాంటి లేఖలు రాసిఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భగవాన్ ఇంటి దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

KTR Harish Rao ktr

ప్రస్తుతానికి కేటీఆర్ హరీశ్ లే సీఎంలు

  తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్ ప్రస్తుతం చైనా టూర్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్దికి.. అక్కడ పెట్టబోయే పరిశ్రమలు.. వాటి అనుకూలతలు గురించి చైనా పారిశ్రామికవేత్తలకు చెప్పి వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేయడానికి ప్రయత్నించే పనిలో పడ్డారు. అయితే కేసీఆర్ పది రోజుల చైనా పర్యటనలో ఉండే ఇక్కడి పరిపాలనా బాధ్యతలు ఎవరు చూస్తున్నారు? ఈ పశ్నకు సమాధానం.. కేసీఆర్ తనయుడు.. ఐటీ మంత్రి కేటీఆర్.. నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు ఈ బాధ్యతలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ఒకవైపు  హరీష్ రావు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటుండగా మరోవైపు కేటీఆర్ పరిపాలన కార్యకలాపాల్లో ఫుల్లు బిజీగా తమ పనుల్లో నిమగ్నమైపోయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ లేకపోయిన వీరిద్దరూ పరిపాలనా కార్యక్రమాల సవ్యంగా నిర్వహిస్తున్నారని అందుకు ఇందుకు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అనేక అంశాల మీద ఇప్పటికే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలో హరీశ్ రావు కూడా వారిపై తిరిగి కౌంటర్లు వేస్తూ టీఆర్ఎస్ పై మాటపడనివ్వకుండా ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొడుతూ విలేకరులతో ఎప్పటికప్పుడూ ముచ్చటిస్తూనే ఉన్నారు. అలాగే కేటీఆర్ కూడా ప్రభుత్వ పరంగా చేయబోయే కార్యాక్రమాలపైన మంత్రి కేటీఆర్ హామీలు ఇస్తుండటం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు. అంతేకాదు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు ఉండదని సీఎం కేసీఆర్ చెప్పినా పెంపు విషయంపై ముఖ్యమంత్రి చైనా నుంచి రాగానే మాట్లాడతానని కేటీఆర్ హామీ ఇవ్వడం పై దూరమవుతున్న కార్మికుల్లో అసంతృప్తి నెలకొనకండా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు తెలంగాణలో అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గ్రామాలను అభివృద్ధి పరిచే దిశగా వారిని ప్రముఖలకు దత్తత ఇచ్చే కార్యక్రమంలో కూడా తన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు.. ప్రకాశ్ రాజ్ తమ వంతుగా ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మొత్తానికి కేసీఆర్ లేని లోటును ఈ ఇద్దరు మంత్రులు తీరుస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతానికే ఈ ఇద్దరే తెలంగాణకు సీఎంలుగా వ్యవహరిస్తున్నారు.

Farmers Suicide

అన్నదాతల ఆత్మహత్యలు.. ఆపేవారెవరూ?

  ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. వర్షాలు రాక.. పంటలకు సరైన నీరు లేక.. పంటలు వేసిన సరిగా పండక పెట్టిన పెట్టుబడి కూడా రాక కడలోతు కష్టాల్లో కురుకుపోతున్న రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చావు ఒక్కటే మార్గమని తమ ప్రాణాలను బలిగొంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జిల్లాలలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు రాజదాని నడిబొడ్డున రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వాలు మాత్రం తమ వైఖరిని మార్చుకుంటున్నాయా అంటే అదీలేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి రాజకీయ నాయకులు చేసిందని ఓ పదివంతు అయితే విద్యార్ధులు రైతులు చేసిన ఆందోళనలు.. వారి త్యాగాలు అనిర్వచనీయం. మరి ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తరువాత అయినా వారి పరిస్థితులు చక్కబడ్డాయా అంటే అదీ లేదు. ఎంతవరకూ పక్క రాష్ట్రంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. వారితో వాదనలు.. వితండవాదాలు చేయడం ఇదే సరిపోయింది కాని రైతుల సమస్యలు ఏంటి వారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని ఆలోచించే ధోరణి ఏ ఒక్క నాయకుడికి పట్టడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో హామీలు చేస్తారు కాని గెలిచిన తరువాత మాత్రం వారిని పట్టించుకునే నాదుడే లేడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.. బంగారు తెలంగాణని ఏర్పాటు చేయాలి అని అంటున్నారు కాని.. అసలు రాష్ట్రంలో ఉన్నరైతుల సమస్యలే పట్టించుకోని నాయకులు ఇక బంగారు తెలంగాణ ఎలా తయారు చేస్తారు అని గుసగుసలాడుకునే వారు కూడా ఉన్నారు. ఒక్క రాష్ట్రాన్నే అభివృద్ధి చేస్తే చాలదు.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని భావిస్తున్నారు. తన ఫామ్ హౌస్ లో పండే పంటలు కూరగాయలు మంచిగా పండితే చాలదు.. రాష్ట్రంలో ఉన్న రైతల పంటలు కూడా అదే విధంగా పండేలా చూడాలి. ఇకనైనా  తమ ఒంటెద్దు పోకడని మాని రైతుల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోసి రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

ap telangana electicity employees

విద్యుత్ ఉద్యోగులపై కమిటీ.. పేర్లు మీరే చెప్పండి.. హైకోర్టు

  తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ ఉద్యోగులను రీలివింగ్ చేసిన వ్యవహారంపై ఇప్పటికీ కోర్టులో వాదనలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఈ సమస్య పరిష్కారం చూడకుండా ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వాదనలకు చిరాకు పుట్టి హైకోర్టు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమస్యపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరిస్తారా సరే లేదంటే మేమే రంగంలోకి దిగాల్సి వస్తుంది అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు హైకోర్టు మరో మెట్టు ఎక్కి ఈ వ్యవహారంపై ఒక కమిటీని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ని చెప్పినా రెండు రాష్ట్రాలు ఈ విషయంలో తిట్టుకుంటూ వ్యవహారాన్ని నాన్చుతున్నాయే తప్ప సమస్యను పరిష్కరించడంలేదని.. అందుకే తామే ఒక కమిటీ వేస్తామని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఏ.శంకరనారాయణలు తెలిపారు. ఈ కమిటీ కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో నలుగురు పేర్లను సూచించాలని.. ఈ కమిటీ ఛైర్మన్ గా ఒక వ్యక్తిని నియమిస్తామని.. అవసరమైతే రెండు రాష్ట్రాలకు సంబంధంలేని వ్యక్తిని కమిటీ ఛైర్మన్ నియమించాలని యోచిస్తున్నామని చెప్పారు. కనీసం ఈ కమీటీ ద్వారా అయినా  ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.

tdp vs ysrcp

చీరాల ఎమ్మెల్యే.. టీడీపీ ఇంఛార్జ్.. కుర్చీలతో దాడి

  ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు ,చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈరోజు వికలాంగుల సదరన్ క్యాంపు కార్యక్రమంలో  టీడీపీ పార్టీ నేతలు.. ఆమంచి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు చీరాల తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి సునీతల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఘర్షణకు దారితీసింది. దీంతో టీడీపీ పార్టీ నేతలు, ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరి మీద ఒకరు కుర్చీలు విసురకొని పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి తెలుసుకొని ఇరువర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి చక్కబడింది.

Ys Jagan

జగన్ దీక్ష డేట్ ఖరారు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న దీక్ష చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే 17 వ తేదీన వినాయక చవితి ఉన్న నేపథ్యంలో విరమించుకున్నారు. అయితే ఈరోజు వైయస్ జగన్ అన్ని జిల్లాల పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో దీక్ష తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 26 నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు.. పార్టీ నేతలతో చర్చించిన తర్వాతనే వైయస్ జగన్ ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఇప్పటికే ఢిల్లీలో ధర్నా చేశారు. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో కూడా ధర్నా చేశారు. ఇప్పుడు గుంటూరులో నిరహారదీక్ష. మరి జగన్ దీక్షలు ఎంతవరకూ పని చేస్తాయో చూద్దాం.

tdp mla revanth reddy

ఆట కాదు వేట మొదలైంది.. రేవంత్ రెడ్డి

  టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడికైనా వెళ్లొట్టు అని హైకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి తన సొంత నియోజక వర్గం అయిన కొండంగల్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ చేరుకున్న ఆయనకు టీడీపీ పార్టీనేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆట ఇప్పుడే మొదలైంది అంటున్నారు మొదలైంది ఆట కాదు వేట అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు సింగం వచ్చేసరికి కేసీఆర్ టూర్ అంటూ చైనా చెక్కేసారు అని వ్యంగాస్త్రాలు విసిరారు. రైతులు ఆత్మహత్యలు.. విద్యార్ధుల ధర్నాలు ఇవేమి కేసీఆర్ కు పట్టడం లేదని కేసీఆర్ ప్రభుత్వం నేను పోరాటం చేస్తానని.. ప్రజా సమస్యల పైన ప్రభుత్వం అంతు చూస్తానని అన్నారు. వంద ఎకరాల ఫామ్ హౌస్ పై ఉన్న శ్రద్ధ రైతల మీద లేదని ఎద్దేవ చేశారు.

Bihar Assembly Elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జారీ

  బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యుల్ ఇవ్వాళా వెలువడింది. సెప్టెంబర్ 12నుండి మొత్తం 5 దశలలో మొత్తం 243స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.   మొదటి దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 16. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 23. నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 24. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: సెప్టెంబర్ 26. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 12. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 49.   2వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 21. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: సెప్టెంబర్ 28. నామినేషన్ల పరిశీలన: సెప్టెంబర్ 29. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 1. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 16. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 32.   3వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 1. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్ 8 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 9. నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్12. ఎన్నికల నిర్వహణ: అక్టోబర్ 20. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 50.   4వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 7 నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్14 నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 17 ఎన్నికల నిర్వహణ: నవంబర్ 1. ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు:55.   5వ దశ ఎన్నికల షెడ్యూల్: నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 8. నామినేషన్లు వేయుటకు ఆఖరి తేదీ: అక్టోబర్ 15. నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 17 నామినేషన్ల ఉపసంహరణకి గడువు: అక్టోబర్ 19 ఎన్నికల నిర్వహణ: నవంబర్ 5 ఎన్నికలు నిర్వహించబోయే మొత్తం స్థానాలు: 57.   ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి: నవంబర్ 8. ఎన్నికల ప్రక్రియ ముగింపు: నవంబర్ 12

ramgopal varma

నన్ను ఇరికించకండి ప్రభో.. వర్మకి రాజమౌళి ట్వీట్

  ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి పైన విమర్శలు చేస్తే కాని రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. అందుకే ఎప్పుడూ ట్విట్టర్ ద్వారా తన పిచ్చిని అప్పుడప్పుడు బయటపెడుతుంటాడు. ఎప్పుడూ విమర్శిస్తే ఏం బావుటుంది అని అనుకున్నాడేమో తెలియదు కాని బాహుబలి విషయంలో ఎస్ఎస్ రాజమౌళిని మాత్రం పొగిడేశాడు. బాహుబలి సినిమా రిలీజైనప్పుడు కూడా రాంగోపాల్ వర్మ రాజమౌళిని.. హీరోలని ప్రశంసించాడు. కాని ఈసారి పొగిడిన పొగడ్తలకి రాజమౌళి పాపం భయపడినట్టున్నారు. అదేంటంటే ప్రస్తుతానికి ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఉన్నాడనే విషయం తెలుసుకున్నానని ట్వీట్ చేశారు. "I just now came to know that the SS in SS Rajamouli stands for Steven Spielberg'' అలా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు రాజమౌళి వెంటనే స్పందించి "జనంతో నన్ను తిట్టించడానికి కాకపోతే అవసరమా సార్ ఇపుడు ఇది" అంటూ ట్వీటారు. మొత్తానికి రాంగోపాల్ వర్మ తిట్టినా కాంట్రవర్సీలా... పొగిడినా కాంట్రవర్సీలా తయారైంది.

venkaiah naidu

ఏపీ రాజధానికి సహకరించండి.. టాటా ఛైర్మన్ తో వెంకయ్య

  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య ఏపీ రాజధాని నిర్మాణానికి.. అభివృద్ధికి సహకరించాలని.. అంతేకాదు ఒక్క రాజధాని నిర్మాణంలోనే కాక హైదరాబాద్ విశాఖ నగరాల్లో కూడా నిర్మాణ బాధ్యతలు స్వీకరించాలని సైరస్ మిస్త్రీని కోరినట్టు తెలుస్తోంది. ఇక్కడే కాదు దేశంలో ఇతర ప్రాంతాల అభివృద్ధికోసం.. వెంకయ్య చేపట్టిన స్మార్ట్ సిటీ పథకం.. స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు పథకాలపై కూడా సహకారం అందించాలని కోరారు. దీనికి సైరస్ మిస్త్రీ కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. కాగా మోదీ స్వచ్ఛ భారత్ లో భాగంగా పిలుపు నిచ్చిన మేరకు టాటా సంస్ధ ముందుకొచ్చి విజయవాడలోని 264 గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

చైనా టూర్లో కేసీఆర్ బిజీబిజీ.. 3గంటలు 30 మీటింగులు

  తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా టూర్ లో భాగంగా నిన్న ఆయన ఫుల్ బిజీగా గడిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి అనేక పారిశ్రామిక వేత్తలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ చర్చలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి పరిశ్రమల స్థాపనకు తాము చేపట్టిన కార్యక్రమాల గురించి చర్చించారు. అంతేకాదు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి వసతులు ఉంటాయి వాటితో పాటు పరిశ్రమల అనుమతుల విషయంలోనూ తాము చేపడుతున్న చర్యల గురించి ముచ్చటించారు. ఎలాంటి అవినీత లేకుండా పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. మొత్తం 3గంటల్లో 30 మంది పారిశ్రామికవేత్తల్ని కలిసిన కేసీఆర్.. వారికి తెలంగాణలో పరిశ్రమలలు పెట్టేందుకు అవకాశాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ లియో గ్రూపు కంపెనీ రూ.వెయ్యి కోట్లతో తెలంగాణలో హెవీడ్యూటీ పైపుల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి కేసీఆర్ తెలంగాణలో పరిశ్రమలు స్థాపనకు బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.

సుజనా తిట్టారా?... పొగిడారా?

  రాజకీయ నేతలు ఎమన్నా దానికి వేరే అర్ధం వచ్చేలా మాట్లాడుకోవడం పరిపాటైపోయింది ఈమధ్య. ఇప్పుడు కేంద్రమంత్రి సుజనా చౌదరి విషయంలో కూడా అలాగే జరిగింది. అదేంటంటే కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు పాలకులుగా ఉన్నందువలన.. అభివృద్ధి పథంలో మనం దూసుకెళ్లిపోతామని అన్నరు. దాంతో పాటు మోడీ ప్రధాని అయిన తరువాత విదేశాలలో భారత ప్రతిష్ట మరింత పెరిగిందని అన్నారు. అంతే దీంతో సుజనా వ్యాఖ్యాలపై ఒకటే కామెంట్లు పడుతున్నాయి. విదేశంలో ప్రతిష్ట పెరిగిందంటే స్వదేశంలో పలచబడిపోయిందనేనా అని వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటున్నారు. మరోవైపు మోడీ కూడా విదేశీ పర్యటనలతో బిజీగానే ఉన్నారు. ఇప్పటికే మోడీ పర్యటనలపై ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుజనా చేసిన వ్యాఖ్యలను కూడా వ్యంగ్యంగానే తీసుకుంటున్నారు. అయితే సుజనా చౌదరి అంటే చాలా విధేయుడైన మంత్రి అనే పేరు ఉంది. మోదీపై ఆయన వెటకారంగా అని మాత్రం అని ఉండరు అని. మనస్ఫూర్తిగానే మోడీని కీర్తించి ఉంటారని పనిలేని వాళ్లు దాని కూడా వెటకారంలాగే అనుకుంటారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు.