ఏపీ శాసనమండలి రద్దు? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు కాబోతోందా? కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుందా?.. ఏపీ శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏడాదిన్నర క్రితం ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. జనవరి 27, 2020న అసెంబ్లీలో పాసైన తీర్మానాన్ని.. మరుసటి రోజే కేంద్రానికి పంపించింది జగన్ రెడ్డి సర్కార్. శాసనమండలి రద్దుపై సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉండటంతో  రద్దు కావడం ఖాయమని అంతా భావించారు. కాని ఏపీ సర్కార్ ఫైల్ ను మోడీ సర్కార్ పెండింగులో పెట్టింది. తాజాగా ఏపీ శాసనమండలి రద్దు అంశం పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు.  2019 డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. మాడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులు అసెంబ్లీ ఆమోదం తర్వాత మండలికి పంపించారు. అయితే పెద్దల సభలో వైసీపీకి బలం లేకపోవడంతో ఆ బిల్లులకు అక్కడ ఆమోదం లభించలేదు. బిల్లులపై చర్చించి సెలక్ట్ కమిటీకి పంపించారు మండలి చైర్మన్. దీంతో తమకు బలం లేని మండలి అవసరం లేదని భావించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలన్నీ మండలి ఇలాగే తిరస్కరిస్తూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించి  మండలి రద్దుకే మొగ్గుచూపారు. మండలి తీరుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం.. న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మండలి రద్దుపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ జనవరి 27, 2020న శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు.  శాసనసభ ఆమోదించిన మండలి రద్దు తీర్మాణాన్ని కేంద్రానికి పంపినా... అక్కడ పెండింగులో పడింది. శాసనమండలి రద్దుపై చాలా సార్లు కేంద్రానికి జగన్ విన్నవించినా ఆ ఫైల్ ముందుకు కదలలేదు. ఇంతలోనే కొవిడ్ మహమ్మారి కల్లోలంతో మండలి రద్దు అంశం పక్కకు పోయింది. ప్రస్తుతం మాత్రం మండలిలో సీన్ మారిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు పెద్దల సభలో టీడీపీకి మెజార్టీ ఉండగా.. ఇప్పుడు మాత్రం అధికార వైసీపీకే మెజార్టీ ఉంది. గత రెండేండ్లలో భర్తీ అయిన సీట్లతో వైసీపీకి లీడ్ వచ్చింది. దీంతో శాసనమండలి రద్దుపై జగన్ వైఖరి మారిందనే చర్చ జరుగుతోంది. గతంలో మండలి రద్దుకు పట్టుబట్టిన జగన్.. ఇటీవల కాలంలో దాని గురించి మాట్లాడకపోవడంతో.. ఆయన వెనక్కి తగ్గారని భావిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. శాసనమండలిని రద్దు చేసి తీరుతానని చెప్పిన సీఎం జగన్.. మడమ తిప్పినట్టేనా అంటూ సెటైర్లు కూడా వేశారు నర్సాపురం ఎంపీ రఘురామ రాజు. శాసనమండలి రద్దుపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే రాజ్యసభలో ఈ అంశం చర్చకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ శాసనమండలి రద్దు అంశం తమ పరిశీలనలో ఉందని కేంద్రం చెప్పడంతో.. తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి జగన్ మండలి రద్దుకే మొగ్గు చూపుతారా లేక.. చాలా హామీల్లో మడమ తిప్పినట్లే.. శాసనమండలి విషయంలోనూ మాట మారుస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

బీజేపీలో ముదిరిన కోల్డ్‌వార్‌! హుజురాబాద్ లో ఈట‌ల‌కు గండం? 

నిఖార్సైన పార్టీ. సైద్దాంతిక‌త‌కు క‌ట్టుబ‌డి ప‌నిచేసే పార్టీగా చెప్పుకునే బీజేపీలో కుహానా రాజ‌కీయాలు పెరిగాయి. క‌రుడుక‌ట్టిన కాషాయ వాదుల్లోనూ వ‌ర్గ పోరు వాస‌న‌లు వ‌స్తున్నాయి.  తెలంగాణ‌లోనూ కమ‌ల‌నాథులు ఆధిప‌త్య పోరుకు దిగుతున్నారు. బీజేపీలో కుమ్ములాట‌లు ఇప్పుడు హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌కు ఇబ్బందిగా మారింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా బాగుండు.. బీజేపీలో ఈ లొల్లేందంటూ రాజేంద‌ర్ తెగ‌ వ‌ర్రీ అవుతున్నార‌ట‌. తాజాగా బ‌య‌ట‌ప‌డిన ఈట‌ల బావ‌మ‌రిది మ‌ధుసూద‌న్‌రెడ్డి వాట్సాప్ చాట్‌తో బీజేపీలో ఆధిప‌త్య‌పోరు ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలుసొస్తోంది.  ఒక‌ప్పుడు వెంక‌య్య‌నాయుడు, బంగారు ల‌క్ష్మ‌ణ్‌, ద‌త్తాత్రేయ‌, విద్యాసాగ‌ర్‌రావు, కిష‌న్‌రెడ్డి, కె.ల‌క్ష్మ‌ణ్‌.. ఇలా బీజేపీ ప్ర‌ముఖులంతా ఒక్క‌మాట మీద ఉంటూ పార్టీని పైకి తీసుకురావ‌డం కోసం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసేవారు. ఇప్పుడు పార్టీ ఏక‌తాటి మీద లేదంటున్నారు. కిష‌న్‌రెడ్డి తెలంగాణ బీజేపీలో మొద‌టినుంచీ కీల‌క నేత‌గా ఉన్నారు. ఇప్పుడూ ఉంటున్నారు. టీబీజేపీలో కిష‌న్‌రెడ్డి ఆధిప‌త్యం కాద‌న‌లేనిది. జాతీయ నాయ‌క‌త్వంతో నేరుగా సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గ‌ల స్థాయి. క‌శ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల పార్టీ బాధ్య‌త‌ల‌నూ ప‌ర్య‌వేక్షించిన స‌త్తా. అలాంటి కిష‌న్‌రెడ్డికి.. నిన్న‌గాక మొన్న పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన బండి సంజ‌య్‌కి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేద‌ని తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్‌లో కార్పొరేట‌ర్ స్థాయి నాయ‌కుడు.. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడి..  ల‌క్కీగా ఈసారి ఎంపీగా గెలిచిన బండి సంజ‌య్‌ను ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా చేయ‌డం.. త‌న‌ను కాద‌ని ఆయ‌న సొంతంగా దూకుడు రాజ‌కీయం నెరుపుతుండ‌టం కిష‌న్‌రెడ్డికి కంట‌గింపుగా మారింద‌ని అంటున్నారు. కొంత‌కాలంగా వారిద్దరి మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంద‌ని చెబుతున్నారు.  ఇటీవ‌ల జీహెచ్ఎమ్‌సీలో లింగోజీగూడ డివిజ‌న్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ కోల్డ్‌వార్ మ‌రింత ముదిరింది. బీజేపీకి చెందిన‌ సిట్టింగ్ కార్పొరేట‌ర్ చ‌నిపోవ‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అయితే, ఆ బైపోల్ ఏక‌గ్రీవం చేయాల‌ని కోరుతూ కొంద‌రు బీజేపీ నాయ‌కులు మంత్రి కేటీఆర్‌ను క‌లవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈజీగా గెలిచే స్థానంలో.. త‌మ‌కు బ‌ద్ద‌శ‌త్రువైన టీఆర్ఎస్ మ‌ద్ద‌తు కోర‌డం దేనికంటూ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మండిప‌డ్డారు. ఇదంతా బండిని ఇర‌కాటంలో ప‌డేసేందుకు.. కిష‌న్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో జ‌రిగిన కుట్ర అంటూ వార్త‌లు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే.. బీజేపీకి టీఆర్ఎస్ స‌పోర్ట్ చేసినా కూడా.. ఆ సిట్టింగ్ సీటును కాషాయం చేజారిపోవ‌డం.. కాంగ్రెస్ కొల్ల‌గొట్ట‌డం కొస‌మెరుపు. ఆనాటి నుంచి కిష‌న్‌.. సంజ‌య్‌ల మ‌ధ్య‌ వైరం మ‌రింత ముదిరింద‌ని అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్‌తో అది తారాస్థాయికి చేరింద‌ని చెబుతున్నారు. ఈట‌ల‌ను బీజేపీలో చేరేలా చేయ‌డంలో కిష‌న్‌రెడ్డిదే కీరోల్‌. ఢిల్లీ నుంచి స్పెష‌ల్ ఫ్లైట్‌లో వ‌చ్చి.. ఈట‌ల‌తో చ‌ర్చించి.. జాతీయ పార్టీతో మాట్లాడించి.. ఢిల్లీలో కాషాయ కండువా క‌ప్పే వ‌ర‌కూ.. మినిట్ టు మినిట్ ఫాలో చేసింది కిష‌న్‌రెడ్డినే. ఈట‌ల బీజేపీలో చేర‌డంలో రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాత్ర చాలా చాలా ప‌రిమితం. అందుకే, ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం విష‌యంలోనూ బండి.. ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఉంటున్నార‌ట‌. సంజ‌య్ వ‌ర్గం ఈట‌ల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ట‌. నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర ప్రారంభించిన రోజు.. బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్‌లోనే ఉన్నా ఆ కార్య‌క్ర‌మానికి కావాల‌నే హాజ‌రుకాలేద‌ని అంటున్నారు. మీరు మీరు చూసుకోండి.. మ‌ధ్య‌లో నేనెందుక‌న్న‌ట్టు బండి సంజ‌య్ సైడ్ అవుతున్నార‌ట‌. మ‌రీ, పార్టీ అధ్య‌క్షుడిగా ఉంటూ హుజురాబాద్‌లో అడుగుపెట్ట‌క‌పోతే బాగుండ‌ద‌నుకున్నారో ఏమో.. ఇటీవ‌ల ఓ రోజు ఇలా వ‌చ్చి.. ఈట‌ల‌కు హ‌లో చెప్పి.. అలా వెళ్లిపోయారు. మ‌ళ్లీ క‌నిపిస్తే ఒట్టు. అయితే, ముందుచూపు కాస్తంత ఎక్కువే ఉన్న బండి.. వ్యూహాత్మ‌కంగా హైద‌రాబాద్ టు హుజురాబాద్ పాద‌యాత్ర ప్ర‌క‌టించి బంతిని త‌న కోర్టులోకి లాక్కున్నారు. హుజురాబాద్‌లో ఈట‌ల గెలిస్తే.. అది కిష‌న్‌రెడ్డి ఖాతాలో ప‌డ‌కుండా త‌న అకౌంట్‌లో వేసుకునే ప్ర‌య‌త్నం ఓవైపు.. పాద‌యాత్ర ఆసాంతం వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో పాటు పార్టీని బ‌లోపేతం చేసే వ్యూహం మ‌రోవైపు.   ఈట‌ల‌పై కిష‌న్‌రెడ్డి మ‌నిష‌నే ముద్ర వేసి సంజ‌య్ వ‌ర్గం సైలెంట్‌గా ఉంటుండ‌టంతో ఈట‌ల తెగ ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. త‌న స్థాయి వాడు కాక‌పోయినా.. బాస్ కాబ‌ట్టి ఎంత‌కాద‌నుకున్నా బండి నేతృత్వంలోనే ఆయ‌న ప‌ని చేయాల్సి ఉంటుంది. అయితే, అన్నివ‌ర్గాల‌ను గుప్పిట్లో పెట్టుకొని మాంచి దూకుడు మీద ఉన్న టీఆర్ఎస్‌కు ధీటుగా నిల‌వాలంటే.. ఈట‌ల రాజేంద‌ర్‌కు సానుభూతితో పాటు మీడియా స‌పోర్ట్ అత్యంత కీల‌కం. ఇక బీజేపీ జాతీయ నేత‌గా మారిన వివేక్ వెంక‌ట‌స్వామికి చెందిన V6 ఛానెల్‌, వెలుగు పేప‌ర్‌లో ఈట‌ల‌కు ఎంత క‌వ‌రేజ్ ఉంటే.. అంత మైలేజ్ వ‌స్తుంది. అయితే, ఇన్నాళ్లూ వివేక్‌-బండి సంజ‌య్‌లు ఓ వ‌ర్గంగా ఉండేవారు. కానీ, ఈట‌ల కోసం కిష‌న్‌రెడ్డి రంగంలోకి దిగ‌డం.. బీజేపీ పెద్ద‌ల‌తో ప‌దే ప‌దే చ‌ర్చించాల్సి రావ‌డం.. జాతీయ నేత‌గా ఉన్న వివేక్ అందులో భాగ‌స్వామ్యం కావాల్సి రావ‌డం.. ఈ క్ర‌మంలో వివేక్.. సంజ‌య్‌కు దూర‌మై.. కిష‌న్‌కి ద‌గ్గ‌ర‌య్యార‌ని అంటున్నారు.  ఇలా బండి సంజ‌య్ వ‌ర్గం నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ‌.. బీజేపీ మీడియా మ‌ద్ద‌తు స‌రైన స్థాయిలో లేక‌పోవ‌డం.. ఈట‌ల‌ను అస‌హ‌నానికి గురి చేస్తోంద‌ని చెబుతున్నారు. వైర‌ల్‌గా మారిన ఈట‌ల‌ బామ్మర్ది వాట్సాప్ చాట్‌లోనూ అదే ఆవేద‌న క‌నిపించింది. మ‌రి, క‌మ‌ల‌నాథులు కోల్డ్‌వార్ ఈట‌ల రాజ‌కీయ భ‌విత‌వ్యంపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో..

డేంజర్ లో హైదరాబాద్ ..

గాంధీ ఆస్పత్రికి మళ్లీ కరోనా బాధితుల సంఖ్య. రోజు రోజుకి ఎక్కువవుతోంది. మళ్ళీ ఆందోళనలో వైద్య అధికారులు. ప్రజలు మళ్ళీ  అప్రమత్తం అవ్వాలని కోరుతున్నారు. కొన్ని రోజులుగా గాంధీ ఆస్పత్రికి రోజుకు 50వరకు సివియర్ కరోనా కేసులు వస్తున్నాయి. కొంత కాలంగా కరోనా ఉపశమనం ఉచిందని ఇటు ప్రజలు అటు ప్రభుత్వాలు తమ పనులను తాము ఎదావిదిగా చేసుకుంటూ పోతున్నారు. ఇంకొంత మంది ఐతే కరోనా లేదు ఏమిలేదని.. వచ్చిన తమను ఏం చేయదు అన్నట్లు కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం లేదు. ప్రజలు తమ పని తాము చేసుకుపోతున్నారని. కరోనా కూడా సాపాకింద నీరులా తన పని తీను చేసుకుంటూ పోతుంది. తాజాగా తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి వరుసగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి కరోనా బాధితుల తాకిడి మరోసారి ఎక్కువైంది. కరోనా వార్డు బాధితులతో ఇప్పటికే నిండిపోయింది. గాంధీకి రోజుకు 50 వరకు సివియర్ కేసులు వస్తున్న పరిస్థితి నెలకొంది. వారం క్రితం వరకు గాంధీలో రోజుకు 20 వరకు మాత్రమే కరోనా అడ్మిషన్లు నమోదు అయ్యాయి. కాగా గతంలో వర్షాలు పడి వరదలు వచ్చినట్లు కరోనా కేసులు ప్రవాహం పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో వరుస పండుగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా హైదరాబాద్ లో బోనాలు అని.. పార్టీ మీటింగ్స్ అని ప్రజలు తిరుగుతున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో 206 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఐదు రోజుల్లో మూడు సార్లు కరోనా కేసులు వంద దాటాయి. గత శనివారం 147 కరోనా కేసులు నమోదు అవగా... బుధవారం 99 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక తాజాగా 108 కొత్త కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో గత 24 గంటల్లో 1,16,815 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 657 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా... 578 మంది కోలుకున్నారు. ఏది ఏమైనా గతం లో వచ్చిన పరిస్థితి వస్తే ఎదురుకోవడానికి ముందు ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

జీతాలకే గతిలేదు.. కేంద్రానికి కట్టేదెలా? జగనన్న బండి గడిచేదెలా? 

అసలు లేదు మొగుడా అంటే పెసర గారెలు కావాలన్నాడంట వెనకటికి ఒకడు. ఇప్పుడు కొత్త అప్పు ఇవ్వమంటే కుదరదంటారు.. ఒకవైపు ప్రకటించిన పథకాలకు డబ్బులు కావాలి.. ఇంకోవైపు రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతం ఇవ్వడం గగనమైపోయింది. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అయితే సరేసరి నెలల తరబడి జీతాలు పెండింగ్ పడిపోయాయి. సమాచార శాఖలో పని చేసే అవుట్ సోర్సింగ్ వారికే మూడు నెలలు పెండింగ్ పడ్డాయంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు కాబట్టి.. కొత్త అప్పు కుదరదన్నారు. ఇంకోవైపు ఇప్పటిదాకా ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్ అన్నట్లు డబ్బులు అటు ఇటు తిప్పేశారు జగనన్న. ఇప్పుడు అది కూడా కుదరకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే డబ్బులు ఆ పథకాలకే వాడేలా బ్యారికేడ్స్ పెట్టేస్తోంది. ఇక ఆ ముచ్చట కూడా జరగదు. ఇవన్నీ కాక..మీరు పరిమితికి మించి తీసుకున్న 4500 కోట్లు వెంటనే తిరిగి చెల్లించేయండని ఒక నోటీసు ఇచ్చిపారేసింది కేంద్రం. ఇది సాధ్యమేనా.. ఆదాయం లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. డబ్బులు పందేరం చేయడంలో సక్సెస్ అయ్యారు. అసలు ఇప్పుడు కొత్తగా అప్పులు కావాలని అడుగుతుంటే.. అప్పు కట్టేయమని చెప్పడంలో కేంద్రం ఉద్దేశమేంటని వైసీపీ ప్రభుత్వ నేతలు మండిపడుతున్నారు. వాటీజ్ దిస్ నాన్సెస్స్ అంటుంటే.. అటు కేంద్రం ఏమో మీరు చేసిందే నాన్సెన్స్ అందుకే చెబుతున్నాం.. ఇప్పటికైనా కళ్లు తెరవండని చెబుతుందంట. మన అదినేత ఏమో వినడం గాని..చూడటం గాని ఉండదు కదా.. ఆయన ఏది అనుకుంటే అదే జరగాలి. ఇప్పుడు అలా జరిగేలా లేదు. అన్నీ అడ్డంకులే. మరోవైపు ఆ రఘురామకృష్ణరాజు ఒకడు తలనొప్పిగా తయారయ్యాడు. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ దెబ్బకు.. ఇప్పుడు లోపలకు పోవాల్సి వస్తుందా అనే టెన్షన్ ఒకవైపు పీకుతుంటే.. ఇంకోవైపు ఈ ఆర్ధిక కష్టాలొకటి.  అందుకే ఈ మధ్య కొత్తగా ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు ఇస్తున్నట్లుగా ఫుల్ పేజీ యాడ్స్ మాత్రం ఇచ్చేస్తున్నారు. అవి కింద మాత్రం రాలేదంటున్నారు. ముందు కొద్దిగా..తర్వాత కొద్దిగా..దశలవారీగా డబ్బులొచ్చినదానిని బట్టి వేస్తున్నారు. జీఎస్టీ డబ్బులొక్కటే ప్రధాన ఆదాయం..ఆ తర్వాత మద్యం అమ్మకాలు..ఇవన్నీ వాస్తవంగా ఈ పథకాలు లేకపోతే..ప్రభుత్వం నడపటానికి సర్దుకోవచ్చు. కాని ముందు పథకాలకు ఇచ్చేసి.. ఆ తర్వాత ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలు, రోజువారీ ఖర్చులు పెండింగ్ పెట్టేస్తున్నారు.  ఇప్పుడు వరుసబెట్టి మీద పడ్డ ఆంక్షలతో జిమ్మిక్కులు చేయడం కుదరదు..మేజిక్ చేయడం అసలే కుదరదు. ముందు ఆ 4500 కోట్లు ఎక్కడ నుంచి కడతారో చూడాలి. కట్టకపోయినా ఆశ్చర్యపోవనవసరం లేదు. కోర్టులనే లెక్క చేయనోళ్లు కేంద్రాన్ని మాత్రం లెక్క చేస్తారనుకోవడం పొరపాటే. 

మమతా ఢిల్లీ యాత్ర సక్సెస్ అయినట్లేనా?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన,అనుకున్నట్లుగా జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించలేదు కానీ, చలనం అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీలో జోష్ పెంచింది. ఆయన మీద మాత్రం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన ప్రభావం ఘనంగానే ఉన్నట్లు కనిపిస్తోందని, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక విధమైన  సంతోషం మరో విధమైన విస్మయం వ్యక్తపరుస్తున్నారు.  పార్లమెంట్ లో యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులతో జరిగే చర్చల్లో రాహుల్ గాంధీ సహజంగా పాల్గొనరు. పార్లమెంట్‘లో అనుసరించవలసిన వ్యూహం పై చర్చించే యూపీఏ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలకు ఆయన హాజరు కారు.  భాగస్వామ్య పార్టీల నాయకులతో చర్చించే ఏ విషయంలో ఆయన జోక్యం చేసుకోరు. కోఆర్డినేషన్  వ్యవహరాలను పార్టీ ఫ్లోర్ లీడర్స్,ఇతర నాయకులు చూసుకుంటారు.కానీ, మమతా బెనర్జీ ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చిన మంగళవారం రాహుల గాంధీ, యూపీఏ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.నిజానికి  రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడు, మల్లిఖార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతి రోజు యూపీఏ వ్యూహ కమిటీ సమావేశం జరుగుతుంది. అయితే, ఇంతవరకు రాహుల్ గాంధీ,ఎప్పుడూ ఆవైపు కన్నెత్తి చూడలేదు. అలాంటిది మంగళవారం సమావేశానికి హాజరయ్యారు. చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు.  పెగాసస్ వ్యవహారంలో ప్రభుత్వం పై వత్తిడి పెంచేందుకు విపక్షలన్నీ ఏకమవ్వాలని అన్నారు. అవసరం అయితే, ప్రభుత్వ మొండి వైఖరిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళి, ఆయన జోక్యం కోరదామని సూచించారు. మరో వంక   విపక్షాలను  ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ నడుం బిగించారనే సంకేతాలు పంపేందుకు, ఏఐసీసీ కార్యాలయం, యూపీఏ కోఆర్డినేషన్ సమావేశానికి రాహుల్ గాంధీ అధ్యక్షత వహించిన ఫోటోలను విడుదల చేసింది. అయితే, రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు ఎంత కాలం ఉంటుందనేది, ఇప్పుడే చెప్పలేమని సమావేశానికి హాజరైన యూపీఏ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అలాగే, ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు జరుగుతున్నప్రయత్నాలలో రాహుల్ గాంధీ క్రియశీల పాత్రను పోషించాలని, గాంధీ కుటుంబ విధేయ ఎంపీ ఒకరు తమ మనసులోని మాటను మీడియా  ముందుంచారు. అయితే, ప్రతిపక్షాలను ఏకం చేయడం, రాహుల్ గాంధీకే కాదు, మమతా బెనర్జీ, శరద్ పవార్ సహా. ఎవరికీ కూడా    అనుకున్నంత సులభంగా అయ్యే పనికాదు. అందుకే. అదే పనిలో నిమగ్నమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అయినా శరద్ పవార్, మమతా బెనర్జీ అయినా మరొక రైనా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.  జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్న పార్టీలు, నాయకులు కొంచెం వెనకా ముందుగా అయినా, ప్రధాని మోడీ ని ఒంటరిగా ఓడించడం, కాంగ్రెస్ సహా ఏ పార్టీకీ అయ్యే పని కాదనే నిజాన్ని గ్రహించారు. అన్ని పార్టీలు ఏకమైతేనే కానీ, మోడీని గద్దె దించడం సాధ్యం కాదన్న సత్యాన్ని తెలుసుకున్నారు. అదే విషయం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో మరో మారు స్పష్టమైంది. అయితే, మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనతో విపక్షాల ఐక్యతా ప్రస్థానంలో తోలి అడుగు పడిందని మాత్రం చెప్పవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మమతా బెనర్జీ, చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అంతే మోడీని గద్దేదించేందుకు ఏర్పడే కూటమికి   ఎవరు  నాయకత్వం వహించినా తనకు అభ్యంతరం లేదని, మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అలాగే, విపక్షాల ఐక్యత కోసం పిల్లి మెడలో గంటకట్టే బాధ్యతను తాను తీసుకుంటానని ముందు కొచ్చారు. ఆ విధంగా దీదీ ఢిల్లీ పర్యటన, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఒక ముందడుగా పరిశీలకులు భావిస్తున్నారు.  

ప్రాంక్ వీడియో యాంకర్‌తో ఫైటింగ్ చేసిన యజమాని.. 

సోషల్ మీడియా వచ్చాక కొందరి వ్యక్తులకు హద్దు అదుపులేకుండా పోయింది. మనకు తెలియకుడండానే మన సంస్కృతి పై దాడి చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలు కూడా రోడ్డు పైకి తీసుకువచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ప్రాంక్ వీడియోస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్లకు మరి హద్దులు లేకుండా పోతున్నాయి. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న విషయాల వాళ్ళ పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఒక ఫ్రాంక్ యూట్యూబ్ యాంకర్  ఓ మొబైల్ షాపులో వెళ్లాడు. అక్కడ యజమానితో గొడవకు దిగాడు.దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన షాపు ఓనర్ యాంకర్‌పై దాడికి దిగాడు.   ఇక వివరాల్లోకి వెళితే ప్రాంక్ వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనకు తెలిసిందే. చాలామంది రోడ్లపై, షాపింగ్ మాల్స్, పబ్లిక్‌ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. ఈ ప్రాంక్‌లతో పబ్లిక్ కాస్త ఇబ్బందులకు గురైనా.. ఆ తర్వత అవి ప్రాంక్ అని తెలిసి కాస్త నవ్వుకుంటారు. ఎంత ఫ్రాంక్ ఐన పబ్లిక్ కొంత ఇబ్బంది పడుతుంటారు. అయితే హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో ఓ యాంకర్ చేసిన ప్రాంక్ వీడియో కలకలం రేపింది. ఓ మొబైల్ షాప్‌లో గొడవ జరిగింది.  హైదరాబాదీ ప్రాంక్స్’ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ యజమానితో గొడవకు దిగాడు. జగదీశ్ మార్కెట్‌లో యాంకర్ ఓమొబైల్ షాపుకు వెళ్లారు. షాప్ యజమానితో గొడవకు దిగాడు యాంకర్. అది కాస్త చిలికిచిలికి గాలివానగా మారినట్టు..ఈ గొడవ కాస్తా పెద్దదిగా అయ్యింది. దీంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్ పై దాడికి పాల్పడ్డాడు. ఇది ఫ్రాంక్ వీడియో అని..అక్కడ కెమెరా ఉందని..కావాలని చేస్తున్నామని యాంకర్ చెప్పినా..యజమాని వినిపించుకోలేదు. ఎందుకంటే ఎవడి ఫ్రాస్ట్రషన్ లో వాడు ఉంటారు.. ఈ ఫ్రాంక్ వీడియోస్ చేస్తే వాళ్ళు అది కూడా గమనించాలి. అది గమనించి ఫ్రాంక్ చేస్తే ప్రాబ్లెమ్ ఉండదు.. ఏది తెలుసుకోకుండా రంగంలోకి దిగితే ఇలాగే రచ్చ రచ్చ అవుతుంది. అయితే ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్‌ని చితకబాదాడు. యాంకర్‌ను మరింత కసిగా కొట్టాడు. ఇక ఆ  విషయం అక్కడితో ఆగకపోగా చివరికి విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.  

మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి.. హోరెత్తుతున్న తెలంగాణం..

మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటే మా ఎమ్మెల్యే చేయాలంటూ యావ‌త్ తెలంగాణ ప్ర‌జానికం గొంతెత్తి నిన‌దిస్తోంది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి.. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక రావాలి.. ఇదే వారి ల‌క్ష్యం. ఉప ఎన్నిక వ‌స్తేనైనా త‌మ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌నే ఆశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా ద‌ళిత బంధు అమ‌ల‌వుతుంద‌నే అత్యాశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా గొల్ల‌-కురుమ‌ల‌కు గొర్లు పంచుతార‌నే దురాశ‌. ఉప ఎన్నిక వ‌స్తేనైనా కులాల వారీగా క‌మ్యూనిటీ హాళ్లు.. అంద‌రికీ డ‌బుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. అద్దాల్లాంటి రోడ్లు.. అంద‌మైన బ‌స్టాండ్లు.. సుంద‌ర‌మైన‌ పార్కులు.. అంద‌రికీ రేష‌న్ కార్డులు.. కొత్త పింఛ‌న్లు.. గ్రామానికి లక్ష‌లు.. మండలానికి కోట్లు అంటూ నిధులు వ‌ర‌ద పారుతుంద‌నే కుట్ర‌, కుతంత్రాల‌తో ప్ర‌జ‌లంతా త‌మ ఎమ్మెల్యే రాజీనామా కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. ఉప ఎన్నిక రావాలంటూ మ‌న‌సా-వాచా-క‌ర్మ‌నా కోరుకుంటున్నారు. ఇప్ప‌టికైతే సోష‌ల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు గానీ.. త్వ‌ర‌లోనే ధ‌ర్నాలు, రాస్తారోకోల‌తో ఉద్య‌మించ‌డానికీ సిద్ధ‌మ‌వుతున్నారు. డౌట్ ఉంటే.. మీ ప‌క్క‌నున్న ఏ ఒక్క‌రినైనా అడిగి చూడండి.. వారి ఎమ్మెల్యే రాజీనామా చేయాలో వ‌ద్దో.. ఉప ఎన్నిక రావాలో వ‌ద్దో.. దిమ్మ‌తిరిగే ఆన్ష‌ర్‌ వ‌స్తుంది అట్నుంచి.  ఒక్క సిరిసిల్ల‌, సిద్ధిపేట మిన‌హా తెలంగాణ‌లోని 117 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే నినాదం. చివ‌రాఖ‌రికి గ‌జ్వేల్ ప్ర‌జ‌లు సైతం ముఖ్య‌మంత్రి అయిన త‌మ ఎమ్మెల్యే కేసీఆర్ రాజీనామా చేయాలి.. అప్పుడే ఎర్ర‌వెల్లితో పాటు గ‌జ్వేల్ ప్రాంత‌మంతా డెవ‌ల‌ప్ అవుతుంద‌ని డిమాండ్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. వారిదేమీ గొంత‌మ్మ కోరిక కాదు. అది మాన‌వ స‌హ‌జం. త‌మ ప్రాంతానికి కేసీఆర్ కొడుకో, అల్లుడో ఎమ్మెల్యేగా ఉంటే బాగుండున‌ని ఇన్నాళ్లూ అసూయ‌ప‌డ్డారు. కేటీఆర్‌, హ‌రీష్‌లు ట‌ర్మ్‌కు ఓసారి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని కోరుకున్నారు. కానీ, అంత అవ‌స‌రం లేద‌ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. హుజురాబాద్‌ను చూసి త‌త్వం బోధ‌ప‌డింది. అభివృద్ధి ఎంత సింపులో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. ఎమ్మెల్యేల‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి రానివ్వ‌డం లేద‌నే ఏడుపు అవ‌స‌రం లేదు. కేసీఆర్ త‌మ‌ను పట్టించుకోడ‌నే మూతిముడుపు అక్క‌ర్లేదు. జ‌స్ట్‌.. ఒక్క సంత‌కం. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ ఒక్క సంత‌కం చేస్తే చాలు. వెంట‌నే ఉప ఎన్నిక వ‌చ్చేస్తుంది. అర‌చేతిలో అభివృద్ధి క‌నిపిస్తుంది. కాళ్ల కాడికి.. అడిగింది లేద‌న‌కుండా త‌న్నుకొస్తుంది. హుజురాబాద్‌లో ఇప్పుడ‌దే జ‌రుగుతుండ‌టంతో.. ఆ ప‌నులు, పందేరాల‌ను చూస్తున్న తెలంగాణ ప్ర‌జానీకం.. త‌మ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాల‌ని.. త‌మ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంద‌ని డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండి చేయ‌లేని డెవ‌ల‌ప్‌మెంట్‌ను రాజీనామాతో చేసి చూపించ‌వ‌చ్చ‌ని.. అవ‌స‌ర‌మైతే ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మిమ్మ‌ల్నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామ‌ని.. ఓట‌మి భ‌యం అవ‌స‌రం లేదంటూ ఓట‌ర్లు త‌మ ఎమ్మెల్యేల‌కు అభ‌యం ఇస్తున్నారు. ఆ మేర‌కు కొన్ని ప్రాంతాల్లో క‌ర‌ప‌త్రాలు సైతం పంచుతున్నారు. ఇక ప్రజా వ్య‌తిరేక‌త అధికంగా ఉన్న చోట్ల‌.. రాజీనామా డిమాండ్ మ‌రింత ద‌ద్ద‌రిల్లుతోంది. తెలంగాణ‌లో ఏ ఇద్ద‌రు క‌లుసుకున్నా.. ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది.  అయితే, ప్ర‌జ‌లు ఎంత అమాయ‌కులు. కేసీఆర్ చేసే మాయ‌లమ‌రాఠీ గారడీ విద్య‌లు వాళ్ల‌కింకా పూర్తిగా బోధ‌ప‌డ‌లేదు. అది హుజురాబాద్ కాబ‌ట్టి.. అక్క‌డ పోటీ చేస్తున్న‌ది ఈట‌ల కాబ‌ట్టి.. ఆ ఎన్నిక ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ దొర‌త‌నానికి స‌వాల్ విసిరింది కాబ‌ట్టి.. అంత చేస్తున్నారు కానీ.. అన్నిచోట్లా వేల కోట్లు కుమ్మ‌రించ‌డానికి కేసీఆర్ ఏమైనా అమాయ‌కుడా? అభివృద్ధి కాంక్షితుడా? అంటున్నారు. డౌట్ ఉంటే.. ఇటీవ‌లే జ‌రిగిన నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల హామీల‌ను ఓసారి గుర్తు చేస్తున్నారు. డిగ్రీ కాలేజీ అంటూ, మార్కెట్ యార్డు అంటూ.. మండ‌లాని ఇన్ని కోట్లు అంటూ.. చేతికి ఎముకే లేన‌ట్టు బ‌హిరంగా స‌భ‌లో హామీలు గుప్పించారు సీఎం కేసీఆర్‌. నిజ‌మే అనుకొని సాగ‌ర్‌లో కారును గెలిపించారు. తీరా గెలిచాక‌.. ఇప్పుడేమైంది? అద‌నంగా ఒక్క పైసా కూడా రాలే. ఒక్క హామీ నెర‌వేర‌లే. ద‌టీజ్ కేసీఆర్‌. ఇలాంటి ట‌క్కుట‌మారం య‌వ్వారాల్లో ఆయ‌న దిట్ట అంటారు. అయితే, మిగ‌తా ఏ హామీ నెర‌వేరినా.. నేర‌వేర‌కున్నా.. ఎక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చినా.. గొర్లు పంచే హామీ మాత్రం సీఎం కేసీఆర్‌ త‌ప్ప‌క నెర‌వేరుస్తున్నారు. ఓట‌ర్ల‌ను గొర్రెల్లా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  అయినా.. అంద‌రు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌లు వస్తాయి కానీ, అభివృద్ధి ఎలా జ‌రుగుతుంది? జ‌నాలు ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మిస్ అవుతున్నార‌బ్బా...?  

ఈటల రాజేందర్ బామ్మర్ది వాట్సాప్ చాట్ లీక్.. బండి సంజయ్ షేక్ 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఇటీవలే పాడి కౌశిక్ రెడ్డి... ఓ బీజేపీ కార్యకర్తలో మాట్లాడిన ఆడియో లీకై సంచలనంగా మారింది. చివరకి అది కౌశిక్ రెడ్డి పార్టీ మారడానికి కారణమైంది. తాజాగా బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న వాట్సాప్ చాట్ ఒకటి లీకై నియోజకవర్గంలో  వైరల్ గా మారింది. ఈటల రాజేందర్ భార్య జమునా రెడ్డి సోదరుడైన మధుసూధన్ రెడ్డి .. ఎన్నికల వ్యవహారాలను చూస్తున్నారు. రాజేందర్ పాదయాత్ర ఏర్పాట్లను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈటలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కూడా మధుసూదన్ రెడ్డే చూస్తారని చెబుతారు.  హుజురాబాద్ ఉప ఎన్నిక, ఈటెల రాజేందర్ పాదయాత్రకు సంబంధించి  కొండవీటి మధు సుధన్ రెడ్డి..  ఈటల పౌల్ట్రీ పార్టనర్ తో చేసిన ఫోన్ వాట్సప్ చాట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. దళితులను  తిడుతూ అందులో మెసేజ్ చేశారు మధుసూధన్ రెడ్డి. దళిత బంధు స్కీమ్ తో ఓడిపోతామని భయం వ్యక్తం చేశారు. అంతేకాదు రాజేందర్ కు బండి సంజయ్ సపోర్ట్ చేయడం లేదని చెప్పాడు మధుసూదన్ రెడ్డి. కిషన్ రెడ్డి అండ  తమకు ఉందన్నారు. వివేక్ వెంకట స్వామి, వీ6 మీడియా సపోర్టుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు మధుసూదన్ రెడ్డి. ఈటెల రాజేందర్ పౌల్ట్రీ పార్టనర్ ద్వారా బయట పడ్డ ఫోన్ చాట్.. ఇలా ఉంది..  మధుసూదన్ రెడ్డి : నరేష్ గానికి మొన్న 50 లక్షలు పంపించిన అయినా వాని పని ఇలా ఉంది ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న నరేష్ డామినేషన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ...మన పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు..డబ్బులు వాడు వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడు మధుసూదన్ రెడ్డి : వాడికి ఫోన్ చేసి మాట్లాడిన...వాడు మీడియా వాళ్లకు ఇచ్చినా అంటుండు... రేపు అందరిని కనుక్కొని చెప్పు నాకు ఈటల పౌల్ట్రీ పార్టనర్ : ఒకే అన్న.. కాల్ చేసి కనుక్కొని చెప్తా మధుసూదన్ రెడ్డి : ఒకే ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న ఫోన్ చేయి ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అన్న ఆ నరేష్ గాడు మీడియా వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు(వాట్సప్ సంభాషణ తరువాత) మధుసూదన్ రెడ్డి : జమ్మికుంట వాళ్లకు కూడ డబ్బులు పంపించు..కేశవన్న కు ఒక్కసారి ఫోన్ చేయి మధుసూదన్ రెడ్డి : నారాయణగూడలో 10 కోట్లు తీసుకోని ఫార్చూనర్ కారులో వెళ్లి  ..4 కమలాపూర్ లో మిగిలిన 6 జమ్మికుంటలో ఇచ్చేయి ఈటల పౌల్ట్రీ పార్టనర్ : ఓకే అన్న... డబ్బులు అందాయి...మహేష్ వచ్చాడు...ఫోన్ చేశా మీకు...వాట్స్ ప్ కాల్ కలవటంలేదు మధుసూదన్ రెడ్డి : దళిత బంధు మీద గ్రామాల్లో అభిప్రాయం ఏమిటి ఈటల పౌల్ట్రీ పార్టనర్ : బాగుందన్న మధుసూదన్ రెడ్డి : ఓకే..దళిత బందు ఏమైనా ప్రభావం చూపిస్తుందా..హుజురాబాద్ ప్రజలు ఏం అనుకుంటున్నారు...ఎస్సి ఓట్లు 40 వేలు ఉన్నాయి ఈటల పౌల్ట్రీ పార్టనర్ : 45 వేల వరకు ఉన్నాయి అన్న...కుటుంబానికి 10 లక్షలు అనేసరికి కొంచం తెరాస వైపే మొగ్గు చూపుతున్నారు...మనం కొంచం టర్న్ చేయాలన్న మధుసూదన్ రెడ్డి : మాదిగ కొడుకులు చాలా చిన్న వాటికి ఆశ పడతారు వాళ్ళను నమ్మలేంరా...జాతీయ నాయకులు రాగానే టర్న్ అవుతుంది ఈటల పౌల్ట్రీ పార్టనర్ :  అవునన్న...అమిత్ షా రావాలి మధుసూదన్ రెడ్డి : వస్తాడు..వీడు బండి సంజయ్ పట్టించుకోట్లేడు...కావాలని మొహం చాటేస్తున్నాడు...చూద్దాం ఈటల పౌల్ట్రీ పార్టనర్ : రాజేందర్ అన్నకు V6 వివేక్ మద్దతు పలకడం బండి సంజయ్ కి నచ్చట్లే అన్న...వివేక్ ను మనం కొన్ని రోజులు పక్కన పెట్టాలి...V6 కూడ పెద్ద కవరేజ్ ఇవ్వట్లేదు మధుసూదన్ రెడ్డి : వివేక్ నుండి మనకు కిషన్ రెడ్డి మద్దతు ఉంది ఈటల పౌల్ట్రీ పార్టనర్ : అవునన్న...కిషన్ రెడ్డితో ఉంటేనే మంచిది...మనకు జేపీ నడ్డా అమిత్షా వాళ్ళ మద్దతు ఉంటది మధుసూదన్ రెడ్డి : అవును మధుసూధన్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న ఈ వాట్సాప్ లీక్ ఇప్పుడు నియోజకవర్గంలో ప్రకంపనలు రేపుతోంది. దీన్ని అస్త్రంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు స్పీడ్ పెంచారు. దళితులను కించపరిచారంటూ.. ఆ వర్గాలతో ఆందోళనలు చేయిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ తో రాజేందర్ కు విభేదాలు ఉన్నట్లుగా ఉన్న చాట్.. బీజేపీని షేక్ చేస్తోంది. ఈటల పాదయాత్రను బండి సంజయ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. పాదయాత్ర ప్రారంభం రోజున సంజయ్ లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాజాగా బయటపడిన వాట్సాప్ చాట్ తో రాజేందర్ తో బండి సంజయ్ తో విభేదాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.   

వివేకా కేసులో అనుమానితుడు మిస్సింగ్.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచుతోంది. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. అదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి . వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన సునీల్ కుమార్ యాదవ్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కనిపించకుండా పోయిన సునీల్ కుమార్ కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు.  వివేకా హత్య కేసులో విచారణ పేరుతో సీబీఐ అధికారులు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు సునీల్ కుమార్ యాదవ్. ఆ తర్వాతి నుంచి పులివెందులలోని సునీల్ కుమార్ ఇంటికి తాళం వేసి ఉంది. అప్పటి నుంచి సునీల్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారన్న సమాచారంతో సీబీఐ అధికారులు గాలింపు చేపట్టారు.ఈ క్రమంలో సునీల్ సమీప బంధువు అయిన యువరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అనంతపురంలోని ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సీబీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.  వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ రంగయ్య ఇటీవల జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ కుమార్ యాదవ్ పేరును కూడా వెల్లడించాడు. ఇప్పుడు ఆయన కుటుంబం మొత్తం కనిపించకుండా పోవడం కీలకంగా మారింది. ఏ క్షణంలోనైనా సునీల్, డ్రైవర్ దస్తగిరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. సీబీఐ దూకుడుతో వివేకా హత్యకేసు అనుమానితుల్లో టెన్షన్ పెరుగుతోంది. 

ప్రొఫెసర్ కామక్రీడ.. చివరికి తేడ.. 

సమాజంలో నిత్యం మహిళలు సమస్యలు ఎదురుకుంటున్నారు. వారిపై రోజు రోజు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అటు ఇంట్లోనూ ఇటు సమాజంలోనే మహిళలకు సేఫ్టీ ఉండడం లేదు. గుడి, బడి, ఆఫీస్, రోడ్డు  ఇలా ఎక్కడ పడితే అక్కడ మగాళ్లు మృగాళ్లు గా మారి మహిళలను వేధిస్తున్నారు. ఇక సమాజంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులు, ఉపాధ్యాయులు ఉండడం విచారకరం. తాజాగా ఒక ప్రొఫెసర్ తన మహిళా సహోద్యోగిని లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అందులోనూ ఈ ఘటన సీఎం జగన్ ఇలాకా లో జరగడం సంచలనంగా మారింది. వివరాల్లోకి  వెళితే.. అది ఆంధ్రప్రదేశ్. సీఎం సొంత జిల్లా కడపలోని. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఓ ప్రబుద్ధ  ప్రొఫెసర్ రాసలీలల బాగోతం బయటపడింది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఒక డిపార్టుమెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి  ఆయనకు  46  సంవత్సరాలు.. అతని బుద్ధి ఎలాంటిదో లేక ఆరోజు అతనికి అలా అనిపించిందో ఏమో గానీ అతని మైండ్ లో ఒక పాడుబుడ్డి పుట్టింది. వెంటనే ఆ విషపు ఆలోచన అమలు చేయాలనుకున్నాడు. అందుకు  ఒక పథకం వేశాడు. అదే డిపార్టుమెంట్ కి చెందిన మహిళా ప్రొఫెసర్ ని ఆదివారం కాలేజ్ కి రమ్మని తెలిపాడు. ఆదివారం సెలవు కదా అని అడిగితే..  మరో సారి ఆర్డర్ వేసినట్లు అత్యవసరంగా పూర్తి చేయాల్సిన పని ఉందని తప్పకుండా రావాలి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఆమె పై అధికారి అందులో  ప్రొఫెసర్ రమ్మంటే రాను అని ఎదురు చెప్పలేక ఆమె సరే అని తల ఊపింది.  క్యాంపస్ కి వెళ్లిన ఆమెను  ప్రొఫెసర్ తన పర్సనల్ రూమ్ కి తీసుకువెళ్లి ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ.. అక్కడక్కడా చేతులు వేయడం ప్రారంభించాడు. అప్పటికే  ప్రొఫెసర్ వ్యవహారం పసికట్టిన  ఆమె అడ్డుచెప్పడంతో ఇక  ప్రొఫెసర్ తన కోరిక తెరిచాకపోతే ఉద్యోగం పోతుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మహిళా ప్రొఫెసర్ తన ఫోన్ లో ఆ మాటలను రికార్డ్ చేసి సహోద్యుగులకు పంపడంతో ఈ విషయం వెలుగు చూసింది. అక్కడితో  ప్రొఫెసర్ మరిన్ని రాసలీలలు బయట పడ్డాయి. అంతకు ముందు తమను కూడా ఇలాగే వేధించాడని  ఇతర ఉద్యోగినిలు కూడా తెలపడంతో అతడిపై  విశ్వవిద్యాలయం ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు.  

రేవంత్ రెడ్డికి ఐదు శాతం ఓట్లే.. కాంగ్రెస్ ఎంపీ కామెంట్లతో కలకలం  

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తుండటంతో ఉప ఎన్నిక షెడ్యూల్ రాకున్నా... ఎన్నికల వాతావరణం పీక్ స్టేజీకి వెళ్లింది. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్ పాదయాత్రతో జనంలో తిరుగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మంత్రులు ఊరూరు చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ కొంత వెనకబడి ఉన్నా.. కార్యకర్తల సమావేశాలతో స్పీడ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంలో జోష్ మీదున్న కాంగ్రెస్.. హుజురాబాద్ లో సత్తా చాటాలని భావిస్తోంది.  హుజురాబాద్ లో అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో పోరాడుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీరో అనేలా కోమటిరెడ్డి కామెంట్ చేయడం తీవ్ర దుమరం రేపుతోంది. హుజూరాబాద్‌ ఉన ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం పక్కా అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.  తాను చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఐదు శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈటలకు 67 శాతం, టీఆర్ఎస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు కోమటిరెడ్డి. అయితే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ గెలుస్తారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈటల గెలుస్తుందని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ కు డిపాజిట్ రాదన చెప్పడం గాంధీభవన్ లో కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించిన వెంటనే అసమ్మతి స్వరం వినిపించారు కోమటిరెడ్డి. పీసీసీ పదవిని కొనుక్కున్నారని ఆరోపించారు. హుజురాబాద్ లో పార్టీకి డిపాజిట్ తీసుకొచ్చి తన సత్తా చూపించుకోవాలని కూడా అన్నారు. తాజాగా ఢిల్లీలోనూ అదే అర్థం వచ్చేలా మాట్లాడి కాంగ్రెస్ లో కాక రేపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీలో కొంత కాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిగా ఉన్నారనే చర్చ సాగుతోంది. వెంకట్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఢిల్లీకి వెళ్లి కమలం పార్టీ పెద్దలతోనూ మాట్లాడారు. దీంతో ఆయన కాషాయ గూటికి చేరుతారని అంతా భావించారు. కాని అది జరగలేదు. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నా... గాంధీభవన్ కు మాత్రం వెళ్లడం లేదు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు కూడా హాజరుకాలేదు. ఇక పీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో వెంకట్ రెడ్డి కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్లారనే టాక్ నడుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి ఆయన మంతనాలు సాగించడం ఇందుకు బలాన్నిచ్చింది.  తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్న కామెంట్లు .. వాళ్లు కాంగ్రెస్ దూరమయ్యేలా ఉన్నాయంటున్నారు. అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని చెప్పడం ద్వారా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి చేరబోతున్నాననే సంకేతం ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు కొంత కాలంగా బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపించగా.. రెండో రోజులుగా మాత్రం సీన్ మారిపోయింది. మంత్రి జగదీశ్ రెడ్డితో జరిగిన వివాదంపై వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తన సోదరుడికి అండగా నిలిచారు. దీంతో త్వరలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం గూటికి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  

ఏపీలో 52, తెలంగాణలో 39 లోక్ సభ సీట్లు?  

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 25 లోక్ సభ సీట్లు ఉండగా.. తెలంగాణలో 17 స్థానాలున్నాయి. అయితే త్వరలో ఏపీలో లోక్ సభ స్థానాలు 52కు, తెలంగాణలో 39 పెరగబోతున్నాయనే సమాచారం వస్తోంది. దేశంలో లోక్ సభ సీట్ల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 543 లోక్ సభ సీట్లుండగా.. వాటిని వెయ్యికి పైగా పెంచడానికి కేంద్ర సర్కార్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉండే తన సహచర ఎంపీల ద్వారా ఈ విషయం తెలిసిందని ఆయన ట్వీట్ చేశారు. దీంతో లోక్ సభ సీట్లు పెరగనున్నాయనే వార్త  దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  '2024 లోపు లోక్ సభ స్థానాలను 1000 లేదా అంతకంటే ఎక్కువకు పెంచేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని బీజేపీలో ఉన్న నా సహచర ఎంపీల ద్వారా తెలిసింది. కొత్త పార్లమెంట్ భవనం 100 సీట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఒకవేళ వెయ్యి స్థానాలకు పెంచితే అంతకంటే ముందు ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలి. కీలకమైన ఈ అంశంపై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి.'' అని మనోజ్ తివారి ట్వీట్ చేశారు. లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను ప్ర‌స్తుత‌మున్న 543 నుంచి ఏకంగా వెయ్యికి పెంచే దిశ‌గా మోదీ స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌లు రూపొందిస్తోంద‌ని, దీనిపై జ‌నాభిప్రాయం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తివారీ త‌న ట్వీట్ లో అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాకుండా త‌న వాద‌న‌కు నిద‌ర్శ‌నంగా.. కొత్త‌గా క‌డుతున్న పార్ల‌మెంటు భ‌వ‌నం సెంట్ర‌ల్ విస్టాను వెయ్యి మందికి స‌రిప‌డేలా క‌డుతున్న వైనాన్ని ఆయ‌న ఉద‌హ‌రించారు.  భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్థానాలను 1000కి పెంచాల్సిన అవసరం ఉందని 2019 ఎన్నికల సందర్భంగా ఆయన అన్నారు. అంతేకాదు రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో 650, కెనడాలో 443, అమెరికాలో 535 మంది ఎంపీలున్నప్పుడు.. వాటి కంటే ఎంతో పెద్దదైన మనదేశంలో ఎందుకు 1000 మంది ఎంపీలు ఉండదని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. చిన్న చిన్న దేశాలు కూడా త‌మ జ‌నాభాకు అనుగుణంగా చట్ట స‌భ‌ల స‌భ్యుల సంఖ్య‌ను పెంచుకుంటూ పోతుంటే.. మ‌నం ఇంకా ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా జరుగుతున్న ప్రచారంతో ఆ దిశగా మోడీ సర్కార్ సీరియస్ గానే వర్కవుట్ చేస్తుందని చెబుతున్నారు.  మనదేశంలో ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలున్నాయి.  ఇందులో 530 సీట్లను రాష్ట్రాలకు కేటాయించగా.. మిగిలినవి కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఉన్నాయి.ఏళ్లుగా ఈ సంఖ్య అలా పెర‌గ‌కుండా  ఉంటూ వ‌స్తోంది. 1977 నుంచి సీట్ల సంఖ్య అలాగే ఉంది. కాని అప్పుడు  మన దేశ జనాభా కేవలం 55 కోట్లే. ప్రస్తుతం దేశ జనాభా 135 కోట్లు దాటింది. కాని లోక్ సభ సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదు. 2009లో పునర్విభజన చేశారు. కాని లోక్ సభ నియోజకవర్గాల పరిధి మాత్రమే మారింది.. కాని సీట్లు సంఖ్య పెరగలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ గతంలో అన్నారని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ కంటే ముందు జితిన్ ప్రసాద కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  మోడీ స‌ర్కారు ప్ర‌తిపాదిస్తున్న మాదిరిగా లోక్ స‌భ సీట్లు వెయ్యికి పెరిగితే.. అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు సంఖ్య ఇప్పుడున్న సంఖ్య కంటే రెట్టింపు కానున్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం 80 లోక్ సభ సీట్లుండగా.. కొత్త ప్రతిపాదనతో అది 193కు పెరగనుంది. మహారాష్ట్రలో 48 సీట్ల నుంచి 117కు పెరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు 42 ఉండగా.. పెరిగితే 92 కావొచ్చంటున్నారు. బీహార్ లో ప్రస్తుతం 40 సీట్లు ఉండగా.. 94కు పెంచాలని మోడీ సర్కార్ ప్లాన్ చేస్తుందని సమాచారం. ప్రస్తుత జనాభా ఆధారంగా తమిళనాడు 77, రాజస్థాన్ లో 65 లోక్ సభ సీట్లు ఉండనున్నాయి. మధ్య ప్రదేశ్ లో 68, కర్ణాటకలో 67క. గుజరాత్ లో 60కి లోక్ సభ సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక  తెలుగు రాష్ట్రాల ఎంపీ సీట్లు కూడా డబుల్ కన్నా ఎక్కువ కానున్నాయి. ఏపీలో ప్రస్తుతం 25 లోక్ సభ సీట్లుండగా... మోడీ సర్కార్ ప్రతిపాదన ప్రకారం 52కు పెరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ‌లో ఉన్న 17 సీట్లు 39కు పెరుగుతాయి.  లోక్ స‌భ స‌భ్యుల సంఖ్య‌ను దాదాపుగా డ‌బుల్ చేసే దిశ‌గా జ‌రుగుతున్న ప్ర‌తిపాద‌న‌ల వ‌ల్ల ప్రాంతీయ పార్టీలు.. ప్ర‌త్యేకించి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌కు లాభమనే చర్చ జరుగుతోంది . అదే సమయంలో యూపీ, బీహార్ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో పెరిగే సీట్లు బీజేపీకి ప్రయోజనమనే చర్చ జరుగుతోంది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం, ఉత్తరాదిలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనం కావడం వంటి అంశాలను పరిశీలిస్తూ మోడీ సర్కార్ తాజా స్కెచ్ వేస్తుందని చెబుతున్నారు. అయితే లోక్ సభ సీట్ల పెంపుపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చేసిన ట్వీట్ పై కేంద్ర సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీజేపీ కూడా మాట్లాడలేదు. దీంతో మోడీ సర్కార్ మదిలో ఈ ప్రతిపాదన ఉందా లేదా అన్నదానిపై పూర్తి స్పష్టత రావడం లేదు.

పార్టీని కాదు నన్ను చూసి ఓటేయండి.. బీజేపీకి ఈటల రాజేందర్ షాక్?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు హుజురాబాద్ కేంద్రంగానే తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో ఉప ఎన్నికల జరగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితమే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే హుజురాబాద్ లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. హుజురాబాద్ లక్ష్యంగానే సీఎం కేసీఆర్ దళిత బంధును తీసుకొచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏడేండ్లుగా పెండింగులో ఉన్న రేషన్ కార్డుల పంపిణి కూడా బైపోల్ పుణ్యమే అంటున్నారు.  తనకు కంచుకోటగా ఉన్న హుజురాబాద్ లో గెలిచి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని ఈటల రాజేందర్ గట్టి పట్టుదలగా ఉన్నారు. బీజేపీలో చేరిన ఈటల.. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. గడపగడపకు వెళ్లి జనాలతో మాట్లాడుతున్నారు. పాదయాత్రలో సంచలన ఆరోపణలు చేస్తూ ముందుకు వెళుతున్నారు రాజేందర్. సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్న ఈటల రాజేందర్.. ప్రచారంలో మాత్రం పార్టీ పేరును ఎక్కువగా చెప్పడం లేదని తెలుస్తోంది. జమ్మికుంట మండలం గండ్రపల్లి సభలో మాట్లాడిన ఈటల.. బీజేపీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ప్రజలు ఎప్పటిలాగే తనకు అండగా ఉండాలని కోరారు రాజేందర్. ఈసారి పార్టీల పరంగా ఆలోచించవద్దని కోరారు. అంతేకాదు తన పార్టీని కాకుండా తనను చూసి ఓటేయమని అభ్యర్థించారు. ఎన్నడూ ఇంతగా ఓట్ల కోసం మిమ్మల్ని అడగలేదని.. మీ గుండెల్లో చోటు సంపాదించిన ఈ బిడ్డను ఈసారి పార్టీ చూడకుండా ఆశీర్వదించాలని కోరారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీని కాదని తనను చూసి ఓటేయమని చెప్పడంపై బీజేపీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తనను  గెలిపించాలని కోరకుండా.. పార్టీ వద్దని చెప్పడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ ఏం చేస్తారన్న దానిపై రకరకాల చర్చలు జరిగాయి. కొత్త పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరిగింది. కాని రాజేందర్ మాత్రం కమలం గూటికి చేరారు. అయితే బీజేపీలో రాజేందర్ ఇమడలేకపోతున్నారనే చర్చలు కూడా కొన్ని రోజులుగా వస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. దీంతో ఈటల కాంగ్రెస్ లో చేరితే బాగుండేదని, ఆయన తొందరపడ్డారనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వినిపించింది.అంతేకాదు ఉప ఎన్నికల తర్వాత రాజేందర్  కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది.  ఇప్పుడు రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో ఆయన సంతృప్తిగా లేరనే అభిప్రాయం మళ్లీ తెరపైకి వస్తోంది. బీజేపీ కంటే తన ఇమేజ్ తో ప్రచారం చేసుకుంటనే గెలుస్తాననే ఆలోచనకు ఈటల వచ్చారంటున్నారు. బీజేపీ అయితే కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం ఉండటంతో.. ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఇలా రూట్ మార్చారనే వాదన కూడా వస్తోంది. మొత్తంగా పార్టీని పట్టించుకోవద్దంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

ఏపీలో సంక్షేమ పథకాలకు కోతలు? అధికారులను బకరా చేయబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త అవతారం ... ఎత్తుతున్నారా? ఇంత వరకు అంతా తమ ఘనతే అని, కొవిడ్, కష్టాలు కట్టకట్టుకుని దాడి చేసినా, సంక్షేమ ఫలాలను గంట కొట్టినట్లు ఠంచనుగా టైముకు ఇంటింటికీ చేర్చిన ఘనత మొత్తానికి మొత్తంగా తమకే దక్కుతుందని అధికార పార్టీ డబ్బాలు కొట్టుకుంది. అంతే కాదు, ఆ క్రెడిట్ మొతం     ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఖాతాలోకే చేరుతుందని కూడా అధికార గణాలు ముఖ్యమంత్రికి కీర్తి కిరీటాలు తగిలించాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం, గొంతు మారుతోందా? అధికారులను బకరాలను చేసే బ్లేమ్ గేమ్’కు రంగం సిద్డంమవుతోందా? అంటే, అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే  వస్తోంది.   జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 26 నెలలు అయింది. అయితే ఇంతవరకు ఆయన అధికారులను పల్లెత్తు మాట అన్న సందర్భం ఇంచుమించుగా లేదనే అంటారు. ఒకటి రెండు సందర్భాలలో చిరుకోపం  చూపినా, మరీ ఇంతలా ముఖాన వాతలు పెట్టిన సందర్భం అయితే లేదు. ఇంతకీ విషయం ఏమంటే,కొంత మంది అధికారుల పనితీరును సిఎం మొట్టమొదటి సారిగా చీదరించుకున్నారు. ఛీ .. చండాలం, వెరీ బ్యాడ్’ అని అక్షింతలు వేశారు. మంగళవారం (జూలై 27) న స్పందన కార్యక్రమం పై జిల్లా కల్లెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్’లో ముఖ్యమంత్రి కొంత మంది ఆఫీసర్స్ పనితీరు చాలా బాగాలేదని,  వెరీ బ్యాడ్ అని పేరు పేరునా చెప్పేశారు. ఇది ఆమోదయోగ్యం కాదు అని గట్టిగా మందలించారు. అంతే కాదు, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో ఫెయిల్ అయిన వారికి  మెమోలు ఇవ్వండి, అని పై అధికారాలకు ఆదేశాల జారీ చేశారు. అక్కడితో ఆగకుండా, ఇలా మెమోలు ఇవ్వవలసి రావడం బాధాకరం. నాకు నేను మెమో ఇచ్చుకోవడంతో సమానం, మీ ఫెయిల్యూర్ నా ఫెయిల్యూర్’ అంటూ మొదటిసారిగా అధికారుల ముఖం మీదనే చీవాట్లు పెట్టారు. గ్రామ, వార్డ్ సెక్రటేరియట్ల ఇన్స్పెక్షన్’కు సంబంధించి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.   గ్రామ, వార్డ్ సచివాలయాలు తమ మానస పుత్రికలుగా పేర్కొంటూ, వాటిని నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ముఖ్యమంత్రి ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు ..అంటూ అధికారుల ఫెయిల్యూర్స్ ఏకరువు పెట్టారు. మనం ముందు మనుషులమ తర్వాతనే అధికారులం .... అంటూ చాలా చక్కగా జ్ఞానబోధ చేశారు. అంతే అయితే అదోరకం, కానీ, అసలు చెప్పదలచుకున్న విషయాన్ని చివర్లో అధికారుల చెవిలో వేశారు. సంక్షేమ ఫలాలు అనర్హులకు అందరాదు, అలాంటి అనర్హులను ఎరివేయండి, అందుకోసంగా ఇల్లిల్లు తిరిగి అయినా  సంక్షేమ లబ్దిదారుల జాబితాను, కుదించమని చెప్పారు. అఫ్కోర్స్ అదే సమయంలో అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని కూడా అన్నారనుకోండి. అయితే, అధికారులు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా గీత దాటిన నేపధ్యంలో.  ముఖ్యమంత్రి  మాట్లాడిన తీరు తెన్నులను బట్టి, సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్యను కుదించి, తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే  ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టమావుతోందని అంటున్నారు.  కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుల పద్దు హద్దులు దాటిందని హెచ్చరించింది.  కేంద్ర నిధుల దారి మళ్లింపు కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా బీజేపీ ఎంపీ జీవిఎల్, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, టీడీపీ ఎంపీల బృదం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.ఈ నేపధ్యంలో, సంక్షేమ కోతలకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. అయితే, ఆ పాపం తమ చేతికి అంటకుండా, అధికారాలను బకరాలను చేసేందుకే, ముఖ్యమంత్రి డైరెక్ట్’గా మెమోల వరకు వెళ్ళారని అధికారులు అంటున్నారు. అయితే ఈ బ్లేమ్ గేమ్ ఎక్కడి వరకు వెళుతుంది.. ఏ మలుపు తీసుకుంటుంది చూడవలసి వుందని అధికారులు అంటున్నారు. 

రెండుసార్లు వ్యాక్సిన్‌.. మూడుసార్లు కొవిడ్‌.. వామ్మో మామూలుగా లేదుగా...

క‌రోనా వైర‌స్‌ మ‌హా ఖ‌త‌ర్నాక్‌. ఏమాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్నా కాటేయ‌క మాన‌దు. మాస్కులు పెట్టుకున్నా, శానిటైజ‌ర్లు రాసుకుంటున్నా మ‌హా జాగ్ర‌త్త‌గా ఉండాలి సుమీ. వ్యాక్సిన్ వేసుకున్నాం క‌దా... ఇక మాకేమీ కాద‌ని బిందాస్‌గా ఉండ‌లేని ప‌రిస్థితి. కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లా సామ‌ర్థ్యం సుమారు 75శాతం మాత్ర‌మే. అంటే, రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కొవిడ్ వ‌చ్చే అవ‌కాశం మ‌రో 25శాతం ఉంద‌న్న మాట‌. డ‌బుల్ డోస్ వేసుకున్న వారికే క‌రోనా సోకుతుంటే.. ఇక సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఏమాత్రం సేఫ్ కాదు. తాజాగా, ఓ లేడీ డాక్ట‌ర్‌కు ఏకంగా మూడుసార్లు క‌రోనా అటాక్ అయింది. వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ బారిన ప‌డ‌టం ఆందోళ‌న‌క‌ర అంశం.  కరోనా కొత్త వేరియంట్లను వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకుంటుందా? లేదా? అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ముంబయికి చెందిన డాక్టర్ శ్రిష్టి హిల్లరి (26) అనే యువ డాక్టర్ రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ రెండు సార్లు కరోనా బారిన పడింది. అంతకుముందు కూడా ఓసారి ఆమెకు క‌రోనాఅటాక్ అయింది. మొత్తం 13 నెలల్లో ఏకంగా మూడుసార్లు ఆమెకు కరోనా వైరస్ సోకింది. తొలి రెండు సార్లు ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉన్నప్పటికీ, మూడోసారి అదీ రెండు డోసులు తీసుకున్న తర్వాత సోకిన వైరస్‌ కారణంగా ఆమెకు తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. ముంబైలోని వీర్ సావర్కర్ హాస్పిటల్‌లో కొవిడ్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ శ్రిష్టి హల్లరికి గతేడాది జులై 17న తొలిసారి కరోనా సోకింది. అప్పుడు ఆమెలో సాధారణ లక్షణాలే కనిపించాయి. ఈ ఏడాది మార్చి 8న తొలి డోసు, ఏప్రిల్ 29న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మే 29న రెండో సారి కరోనా బారినపడ్డట్టు రిపోర్ట్స్ వెల్లడించాయి. సింప్టమ్స్ మైల్డ్‌గానే ఉండటంతో ఇంట్లోనే కోలుకున్నారు. జులై 11న మరోసారి మొత్తం కుటుంబానికి వైరస్ సోకింది. ఈ సారి ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అయితే, టీకాలు ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోకున్నా.. ఆరోగ్యం దిగజారకుండా, ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మార‌కుండా కాపాడుతాయనేది నిపుణులు మాట‌. కానీ, శ్రిష్టి హల్లరి విషయంలో మాత్రం ఆరోగ్యం క్షీణించ‌డానికి.. క‌రోనా వైర‌స్‌ వేరియంట్లు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయ‌నేందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. అందుకే, మాస్కు పెట్ట‌కున్నా.. వ్యాక్సిన్ వేసుకున్నా.. బీ కేర్‌ఫుల్‌. నిర్ల‌క్ష్యం ఏమాత్రం త‌గ‌దు.   

నిషేధిత ఆస్తుల జాబితాలో 20 లక్షల ఎకరాలు.. ఇదేందయ్యా కేసీయారూ! 

తెలంగాణలో రెవిన్యూ సంస్కరణల గురించి గంభీర వచనాలు వల్లించిన కేసీఆర్.. ఆ మాటలు చెప్పి రెండేళ్లు కావస్తున్నా రాష్ట్ర ప్రజల సమస్యలకు పరిష్కారం మాత్రం చూపించలేకపోయారు. అనేక దఫాలుగా ఎన్నో గంటలపాటు సమావేశాలు జరిపి తయారు చేసిన మార్గదర్శకాల మేరకు అధికారులు పని చేయలేకపోతున్నారా.. లేక మార్గదర్శకాలు, పని విభజనే అశాస్త్రీయంగా ఉందా.. అదీగాక అధికారులు తమ పాత పద్ధతిలోనే లంచాల సంస్కృతిని మరింత పెంచి పోషిస్తూ భూముల లావాదేవీల్లో కొర్రీలు వేస్తున్నారా అన్న విమర్శలకు ఇప్పుడు బలం పెరిగింది. ఇందులో అధికారుల లోపం ఉందా.. ప్రభుత్వం చేతగానితనం ఉందా అనేది కాసేపు పక్కనపెడితే.. ఇప్పటికీ 20 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా ల్యాండ్ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండడమే అందుకు ఓ నిదర్శనంగా చెబుతున్నారు విపక్ష పార్టీల నేతలు.  రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిషేధిత ఆస్తుల జాబితా రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్, అసైన్డ్ ల్యాండ్స్ ఉండాల్సిన ఈ లిస్టులో లక్షలాది మంది అసలైన పట్టాదారుల సర్వే నెంబర్లు నమోదయ్యాయి. అధికారులు చేసిన తప్పులు.. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో  దాదాపు 20 లక్షల ఎకరాల పట్టా ల్యాండ్స్ నిషేధిత ఆస్తుల చిట్టాలో చిక్కుకున్నాయి. దీంతో అసలు సిసలైన యజమానులు తమ భూములను అమ్ముకోలేక.. కుటుంబీకులకు మ్యుటేషన్ చేసుకోలేక తిప్పలు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఫ్రీడమ్ ఫైటర్లు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు ఈ జాబితాలో ఉండటం రెవిన్యూ రికార్డుల్లోని తప్పులను వేలెత్తి చూపుతోంది. తమ దగ్గర పట్టాదారు పాసు పుస్తకాలున్నాయని.. తమ  భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు ఏళ్లకేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జిల్లా అధికారుల నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని.. అప్పుడే ఆ జాబితా నుంచి భూములు తొలగిస్తామని రెవిన్యూ సిబ్బంది ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు చేసిన తప్పులకు తాము బలవుతున్నామని, ఎన్వోసీ తెచ్చుకునేందుకు లంచాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. గతంలో హైదరాబాద్ ను ఆనుకునే ఉన్న ఓ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి చిక్కింది కూడా ఇలాంటి కేసులోనే కావటం గమనార్హం. అంతేకాదు.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చిన భూములపైనా క్లారిటీ లేకుండా నోషనల్ ఖాతాలకే పరిమితం చేశారు. దీనివల్ల లబ్ధిదారులకు నష్టపరిహారం సైతం ఇంకా అందకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రీడం ఫైటర్లు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు కూడా ప్రొహిబిటెడ్ జాబితాలోకి వెళ్లిపోయి అభివృద్ధి చేసుకోవాలన్నా లేక అవసరం మేరకు అమ్ముకోవాలన్నా, మరేదైనా ఇతర అవసరాలకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో పిల్లల చదువులైనా, పెళ్లీడుకొచ్చిన పిల్లలకైనా ఉపయోగపడకుండా పోయాయి. అసలు ఇలాంటి భూములకు రిజిస్ట్రేషన్ల శాఖ సింపుల్ గా రెడ్ మార్క్ పెట్టి కూర్చోవడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే నిషేధిత జాబితా నుంచి తమ భూములు తీసేయాలని ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికే 60 వేల  మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరంతా ఎన్వోసీ కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అటు అధికారులు భూముల విలువను బట్టి ఎన్వోసీ కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. రెవిన్యూ అధికారుల మీద బాధిత ప్రజలు దాడులు చేస్తున్నా లంచావతారులకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటికైతే పరిష్కారం దక్కలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగానైనా ఈ ప్రజోపయోగ కార్యక్రమాన్ని పట్టాలకెక్కిస్తారా అంటున్నారు సామాన్య జనం.

కాపురానికి  నో చెప్పిన భార్య..  బ్లేడ్‌తో గొంతు కోసుకున్న భర్త..  

ఈ మధ్య కొంత మందికి ప్రాణం అంటే లెక్కలేకుండా పోయింది. ప్రతి చిన్న విషయానికి ప్రాణం తీసుకుంటున్నారు.. లేదంటే పర్ణాలు తీస్తున్నారు. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా తాండూర్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో జరిగింది.  కర్ణాటక రాష్ట్రంలోని గురుకుంటకు చెందిన ఒక వ్యక్తి. అతని పేరు  అడిగి సంగమేశ్వర్. అతను తన భార్యతో కలిసి ఎన్టీఆర్ కాలనీలో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. ఈ ప్రాంతంలోనే పాలిసింగ్ యూనిట్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంగమేశ్వర్‌కు, తన భార్యకు మధ్య గొడవ జరిగింది. దీంతో తన భార్య ఆమె అక్క ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. భార్య భర్తల మధ్య ఎప్పుడు ఉండే చిన్న చిన్న గొడవలే అని ఆమె అనుకోలేదు.. అతను కూడా అనుకోలేదు..  ఈ క్రమంలో పలుసార్లు  భార్య అక్కా, బావాతో కూడా సంగమేశ్వర్ మాట్లాడాడు. అయినా ఫలితం లేదు. చివరికి  తన భార్య ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన భార్యను కాపురానికి పంపించడం లేదంటూ మనస్తాపానికి గురైన సంగమేశ్వర్..ఎప్పుడు గొడవ పడే వాళ్ళు లేకపోతే కూడా మనిషికి భయం వేస్తది కదా.. మరి అతనిది అమాయకత్వం లేదంటే నిజంగానే భార్య అంటే బెంగో తెలియదు గానీ చివరికి  బ్లేడ్‌తో గొంతు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయింది. అయితే.. సంగమేశ్వర్‌ను గమనించిన స్థానికులు వెంటనే అతనిని తాండూర్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు.  

కేసీఆర్ కోసం కొత్త ఫామ్‌హౌజ్‌.. ఆ గ‌ట్టు మీదే ఉంటారా? ఆ టార్గెట్ కోస‌మేనా?

కేసీఆర్ ఇల్లెక్క‌డుందో చాలా త‌క్కువ మందికే తెలుసు. కేసీఆర్ ఉండేది ఎక్క‌డో అంద‌రికీ తెలుసు. పెద్దిల్లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌.. చిన్నిల్లు గ‌జ్వేల్ ఫామ్‌హౌజ్‌. రెండు ఇండ్ల సంసారం ముఖ్య‌మంత్రిది. నందిన‌గ‌ర్‌లో ఉండే ఆయ‌న సొంతింటికి వెళ్లి చాలా ఏండ్లే అయ్యింది. తాజాగా, సీఎం కేసీఆర్ మ‌రో కేరాఫ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ గ‌ట్టు మీద కుర్చీ వేసుకొని కూర్చొనేందుకు రెడీ అవుతున్నారు. ఆ మేర‌కు ఆస్థాన వాస్తు పండితుడు సుద్దాల సుధాక‌ర్‌తేజ.. ఇంటి స్థ‌లాన్ని ప‌రిశీలించి వ‌చ్చారు. ఓ శుభముహుర్తాన కేసీఆర్ కొత్త‌ ఇంటికి శంకుస్థాప‌న ప‌డ‌నుంది. ఇంత‌కీ, ఆయ‌న‌కు ఇప్ప‌టికిప్పుడు ఇంకో ఇంటి అవ‌స‌రం ఏమొచ్చింది? ఇంత‌కీ ఆ లొకేష‌న్ ఏంటి?  కేసీఆర్ మాట‌లు చెబుతారే గానీ.. చేత‌ల్లో చూపించ‌రనే ఆరోప‌ణ‌ ఉంది. కేసీఆర్ కోత‌ల రాయుడనే విమ‌ర్శ ఉంది. ఆయ‌న చెప్పే మాట‌లు, చేసే ప‌నులు కూడా అలానే ఉంటాయ‌నుకోండి అది వేరే విష‌యం. తాజాగా, తెలుగురాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం తీవ్ర స్థాయిలో న‌డుస్తోంది. మంత్రులు తిట్ల దండ‌కంతో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు. ప్రాజెక్టుల ద‌గ్గ‌ర పోలీసుల మోహ‌రింపుతో ఉద్రిక్త‌త‌లు పెంచేస్తున్నారు. కేంద్రానికి, ట్రైబ్యున‌ల్‌కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఏపీ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తి చేస్తే.. పాల‌మూరు ఇక ఎడారే అంటోంది తెలంగాణ‌. జ‌గ‌న్ దూకుడుకు భ‌య‌ప‌డో, మ‌రే కార‌ణ‌మో కానీ.. ఏళ్లుగా ప‌ట్టించుకోకుండా ప‌క్క‌న‌ప‌డేసిన పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఇప్పుడిప్పుడే ఫోక‌స్ పెడుతున్నారు. గ‌తంలో ఆ ప్రాజెక్టును త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు తాను అక్క‌డే కుర్చీ వేసుకొని కూర్చుంటానంటూ ఎన్నిక‌ల ప్ర‌చారానికి పాల‌మూరుకు వెళ్లిన ప్ర‌తీసారి కేసీఆర్ ఊద‌ర‌గొడుతూనే ఉంటారు. కానీ, ఇంత వ‌ర‌కూ అక్క‌డ ఒక్క కుర్చీ కూడా వేసింది లేదు. తాజాగా, కుర్చీ ఏం ఖ‌ర్మ‌.. ఏకంగా గెస్ట్‌హౌజ్ క‌ట్టుకొని అక్క‌డే తిష్ట వేస్తాన‌ని.. ప్రాజెక్టు పూర్తి అయ్యే వ‌ర‌కు అక్క‌డి నుంచి క‌దిలేది లేద‌ని కేసీఆర్ క‌మిట్ అయ్యార‌ట‌. వెంట‌నే ప్రాజెక్ట్ సమీపంలో త‌న‌కో గెస్ట్‌హౌజ్ నిర్మించాలంటూ ఇటీవ‌ల‌ అధికారుల‌ను ఆదేశించార‌ట‌.  సీఎం కేసీఆర్ గెస్ట్‌హౌజ్‌ కోసం స్థానిక ఎమ్మెల్యే ఆల వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి ఓ స్థ‌లం చూశారు. అదెలా ఉందో చూసి ర‌మ్మంటూ త‌నకెంతో న‌మ్మ‌క‌మైన‌ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాక‌ర్ తేజ‌ను కోరార‌ట కేసీఆర్‌. ఆ మేర‌కు ఇటీవ‌ల సుద్దాల.. భూత్పూర్ మండలంలో పర్యటించారు. కరివెన ద‌గ్గ‌ర‌ నిర్మాణంలో ఉన్న కురుమూర్తిరాయ ప్రాజెక్టు దగ్గర గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన స్థ‌లాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆ స్థ‌లం వాస్తుకు అనుగుణంగా ఉందో లేదో అనే వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్‌కు అందించ‌నున్నారు సుద్దాల సుధాక‌ర్‌తేజ‌. కేసీఆర్ ఆమోదం తెలిపితే.. వెంట‌నే గెస్ట్‌హౌజ్ నిర్మాణం మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. ఆ గ‌ట్టుపై ఉన్న‌ గెస్ట్ హౌస్‌లోనే కేసీఆర్ ఉంటార‌ని.. అక్క‌డి నుంచే ప్ర‌భుత్వ‌ పరిపాలన కార్యక్రమాలు, ప్రాజెక్టు నిర్మాణ పనులు చూస్తార‌ని అంటున్నారు. ఆ లెక్క‌న త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్ అడ్ర‌స్ మారిపోనుంద‌న్న మాట‌. హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉంటేనే ఎవ‌రికీ అందుబాటులో ఉండ‌ని ముఖ్య‌మంత్రి.. ఇక‌పై పాల‌మూరు షిఫ్ట్ అయితే ఆ మాత్రం కూడా క‌నిపించ‌రేమో...అంటున్నారు.  

ప్రాణం తీసిన సమోసా.. 

టైటిల్ చూసి షాక్ అయ్యారా ..? సమోసా ప్రాణం తియ్యడం ఏంటని అనుకుంటున్నారా..? గాశారం బాగాలేకపోతే గడ్డిపోస కూడా మన చావుకు కారణం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సమోసా ధర విషయంలో ఏర్పడిన చిన్న వివాదం కాస్తా చినికిచినికి గాలివానై.. చివరకు ఓ వ్యక్తి బలవన్మరణానికి దారితీసింది. పోలీసులు విచారణ చేసి  తెలిపిన వివరాల మేరకు అతని పేరు  బజ్రు జైశ్వాల్ వయసు 30 సంవత్సరాలు  తన స్నేహితులతో కలిసి సమోసా తినేందుకు సమీపంలోని షాప్‌కు వెళ్లారు. షాప్‌లో రెండు సమోసాలు తిన్నారు. రెండు సమోసాలకు రూ.20లు చెల్లించాలని సదరు షాప్ యజమానురాలు కాంచన్ సాహు కోరింది. ఇక అంతే ఆమెకు చెల్లించడానికి డబ్బులు లేకనో.. అంతకు ముందు ఉన్న ధరను కాకుండా  ధర పెంచినందుకు తెలియదు గానీ.. కొన్ని రోజుల క్రితం వరకు ఆ షాప్‌లో రెండు సమోసాల ధర రూ.15 (ఒక్కోటి రూ.7.50)గా ఉండేది. రూ.20 ఎందుకు చెల్లించాలంటూ షాప్ యజమానురాలితో  గొడవకు దిగాడు జైశ్వాల్ఒ. ఒక్కో సమోసా ధరను రూ.2.50 పెంచడం కరెక్టుకాదంటూ రూ.5లు అదనంగా ఇచ్చేందుకు నిరాకరించాడు.  అయితే ముడి సరుకుల ధరలు పెరగడంతో సమోసా ధరను ఒక్కోటి రూ.10కి పెంచినట్లు కాంచన్ తెలిపింది. నిజమే కదా మరి నిత్యావసరాల ధరలు కూడా ఆకాశానికి అంటుతున్నాయి ఇప్పుడు ఉన్నపరిస్థితిలో ఆమె వెర్షన్ ఆమె చెప్పింది. అయినా సరే అల్లు అర్జున్ సినిమాలో తగ్గేదే లో అన్నట్లు  వెనక్కి తగ్గని జైశ్వాల్ మునుపటిలా రూ.15లే చెల్లిస్తానని తెగేసి  చెప్పాడు. ఇక రెండు సమోసాలు, 5 రూపాయల విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. జైశ్వాల్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు షాపు యజమాని సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.  జైశ్వాల్‌పై 294, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని పోలీసులు స్టేషన్‌కు పిలించి ప్రశ్నించారు. పోలీసు కేసుతో తీవ్ర మనోవేధనకు గురైన నిందితుడు ఈ నెల 24న తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కుటుంబీకులు, స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పించగా.. చికిత్సా ఫలితం లేకుండా ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆత్మాహుతికి పాల్పడే ముందు జైశ్వాల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను కాంచన్, పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించాడు. పోలీసులు తనను స్టేషన్‌లో తీవ్రంగా కొట్టినట్లు తెలిపాడు. కాగా జైశ్వాల్ కుటుంబ సభ్యుల నుంచి తమ కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు ఉందని దుకాణ యజమాని కాంచన్ మీడియా తెలిపింది. జైశ్వాల్ ఆత్మాహుతికి ప్రతీకారం తీర్చుకుంటామని అతని కుటుంబీకులు బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీంతో తమ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు. మొత్తానికి రెండు సమాసాలకు సంబంధించిన రూ.5ల గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకోవడం మధ్యప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింద.  ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.