జగనే అతిపెద్ద భూ బకాసురుడు.. జగన్ తప్పా ఇంకెవరూ మిగలరు..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు. జగన్ దేశంలోనే అతిపెద్ద భూ బకాసురుడు అని.. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో భూములున్నాయంటూ ఎవరి పేర్లయితే రాశారో.. వారిలో ఒక్కరికైనా భూములుంటే ప్రజలకు పంచిపెడతామన్నారు. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు.. జగన్ అవినీతి పరుడు కనుక.. ఆయనకు అందరూ అదేవిధంగా కనపడతారు అన్నారు. ఇలాంటి వార్తలు రాసినందుకు అతనిపై పరువునష్టం దావా వేస్తానని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని.. ప్రాంతంలో టీడీపీ నేతలకు భూములున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.   మరో మంత్రి నారాయణ కూడా ఈ విషయంమీద జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ తన సొంత పత్రికలో తన ఇష్టమొచ్చినట్టు రాతలు రాయించారు.. ఆయన చెప్పినట్టు ఎవరికి ఎక్కడ భూములు ఉన్నాయో చెబితే వాటిని పేద ప్రజలకు ఇచ్చేస్తామని అన్నారు. అంతేకాదు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను తప్పా.. డబ్బులు ఆశించి కాదు.. నాకూ వ్యాపారాలు ఉన్నాయి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి వైసీపీ జగన్ తప్పా ఇంకెవరూ మిగలరని ఎద్దేవ చేశారు.

చెల్లి కళ్లు పీకి... చెవులు కోసి.. 143 సార్లు పొడిచి చంపిన అక్క..

  రష్యాలో ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. అక్క సొంత చెల్లిని పొడిచి చంపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 143 సార్లు పొడిచి పొడిచి చంపింది. రష్యా మోడల్ స్టెఫానియా దుబ్రొవీనా ను ఆమె అక్క ఎలిజా వెటా దుబ్రొవీనాను హత్య చేసింది. వివరాల ప్రకారం..  మోడల్ స్టెఫానియా దుబ్రొవీనా ను ఆమె అక్క ఎలిజా వెటా దుబ్రొవీనా వారి స్నేహితుడైన షోమ్యాన్ స్టాస్ బేర్ స్కీ ఇంటికి వెళ్లారు. అక్కడ వారు ముగ్గురు డ్రగ్స్ తీసుకొని.. మద్యం సేవించి పార్టీ చేసుకున్నారు. అయితే తరువాత బేర్ స్కీ ఏదో కొనడానికి బయటకు వెళ్లగా.. ఏమైందో ఏమో తెలయదు కానీ అతను వచ్చే లోపు ఎలిజా వెటా తన చెల్లిని అత్యంత కిరాతకంగా.. కనుగుడ్లు పీకేసి.. చెవులు కోసేసి.. ఆమెను చంపేసింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఆమె తన చెల్లిపై 143 సార్లు పొడిచి చంపిందని పోలీసులు తెలిపారు.

మైనర్ బాలికపై అత్యాచారం- మతబోధకునికి 40 ఏళ్ల శిక్ష

  మతబోధకుడు అంటే దేవుడి తరువాత దేవుడంతటివాడన్న భావం ఉంటుంది. కానీ కేరళకు చెందిన జేమ్స్ అనే పాస్టర్‌ తన స్థాయిని మరిచి ప్రవర్తించాడు. మైనారటీ కూడా తీరని బాలికలను చెరిచాడు. పాస్టర్‌ మీద ఫిర్యాదు చేయవచ్చునో లేదో అన్న భయంతో బాధితురాలు నోరు విప్పనేలేదు. కానీ, ఆమె చదువుకునే పాఠశాలలో మరో బాలిక కూడా ఇలాంటి అత్యాచారానికే లోను కావడంతో విషయం బయటకు పొక్కింది. పోస్కో చట్టం కింద ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి బాధితురాలికి 3 లక్షల నష్టపరిహారంతో పాటుగా, నిందితునికి 40 ఏళ్ల కారాగార శిక్షను కూడా విధించారు. నిందితుని మీద ఇలాంటి ఆరోపణలు మరిన్ని వెలుగులోకి వస్తుండటంతో, మరి వాటికి ఏ శిక్షను విధించనున్నారో!

బీజేపీ నేతలు నోటిని అదుపులో పెట్టేదెప్పుడూ..!

ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలకు కాస్త నోటి దురుసుతనం ఎక్కువైన్నట్టు తెలుస్తోంది. అసలే బీజేపీ పార్టీ మీద మత ముద్ర ఎక్కువగా ఉంటుంది. అందునా ఒక పక్క దేశంలో అసంఘటిత చర్యలు ఎక్కువయ్యాయి.. ఇప్పటికే ఒక పక్క జెఎన్ యూ.. మరోపక్క రోహిత్ ఆత్మహత్య ఇలాంటి ఘటనలతో దేశం అట్టుడిపోతుందే.. ఎంతో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. కానీ అదేమీ లేకుండా.. వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పార్టీకే సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితి వస్తుంది.  ఈ మధ్యన రాజస్థాన్ కు చెందిన బీజేపీ నేత జేఎన్ యూ విద్యార్థుల వల్ల ఢిల్లీలో సగం అత్యాచారాలు జెఎన్ యూ విద్యార్ధుల వల్లే జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో నేత  సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపుతున్నాడు. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే.. ప్రపంచంలో ఇస్లాం మతం ఉన్నంత కాలం ఉగ్రవాదాన్ని ఎవరూ ఆపలేరని.. భత్కల్ వంటి ప్రదేశాల్లో శాంతిని కాపాడాలంటే ప్రపంచం నుంచి ఇస్లాంను తరిమేయాలంటూ కామెంట్స్ చేశాడు. అంతే దీనిపై ఇప్పుడు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికైనా పరిస్థితులను గమనించి బీజేపీ నేతలు కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని భావిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ వంగవీటి రత్మకుమారి దొరికింది..

  రామ్ గోపాల్ వర్మ తీయబోయే వంగవీటి సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలుసుకోవడానికి రాంగోపాల్ వర్మ విజయవాడలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన వంగవీటి మోహన్ రంగా పాత్రకు క్యారక్టర్ ని ఎంపిక చేసి దానికి సంబంధించిన ఫొటోను ప్రకటించారు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా భార్య పాత్రకు గాను ఓ బెంగాళి నటి స్మితా పాటిల్ ను ఎంపిక చేసి దానికి సంబంధించిన ఫొటోను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు...కానీ ఆ హత్య జరగక ముందు నాకు తెలిసిన రత్నకుమారిగారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం నేను చాలా చాలా చాలా అన్వేషించాను..చివరికి ఆ కెపాసిటీ నాకు స్మితా పాటిల్ లో కనిపించింది అని అన్నారు.

భవనంపై నుండి కిందపడి విప్రో ఉద్యోగి మృతి.. హత్యా..? ఆత్మహత్యా..?

హైదరాబాద్ లో గచ్చిబౌలి విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన రాణిమిశ్రా విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే తాను ఇందిరా నగర్ లో బాలాజీ హాస్టల్ లో ఉంటుండగా.. ఈరోజు బాలాజీ హాస్టల్ భవనంపై నుండి కిందపడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. దీనిలో భాగంగా రాణిమిశ్రా ఎక్కువగా దైవ చింతనలో ఉండేదని.. ఎప్పుడూ ఒంటరిగా ఉండేదని స్ధానికులు పోలీసులకు తెలిపారు. మరోవైపు రాణిమిశ్రాది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

నేను సిగ్గుపడుతున్నా.. ముద్రగడ మళ్లీ సీరియస్..

