ఏపీ, తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు గాను అధికారులు సెట్ ‘సి’ ప్రశ్నాపత్రం ఎంపికచేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగే ఈ పరీక్షల్లో ఎలాంటి సమస్యలు ఎదురవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అంతేకాదు సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకనిఘా.. సీసీ కెమెరాల ఏర్పాట్లు.. కొన్ని పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ కూడా విధించినట్టు తెలుపుతున్నారు. కాగా ఏపీలో 1,363 తెలంగాణలో, 1, 257 కేంద్రాల్లో దాదాపు 19 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు.