Earth quake

ఉత్తర భారత్ లో భారీ భూకంపం

  పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది, దాని ప్రభావం భారత్ పైనా పడింది, నార్తిండియాలోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి, అఫ్ఘన్ లోని హిందూకుష్ పర్వత శ్రేణులు కేంద్రంగా ఏర్పడిన ఈ భూకంపం తీవ్రత పాకిస్తాన్ లో 7.7గా నమోదు కాగా, ఉత్తర భారత్ లో అది 7.5గా ఉందని చెబుతున్నారు, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఐదారు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు, ఢిల్లీలో మెట్రోరైల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు, భూకంపం ప్రభావం జమ్మూకాశ్మీర్ లో అధికంగా ఉందని తెలుస్తోంది, భూప్రకంపనల ధాటికి కాశ్మీర్ లో పలు భవనాలు ధ్వంసమయ్యాయని వార్తలు అందుతున్నాయి.

jc prabhakar reddy

రఘువీరాపై జేసీ వ్యాఖ్యలు.. రెండుసార్లు దెబ్బలు తిన్నాడు.. మూడోసారి నేను కొడతా

  సంచలన వ్యాఖ్యలు చేయడంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తరువాతే ఎవరైనా. అది ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఆయనకు అలవాటు. అసలే కోపం ఎక్కువ అలాంటిది జేసీ జోలికి వెళితే ఎలా ఉంటుందో.. రఘువీరారెడ్డిని చూస్తే తెలుస్తుంది. తాజాగా ఆయన లంచం తీసుకుంటున్నా అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసి అందరూ షాకయ్యేలా చేశారు. దీనికి రఘువీరా రెడ్డి స్పందించి ఆయనపై విమర్శలు చేయడం.. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రివర్స్ లో ఆయనేమి సత్య హరిశ్చంధ్రుడు కాదు.. ఆయన జీవితంలో ఎప్పుడూ లంచాలు తీసకోలేదా అంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు జేసీ రఘువీరారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తాను మాట్లాడాలనుకుంటే ఎవరి గురించైనా మాట్లాడుకోవచ్చని.. తన గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోనని.. బట్టలు ఊడదీసి కొడతానని హెచ్చరించారు. అంతేకాదు ఇప్పటికే రెండుసార్లు ప్రజల చేతిలో దెబ్బలు తిన్న రఘువీరా రెడ్డి.. మూడోసారి తన చేతిలో తన్నులు తినాల్సి వస్తుందని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు సంపాదించిన దానిలో 20 శాతం పిల్లాడైన జగన్ తింటే.. మిగిలిన 80శాతం రఘువీరారెడ్డి లాంటివారు తిన్నారని విమర్శించారు. మొత్తానికి జేసీ జోలికి వస్తే ఎలా ఉంటుందో రఘువీరాకి ఇప్పటికే అర్ధమైఉంటుంది.

ys jagan

వీధుల్లోనే ఎక్కువ గడుపుతున్న జగన్

వైకాప అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంశాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ కు మరో వార్త పిడుగులా ఆయన మీద పడింది. ఆ పార్టీలోని ఇద్దరు నేతలు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఆలోచించేలోపే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు దీనిపై ఆందోళనలు చేయడానికి బయల్దేరారు వైకాపా శ్రేణులు. అంతేకాదు రాజధాని ప్రాతం తుళ్లూరులోనూ.. ఉద్దండరాయుని పాలెంలోనూ రైతులతో సమావేశం కానున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం జగన్ ను ఇంట్లో కంటే వీధుల్లోనే ఎక్కువ గడిపేలా చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. దానికి జగన్ ఆందోళనలు.. నిరసనలు అంటూ వీధులకెక్కడం ఇదే సరిపోతుంది. మరి పార్టీ గురించి ఎప్పడు ఆలోచిస్తాడు.. పార్టీ బలోపేతానికి ఏం చేస్తాడు అని పలు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

TTDP BJP

వరంగల్ ఉపఎన్నిక.. టీడీపీ బీజేపీకే ఆ ఛాన్స్ ఇవ్వనుందా?

  వరంగల్ ఉపఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఏ పార్టీ వ్యూహాలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే ఈ ఉపఎన్నికకు టీటీడీపీ.. బీజేపీ పార్టీలు తమ అభ్యర్ధులను బరిలోకి దింపడానికి పోటీపడుతున్న సంగతి తెలసిందే. దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో శాసనసభ స్థానానికి.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను టీడీపీ బీజేపీ తరుపున మిత్రధర్మం పాటించిందని.. ఇప్పుడు బీజేపీ కూడా మిత్రధర్మ పాటించాలని సూచించారు. అయితే ఇప్పుడు టీడీపీ ఈ విషయంలో కొంచం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది.. ఈ పరిస్థితిలో పోటీ చేయడం.. ఒకవేళ పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని భావించి ఆ అవకాశం బీజేపీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో అనవసరమైన తప్పుల్ని చేయకూడదన్న లక్ష్యంతోనే వరంగల్ ఉఫ ఎన్నికకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఉపఎన్నికు బీజేపీ ముగ్గురు పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది.. వారిలో డాక్టర్ పంగిడి దేవయ్య.. డాక్టర్ రాజమౌళి.. డాక్టర్ ఎ. చంద్రశేఖర్ లు ఉన్నారు.

Rahul Gandhi

ప్రియాంకని హీరో.. రాహుల్ ని జీరో చేస్తున్న కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ శక్తి సామర్థ్యాలు ఏంటో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరికీ తెలుసు కానీ.. ఏ ఒక్కరూ బయటకు చెప్పే సాయసం చేయరు సరికదా.. తన శక్తి సామర్థ్యాల గురించి సోనియమ్మ దగ్గర ప్రశ్నించే ధైర్యం చేయరు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏదో చేసేస్తాడని భావించిన రాహుల్ గాంధీని హీరోని చేస్తూ తెగ పొగిడిన నాయకులకు.. ఆ ఎన్నికల్లో రాహుల్ ఘోర పరాజయం అవ్వడం వలన ఆ హీరోకి అంత సీన్ లేదని అర్ధమయింది. ఆ తరువాత విశ్రాంతి పేరిట కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ వచ్చిన రాహుల్ ఏమైందో ఏమో తెలియదు కాని కొన్ని రోజులు హడావుడి చేశారు. కానీ ఆ హడావుడి గురించి కొన్ని రోజులు చెప్పుకున్న దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి చిన్నచిన్నగా మారుతుంది. ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీని సీన్ లోకి ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు.. అప్పట్లో ఇందిర తన రాజకీయ వారసురాలిగా ప్రియాంకగాంధీనేనని చెప్పేవారని ఆయన వెల్లడించారు. ఆయన అలా వ్యాఖ్యానించిన తరువాత ఇంకో నేత ఎం.ఎల్. ఫోతేదార్ కి కూడా ధైర్యం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆయన కంటే కాస్త ఘాటుగానే రాహుల్ గాంధీని విమర్శించారు. రాహుల్ కు పార్టీ పగ్గాలు ఇవ్వటానికి పార్టీలో చాలామంది ఒప్పుకోవటం లేదని.. పార్టీ అధ్యక్ష పదవి కాకుండా ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా రాహుల్ సరైన వ్యక్తికాదని వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్క ప్రియాంక గాంధీని హీరోని చేసే క్రమంలో పాపం రాహుల్ గాంధీని జీరో ని చేస్తున్నారు పార్టీ నేతలు. మరి ఈ విషయంలో అమ్మ సోనియా గాంధీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

cm chandrababu

పార్టీ పరువు తీస్తున్నారు.. చంద్రబాబు

వరంగల్ ఉపఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో టీ టీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో దూషించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జరిగిన గొడవ గురించి చంద్రబాబు ఫోన్ చేసి తెలుసుకోగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. ఈసందర్బంగా చంద్రబాబు పార్టీ నేతలపై మండిపడ్డారు. వరంగల్ ఉపఎన్నికల సందర్బంగా ఈ గొడవలు ఏంటి.. పార్టీ పరువును తీస్తున్నారు అని పార్టీనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా సోమవారం నాడు నేతలను విజయవాడ రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ నేతలందరూ ఒకటై రేవంత్ రెడ్డిని ఒంటరి వాడిని చేశారన్న ఆరోపణలపై..  గొడవ పడకుండా రేవంత్‌రెడ్డికి సహకరిస్తూ పార్టీ కార్యక్రమాలను కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని ఆగ్రహంగా చెప్పారని సమాచారం. కాగా తనపై నేతలు ప్రవర్తిస్తున్న తీరును.. నేతలు తనను అవమానిస్తున్నా, దూషిస్తున్నా పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డు చెప్పలేదని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

 Telangana CM KCR

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో మూడు రోజులు మకాం దేనికో?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఎదుర్కొనే ప్రశ్న ఆయన డిల్లీ పెద్దలతో ఎందుకు దూరంగా ఉంటున్నారని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ఈ ఏడాదిన్నర కాలంలో ఆయన చాలా తక్కువ సార్లు డిల్లీ వెళ్ళారు. ఆయన కేంద్రప్రభుత్వంతో కూడా గొడవలు పెట్టుకొంటూ, దానికి దూరంగా ఉంటున్నందునే తెలంగాణా రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆయన డిల్లీ వెళ్లి అక్కడే మూడు రోజులు మకాం వేయబోతున్నట్లు తెలియగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. సీబీఐ కేసు మెడకు చుట్టుకోగానే దానిని వదిలించుకోనేందుకే ఆయన డిల్లీలో పెద్దలను కలిసేందుకు వెళుతున్నారని అందుకే అక్కడ ఆయన మూడు రోజులు మకాం వేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   రేపు డిల్లీలో జరుగబోయే నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ్ళ డిల్లీ బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో సమావేశం అవుతారని సమాచారం. తెలంగాణాకు కేంద్రం విడుదల చేయవలసిన నిధులు, వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన వారితో చర్చిస్తారని తెలుస్తోంది.

ex mp Vivek

టీఆర్ఎస్ లో చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చిన వివేక్

మాజీ ఎంపీ వివేక్ టీఆరెస్ లోకి చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్ ఉపఎన్నిక షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున పోటీ చేయమని మంత్రి హరీశ్ రావు అడిగినట్టు, దానికి వివేక్ కూడా సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆవార్తలకు బ్రేక్ వేశారు వివేక్. తానే స్వయంగా మీడియా ముందుకొచ్చి ''నేను టీఆరెస్ లో చేరబోవడం లేదు.. కాంగ్రెస్ ను వీడడం లేదు'' అని క్లారిటీ ఇచ్చారు. దీంతో టీఆరెస్ లో ఆయన చేరిక లేనట్లేనని తేలిపోయింది. అంతేకాదు.... వివేక్ ను చేర్చుకుని వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని భావిస్తున్న టీఆరెస్ ఇప్పుడు కొత్త అభ్యర్థిని వెతుక్కనే పనిలో పడింది. కాగా ఇప్పుడు మరో అనుమానం వ్యక్తం అవుతుంది. వివేక్ టీఆర్ఎస్ ఆఫర్ చేసిన ఎంపీ సీటు మంచిదేనని.. మరి ఎందుకు వివేక్ ఈ అవకాశాన్ని వదులుకున్నారో అని.. బహుశా ఆయనకు అధిష్టానం ఫోన్ చేసి ఇంకా ఏదో మంచి ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మరి ఏం జరిగిందో వివేక్ కే తెలియాలి.

JC Prabhakar Reddy

రఘువీరాకి జేసీ కౌంటర్.. ఆయన ఏమి సత్య హరిశ్చంద్రుడు కాదు

  జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. వాళ్లు అలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా చాలా దర్జాగా.. ఎలాంటి బెదురు లేకుండా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వారు.. తాజాగా తాము లంచం తీసుకుంటామని.. ఆ వచ్చిన డబ్బుతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేస్తామని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దీనికి ఏపీ కాంగ్రెస్ రథసారధి రఘేవీరా వెంటనే స్పందించి విమర్శలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరుకుంటారా ఆయన కూడా రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు.  రఘవీరా ఏమీ సత్య హరిశ్చంద్రుడేమీ కాదన్నారు. రఘువీరా తన జీవితంలో ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదా? అని సూటిగా ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులతో రఘువీరా నీలకంఠాపురం వచ్చి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. మొత్తానికి జేసీ మీద వ్యాఖ్యలు చేసిన రఘువీరాను జేసీ చాలా తెలివిగా ఇరికించారు. మరి జేసీ సవాల్ కు రఘువీరా వివరణ ఇస్తారో లేదో చూడాలి.

nandamuri balakrishna

కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన బాలయ్య

  తెలంగాణ మంత్రి కేటీఆర్ పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఈరోజు బసవతారకం క్యాన్స్రర్ ఆస్పత్రి తరపున పింక్ రిబ్బన్ వాక్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అడగ్గానే ఈ కార్యక్రమానికి సహకరించిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. ఆయన ఆరోగ్యం సహకరించనందుకే ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. ప్రజల్లో క్యాన్సర్ పట్ల మరింత అవగాహన పెంచాలని.. అందుకు మీడియా సహకరించాలని కోరారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మూడు అంతస్తుల్లో 100 పడకలతో ప్రారంభించిన ఈ ఆసుపత్రి ఇప్పుడు 500 పడకలతో ఇప్పుడు బహుళ అంతస్తుల్లో విస్తరించిందని అన్నారు.

KCR

కేసీఆర్ ఏపీకి 200 కోట్లు విరాళం ఇవ్వాలనుకున్నారా?

  ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా పిలవడం, ఆయన మాటకు కట్టుబడి కేసీఆర్ కూడా కార్యక్రమానికి వెళ్లడం.. వీరిద్దరు సన్నిహితంగా ఉండటం చూసి ఇతర పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీ కంటే కేసీఆర్ కే ఎక్కువ రెస్పాన్స్ రావడం ఆశ్చర్యకరం. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్ మాత్రం ఏపీకి ఓ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించుకుని వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి చంద్రబాబు పిలవగానే అంగీకరించి అమరావతికి వచ్చిన కేసీఆర్ అక్కడ తనకు మంచి ప్రాధాన్యం దక్కుతుందునిముందే తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఏపీకి 200 కోట్లు భారీ విరాళం ప్రకటించాలని అనుకున్నారట. అయితే ఏపీ ప్రజలు అనుకున్నట్టే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధాన మంత్రి ఏపీకి ఎదో ఒక ప్రకటన చేస్తారని కేసీఆర్ కూడా అనుకున్నారట. అయితే మోడీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. కేసీఆర్ ప్రకటన చేయకుండా ఊరుకుండిపోయారట. ప్రధాన మంత్రి ఎటువంటి ప్రకటన చేయకుండా తాను ప్రకటన చేస్తే  బావుండదని ఆలోచించి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఏపీకి అంత విరాళం ఇవ్వాలనుకోవడం మెచ్చుకోతగిన విషయమే. ఒకవేళ కేసీఆర్ కనుక అలా చేసిఉంటే ఏపీ ప్రజల్లో ఎప్పుడూ నిలిచి ఉండేవాడు.

ex mp vivek

టిఆర్ఎస్‌లోకి మాజీ ఎంపి వివేక్?

  కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ గాలి వివేక్ తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ కేశవరావు తెలంగాణ మంత్రి హరీశ్ రావు భేటీ అయిన నేపథ్యంలో మాజీ ఎంపీ వివేక్ కూడా ఈ భేటీకి హాజరుకావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ఆ స్థానానికి టీఆర్ఎస్ తరుపున వివేక్ ను బరిలోకి దిగమని హరీశ్ రావు కోరగా.. వివేక్ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. నవంబర్‌ 4తో నామినేషన్‌ గడువు ముగియనుంది. కాగా వివేక్‌తో పాటు ప్రొ. సాంబయ్య, ఎర్రొళ్ల శ్రీనివాస్‌, రవికుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్‌ లేదా రవికుమార్‌ ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అదివారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

amaravathi stone foundation

దేవాన్ష్ పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య.. అమరావతిని పాలించాలని

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాన మంత్రి మోడి అయిన సెంట్రాఫ్ యాట్రక్షన్ అయ్యారో లేదో కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలయ్యల మనువడు దేవాన్ష్ మాత్రం కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రతిఒక్కరూ దేవాన్ష్ ను ముద్దు చేశారు.. ఆఖరికి మోడీ కూడా దేవాన్ష్ ను కొద్దిసేపు ముద్దుచేశారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా దేవాన్ష్ ను ఎత్తుకున్న రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రేవంత్ రెడ్డి దేవాన్ష్ ను ఎత్తుకుని అతని మెడలో అమరావతి కండువ వేయగా.. పక్కనే ఉన్న చంద్రబాబు భార్య భువనేశ్వరి.. దేవాన్ష్ నాయనమ్మ అమరావతి కండువా వేశావు.. మరి పసుపు కండువా ఎప్పుడు వేస్తావు అని అడుగగా దానికి రేవంత్ రెడ్డి భవిష్యత్ లో అమరావతిని పాలించడానికి ఈ కండువా వేశాను.. పసుపు కండువా తాతగారు వేస్తారు అని అక్కడ ఉన్న వారిని నవ్వించారు. మొత్తానికి నారా దేవాన్ష్ కు ఇప్పటినుండే రాజకీయా ఓనమాలు దిద్దేలా ఉన్నారు.

