amarawathi

గన్నవరంలో మోడీకి ఘనస్వాగతం

  అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నర్సింహన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఘనస్వాగతం పలికారు, పుష్పగుచ్చాలు, పట్టు శాలువాలతో మోడీని చంద్రబాబు సత్కరించారు, ఉదయం పదకొండున్నర సమయంలో భారత వాయుసేన విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చిన మోడీ... సెక్యూరిటీ చెకింగ్స్ అనంతరం కిందికి దిగారు, తెల్లని వస్త్రాలు, బూడిద రంగు కోటు ధరించిన మోడీ... చాలా హుందాగా, శోభాయమానంగా కనిపించారు, అనంతరం మోడీ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతి ప్రాంతానికి వచ్చారు, మోడీ ప్రయాణించిన హెలికాప్టర్ ను మరో మూడు హెలికాప్టర్లు అనుసరించాయి, అత్యాధునికమైన ఈ హెలికాప్టర్లు రాడార్ సిస్టమ్ ద్వారా మోడీ భద్రతను పర్యవేక్షిస్తాయి

aMARAWATHI

అమరావతిలో సినీ ప్రముఖుల సందడి

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ దంపతులతోపాటు హీరో వెంకటేష్‌, కృష్ణంరాజు, సినీనటులు సాయికుమార్‌, సుమన్‌లు తరలివచ్చారు. సినీనటుల రాకతో అమరావతి ప్రాంగణం కోలాహలంగా మారింది. మరోవైపు తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు క్యూకట్టడంతో అమరావతి పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి, ముఖ్యంగా రాయలసీమ నుంచి జనం బారులు తీరారు, అమరావతి శంకుస్థాపనకు తరలివస్తున్న అశేష జనవాహినికి, అతిథులకు స్వాగతం పలుకుతున్న మంత్రి నారాయణ... సభాప్రాంగణం దగ్గర ఉంటూ పర్యవేక్షిస్తున్నారు,

Telangana CM

ఉద్దండరాయుని పాలెం చేరుకొన్న ప్రధాని, ప్రముఖులు

  ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికేరు. ఆయన హెలికాఫ్టర్లో వేదిక వద్దకు చేరుకొంటారు.   బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, తెలుగు సినీ పరిశ్రమ నుంచి కృష్ణం రాజు, వెంకటేష్, సుమన్, అలీ, చలపతి, ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్ తో సహా నందమూరి కుటుంబానికి చెందిన 50మంది సభ్యులు ఈ కార్యక్రమానికి తరలివచ్చేరు.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే వేదిక వద్దకు చేరుకొన్నారు. ఆయనతో బాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, నామా నాగేశ్వర రావు తదితరులు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చేరు.   కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి వేదిక వద్దకు చేరుకొన్నారు.ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు సతీ సమేతంగా వచ్చేరు. ముంబై కి చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేదిక వద్దకు తమకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో చేరుకొంటున్నారు. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయిన అతిధులను, లక్షలాది ప్రజలను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు శివమణి డ్రమ్ బీట్స్ తో మొదలయ్యాయి.

Sai Kumar

మా జన్మ ధాన్యం అయ్యింది: సాయి కుమార్, సునీత

  అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా పాల్గొనేందుకు తమకు అవకాశం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని యాంకరింగ్ చేయబోతున్న డబ్బింగ్ కింగ్ సాయి కుమార్, సునీత చెప్పారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరుగకుండా ఆశించిన దానికంటే గొప్పగా యాంకరింగ్ చేసేందుకు గత రెండు రోజులుగా రిహార్సల్స్ కూడా చేస్తున్నామని వారు తెలిపారు.   ఇటువంటి అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని సాయి కుమార్ అన్నారు. అవకాశం రావడానికి అమరేశ్వరుని ఆశీస్సులే కారణం. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్న ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇది మన ఇంటి పండుగ మన అందరి పండుగ. అమరేశ్వరుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను అని గాయని సునీత అన్నారు.

Amaravati

అమరావతి శంఖుస్థాపనశిలాఫలకంపై ఉండే పేర్లు ఇవే

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన శిలాఫలకం మీద మొత్తం 16మంది పేర్లు చెక్కబడ్డాయి. వాటిలో అన్నిటి కంటే పైవరుసలో ప్రధాని నరేంద్రమోడి, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్లు, ఆ క్రిందన ఎడమవైపున వరుసగా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అమరావతి నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌,నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,బండారు దత్తాత్రేయ,అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న జపాన్ మంత్రి ఇసుకే టకాచీ పేర్లు ఈ శిలాఫలకంపై ఉంటాయి. కుడివైపున వరుసగా అశోక్‌ గజపతిరాజు,తమిళనాడు గవర్నర్ రోశయ్య, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్ బాదల్ ,సుప్రీంకోర్టు జడ్జి ఎన్‌.వి. రమణ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిలపేర్లు ఉంటాయి.

political news

అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై కేసీఆర్ పేరు

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా చేర్చారు, అయితే రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ పేరును ఏపీ కొత్త రాజధాని శంకుస్థాపన శిలాఫలకంపై ఎలా చేర్చుతారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు, టీడీపీ నేతలు కూడా కేసీఆర్ పేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది, అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ రాష్ట్ర విడిపోవడానికి కారణమైన కేసీఆర్ పేరును శిలాఫలకంపై ఎలా చేరుస్తారంటూ కొందరు టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు, దీనిపై పార్టీ హైకమాండ్ ను నేరుగా ప్రశ్నించినట్లు కూడా తెలిసింది, అయితే ప్రోటోకాల్ ప్రకారమే కేసీఆర్ పేరును చేర్చామని, గవర్నర్లు, ముఖ్యమంత్రుల పేర్లు చేర్చడం ఆనవాయితీ అని చెప్పారట.

amaravathi

అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ ఇదే

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమ షెడ్యూల్ ను విడుదల చేసింది, ప్రధాని నరేంద్రమోడీతోపాటు దేశ విదేశీ ప్రముఖులు హాజరయ్యే అమరావతి ఫౌండేషన్ మెయిన్ ప్రోగ్రాం మధ్యాహ్నం 12గంటల తర్వాతే మొదలుకానుంది, మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రధాన వేదిక దగ్గరకు చేరుకోనున్న మోడీ... 12.35కి అమరావతి గ్యాలరీని సందర్శిస్తారు, అనంతరం 12.43 గంటల్లోపే రాజధానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత 12.45కి ప్రధాన వేదిక దగ్గరకు చేరుకుంటారు, 12.48 నుంచి 12.50 వరకు ‘మా తెలుగుతల్లి‘ గీతాలాపన, మధ్యాహ్నం 12.50 నుంచి 12.53 వరకు జపాన్ మంత్రి తకాగి స్పీచ్, 12.53 నుంచి 12.56 వరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, 12.56 నుంచి ఒంటి గంట వరకూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఒంటి గంటా 11 నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు, చివరిగా ఒంటి గంటా 11 నిమిషాల నుంచి 143 వరకు ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు

Amitabh Bachchan

యూపీ సర్కారుతో అమితాబ్ కి తలనొప్పులు.. ముందుగానే మేల్కొన్నారు

  ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు రూ 50,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా విమర్శలు తలెత్తాయి. స్వాతంత్ర్య సమరయోధుల కంటే ఈ పెన్షన్ భారీగా ఉండటం.. బిగ్ బీ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్న నేపథ్యంలో ఇంత భారీ పెన్షన్ ను కేటాయించడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా వివాదాస్పదం అవుతుందని గమనించి బిగ్ బీ ముందు జాగ్రత్తగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తనకు.. తన కొడుకు అభిషేక్ బచ్చన్, భార్య జయా బచ్చన్ కు కేటాయించిన పెన్షన్ మొత్తాన్ని పేదలకు ఉపయోగించాలని.. తమ కుటుంబ కోరిక కూడా ఇదేనని అన్నారు. దీనిలో భాగంగా యూపీ సర్కారుకు ఓలేఖ కూడా రాయనున్నారట. మొత్తానికి బిగ్ బీ తొందరగానే మేల్కొని సమస్య జఠిలం కాకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారు. కాగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం క్రీడా, కళా రంగాలలో విశేషకృషి చేసిన వారిని గౌరవించేందుకు "యష్ భారతి సమ్మాన్" అనే పెన్షన్ పధకం ప్రారంభించింది. దీనిలో భాగంగానే బిగ్ బీ లాంటి గొప్ప నటులు తమ ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమని అందుకే అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లను ఈ పెన్షన్ పధకానికి ఎంపిక చేసినట్లుగా రాష్ట్ర సాంస్క్రతిక శాఖ ప్రకటించింది.

