డేంజర్ లో హైదరాబాద్ ..
posted on Jul 29, 2021 @ 1:42PM
గాంధీ ఆస్పత్రికి మళ్లీ కరోనా బాధితుల సంఖ్య. రోజు రోజుకి ఎక్కువవుతోంది. మళ్ళీ ఆందోళనలో వైద్య అధికారులు. ప్రజలు మళ్ళీ అప్రమత్తం అవ్వాలని కోరుతున్నారు. కొన్ని రోజులుగా గాంధీ ఆస్పత్రికి రోజుకు 50వరకు సివియర్ కరోనా కేసులు వస్తున్నాయి. కొంత కాలంగా కరోనా ఉపశమనం ఉచిందని ఇటు ప్రజలు అటు ప్రభుత్వాలు తమ పనులను తాము ఎదావిదిగా చేసుకుంటూ పోతున్నారు. ఇంకొంత మంది ఐతే కరోనా లేదు ఏమిలేదని.. వచ్చిన తమను ఏం చేయదు అన్నట్లు కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం లేదు. ప్రజలు తమ పని తాము చేసుకుపోతున్నారని. కరోనా కూడా సాపాకింద నీరులా తన పని తీను చేసుకుంటూ పోతుంది. తాజాగా తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి వరుసగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి కరోనా బాధితుల తాకిడి మరోసారి ఎక్కువైంది. కరోనా వార్డు బాధితులతో ఇప్పటికే నిండిపోయింది. గాంధీకి రోజుకు 50 వరకు సివియర్ కేసులు వస్తున్న పరిస్థితి నెలకొంది.
వారం క్రితం వరకు గాంధీలో రోజుకు 20 వరకు మాత్రమే కరోనా అడ్మిషన్లు నమోదు అయ్యాయి. కాగా గతంలో వర్షాలు పడి వరదలు వచ్చినట్లు కరోనా కేసులు ప్రవాహం పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో వరుస పండుగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా హైదరాబాద్ లో బోనాలు అని.. పార్టీ మీటింగ్స్ అని ప్రజలు తిరుగుతున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో 206 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఐదు రోజుల్లో మూడు సార్లు కరోనా కేసులు వంద దాటాయి. గత శనివారం 147 కరోనా కేసులు నమోదు అవగా... బుధవారం 99 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. ఇక తాజాగా 108 కొత్త కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలో గత 24 గంటల్లో 1,16,815 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 657 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా... 578 మంది కోలుకున్నారు. ఏది ఏమైనా గతం లో వచ్చిన పరిస్థితి వస్తే ఎదురుకోవడానికి ముందు ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.