మ‌హిళ‌పై అంబ‌టి అరాచ‌కం.. భ‌గ్గుమంటున్న మ‌హిళాలోకం..

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తమపై ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా  వైసీపీ ఫైర్ బ్రాండ్ ల్లో ఒకరైన ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన నిర్వాకం తీవ్ర వివాదస్పదమవుతోంది.  ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఒక సామాజిక వర్గాన్నికించపరిచారనే ఆరోపణలు రావడంతో.. వెనక్కు తగ్గి  క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఆస్తి, చెత్తపన్ను పెంపుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో మున్సిపల్ ఆఫీసు మెట్లకు అడ్డంగా బైఠాయించి సీపీఎం నేతలు ధర్నాకు దిగారు. అప్పుడే కౌన్సిల్ హాల్ కు వచ్చిన అంబటిని సీపీపీ కార్యకర్తలు నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  అయితే చెత్తపై పన్ను విధించడం, ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ ఆందోళనకు దిగిన సిపిఎం శ్రేణులతో వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దారుణంగా వ్యవహరించారు. సత్తెపల్లి మున్సిపల్ కార్యాలయంలోకి ఎమ్మెల్యేను వెళ్లనివ్వకుండా నిరసనకారులు అడ్డుగా కూర్చోగా... వారిని తొక్కుకుంటూ ఆయన ముందుకు వెళ్లారు. మహిళలు అనికూడా చూడకుండా నిరసనకారులను పక్కకు తోస్తూ, కాళ్లతో తొక్కుకుంటూనే ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా ముందుకు వెళ్లారు.  ఎమ్మెల్యే తీరుతో షాక్ తిన్న ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అంబటి తీరుపై సిపిఎం నాయకులు మండిపడుతున్నారు.  సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే అంబటి.రాంబాబు తోపాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్స్ పై తమపై దాడిచేసికోట్టి,అసభ్యంగా దూషించారని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆఫీసు వద్ద ఆస్థిపన్ను ఉపసంహరించాలని ఆందోళన చేస్తున్న తమపై మహిళలనే గౌరవం లేకుందా,అసభ్యంగా దూషిస్తూ, దాడి చేసి కోట్టిగాయపరిచారని తమ ఫిర్యాదులో ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే విధులకు ఆటంకం కలిగించారనే కారణంగా ధర్నాకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు స్టేషన కు తరలించారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. 

బిర్యానీ కోసం.. ఐపీఎస్ అధికారిణి కక్కుర్తి.. చివరికి.. 

ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటారు..అది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన అందరికి తెలిసిన విషయమే..  కానీ ఓ ఐపీఎస్ అధికారిణి..  బిర్యానీ కోసం కక్కుర్తి పడింది. చివరకు ఆ కక్కుర్తి  పికల్లోతు వివాదంలో కూరుకుపోయింది. చివరకు ప్రభుత్వమే స్పందించి. ఆ మహిళా ఐపీఎస్ అధికారి చేసిన నిర్వాకంపై విచారించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణే పరిధిలో జరిగింది. అక్కడ డిప్యూటీ కమిషనర్‌ ర్యాంకులో మహిళా ఐపీఎస్‌ అధికారిణి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన సబార్డినేట్‌తో విశ్రాంబాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏ రెస్టారెంట్‌లో మంచి బిర్యానీ దొరుకుతుందనేది అడిగి తెలుసుకున్నారు. దేశీ ఘీ రెస్టారెంట్‌‌లో మంచి బిర్యానీ దొరకుతుందని చెప్పడంతో.. అక్కడి నుంచి మటన్‌ బిర్యానీ తెప్పించాలని ఐపీఎస్ అధికారిణి కోరారు. ఈ క్రమంలో రెస్టారెంట్‌ వాళ్లు తమ పద్ధతోలో డబ్బులు అడిగారు. అడిగితే స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడించాలంటూ ఆర్డర్  జారీ చేశారు. తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా..? ఎందుకు అంటు ఆమె సబార్డినేట్‌‌తో మాట్లాడారు. అదేదో అధికారులకు రాజ్యాంగంలో రెస్టారెంట్స్ పెట్టుకున్న వాళ్ళు ఫ్రీ గా బిర్యానీ ఇవ్వాలి అని రూల్ పెట్టినట్లు. దానికి సబార్టినేట్ తాము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్‌ చేసినా.. డబ్బులు చెల్లిస్తామటూ సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్‌.. మన పరిధిలో ఉన్న రెస్టారెంట్‌కు కూడా డబ్బులు చెల్లించాలా.. ఇదంతా అక్కడున్న ఇన్‌స్పెక్టర్‌ చూసుకుంటాడంటూ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ తతాంగమంతా మహారాష్ట్ర హోం మంత్రి వాల్సే పాటిల్ దగ్గరికి చేరింది. వెంటనే ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. విచారణ అనంతరం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి తెలిపారు. వాళ్ళు కూడా రెస్టారెంట్ నడిపేదే బతకడానికి కదా మరి.. ఆ విషయం అర్థం చేసుకోలేదు బాగా చదువుకున్న ఆఫీసర్. పైగా ఆమె  వ్యవహారం సదువుకున్న వాడికంటే ఆడెవ్వడో బెటర్ అనే సామెత లా తయారైయింది. ఈ విషయంపై ఐపీఎస్‌ అధికారిణి స్పందించారు. తన ఆడియో క్లిప్‌ను కొంతమంది మార్ఫింగ్‌ చేశారంటూ కొత్త నాటకానికి తెరలేపారు. ఇదంతా సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందనని.. కుట్రతోనే ఇలా చేశారని ఆమె అన్నారు. తాను ఇక్కడ ఉద్యోగంలో చేరిన తరువాత కొంతమంది సీనియర్ల ఆర్థిక ప్రయోజనాలు ఆగిపోయాయని.. దీంతో తనను తొలగించాలనే అక్కసుతో ఇదంతా చేశారని ఆమె తెలిపారు. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించనున్నట్లు మహిళా ఐపీఎస్ అధికారిణి తెలిపారు. నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. అయినా బిర్యానీ తినాలనిపిస్తే 500 పెడితే సరిపోతుంది కానీ మరి ఇలా చేయడం ఏంటని కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మంట లేనిదే పొగ రాదంటారు సో ఎంతో కొంత నిజం ఉంటుందంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.    

క్షుద్రపూజల భయంతో.. బయటికిరాని గ్రామ ప్రజలు.. 

పల్లెటూరు అంటే పది , పన్నెండు గాక గాలి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు..కానీ  రెండు రోజులుగా ఆ ఊరు అంత నిశ్శబ్దం.. ఇంటి తలుపులు వేసుకుని కనీసం బయటికి కూడా రావట్లేదు. అలా అని ఆ ఊరిలో కరోనా వచ్చిందేమో అనుకునేరు కాదు.. ఆ గ్రామ ప్రజలను ఒక భయం వెంటాడుతోంది. ఇంతకీ ఆ ఊరి పేరు ఏంటని అనుకుంటున్నారా..ఆ ఊరి పేరే కదంబాపూర్. మరి ఆ గ్రామా ప్రజలను వెంటాడే భయం ఏంటని అనుకుంటున్నారా..? ఇంగ్లీష్ లో బ్లాక్ మేజిక్ అంటారు. సాంస్కృతంలో  క్షుద్రపూజలంటారు. తెలుగులో చేతబడి అంటారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.. ఒక వైపు చంద్రమండలంలోకి అడుగుపెడుతున్నారు. మరో వైపు అంతరిక్షం లో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేస్తున్నారు.  టెక్నాలజీ తో ప్రపంచం దూసుకుపోతుంటే కూడా ఇంకా జనం మూఢనమ్మకాల ఊబి నుంచి బయటకు రావట్లేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అశోక్‌నగర్ సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద రాత్రిపూట కోడిని బలిచ్చారు. నిమ్మకాయలు, కోడిగుడ్డు, అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి క్షుద్ర పూజలు చేశారు. ఎవరో  గుర్తుతెలియని వ్యక్తులు. ఊరిబయట అర్ధరాత్రి క్షుద్రపూజలు, చేతబడి చేయడంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే కూడా భయాందోళన చెందుతున్నారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లేవాళ్లు కూడా హడలిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాలు చేతులో పట్టుకుని ఇళ్లలో దాకుంటున్నారు.  ముఖ్యంగా ఆదివారం, గురువారాలు వచ్చాయంటే చాలు మూడు రోడ్లు కలిసిన చోట క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. ఆషాఢమాసంలో క్షుద్రపూజలు, చేతబడి ఆనవాళ్లు ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకోకుండా వాటిపై నుంచి దాటడంతో అనారోగ్యానికి గురవుతామని అనుమానంతో జనం భయపడిపోతున్నారు. ఈ ఘటనపై అటు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు జనవిజ్ఞాన వేదిక లాంటి స్వచ్చంద సంస్థలు ఇలాంటి మూఢ నమ్మకాలపై యెంత అవగాహనా కలిపించిన ప్రజలు భయభ్రాంతులకు గురైతున్నారు.  ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా మంత్రగాళ్లు క్షుద్రపూజలు, చేతబడి పూజలు చేయడం మానడం లేదు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా.. ఇంకా మంత్రాలు, క్షుద్రపూజలు అంటూ ఎక్కడికి వెళ్తున్నామని విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని పట్టుకుని, కేసు నమోదు చేయాలని, మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేదా రోడ్లు కలిసే కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు పెట్టి ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ల ఆట కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఐటీ కంపెనీలతో తెలంగాణ సర్కార్ వార్? ఉద్యోగుల్లో కలవరం.. 

ఐటీ అనగానే దేశంలో బెంగళూరు తర్వాత వినిపించే పేరు హైదరాబాదే. గత కొన్నేండ్లుగా హైదరాబాద్ లో ఐటీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ ఎగుమతుల్లోనూ ఏడాదికేడాది రికార్డులు సాధిస్తోంది. కరోనా కల్లోల సమయంలోనూ హైదరాబాద్ ఐటీ వృద్ధి అశాజనకంగానే ఉంది. తమ ప్రభుత్వ విధానాలు, పాలసీల వల్లే ఐటీ రంగం దినదినాభివృద్ధి చెందుతోందని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఐటీ మంత్రి కేటీఆర్ ప్రయత్నాల వల్లే ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలన్ని హైదరాబాద్ వస్తున్నాయని గులాబీ లీడర్లు, కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే ప్రస్తుతం మాత్రం సీన్ మారినట్లు కనిపిస్తోంది. ఐటీ కంపెనీలతో తెలంగాణ సర్కార్ కు మధ్య ప్రస్తుతం వార్ జరుగుతోందని తెలుస్తోంది. తమపై తెలంగాణ  ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని ఐటీ సంస్థల ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు.  కరోనా కారణంగా ఐటీ కంపెనీలన్ని మూత పడ్డాయి. ఉద్యోగులతో అవి వర్క్ ఫ్రమ్ హోం చేపిస్తున్నాయి. ముందుగా కొన్నినెలల వరకే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకున్నా... అది పొడిగిస్తూ పోతూనే ఉన్నాయి. గత మార్చి నుంచి ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోంలోనే ఉన్నారు. అయితే తాజాగా తెలంగాణ సర్కార్.. వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఐటి కంపెనీలపై ఒత్తిడి తెస్తుందట. వర్క్ ఫ్రం హోం పద్దతికి స్వస్తి చెప్పి ఉద్యోగులను సంస్ధలకు పిలిపించాలని ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ తో ప్రభుత్వం చెప్పించిందని తెలుస్తోంది ఇప్పటికే చాలాకాలంగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఇళ్ళనుండే చేస్తున్నారని ఈ పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టి అందరినీ ఆఫీసులకు పిలిపించాలని జయేష్ ఐటి సంస్ధల మేనేజర్లతో జరిగిన సమావేశంలో గట్టిగానే చెప్పారట.  తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని  ప్రముఖ కంపెనీలు వ్యతిరేకించాయని తెలుస్తోంది. తమ యాజమాన్యాల నిర్ణయం ప్రకారమే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు అందరినీ ఆఫీసులకు పిలిపించటం సాధ్యంకాదని తెగేసి చెప్పాయట. గూగుల్, కాగ్నిజెంట్ , విప్రో , ఫేస్ బుక్,  డెలాయిట్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల యాజమాన్యాలన్నీ తమ ఉద్యోగులంతా వచ్చే అక్టోబర్ వరకు ఇళ్ళనుండే పనిచేయాలని గతంలోనే నిర్ణయించాయి. ఈ విషయాన్ని సంస్ధల ప్రతినిధులు జయేష్ కు చెప్పారట. పెద్ద కంపెనీల బాటలోనే చిన్నతరహా  ఐటీ కంపెనీలు కూడా ఫాలో అవుతాయని వివరించారట. పైగా ఉద్యోగులు ఇళ్ళల్లో ఉండి పనిచేసినా ఆఫీసులకు వచ్చి పనిచేసినా అవుట్ పుట్ ఒకేలా ఉందని వివరించారు. కాబట్టి ఐటి ఉద్యోగుల పని విషయంలో ఇప్పటికప్పుడు తాము నిర్ణయం తీసుకోవటం కష్టమని కూడా తెగేసిచెప్పారు.  ఐటీ కంపెనీలపై తెలంగాణ సర్కార్ ఒత్తిడి తేవడానికి బలమైన కారణాలు కనిపిస్తుండగా... ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ అఫీసుకు విముఖత చూపడానికి వాళ్లకు బలమైన కారణాలే ఉన్నాయి. ప్రభుత్వం గట్టిగా వ్యవహరించడానికి కారణం ఉపాధి కల్పనే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 15 వందల ఐటీ కంపెనీలు ఉండగా... దాదాపు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఐటీ కంపెనీలపై ఆధారపడి మరో 15 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో వాలాలు.. టిఫిన్ సెంటర్లు, సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్స్, చిన్న చిన్న ఉద్యోగులు, గార్డెన్ వర్కర్లు... ఇలా దాదాపు 15 లక్షల మంది ఐటీ కంపెవీల్లో పని చేస్తూ జీవనం సాగించే వారు. ఇప్పుడు ఐటీ కంపెనీలన్ని మూతపడి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండటంతో... చిన్న చితకా పనులు చేసే 15 లక్షల మంది రోడ్డున పడ్డారు. వీళ్లందరికి ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే పడింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. అందుకనే ఐటి కంపెనీల ప్రతినిధులపై ఒత్తిడి తెస్తోందని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఐటీ కంపెనీల వాదన మాత్రం మరోలా ఉంది. కొవిడ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడం, థర్డ్ వేవ్ వస్తుందన్న భయాలతో తాము ఆఫీసులు తెరవడానికి ముందుకు రావడం లేదని ఐటీ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగులను రిస్కులో పడేయలేమని అంటున్నారు. కారణాలు ఇవి చెబుతున్నా ఐటీ కంపెనీలు ఆలోచన మరోకటి కూడా ఉందంటున్నారు. ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం వల్ల కంపెనీల యాజమాన్యాలకు చాలా ఖర్చులు మిగులుతున్నాయట. ఆఫీసు నిర్వహణ ఉద్యోగుల ట్రాన్స్ పోర్టు, కరెంట్ ఏసీ బిల్లులు, చిన్న చిన్న ఉద్యోగుల వేతనాలు అన్ని మిగులుతున్నాయట. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోంలోనూ జరగాల్సిన ప్రాజెక్టు వర్కులన్ని టార్గెట్ మేరకే జరుగుతున్నాయట. దీంతో ఆఫీసులు ఓపెన్ చేయడం కల్లా ఇదే ప్రాఫిట్ గా ఉందన్న ఆలోచనకు వచ్చిన ఐటీ కంపెనీలు.. వర్క్ ఫ్రమ్ హోంను కంటిన్యూ చేస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఉపాధి కల్పనే లక్ష్యంగా ఐటీ కంపెనీలకు రాయితీలు ఇచ్చినందున.. 15 లక్షల మంది కోసమేనా ఆఫీసులు తెరవాల్సిందేనని ప్రభుత్వం గట్టిగా చెబుతుందని సమాచారం. చూడాలి మరీ తెలంగాణ సర్కార్, ఐటీ కంపెనీల మధ్య వివాదం ఎంత వరకు వెళుతుందో..  

మందు తాగితే.. మంచింది..

నేటి కాలంలో మందు తాగని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.. ఇకపోతే  ఆ మందు తాగడానికి మందు బాబులు రకరకాల కారణాలు వెతుకుంటారు. అమ్మాయి వదిలివెళ్ళిపోయిందని బాధలో తాగుతున్నానని కొందరు చెపితే.. ఆఫీస్ లో బాస్ తిట్టాడని, ఇంట్లో టెన్షన్స్, అప్పులోల బాధలు ఎక్కువ అయ్యాయి అని మరి కొందరు. సంబంధం లేకుండా చాలా మంది మందు తాగుతారు. ఇలా చెపుతూ పొతే మందు బ్రాండ్లు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని కారణాలు మందు తాగడానికి చెప్పుకుంటారు మందు బాబులు. ఇంకొంత మంది ఐతే ఎప్పుడు వైన్స్ షాప్ తెరుస్తారో అప్పుడే వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. ఈ విషయం పక్కన పెడితే..మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే. కానీ, మద్యం సేవిచడం వలన కూడా ఆరోగ్యనికి మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ మద్యం సేవించడం వలన ఆరోగ్యానికి ఏం ప్రయోజనం.. ఎంత మోతాదులో తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మహిళలు మద్యం సేవించడం మంచిదేనా.. వారు ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది చూద్దాం. మద్యం వలన ఆరోగ్యానికి మంచి జరగాలంటే తగినంత మోతాదులో తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే రోజుకి మహిళలు ఒక డ్రింక్, పురుషులు రెండు డ్రింకులు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. రోజు ఇలా మద్యం తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్ట వచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఒక డ్రింక్ అంటే 12 ఔన్సుల బీరు లేదా 5 ఔన్సుల వైన్ లేదా 1.5 ఔన్సుల లిక్కర్ అయినా తీసుకోవచ్చు. దీని వలన మానసిక ఆనందం పొదవచ్చు. అయితే మరో ముఖ్య గమనిక  గర్భిణీలు ఆల్కహాల్ తీసుకోకూడదు. అదే విధంగా లివర్ సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది. అది నిపుణులు పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది. మరో వైపు తాగమని చెపుతూనే చెప్పకనే చెపుతున్నారు ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందువలన సాధ్యమైనంత వరకు మహిళలు మద్యం సేవించకపోవడమే ఉత్తమం. సో మనం గ్రహించాలి ఏ మాట వెనుక ఎవరి స్వార్ధం ఉందో తెలుసుకోలేనంత కాలం మోసపోతావ్ అని చెప్పాడు లెనిన్  మనం కూడా ప్రతి విషయాన్నీ గ్రహించాలి.. మద్యం సేవించడం వలన కలిగే ప్రయోజనాలు.. తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల గుండెజబ్బులు దూరమయ్యే అవకాశాలున్నాయి. కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.తగినంత మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వలన జీవితకాలం కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు మద్యం సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చు. మానసిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు. సో ఆడండి విషయం మనం కొంచం జాగ్రత్త ఉంటే ఏ రోగాలు రావు.. దానికి మద్యం తాగాల్సిన అవసరం లేదు.. మీరే ఆలోచించండి  ఎందుకంటే ఎవడి లైఫ్ వాడికి తెలుసు.. ఎవడి కుటుంబ బాధ్యతలు వాళ్ళకి తెలుసు. 

అఖిలేష్ యాదవ్ డైరెక్షన్ లో తెలంగాణలో మరో కొత్త పార్టీ? 

రాజన్న సంక్షేమ రాజ్యం కోసం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలమ్మ, వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. మతాన్ని, కులాన్ని కలబోసి ఒక వర్గం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో వంక ఇటీవలనే స్వచ్చంద పదవీ విరమణ చేసిన  ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ రేపో మాపో  అధికారికంగా రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దళిత జనుల ఉద్దరణ కోసం ఆరేళ్ళ సర్వీస్ వదులుకుని వచ్చిన ఆయన ఆగష్టు 7 వతేదీన మాయావతి బాటలో కాన్షీరామ్’ స్థాపించిన బీఎస్పీలో చేరుతున్నారు. బీఎస్పీలో చేరుతున్నారు అంటే కంటే, ఆయన తమ ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చేందుకు బీఎస్పీని వేదిక చేసుకుంటున్నారు. ఇక్కడ దళిత జనుల ఉద్దరణ ఆయన ప్రధాన ఎజెండాగా ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. ఇప్పుడు అదే వరసలో అదే యూపీ నేతల ప్రోత్సాహంతో, తెలుగు రాష్ట్రాలలో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది.అవును,సమాజ్ వాదీ పార్టీ, (ఎస్పీ) అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలుగు రాష్ట్రాలలో బీసీల పార్టీ ఏర్పాటు చేస్తే, తమ పార్టీ మద్దతు ఇస్తుందని, తెలుగు రాష్ట్రాలలో బీసీ సంఘాల నాయకుదు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యకు హామీ ఇచ్చారు. నిజానికి బీసీ పార్టీ పెట్టమని ఆయనే ఈయన్ని గిల్లి వదిలి పెట్టారు. జాతీయ రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల నేపధ్యంలో అఖిలేష్ యాదవ్  చేసిన సూచన ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.  ఇక విషయంలోకి వెళితే ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ ఢిల్లీలో గురువారం అఖిలేష్ యాదవ్ ను  కలిశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి చొరవ తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా, అఖిలేష్ యాదవ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీసీ వాదం బలంగా ఉందని, ఈ  నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో  బీసీల పార్టీ పెట్టాలని సూచించారు.ఈ విషయాన్ని ఆర్. కృష్ణయ్య స్వయంగా చెప్పారు. అయితే, బీసీల పార్టీ పెడతారా లేదా అన్న విషయంలో మాత్రం ఆయన ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు.  గతంలో కొందరు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. ఇక ముందు ఏమి జరుగుతుందనేది ముందే తెలుస్తుంది. అయితే, తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో కులాల ప్రభావం పెరుగుతోందా అంటే మాత్రం అవుననే అనవలసి వస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు, కుల రాజకీయాలను తట్టి లేపుతోందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈట‌ల పాద‌యాత్ర ఇక లేన‌ట్టేనా? క్లారిటీ ఇచ్చిన రాజేంద‌ర్‌..

12 రోజులు.. 222 కిలోమీట‌ర్లు.. రోజంతా న‌డ‌క‌.. దారంతా జ‌నం.. జెండాలు.. జేజేలు.. ప‌ల‌క‌రింపులు.. ప్ర‌సంగాలు.. దండాలు.. దండోరాలు.. అబ్బో పాద‌యాత్ర అంటే మామూలా. చావోరేవో అన్న‌ట్టు సాగుతోంది ఈట‌ల ప్ర‌జాదీవ‌న యాత్ర.  అస‌లే చిన్న ప్రాణం. మ‌నిషి మ‌రీ బ‌ల‌హీనం. అంత దూరం పాద‌యాత్రకు ఈట‌ల శ‌రీరం త‌ట్టుకోలేక‌పోయిన‌ట్టుంది. అనేక‌మంది మ‌నుషులు, అనేక ప్రాంతాలు, టైంకి తిన‌లేక‌పోవ‌డం, కంటినిండా కునుకు లేక‌పోవ‌డం.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కావొచ్చు ఆయ‌న‌కు జ్వ‌రం వ‌చ్చింది. షుగ‌ర్ లెవెల్స్ పెరిగాయి. ఆక్సిజ‌న్ లెవెల్స్ పడిపోయాయి. అస్వ‌స్థ‌త‌కు గురైన ఈట‌ల నడవలేని స్థితిలో ఉండటంతో పాదయాత్రను అర్థాంత‌రంగా నిలిపివేశారు. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు వెంట‌నే హైద‌రాబాద్ త‌ర‌లించారు. ఈటల అనారోగ్యం పాలవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.   ఈట‌ల పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డ‌టంతో.. ఇక ఈట‌ల ప‌ని అయిపోయింద‌ని.. ఇక‌పై పాద‌యాత్ర ఉండ‌బోద‌ని.. పాద‌యాత్ర చేయ‌లేకే ఇలా డ్రామా చేశార‌ని.. ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చాలా వ‌ర‌కూ నెగ‌టివ్ న్యూస్ స‌ర్క్యూలేట్ అవుతుండ‌టంతో.. త‌న పాద‌యాత్ర‌పై ఈట‌ల‌నే క్లారిటీ ఇచ్చారు. ఆ మేర‌కు ట్విటర్‌లో అప్‌డేట్ ఇచ్చారు.  ‘‘ 12 రోజులుగా, 222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతిక్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి. కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజాదీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్లీ పునఃప్రారంభం అవుతుంది. ఆగిన చోటు నుంచే అడుగులు మొదలవుతాయి. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజాదీవెన యాత్రతో వస్తా’’ అంటూ ఈట‌ల‌ ట్వీట్ చేశారు. సో.. పాద‌యాత్ర‌కు తాత్కాలిక విరామం మాత్ర‌మే. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ పాద‌యాత్ర ఆగిన చోటు నుంచే కంటిన్యూ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు ఈట‌ల రాజేంద‌ర్‌. 

జ‌గ‌న్ స‌ర్కారుకు షాక్‌.. అక్రమ మైనింగ్‌పై ఎంక్వైరీ...

గ‌ద్దెనెక్కిన‌ప్ప‌టి నుంచీ దోచుకోవ‌డ‌మే ప‌ని. ఇసుక నుంచి మ‌ద్యం వ‌ర‌కూ అన్నింటా దోపిడీనే. ప్ర‌కృతి వ‌న‌రుల‌పై ప‌గ బ‌ట్టిన‌ట్టు మ‌రీ కొల్ల‌గొడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇసుక త‌వ్వ‌కాల‌తో వైసీపీ నేత‌లు కాసులు దండుకుంటున్నారు. లేట‌రైట్‌, బాక్సైట్‌.. ఇలా ఏ ఒక్క ఖ‌నిజాన్ని వ‌ద‌ల‌కుండా త‌వ్వుకుంటున్నారు. అక్ర‌మ మైనింగ్‌పై ప్ర‌శ్నిస్తే దాడులు, కేసుల‌కు తెగ‌బ‌డుతున్నారు. కొండ‌ప‌ల్లిని కొల్ల‌గొడుతున్న తీరును వెలుగులోకి తీసుకొచ్చినందుకే మాజీ మంత్రి దేవినేని ఉమా మీద అంత దౌర్జన్యానికి దిగారు. కేవ‌లం కొండ‌ప‌ల్లి అనే కాదు.. విశాఖ మ‌న్యంలోనూ జోరుగా అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అదంతా వైసీపీ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కేవ‌లం విమ‌ర్శ‌లే కాదు.. కొండ్లు మ‌రీద‌య్య అనే అత‌ను ఏకంగా జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్‌లో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఫ‌లితంగా.. విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్‌పై విచారణ కమిటీ ఏర్పాటవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  విశాఖ మ‌న్యం మైనింగ్‌పై విచార‌ణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్‌ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధరణకు వచ్చింది. వేల చెట్లు కూల్చి రోడ్డు వేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. అనుమతించిన పరిధి దాటి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్‌ చేశారని గుర్తించింది. అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది.  కమిటీలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు, విశాఖ కలెక్టర్‌ సభ్యులుగా ఉండనున్నారు. అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతంలో పర్యటించి మైనింగ్‌ అనుమతులు, పరిధి, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్‌పై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. క‌మిటీ ఏర్పాటుతో వైసీపీ నాయ‌కుల్లో వ‌ణుకు మొద‌లైంది.   వైసీపీ మైనింగ్ మాఫియా పునాదులు క‌దులుతున్నాయ‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అన్నారు. లేట‌రైట్ ముసుగులో బాక్సైట్ త‌వ్వుతున్న సీఎం జ‌గ‌న్ బంధువుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయ‌ని విమ‌ర్శించారు.  గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన జగన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గర్లో ఉంది. బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ అండ్ కో తో పాటు మన్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కి సహకరించిన అధికారులు కూడా ఈ సారి చిప్పకూడు తినడం ఖాయమ‌న్నారు నారా లోకేశ్.

వైసీపీకి సీబీఐ ఉచ్చు.. సోష‌ల్‌మీడియా కేసులో అరెస్టులు..

నోటికొచ్చిన‌ట్టు కూశారు. చేతికొచ్చిన‌ట్టు రాశారు. అధికారమే మాది.. మ‌మ్మ‌ల్ని ఎవ‌రు అడిగేది అనుకున్నారు. పాల‌కుల సైగ‌తో మ‌రింత రెచ్చిపోయారు. టీడీపీని తిట్టిన‌ట్టు.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై నోరు పారేసుకున్నారు. జ‌డ్జిమెంట్ జ‌గ‌న్ స‌ర్కారుకు అనుకూలంగా రాలేద‌నే అక్క‌సుతో.. న్యాయ‌మూర్తుల‌పై సోష‌ల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెట్టారు. జ‌డ్జిల‌ను కించ‌ప‌రిచారు. జ్యుడీషియ‌ల్ సిస్ట‌మ్‌ను బ‌ద్నామ్ చేశారు. న్యాయ‌వ్య‌వ‌స్థ క‌న్నెర్ర చేయ‌డంతో.. చేసిన త‌ప్పుకు ఇప్పుడు అనుభ‌విస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై జ‌రుగుతున్న‌ సీబీఐ దర్యాప్తు మ‌రింత‌ వేగం పుంజుకుంది. న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను దూషించిన కేసులో సీబీఐ వేగంపెంచింది. ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు సీబీఐ నోటీసులిచ్చింది. తాజాగా, ఈ కేసులో మ‌రో ఇద్ద‌రిని అరెస్ట్ చేసింది. మ‌రోవైపు విచారణకు రావాలని వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దేవేందర్‌రెడ్డిని సీబీఐ ఆదేశించింది. ఈ దేవేంద‌ర్‌రెడ్డినే వైసీపీకి చెందిన అన్ని గ్రూపుల‌ను డైరెక్ట్ చేస్తారంటారు. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే సోష‌ల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతుంటాయని చెబుతారు. ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీ మీద సెటైర్లు వేయ‌డం.. వాటిని వైర‌ల్ చేయ‌డం ఈ గ్రూపుల ప‌ని. చంద్ర‌బాబు, లోకేశ్ టార్గెట్‌గా అభ్యంత‌క‌ర పోస్టులు పెట్టేదీ వీరే. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చే వార్త‌ల‌ను స్క్రుటినీ చేసి అధినేత‌కు నివేదిక‌లు స‌మ‌ర్పిస్తుంటారు. వీరి ఇన్ఫ‌ర్మేష‌న్ మేర‌కే ప్ర‌భుత్వ వ్య‌తిరేక పోస్టులపై కేసులు పెడుతుంటారు. ఆ అల‌వాటు ప్ర‌కార‌మే.. ముందు వెన‌కా ఆలోచించ‌కుండా అప్ప‌ట్లో హైకోర్టు తీర్పును త‌ప్పుబ‌డుతూ తెగ పోస్టులు పెట్టారు. జ‌డ్జిల‌పై నిందారోప‌ణ‌లు చేశారు.  క‌ట్ చేస్తే.. హైకోర్టు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో కించపర్చే పోస్టులను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. కేసు విచారణను ఏకంగా సీబీఐకి అప్పగించడం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాలతో 16 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖలో 12 మంది, ఇతర ప్రాంతాల్లో నలుగురిపై సీబీఐ కేసు పెట్టింది. సీబీఐ త‌న‌ నివేదికను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించింది. తాజాగా, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దేవేందర్‌రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించ‌డం, మ‌రో ఇద్ద‌రిని అరెస్ట్ చేయ‌డంతో సీబీఐ ఉచ్చు బిగుస్తున్న‌ట్టే ఉంది.   

ఏపీ-తెలంగాణ‌లో డెల్టా ప్లస్ కేసులు.. అప్ర‌మ‌త్తం చేసిన కేంద్ర స‌ర్కారు..

సెకండ్ వేవ్ చూసాంగా.. ఏ రేంజ్‌లో అడుకుందో. పొంచి ఉన్న థ‌ర్డ్ వేవ్‌కు అదొక శాంపిల్ మాత్ర‌మే అంటున్నారు. మూడో ముప్పు మామూలుగా ఉండ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. సెకండ్ వేవ్ విజృంభ‌ణ‌కు డెల్టా వేరియంటే కార‌ణం. డెల్టానే ఇలా ఉంటే.. ఇక మ‌రింత రాటుదేలిన‌ డెల్టా ప్ల‌స్ వేరియంట్ ఇంకెంత డేంజ‌ర్‌గా ఉండాలి? అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా ప్ల‌స్ వైర‌స్ ర‌కం తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూడ‌టం ఆందోళ‌న క‌లిగించే ప‌రిణామం. ప్ర‌స్తుతం బ‌య‌ట‌ప‌డింది రెండు కేసులే అయినా.. చాప‌కింద నీరులా ఆ వేరియంట్ ఎలా వ్యాపిస్తుందోన‌నే టెన్ష‌న్ వైద్య నిపుణుల‌ను, ప్ర‌భుత్వాల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది.  తెలంగాణ, ఏపీలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నెల 23 వరకు దేశ వ్యాప్తంగా ఈ రకం కేసులు 70 వెలుగుచూడగా.. తెలంగాణలో 2, ఏపీలో 2 చొప్పున నమోదైనట్టు తెలిపింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల్లో చేసిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ లోక్‌సభకు చెప్పారు.  నమూనాల్లో 4,172 ఆల్ఫా వేరియంట్‌, 217 బీటా, ఒకటి గామా వేరియంట్‌ ఉన్నట్టు చెప్పారు. జులై 23 వరకు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 70 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయన్నారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 23 కేసులు రాగా.. మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10, చండీగఢ్‌లో 4, కేరళ, కర్ణాటకలలో మూడు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో రెండేసి కేసులు చొప్పున నమోదు కాగా.. ఉత్తరాఖండ్‌, హరియాణా, జమ్మూ, రాజస్థాన్‌, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒక్కో కేసు నమోదయ్యాయని మంత్రి జితేంద్ర‌సింగ్ లోక్‌స‌భ‌కు తెలిపారు.  SARS-CoV2కు చెందిన 58,240 నమూనాలను సీక్వెన్సింగ్‌ చేసి.. 46,124 శాంపిల్స్‌ను విశ్లేషించినట్టు వివరించారు. ఈ శాంపిల్స్‌లో అత్యధికంగా 17,169 డెల్టా వేరియంట్‌ కేసులే ఉన్నట్టు తెలిపారు. లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు.  

1000 మంది ప్రైవేట్ లెక్చరర్ల పోటీ ? హుజురాబాద్ లో నిజమాబాద్ సీన్.. 

ఎక్కడి వారణాసి ఎక్కడి నిజామాబాద్.. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి నామినేషన్లు వేయడం ఏమిటి? అది కూడా  ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా ఓ 50 మంది వరకు  ఊరు కానీ ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి, అక్కడి నుంచి లోక్ సభకు పోటీచేయడం ఏమిటి? ఏంటి, గెలుద్దామనే, లేదు, గెలవాలన్న ఆశే కాదు అలాంటి ఆలోచన కూడా లేదు. అయినా, నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు, ఎర్ర జొన్న రైతులు 2019 లోక్ సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్’లోని వారణాసి నుంచి నామినేషన్లు వేశారు. అందుకు కారణం, ఆ నియోజక వర్గం నుంఛి పోటీ చేస్తున్న ప్రధాని  నరేంద్ర మోడీకి  నిజామాబాద్’లో  పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న తమ గోడు వినిపించుకోవడమే.. అందుకోసమే కట్టకట్టుకుని వెళ్లి అక్కడ నామినేషన్ వేశారు. నిజామాబాద్ రైతులకు  మద్దతుగా తమిళనాడు రైతులు  కూడ  వారణాసిలో  నామినేషన్లు దాఖలు చేశారు. రైతులు  తమ డిమాండ్‌ను  దేశ వ్యాప్తంగా తెలిపేందుకు ఇలా వారణాసిలో నామినేషన్లు దాఖలు చేశారు. అదే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేసిన నిజమాబాద్ లోక్ సభ స్థానం నుంచి కూడా 178 రైతులు నామినేషన్ వేశారు. అంతే కాదు కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసి గుర్తులు తెచ్చుకున్నారు. నిజామబాద్ నుంచి మొత్తం 185 మంది  పోటీకి దిగితే అందులో పార్టీల తరపున పోటీలో నిలిచింది ఏడుగురు, మిగిలిన 178 పసుపు రైతులే ఉన్నారు. ఈ నిరసన నామినేషన్ల వలన ప్రయోజనం కలిగిందా, అంటే, పూర్తి ప్రయోజనం జరగలేదు, కానీ, కొద్దిపాటి ప్రయోజనం అయితే జరిగింది. ముఖ్యమంత్రి కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఓడిపోయారు. బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ గెలిచారు. అధికార పార్టీ సభ్యుడిగా ఆయన కింద మీద పడి,నిజామాబాద్‌ కేంద్రంగా తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ మండలి (స్పెసిస్ రీజినల్ బోర్డు) ఏర్పాతు చేయించారు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, అన్నట్లుగా రైతులు సర్దుకున్నారు.     ఇప్పుడు ఇటు అధికార తెరాస పార్టీకి, మరీ ముఖ్యంమంత్రి కేసీఆర్ సార్’కి అలాగే మాజీ మంత్రి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’కు మెడ మీద కత్తిలా వేళ్ళాడుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికలలో, రాష్ట్ర ప్రభుత్వ అన్యాయ పోకడలకు వ్యతిరేకంగా వివిధ వర్గాల ప్రజలు మూకుమ్మడి నామినేషన్’కు సిద్దమవుతున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌లో తాము పోటీ చేస్తామంటూ 1000 మంది ఫీల్ట్ అసిస్టెంట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారిని విధుల నుంచి తొలగించినందుకు నిరసనగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. అలాగే, ఇప్పుడు తాజాగా, ఉ‌ ఎఎన్నికల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ గోడు వినిపించేందుకు వంద మంది ప్రైవేట్ లెక్చరర్లు పోటీ చేస్తారని తెలంగాణ లెక్చరర్ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ మనోహర్ ప్రకటించారు.ఒక్క ప్రైవేటు లెక్చరర్లు మాత్రమే కాదు, ప్రైవేట్ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రైవేట్ లెక్చరర్లు పోటీ చేస్తారని మురళీ మనోహర్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు స్కూల్ టీచర్లకు నెలకు రూ.2వేల నగదు, రేషన్ బియ్యం సహాయం అందించిని తెలంగాణ సర్కారు ప్రైవేట్ లెక్చరర్లకు మాత్రం మొండి చేయి చూపించిందని మురళీ మనోహర్ ఆరోపించారు. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు నెలకు రూ.10 వేల చొప్పున ప్రైవేట్ అధ్యాపకులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే హుజురాబాద్‌లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.మరి దళిత బంధు సీఎం, ఉద్యోగ బంధు, ఉపాధ్యాయ బంధు అవుతారో ..లేదో చూడాలి..

జ‌గ‌న్ త‌ర్వాత‌ విజ‌య‌సాయినే టార్గెట్‌.. మ‌రో కేసుతో ర‌ఘురామ దూకుడు..

ర‌ఘురామ ఫుల్ ఖుషీగా ఉండి ఉంటారు. ఆగ‌స్టు 25 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. జ‌గ‌న్‌కు గుండె ద‌డ‌ పెరిగి ఉంటుంది. ఆగ‌స్టు 25 వ‌స్తుందంటేనే ఆయ‌న‌లో ఉత్కంఠ పెరిగిపోతుంటుంది. ఒకే డేట్‌. ఆ ఇద్ద‌రిలో వేరు వేరు వేరియేష‌న్స్‌. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై సీబీఐ కోర్టు తీర్పు వెలువ‌రించే రోజు. ఎన్నాళ్లో వేచిన ఆ ఉద‌యం.. అతి త్వ‌ర‌లోనే ఆవిష్కృతం కాబోతోంది.  ఆర్థిక నేరాలు, అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని.. అందువల్ల బెయిల్ రద్దు చేయాలని గ‌తంలో హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రఘురామ‌. ఈ అనూహ్య ప‌రిణామంతో జ‌గ‌న్ షాక్‌కు గుర‌య్యారు. రెండేళ్లుగా బిందాస్‌గా ఉన్నా.. స‌డెన్‌గా త‌న బెయిల్ ర‌ద్దు చేయ‌మంటే ఎలా? అంటూ ఉలిక్కిప‌డ్డారు.  అటు, ర‌ఘురామ చెప్పిన కార‌ణాలు, చూపిస్తున్న సాక్షాలు ప‌క్కాగా ఉండ‌టంతో.. జ‌గ‌న్ ఇర‌కాటంలో ప‌డ్డారు. అందుకే ఇటు జ‌గ‌న్ త‌ర‌ఫు లాయ‌ర్లు.. అటు సీబీఐ న్యాయ‌వాదులు ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాల‌తో రెండు మూడు నెల‌లు ప‌బ్బం గ‌డుపుకున్నారు. కానీ, ఎన్నిసార్ల‌ని వాయిదాలు అడుగుతారు? ఎన్నిసార్లు అని కోర్టు వాయిదాలు వేస్తుంది? జ‌డ్జిమెంట్ ఇచ్చే రోజు రానేవ‌చ్చింది..  ఆగ‌స్టు 25న ముహూర్తం ఫిక్స్ అయింది. బెయిల్ ర‌ద్దు నిర్ణ‌యాన్ని సీబీఐ కోర్టుకే వ‌దిలేయ‌డంతో కేసు క్లైమాక్స్‌కు చేరింది. సీబీఐ ఎక్క‌డా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయ‌వ‌ద్దు అని అన‌లేదు. ఆయ‌న బెయిల్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డం లేద‌నీ చెప్ప‌లేదు. సో, మౌనం అర్థ అంగీకారం అన్న‌ట్టే అనుకోవాలా? బెయిల్ ర‌ద్దుపై సీబీఐ జోక్యం చేసుకోలేదంటే.. కోర్టు విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేసిందంటే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు త‌ప్ప‌దా? మ‌ళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.  కేసు వేసిన‌ ర‌ఘురామ మాత్రం 100% జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని ధీమాగా ఉన్నారు. జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు అయి జైలుకెళ్లాక‌.. ఇక విజ‌య‌సాయిరెడ్డి ప‌ని ప‌డ‌తానంటూ స‌వాల్ చేస్తున్నారు. విదేశాలకు పారిపోయేందుకు ఏ2 చూస్తున్నారని, మ‌రో 2 రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని రఘురామ ప్రకటించి కలకలం రేపారు. ర‌ఘురామ అన్నారంటే అన్నంత ప‌ని చేస్తారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. కోర్టులో గ‌ట్టిగా నిల‌బ‌డి.. త్వ‌రిత‌గ‌తిన విచార‌ణ జ‌రిగేలా చేసి.. ఆగ‌స్టు 25న తీర్పు వ‌చ్చేలా చేశారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌నే.. ర‌ఘురామ దూకుడును త‌ట్టుకోలేక‌పోతే.. ఇక సాధార‌ణ ఎంపీ అయిన విజ‌య‌సాయిరెడ్డి.. ర‌ఘురామ ముందు ఇంకేం నిల‌బ‌డ‌తాడు? ఆయ‌న సృష్టించే సునామీలో కొట్టుకుపోవ‌డం ఖాయం అంటున్నారు. జ‌గ‌న్ బెయిల్ రద్దు అయితే.. విజ‌య‌సాయిని సైతం మ‌ళ్లీ జైలుకి సాగ‌నంపితే.. వైసీపీ స‌ర్కారు కుప్ప‌కూల‌డం త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు. మొక్కే క‌దాని పీకేస్తే.. పీక కోసేలా ఉన్నాడంటూ ర‌ఘురామను త‌లుచుకొని నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నార‌ట జ‌గ‌న్ అండ్ విజ‌య‌సాయి.   

మద్యం డబ్బుల కోసం.. కన్నబిడ్డల్నే అమ్మేసిన దంపతులు.

రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే.. బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే.. తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు. పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు. ఈ ప్రపంచంలో అన్ని మనిషి చుట్టూ తిరిగితే మనిషి మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. మనుషులు వారి అలవాట్లు తీర్చుకోవడానికి డబ్బులు కావలి అలాగే ఆ డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా మద్యానికి బానిసైన భార్యభర్తలు డబ్బుల కోసం ఇద్దరు బిడ్డల్ని అమ్ముకున్న దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మూడో బిడ్డను కూడా అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నించగా బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఊటీ కాందల్‌ భగవతి అమ్మవారి ఆలయ వీధికి చెందిన రాబిన్‌ (29), మోనీషా (26) కొన్నా్ళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొద్ది నెలలుగా దంపతులిద్దరూ మద్యానికి బానిసయ్యాడు. ఆ మద్యానికి బానిసై మద్యం మత్తులో దొరికిన చోటల్లా అప్పులు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూడా కూలిపోయింది. అప్పటి నుండి కుటుంబ పోషణ భారమైంది. ఇక ఆ తల్లిదండ్రులు చేతులు ఎత్తేశారు. పిల్లల్ని పోషించలేక మూడేళ్ల వయసున్న పెద్ద కుమార్తెను మోనీషా సోదరి ప్రవీణకు అప్పగించారు. రాబిన్‌ మిత్రుడి సాయంతో తిరుప్పూర్‌కు చెందిన నిసార్‌బాయ్‌కి రెండో కుమార్తెను(18 నెలలు) రూ.25 వేలకు విక్రయించారు. కుమారుడి (3 నెలలు)ని సేలం ప్రాంతానికి చెందిన భూపతి-ఉమామహేశ్వరి దంపతులకు ఏకంగా రూ.30 వేలకు అమ్మారు. ఈ క్రమంలో పెద్ద కుమార్తెను కూడా విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రవీణ వద్దకెళ్లి తమ బిడ్డను ఇచ్చేయాలని గొడవకు దిగారు. దీంతో ఆమె ఆమె పిల్లల సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాబిన్ దంపతులను విచారించగా మిగిలిన ఇద్దరు పిల్లలని అప్పటిక విక్రయించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రాబిన్ దంపతులతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. 

వీ వాంట్‌ గోల్డ్.. ట‌ఫ్ ఫైట్‌లో నెగ్గిన సింధు..

గ‌త ఒలింపిక్స్‌లో వెండి వెలుగులు. ఈసారి ఏకంగా స్వ‌ర్ణ 'సింధు'రం సాధ్యం కావొచ్చు. ఒలింపిక్స్‌లో భార‌త టాప్ షట్ల‌ర్ పీవీ సింధు జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో అత్యంత ట‌ఫ్ ఫైట్‌ను దాటేసింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఆ మ్యాచ్‌లో య‌మ‌గుచిపై గెలిచి.. సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఫైన‌ల్ వ‌ర‌కూ ఈ దూకుడు ఇలానే కంటిన్యూ అయితే.. ఈసారి పీవీ సింధు మెడ‌లో స్వ‌ర్ణ ప‌త‌కం వ‌చ్చి చేరొచ్చు. తాజాగా ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో పీవీ సింధు జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. మరోసారి భారత్‌కు పతకం దాదాపు ఖాయం చేసింది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన సింధు.. రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. రెండో గేమ్‌ తొలి విరామానికి సింధు 11-6తో ఆధిపత్యం సాధించింది. విరామం తర్వాత యమగుచి గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో ఇద్దరి పాయింట్లు సమానంగా నిలిచాయి. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్‌లో 22-20తో సింధు నెగ్గింది . వరుస గేమ్‌లలో గెలిచిన సింధు సెమీస్‌కు చేరింది. య‌మ‌గుచి అడ్డు తొల‌గిపోవ‌డంతో.. ఇక చైనా ష‌ట్ల‌ర్ల‌కు చెక్ పెడితే స‌రి.   

16 ఏళ్ళ అమ్మాయిపై 6 నెలలుగా.. 5 మంది యువకులు అత్యాచారం..

దేశంలో రోజురోజుకు ఎక్కడ చూసిన మహిళల ఆవేదనలు.. ఆక్రందన.. మహిళలపై , చిన్న చిన్న బాలికలపై వరసలు లేవు.. కూతురుని చెరబట్టిన తండ్రి.. స్నేహితురాలిని వేధించిన ఫ్రెండ్.. అక్కకు గర్భం చేసిన తమ్ముడు.. ఆఫీస్ లో బోస్  లైంగిక వేధింపులు.. ఇలా అన్ని రకాలుగా ఆడవాళ్లు వంచనకు గురవుతూనే ఉన్నారు.. వారిపై  దాడులు  రోజు రోజుకి పెరుగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు, జీవోలు తీసుకువచ్చినా దుర్మార్గాలు శిక్షలు పడిన నిత్యం మహిళలపై ఎదావిదిగా దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై  ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  6నెలల పాటు ఆ ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమె నగ్నంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. 6 నెలలు నరకం చూసిన ఆ అమ్మాయి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని అనుకుంది అందుకే నోరు మెదపలేదు. చివరకు ధైర్యం చేసుకొని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్‌పై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అత్యాచారం ఘటనను వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను ఎదావిదిగా అతడి స్నేహితులకు పంపించాడు. అదే అదును అనుకున్న ఆ అబ్బాయి ఫ్రెండ్స్ తమ దగ్గర ఉన్న వీడియో వైరల్ చేస్తామని సదరు బాలికను భయపెట్టి ఐదుగురు యువకులు కలిసి  6 నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే అత్యాచారం చేసిన వీడియోలను బయట పెడతామని హెచ్చరించారు. ఈ బాధలను భరించలేక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులు ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆ ఘటన మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్‌ లో చోటు చేసుకుంది.    రాత్రి విందుకు పిలిచి.. అశ్లీలంగా వీడియోలు తీసి.. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా. అనే పుస్తకాలూ చూసే ఉంటారు.. అలాగే  30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చూసే ఉంటారు. ఐతే ఇది ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థం ఐంది. ప్రజల మైండ్ లో కూడా అన్ని చాలా తొరగా జరిగిపోవాలి.. ఇలా అనుకుంటే అలా జారిపోవాలి. అనే మైండ్ సెట్ తో ఉన్నారు ప్రజలు అన్నింటికంటే ముందు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలని ఆలోచిస్తుంటారు.. అందుకోసం ఈజీగా డబ్బులు సంపాదించుకునేందుకు కొంత మంది యువతులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హనీట్రాప్ కేసులు బయటకు వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే కర్నాటకలోని మంగుళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంగుళూర్‌లోని ఉళ్లాల ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సప్నా, అఫ్రీన్ అనే యువతులు నివాసం ఉంటున్నారు. వారి పక్క ఫ్లాట్‌లో ఓ వ్యాపారవేత నివస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న సదరు వ్యాపారవేత్తను యువతులు రాత్రి భోజనానికి పిలిచారు. అంతకుముందు అతనితో పథకం ప్రకారం పరిచయం పెంచుకున్నారు. ఆ రోజున అతడు విందుకు రాగానే మద్యం తాగించి రూ.2.12 లక్షలు నగదు, బంగారు అభరణాలను దోచుకున్నారు. మత్తులో ఉన్న అతనితో సప్నా అశ్లీలంగా వీడియోలు, ఫోటోలను తీసుకుంది. మరుసటి రోజు తేరుకున్న వ్యాపారవేత్త తన డబ్బు, నగలను ఇవ్వాలని కోరగా, అశ్లీల వీడియోలను విడుదల చేస్తామని బెదిరించారు. ఒక్కసారిగా షాకైన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారవేత్త ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇద్దరు యువతులనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కాంగ్రెస్ గూటికి పీకే .. ఇక మోడీకి మూడినట్లేనా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? ప్రతి పక్షాలను ఏకంచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నడుం బిగిస్తున్నారా ?  గత కొంత కాలంగా ఆయన కాలికి బలపం కట్టుకుని దేశం చుట్టివస్తున్నది అందుకేనా? అంటే అవుననే అంటున్నారు, కాంగ్రెస్ కీలక నేతలు, మీడియా విశ్లేషకులు. నిజానికి జూలై 13వ తేదీన ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాతో సమావేశమైన సందర్భంలోనే, ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్త మీడియాలో షికార్లు చేసింది. సుమారు మూడు గంటల పాటు రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అయితే  అప్పట్లో ఇటు కాంగ్రెస్ నాయక త్రయం కానీ అటు పీకే కానీ, దానిపై పెదవి విప్పలేదు. వ్యూహాత్మకంగా  ఊహాగానలకు వదిలేశారు.  అయితే, ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ. పీకేని పార్టీలోకి తీసుకునే అంశం పై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ఏకే అంటోనీ, మల్లిఖార్జున ఖర్గే, కమల్ నాథ్, అంబికా సోనీ, హరీష్ రావత్, కేసీ వేణుగోపాల్ సహా మరి కొందరితో, సుదీర్ఘంగా చర్చించారు. ఒక విధంగా మేథోమథనం సాగించారన్న వార్త  మీడియాలో హాట్ హాట్’గా షికారు చేస్తోంది. అయితే, నిజానికి ఇది కూడా పాచి వార్తే .. ఈ సమావేశం జరిగింది నిన్ననో మొన్ననో కాదు, జూలై 22 న అంటే సుమారు వారం రోజుల క్రితం కీలక నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పీకేను పార్టీలోకి తీసుకుంటే వొనగూరే లాభనష్టాలు, ఒక వేళ పీకేను పార్టీలోకి తీసుకుంటే, ఆయనకు ఏ బాధ్యత ఇవ్వాలనే విషయంలో లోతుగా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలంతా  సహజంగానే, పీకే పార్టీలో చేరితే పార్టీకి ప్రయోజనం ఉంటుందని, ఆయన వస్తానంటే, వెల్కమ్ చెపుదామని తీర్మానించారు.  ఇందుకు సంబంధించి ఎలాంటి అధికార సమాచారం లేదు. పది రోజుల నాడు జరిగిన సమావేశానికి సంబంధించిన వార్తను మీడియా ఇప్పుడు వండి వార్చి లేదా మళ్ళీ వేడి చేసి వడ్డించింది. అయితే, అప్పుడు ఎందుకు మీటింగ్ వ్యవహారానని, రహస్యంగా ఉంచారు, ఇప్పుడెందుకు లీక్ చేసారు అనేది మనం అడగరాదు. దీన్నేపీకే స్ట్రాటజీ,అంటారు. నిజానికి ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, ఇక ఎలక్షన్ స్ట్రాటజీ ప్రొఫెషన్’కు గుడ్ బై చెప్పేస్తున్నానని చెప్పు కొచ్చారు. అలాగే, రాజకీయాలోకి రానని కూడా అంతే గట్టిగా చెప్పారు. “ఒక సారి జనతాదళ్ (యూ) లో వేలు పెట్టి చేయి కాల్చుకున్నాను, మళ్ళీ మరోమారు అదే తప్పు చేయను. రాజకీయాలకు నేను పనికిరాను” అని పీకే స్వీయ ప్రకటన చేశారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్లను,ఇంతలోనే గట్టున పెట్టేశారు. సో .. ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు పొలిటీషియన్ కాలేడు, అన్న గిరీశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, పీకే భవిష్యత్’లో ఉత్తమోత్తమ రాజకీయ నాయకుడు అవుతారు.కాలం ఖర్మం కలిసొస్తే, పీకీ ... పీఎం కూడా అవుతారు.    ఇక మోడీని ఓడించడమే ఎజెండాగా సాగే ఏకతా యత్నాల వలన ప్రయోజనం ఉండదని, మోదీ వ్యతిరేకత’ అన్న ఒకే ఒక అంశంతో ప్రతిపక్ష కూటమి సఫలీకృతం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పెదవి విరిచారు. ప్రతిపక్ష పార్టీలకు  కనీస ఉమ్మడి కార్యక్రమం అవసరమని కూడా ఆయన సూచించారు.అలాగే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అన్నిటికంటే, కుర్చీ ఎవరిదీ? కిస్సా కుర్సీకా? అనేదే అతి పెద్ద సమస్య అని కూడా మొయిలీ ముందుగానే హెచ్చరించారు.అలాగే, మరో సీనియర్ నాయకుడు, ప్రశాంత్ కిశోర్ పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా చివరకు ఆయనే, కుర్చీ ఎక్కుతారేమో ... అన్న చిన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. అందుకే విశ్లేషకులు ఏమో చివరకు ఏమవుతుందో .. చూడాలి అంటున్నారు .. చూద్దాం.మొత్తానికి మోడీని ఓడించడమే ఎజెండాగా పీకే దర్శకత్వంలో నడుస్తున్న డ్రామా బానే రక్తి కడుతోంది

జేసీ మొన‌గాడురా బుజ్జా.. తాడిప‌త్రిపై మ‌రోసారి టీడీపీ జెండా..

తొడ‌కొట్టారు. ఇంటిపైకి దాడికొచ్చారు. కేసుల‌తో కుట్ర‌లు చేశారు. బ‌స్తీ మే స‌వాల్ అంటూ మీసం మెలేశారు. ఇంత‌ ఓవ‌రాక్ష‌న్ చేసినా.. జేసీ బ్ర‌ద‌ర్ ముందు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పప్పులేమీ ఉడ‌క‌లేదు. తాడిప‌త్రిలో జేసీ ఫ్యామిలీకి, టీడీపీకి తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించారు. ఉత్కంఠ రేపిన తాడిప‌త్రి మున్సిపాలిటీ రెండో వైస్ ఛైర్మ‌న్ ప‌ద‌వి కూడా తెలుగుదేశం ఖాతాలోనే ప‌డింది. కౌన్సిల్ హాల్‌కు వెళ్ల‌కుండానే.. ఇంట్లో కూర్చొని చ‌క్రం తిప్పారు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి. తాడిప‌త్రిలో త‌న‌కు తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించారు. వైసీపీ శ్రేణుల‌కు, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ ఇచ్చారు.  ఏపీ వ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగితే.. ఒక్క తాడిప‌త్రిలోనే టీడీపీ జెండా ఎగిరింది. అది జేసీ కుటుంబం స‌త్తాకి నిద‌ర్శ‌నం. టీడీపీని ఎలాగైనా దెబ్బ‌కొట్టి.. తన పట్టు నిలుపుకోవాలని తెగ ట్రై చేశారు MLA పెద్దారెడ్డి. తాడిప‌త్రి పీఠం కోల్పోయిన‌ప్ప‌టి నుంచీ ధూంధాం చేశారు. ఏకంగా జేసీ ఇంటిపైకే దాడికి వ‌చ్చారు పెద్దారెడ్డి అండ్ గ్యాంగ్. అప్ప‌టి నుంచీ ఆ రెండు వ‌ర్గాల మ‌ధ్య నువ్వా-నేనా అన్న‌ట్టు పొలిటిక‌ల్ వార్ న‌డుస్తోంది. తాజాగా, తాడిప‌త్రి మున్సిపాలిటీ రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నికల‌పై ఉత్కంఠ, ఉద్రిక్త‌త మ‌రింత పెరిగింది. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. టీడీపీ స‌భ్యుల‌తో పాటు త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న క‌మ్యూనిస్టు అభ్య‌ర్థి, ఇండిపెండెంట్ కేండిడేట్‌తో ప్ర‌త్యేక‌ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక టీడీపీదే విజ‌యమ‌ని భావించిన వైసీపీ.. వైస్ ఛైర్మ‌న్ ఎన్నికకు గైర్హాజరు కావడంతో విజ‌యం టీడీపీ ఖాతాలో పడింది.  తాడిపత్రిలో టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ TDPకే మద్దతు ఇచ్చారు. దీంతో TDP బలం 20కి పెరిగింది. YCPకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వైసీపీ గైర్హాజరుతో ఎలాంటి నెంబర్‌ గేమ్‌ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్‌ చైర్మన్‌ అయ్యారు. వైసీపీపై టీడీపీది మ‌రోసారి పైచేయి సాధించింది. తాడిప‌త్రిలో జేసీ ఫ్యామిలీకి ఎదురులేద‌ని రుజువైంది.   

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు?.. ఆగ‌స్టు 25న సీబీఐ కోర్టు జ‌డ్జిమెంట్..

ర‌ఘురామ ఎన్నాళ్లో వేచిన ఉద‌యం. ఆగ‌స్టు 25న ఆవిష్కృతం కాబోతోంది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసులో ఆ రోజు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వ‌నుంది. ఇన్నాళ్లూ వాయిదాల ప‌ర్వంతో నెట్టుకొచ్చిన జ‌గ‌న్‌.. ఇప్పుడిక లాక్ అయ్యారు. సీబీఐ సైతం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో తీర్పుకు ముహూర్తం ఫిక్స్ అయింది.  జగన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ మరోసారి సమయం కోరింది. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. సీబీఐ లాయ‌ర్ల అభ్య‌ర్థ‌న‌ను ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది వ్య‌తిరేకించారు. మరింత సమయం ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.  ఇక్క‌డే సీబీఐ న్యాయ‌వాది వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. బెయిల్ ర‌ద్దు అంశంలో కోర్టు విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో విచారణ ముగిసిందని, ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై సీబీఐ మొద‌టి నుంచి అర‌క‌త్త‌ర‌లో పోక‌చెక్క‌లా మారింది. బెయిల్ ర‌ద్దు చేయాలంటూ నేరుగా రాసివ్వ‌లేక‌పోయింది. అలాగ‌ని బెయిల్ కొన‌సాగించానీ చెప్ప‌లేని ప‌రిస్థితి. ర‌ఘురామ పూర్తి సాక్షాధారాల‌తో సీబీఐని ఏదో ఒక నిర్ణ‌యం చెప్పేలా చేసేందుకు బాగా ట్రై చేశారు. కానీ, సీబీఐ ఎప్ప‌టిక‌ప్పుడూ త‌ప్పించుకుంటూ వ‌చ్చింది. ఈసారి కూడా మ‌రో వాయిదా కోరింది. కానీ, ర‌ఘురామ లాయ‌ర్‌, కోర్టు అందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కోర్టు విచ‌క్ష‌ణ మేర‌కే నిర్ణ‌యం తీసుకోవాలంటే సీబీఐ న్యాయ‌వాది హ్యాండ్స‌ప్ అన్నారు. దీంతో.. కేసు విచార‌ణ ముగిసింద‌ని.. ఆగ‌స్టు 25న తుది తీర్పు వెల్ల‌డిస్తామ‌ని సీబీఐ కోర్డు స్ప‌ష్టం చేసింది. బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉండ‌టంతో.. సీఎం జ‌గ‌న్‌కు ఇక‌ ద‌బిడి దిబిడే.  

10 వేలు ఇవ్వని దొర.. 10 లక్షలు ఇస్తడా? 

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం విమర్శల సుడిగుండంలో చిక్కుకుంటోంది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఆ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు. దీంతో దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త పథకం తెచ్చారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళిత బంధు స్కీం, సీఎం కేసీఆర్ ప్రకటనలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లు ఎదురుచూసినా రాష్ట్రంలోని పేద‌ల‌కు రూ.10 వేల రుణం కూడా  ఇవ్వ‌ని పాల‌కుడు.. ఇప్పుడు ఉప ఎన్నిక ఉండ‌డంతో ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌ల సాయం ఇస్తామంటున్నార‌ని మండిపడ్డారు.    'ఏళ్లకేళ్లు పడిగాపులు పడినా పట్టుమని పది వేలు రుణమివ్వని పాలకుడు... పది లక్షల రూపాయ‌ల‌ సాయమంటూ కొత్త జిత్తుతో ఎత్తులు వేస్తున్నాడు. ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు... మళ్లీ మళ్లీ మోసపోతే మనదే తప్పు. తెలంగాణ సమాజమా ఆలోచన చెయ్' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 'పచ్చి నిజం... పచ్చి మోసం.. తన కాళ్లపై తాను నిలబడదామని, ఆత్మగౌరవంగా బతుకుదామని అప్పు కోసం చెప్పులరిగేలా తిరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు మొండి చెయ్యి చూపే దుర్మార్గం నేడు గద్దెనెక్కి రాజ్యమేలుతోంది. ఓట్ల వాసన రాగానే నోట్ల కట్టలతో స్వైరవిహారం చేస్తోంది' అని రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో విమ‌ర్శించారు. ఈనాడు దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తుంటారని, ఇలాంటి వారికి కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు సువర్ణావకాశమ‌ని అందులో పేర్కొన్నారు. ఇలాంటి రాయితీ రుణ పథకాలను తెలంగాణ‌ ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసిందని చెప్పారు. 2019-20 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల జారీని నిలిపేసింద‌ని ఈనాడులో వివ‌రించారు.  కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు అందించే రుణాలకు సైతం మోకాలడ్డిందని అందులో పేర్కొంది. దీంతో వేలాది మంది నిరుపేదలకు ఈ చ‌ర్య‌ అశనిపాతంగా మారుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.