  హామీలు నెరవేరక నేను సిగ్గుపడుతున్నాని ముద్రగడ పద్మనాభం అన్నారు. దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని..  చంద్రబాబు తనను మోసగించారంటూ.. కాపు రుణాల పేరుతో పసుపు చొక్కాలకే ఇస్తున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రెండు మూడు రోజుల్లో కాపు నేతలతో సమావేశమయి.. భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని అన్నారు. అంతేకాదు ముద్రగడను కలిస్తే కేసుల్లో ఇరుక్కుంటారని యువకులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని...  ఏ కులానికీ వ్యతిరేకం కానని చెబుతున్నారు. మొత్తానికి ముద్రగడ సీరియస్ చూస్తుంటే మళ్లీ ఉద్యమానికి తెర తీసేటట్టు కనిపిస్తున్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధీ.. ఇప్పటికి 8మంది

  వైసీపీ ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధి చూసే టీడీపీలో చేరా.. కోడుమూరు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ..మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరుతున్నారు.. ఎవరిని ప్రలోభపెట్టాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలకు ఈ చేరికలే జవాబు.. ఇంకా ఐదారుగురు నేతలు టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు.. ప్రతిపక్షం లేకుండా పోతుందని జగన్ భయపడుతున్నారని అన్నారు. కాగా మణిగాంధీతో కలిపి.. ఇప్పటికి 8మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.

కిరణ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ కు దరిద్రం.. వీహెచ్

  కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వ్యవహారంపై పార్లమెంట్లో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. కార్తీ చిదంబరం అక్రమ మార్గాల ద్వారా వేలాది కోట్లు సంపాదించారని, ఎయిర్ టెల్-మ్యాక్సిస్ డీల్‌లో నిందితుడైన ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. సభలు ప్రారంభమైన వెంటనే వెల్ లోకి వెళ్లి కార్తీ చిదంబరంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు స్పందిస్తూ కార్తీ చిదంబరం వల్లే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన వల్లే కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి దక్కిందని.. ఆయన సీఎం అయిన తర్వాతే కాంగ్రెస్‌కు దరిద్రం పట్టుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమే.. దేవినేని

  కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత పురంధేశ్వరి పోలవరంకు కేవలం రూ.100 కోట్లు రావడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని..పట్టిసీమను పోలవరం నిర్మాణ వ్యయంలో ఎందుకు చేర్చారో చెప్పాలని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేత దేవినేని ఉమ ఖండించారు. పోలవరం ప్రాజెక్టుపై పురంధరేశ్వరీ చేసిన వ్యాఖ్యలు అవాస్తమని.. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమేనని ఆయన అన్నారు.పోలవరం అథారిటీకి జలవనరుల శాఖ సహకరిస్తుంది.. పోలవరం బడ్జెట్ పై ఉమాభారతితో చంద్రబాబు మాట్లాడారు.. ఈవారంలోపు చంద్రబాబు ఆమెను కలుస్తారు.. పోలవరంను సకాలంలోనే పూర్తిచేస్తామని తెలిపారు.

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన రోజా..

  అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలసిందే. అయితే సస్పెన్షన్ సవాల్ చేస్తూ రోజా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని ఈనెల 9కి వాయిదా వేసింది. ఇప్పుడు దీనికి ప్రశ్నిస్తూ రోజా డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదిస్తూ..  శాసన సభ వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయకుండా వాయిదా కోరారని.. కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏదో ఒక సాకుతో వాయిదా కోరుతున్నారని తెలిపారు. అంతేకాదు.. ఈనెల 5 నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో 9కి వాయిదా వేస్తే పిటిషనర్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కోల్పోతారని అన్నారు.   దీనిపై ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గత నెల 17న ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి 24న అందాయని.. వాదనలు చెప్పాలని తనను కోరారని, ఆ విషయాన్నే కోర్టుకు చెప్పి వాయిదా కోరానని తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందున్న కేసు విచారణను 9వ తేదీ కంటే ముందుగానే చేపట్టాలని కోరతామని స్పష్టం చేస్తూ విచార ణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసింది.

జెఎన్ యూ.. అవి అసలైన వీడియోలు కాదు.. తేల్చేసిన ఫొరెన్సిక్

జ్యాతి వ్యతిరేక నినాదాలు చేశారంటూ.. దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్ పై వచ్చిన వీడియోలు మార్ఫింగ్ చేసినవి అని.. అసలు వీడియోలు కాదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఫోరెన్సిక్ అధికారులు వాటిని పరిశీలించిన అనంతరం.. అవి అసలైనవి కావని.. మార్ఫింగ్ చేసినవే అని తేల్చి చెప్పింది. ఈ వీడియోలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఫొరెన్సిక్ విభాగాన్ని ఆదేశించగా హైదరాబాద్ లోని అధికారులు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు చెబుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం ఏడు వీడియోలు రాగా.. అందులో రెండింటిని ముందే ఎడిట్ చేశారని.. గొంతులు కూడా కలిపారని.. దీనికి సంబంధించిన నివేదికను ఢిల్లీ ప్రభుత్వానికి అందించామని తెలిపారు.