Kodandaram

కేంద్రం చంద్రబాబుకు పవర్స్ ఇచ్చింది.. కోదండరాం

  తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్స్ గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా తెలంగాణపై చంద్రబాబుకు కేంద్రం అధికారాల్ని కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన లాంటి అంశాలు చంద్రబాబు ఆదేశాల్ని బట్టి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అసలు హైకోర్టును విభజించాలని కేంద్రాన్నికోరితే చంద్రబాబు లేఖ రాస్తే తప్ప చేయమంటున్నారు.. ఒక రాష్ట్రపతి చేయాల్సిన పనిని చంద్రబాబు ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. ఉద్యోగుల విభజన పై ఏర్పాటు చేసిన కమల్ నాథ్ కమిటీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది.. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇంతవరకూ ఈ సమస్యకు ఓ కొలిక్కి తీసుకురాలేదు.. కావాలనే జాప్యం చేస్తుంది.. అక్కడ ఆంధ్రాలో తెలంగాణ ఉద్యోగులు నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారు.. వారిని వెనక్కి తెచ్చేందుకు తెలంగాణ సర్కారు లేఖలు రాసిని ప్రయోజనం ఉండటం లేదు’’ అంటూ మండిపడ్డారు. నిజంగానే చంద్రబాబుకు అంత పవర్ ఉంటే ఆయన పాలిస్తున్న రాష్ట్రానికి ఏం కావాలో ఎప్పుడో చేయించుకునే వాళ్లు కదా.. ఈ  విషయం కోదండరాం ఆలోచించలేదేమో..

జయలలిత పై నగ్మా కామెంట్స్.. మహిళల్నివిధవల్ని చేస్తున్నారు

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై నగ్మా ఘాటైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు సినిమాల్లో నటించిన అందాల తార నగ్మా చాలా కాలం తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది. అయితే ఇప్పుడు నగ్మా జయలలిత పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మహిళలకు చీరలు పంచిపెడుతూనే.. మధ్యం విక్రయాలు పెంచి అదే మహిళల్ని విధవల్ని చేస్తున్నారని జయలలితపై నగ్మా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. అంతేకాదు తనకు జయలలితపై ఎనలేని గౌరవం ఉందంటూనే ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సుపరిపాలన అంటే ముందువెనుక ఆలోచించకుండా వరాలు ఇవ్వడం కాదని.. ప్రజల కష్టనష్టాలు తీర్చడమేనని సూచించింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఖుష్బూతో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేస్తానని తెలిపింది. మరి నగ్మా చేసిన వ్యాఖ్యలకు జయలలిత ఎలా కౌంటర్ ఇస్తుందో.

రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం.. నువ్వు ఐటెం గార్ల్ వి.. నువ్వు కోవర్టువి

  టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, యువనేత రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఎప్పటినుండో వీరిద్దరి మధ్య బేధాభ్రిపాయలు  నడుస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే జరిగిన తెలంగాణ అధ్యక్ష పదవిలో వీరిద్దరి మధ్య గట్టిపోటీనే ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు పరిస్థితిని చక్కబెట్టి ఎవరూ నొచ్చుకోకుండా పదవులు కట్టబెట్టారు. అయితే మళ్లీ ఇప్పుడు వీరిద్దరి తీరుపై పార్టీకి సమస్యలు తలెత్తేలా కనిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికకు తేదీ ఖరారైన నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు గాను నిన్నఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా టీటీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  రేవంత్ మాట్లాడుతూ... వరంగల్ లోకసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ పెట్టాలని ప్రతిపాదించారు. దీనికి ఎర్రబెల్లి కల్పించుకొని గత ఎన్నికల్లో మిత్రధర్మంతో బీజేపీకే ఛాన్సిచ్చామని, ఇప్పుడూ ఇవ్వకతప్పదని, అన్నీ ఆలోచించి మాట్లాడాలని బదులిచ్చారు. దీంతో కోపాద్రిక్తుడైన రేవంత్ రెడ్డి అంటే అన్నీ మీరేనా? చివరకు పార్టీ క్యాడర్‌కు పంపించే ఎస్సెమ్మెస్‌లు కూడా నీ పేరు, రమణ పేరుతోనే వెళ్తున్నాయని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అని, తన పేరు అక్కర్లేదా? చివరకు టీడీఎల్పీలో కూడా తన మాట వినడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య మాటాల తూటాలు పేలాయి. అంతేకాదు రేవంత్ రెడ్డి ఎల్.రమణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తాను వర్కింగ్ ప్రసిడెంట్ అలాంటిది నాకు చెప్పకుండా  సమావేశాలు పెడుతున్నారని నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని ఎల్ రమణను కూడా రేవంత్ అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎర్రబెల్లి మళ్లీ కల్పించుకొని.. ఐనా నువ్వు పార్టీలో ఓ ఐటెం సాంగ్ గర్ల్‌గా మారిపోయావని, ఇలా వచ్చి అలా వెళ్తుంటావని, నీతో పార్టీకి ఒరిగిందేం లేదని వ్యాఖ్యానించగా దానికి రేవంత్ రెడ్డి నీలా నేను కోవర్టును కాదని ధీటుగా సమాధనమిచ్చారు. అయితే ఈ గొడవలో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అందేంటంటే రేవంత్ రెడ్డి ఒంటరివాడయ్యాడనే విషయం. ఎందుకంటే ఎర్రబెల్లికి ఉన్నసీనియర్ల సపోర్టు రేవంత్ రెడ్డికి లేకపోవడం.. అంతేకాదు సీనియర్లంతా ఆయనపై గుర్రుమంటున్నారు. కాగా ఈ విషయాన్ని రమణ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఏరకమైన నిర్ణయం  తీసుకుంటారో చూడాలి.

ప్రముఖ హాస్య నటుడు ‘మాడా’ మృతి

  ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు(65) నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 17న అపోలో ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స తీసుకొంటున్నారు. నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన మరణించారు.   ‘మాడా’ గా తెలుగు ప్రజలకు సుపరిచితులయిన ఆయన పూర్తి పేరు మాడా వెంకటేశ్వర రావు. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో దుళ్ల గ్రామంలో 1950 అక్టోబర్ 10న జన్మించారు. ఆయనకు నలుగురు కుమార్తెలున్నారు. ఆయన సినీ పరిశ్రమలో ప్రవేశించే ముందు నాటక రంగంలో తన ప్రతిభను చాటుకొన్నారు. దర్శకుడు బాపు ఆయన ప్రతిభను గుర్తించి తన సినిమాలలో అవకాశం కల్పించారు. నాటక రంగానికి రాక పూర్వం మాడా వెంకటేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఇంజనీరుగా పనిచేసేవారు. బాపు సహాయంతో సినీ పరిశ్రమలో ప్రవేశించిన మాడా సుమారు 300కి పైగా సినిమాలలో నటించారు. ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ళ రాందాసు వంటి సినిమాలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టాయి.   ముఖ్యంగా 1977 సం.లో విడుదలయిన దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ సినిమాలో ‘పువ్వుల కొమ్మయ్య’ అనే నపుంసక పాత్ర, దానికి ఆయన చేసిన ‘చూడు పిన్నమా...పాడు పిల్లోడు..’అనే పాట ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ తరువాత ఆయన ఎన్ని విభిన్నపాత్రలు పోషించినప్పటికీ మాడా అంటే చటుక్కున అందరికీ అదే పాత్ర గుర్తుకు వస్తుంది. అంత అద్భుతంగా ఆయన ఆ పాత్ర చేసారు.

వరంగల్ ఉప ఎన్నిక.. టీడీపీ, బీజేపీ పోటాపోటిగా బరిలో

  వరంగల్ లోక్ సభ నియోజక వర్గ ఉప ఎన్నిక స్థానానికి షెడ్యూల్ విడుదలైందని విదితమే. అయితే ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ ఉప ఎన్నిక స్థానానికి పార్టీలు బానే పోటీపడుతున్నాయి. మరోవైపు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీ పార్టీలు కూడా ఈ నియోజక వర్గం నుండి పోటీ చేయడానికి పోటీపడుతున్నాయి. రెండు పార్టీలు ముందు నుండీ పొత్తులో భాగంగా ఆస్థానం నుండి పోటీ చేయాలనీ అనుకున్నారు కానీ.. తీరా ఎన్నికల తేదీ వెల్లడయ్యే సరికి ఇరు పార్టీల కార్యకర్తలూ కూడా తమ అభ్యర్థే రంగంలో ఉండాలని పట్టుపడుతున్నాయి. దీనిలో భాగంగానే టీ టీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్ లో సమావేశమవ్వగా.. బీజేపీ నేతలు వారి కార్యలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు పార్టీలు ఈ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. కాగా మెదక్ లోక్ సభ.. రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలప్పుడు టీడీపీ మిత్రధర్మం వహించిందని.. ఇప్పుడు బీజేపీ కూడా అలానే పాటించాలని టీడీపీ గుర్తుచేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.