తలసాని వ్యవహారంతో నాకు సంబంధం లేదు.. భన్వర్ లాల్

  తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభకు ఎంపికయి ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి మారి మంత్రివర్గంలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తలసాని రాజీడ్రామా సమస్య మాత్రం ఇంకా ఓ కొలిక్కి రానే రాలేదు. తాను రాజీనామా చేశానని చెపుతున్నా దానికి సంబంధించి స్పీకర్ కూడా తగిన చర్యలు తీసుకోకపోవడంతో.. ఈ విషయంపై కోర్టులో విచారణ జరిపినా కోర్టు కూడా తాము చేయడానికి ఏం లేదని.. కానీ ఈ విషయంలో స్పీకర్ త్వరగా ఏదో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కూడా తనకు ఈ విషయంతో సంబంధం లేదని వ్యాఖ్యనించారు. భన్వర్ లాల్ కేంద్ర ఎన్నికల కమిషనర్ నసీం జైదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుశాతం ఓట్ల తొలగింపు జరిగింది.. నిజామాబాద్ జిల్లాలో 26 శాతం ఓట్ల తొలగింపు జరిగింది.. ఈ ఓట్ల తొలగింపుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో తలసాని రాజీనామా గురించి అడుగగా ఈ వ్యవహారం తన పరిధిలో లేదని.. తాను కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ గా మాత్రమే ఉన్నానని.. తాను ఏపీకి చెందిన వాడినని సమాధానమిచ్చారు.

అమరావతి నిర్మాణంపై దిగ్విజయ్ అనుమానాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు, నయారాయపూర్, ఛండీగఢ్, గాంధీనగర్,  అహ్మదాబాద్, డెహ్రాడూన్ వంటి కేపిటల్ సిటీస్ ను స్వదేశీ కంపెనీలే నిర్మించాయని, కానీ చంద్రబాబు మాత్రం విదేశీ కంపెనీల వెంటపడుతున్నారని మండిపడ్డారు, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని 99ఏళ్ల లీజుకు విదేశీ కంపెనీలకు కట్టబెట్టడం దారుణమన్న దిగ్విజయ్... అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వస్తాయని అనుకోవడం లేదన్నారు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ మాత్రమే పోరాటం చేస్తోందన్న డిగ్గీ.... చంద్రబాబు, జగన్ లు ప్రధాని మోడీని ప్రశ్నించడం లేదన్నారు.

చంద్రబాబు పలక ప్రచారం.. చౌకబారుగా ఉందని విమర్శలు

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వంహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచారం ఎప్పుడో మొదలైంది. దీనిలో భాగంగానే "మన అమరావతి - మన రాజధాని" పేరుతో వీడియో తీసి వాటి ద్వారా కూడా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అయితే అక్కడితో ఆగకుండా వినూత్నంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు చంద్రబాబు. అది అలా ఇలా కూడా కాదు పలకతో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు తన కుటుంబసభ్యులు ఆయన సతీమణి, కొడుకు లోకేశ్, కోడలు బ్రహ్మణి, ఆఖరికి మనవడు దేవాన్ష్ తో సహా అందరిని ఈ ప్రచారంలోకి లాగారు. అంతా బానే ఉన్నా ఈ ప్రచారం పై కొంత మంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పలకలతో చేస్తున్న ఈ ప్రచారం అత్యంత చౌకబారుగా ఉందని విమర్సిస్తున్నారు. అయితే మనవడు దేవాన్ష్, కోడలు స్మార్ట్ ఫోన్ తో ప్రచారం బాగుంది కానీ పలకలతోనే మరీ ఇబ్బందికరంగా ఉందని అటు ప్రతిపక్ష నేతలే కాదు.. పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు పలకల ప్రచారం ప్లాన్ పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించడంలేదు.

తరతరాలు గుర్తుండిపోయేలా భోజనాలు

  అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చే అతిథులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి పరిటాల సునీత ప్రకటించారు, అతిథులు లోపలికి వచ్చే సమయంలోనే భోజన ప్యాకెట్లను అందిస్తామని, పులిహోరా, చక్రపొంగలి, పెరుగన్నం, తాపేశ్వరం కాజా, అరటి పండు, మజ్జిగ, వాటర్ బాటిల్ ఇవ్వడంతోపాటు ప్రతి ఒక్కరూ భోజనం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు, శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చే అతిథులకు కొన్నిరోజులపాటు గుర్తుండిపోయేలా భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు సునీత తెలిపారు, మంత్రులు కిమిడి మృణాళిని, పీతల సుజాతలతో కలిసి తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో వంటశాలను పరిశీలించిన సునీత... అక్కడ వండిన ఫుడ్ ఐటెమ్స్ శాంపిల్స్ ను రుచిచూసి పరిశీలించారు