బుల్లితెర నటి ఆత్మహత్య.. ఉరేసుకొని

  బుల్లితెరపై నటించే శృతి అనే నటి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగుళూరులో టెలివిజన్ నటి శృతికి రమేష్ అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితమే వివాహమైంది. వీరిద్దరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే శృతికి తన ఇంటికి సమీపంలో శ్రీకాంత్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శృతి నిన్న రాత్రి శ్రీకాంత్ ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో  ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన కొద్ది సేపటికి శ్రుతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాంత్ అతని స్నేహితుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే శృతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంది. దాంతో శ్రీకాంత్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు శృతి భర్త రమేష్ తన భార్య చనిపోవడానికి కారణం శ్రీకాంతే అంటూ.. అతనే శ్రుతిని ఆత్మహత్యకు ప్రేరేపించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకాంత్ పై కూడా కేసు నమోదు చేశారు.

జగన్ ను రెండో పెళ్లి చేసుకోమన్నా..చంద్రబాబుకి కులపిచ్చి..

  వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన ఆదినారాయణ రెడ్డి అప్పుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఎలాగో అనేక అడ్డంకులు ఎదురైనా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు. అయితే అలా చేరారో లేదో అప్పుడే మైక్ దొరికింది కదా అని చెప్పేసి జగన్ పై విమర్శనాస్త్రాలు విసిరారు. అంతేకాదు పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ లక్ష కోట్లు సంపాదించాడని.. వాటికి రూపాయి లెక్క వడ్డీ వేసుకున్నా ఆరు లక్షలవుతుందని.. అన్నారు. అంతేకాదు తను ఎంట్రీకి అడ్డుపడిన రాంసుబ్బారెడ్డిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యానించారు. అతనితో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని.. ఒకవేళ తాను కనుక ఇబ్బంది పెడితే.. నేను రెండింతలు ఇబ్బందులు పెడతానని హెచ్చరించారు.   అక్కడితో ఆగకుండా ఇంకా అనేక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారని.. ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పానని..  అన్నారు. ఇక చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. అలాగే...  చంద్రబాబుకు కులపిచ్చి ఉందని... అది మార్చుకోవాలని ఆయనకు చెప్పానని అన్నారు. వైఎస్ హయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా జరిగాయని.. అంతకంటే వేగంగా చేయాలని చంద్రబాబుకు సూచించానన్నారు. మరి పార్టీలోకి వచ్చిన కొత్తలోనే ఇంతలా మాట్లాడుతున్నాడు.. అందునా చంద్రబాబు గురించి కూడా మాట్లాడుతున్నాడు.. ఇలానే మాట్లాడితే పార్టీలో ఏమాత్రం ఇమడగలడో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆదినారాయణ రెడ్డిగారు నోరు కాస్త ఆదుపులో పెట్టుకుంటే మంచిదని.. అనుకుంటున్నారు.  

భారత్ పాక్ మ్యాచ్ పై కొత్త సస్పెన్స్

టి20 వరల్డ్ కప్ ఈ ఏడాది ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు ఇండియా పాకిస్థాన్ దేశాలు, ఈ నెల 19న ధర్మశాలలో తలబడబోతున్నాయి. వరల్డ్ కప్ ఫిక్స్చర్స్ ప్రకటించి చాలా కాలమైనా నోరు మెదపని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఈ మ్యాచ్ కు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఇలాంటి పాలిటిక్స్ చేస్తోందని, దీని వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ విమర్శలు చేశారు బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్. ఈ నేపథ్యంలో, ఇండియా పాక్ మ్యాచ్ పై సస్పెన్స్ నెలకొంది. ఈ విషయమై బిసిసిఐ ఎలాంటి కసరత్తు చేస్తుందో చూడాలి