ఇండియా ఎంబసీలో సోదాలు.. అప్ఘన్ లో తాలిబన్ల అరాచకాలు..

రక్తం చుక్క చిందకుండా  కాబూల్ ను కైవసం చేసుకున్నామని, మాటల్లో  శాంతి కపోతాలను ఎగరేసి, ఇక పై తమ పంధా అదే అని నమ్మబలికిన తాలిబాన్లు.. ఇంతలోనే రక్తం రుచి మరిగిన తమ పంధా మారదని నిరూపించుకున్నారు. ఇంతవరకు ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం అధికారికంగా ఏర్పడలేదు. కానీ, ఇంతలోనే అరాచకానికి తెరతీసారు. మర్డర్లు, మాన భంగాలు, బహిరంగ శిక్షలు మాములుగానే మొదలయ్యాయి.   మేము మారిపోయాం, మా మాట నమ్మండి, మా పాలను గుర్తించండి అని ప్రప్రంచ దేశాలను కోరుతున్న తాలిబాన్లు, భారత దేశం సహా వివిద దేశాల రాయబార కార్యాలయాలలోకి చొరబడి సోదాలు చేస్తున్నారు. తాలిబాన్లు అరాచకాలు ఎంత భయంకరంగా ఉంటాయో, ముందుగానే ఉహించిన వివిద దేశాలలు తమా రాయబార కార్యాలయాలకు తాళాలు వేశాయి. రాయబార కార్యాలయాల సిబ్బంది, స్వదేశాలకు వెళ్ళిపోయారు. ఇదే అదనుగా, ఓ వంక శాంతి వచనాలు పలుకుతున్న తాలిబాన్లు, అంతర్జాతీయ దౌత్య నియమాలకు విరుద్దంగా, భారత దేశం సహా  పలు దేశాల రాయబార కార్యాలయాల తాళాలు పగలగొట్టి లోపల చొరబడి విద్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ విద్వంస, ద్వంస రచనలో భాగంగా, కాంద‌హార్, హెరాత్‌ నగరాల్లోని  భార‌త దౌత్య కార్యాల‌యాలలోకి చొరబడి, గంటల తరబడి సోదాలు చేశారు. తాలిబాన్ల ముట్టడికి ముందు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరించింది. ఆదేశంలో పెద్ద ఎత్తున పెతుబడులు పెట్టింది. ఆ కారణంగా కావచ్చు, భారత  రాయబార కార్యాలయాల్లో తాలిబాన్లు పెద్ద ఎత్తున సోదాలు చేసారు.   ఆ త‌ర్వాత బ‌య‌ట పార్క్ చేసి ఉన్నవాహ‌నాల‌ను ఎత్తుకెళ్లారు.దీంతో, తాలిబాన్లు, మారలేదు, మారరు అని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. గతంలో నాటో ద‌ళాల‌తో కలిసి పని చేసిన వారో కోసం తాల్బాన్లు జల్లెడ పడుతునంరు. దొరికిన వారిని దొరికినట్లు, కిరాతకంగా ఉరికంబం ఎక్కిస్తున్నారని సమాచారం. శతృశేషం మిగలకుండా చేసేందుక ఇల్లిల్లీ గాలిస్తున్నారు. మహిళలు టార్గెట్’గానూ దాడులు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో ఆధారాలతో కూడిన కథనాలు వస్తున్నాయి.  మరోవైపు గురువారం ఆఫ్ఘాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాలిబాన్లు మారణహోమమే   సృష్టించారు. అసదాబాద్‌ నగరంలో కొందరు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో రెచ్చిపోయిన తాలిబన్ మూకలు వారిపై తూటాల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. బుధవారం జలాలాబాద్‌ లో తమకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై కూడా తాలిబన్లు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులలో  ముగ్గురు మరణించారు.  ఇదిలా ఉంటే మన దేశంలో అసదుద్దీన్ ఒవైసీ వంటి కొందరు, శాంతి కాముకులు మాత్రం భారత ప్రభుత్వం తాలిబాన్లతో చర్చలు జరపాలని సలహా ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, మా దేశానికి తాలిబాన్ల కంటే, దేశీయ తాలిబాన్ల వల్లనే, ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని, నెటిజన్లు శాంతి కముకులకు చురకలు అంటిస్తున్నారు

సీబీఐ బోనులో మమతా దీదీ..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,బీజేపీ  నాయకులు కార్యకర్తల మధ్య మాటల  యుద్ధం జరిగింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. అక్కడితో ఎన్నికల యుద్ధం ముగిసింది. కానీ, ఆ వెంటనే రాజకీయ యుద్ధం మొదలైంది. అనూహ్యంగా అద్భుత విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల విజయం తెచ్చి పెట్టిన ఉత్సాహం, ఎన్నికల సందర్భంగా ఎదురైన చిన్నపాటి ఎదురు దెబ్బల తాలూకు అవమానాలను జతచేసి కత్తులు తీశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల పై యుద్దాన్ని ప్రకటించారు.తాలిబాన్ల తరహాలో దాడులకు తల పడ్డారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో సాముహిక మానభంగానికి గురైన ఓ 17 ఏళ్ల బాలిక సహా ఇతర బాధితులు  సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటీషన్ల ప్రకారం, అలాగే రాష్ట్ర హై కోర్టులోదాఖలైన అనేక పిటీషన్ల ప్రకారం గృహ దహనాలు, మానభంగాలు, బహిరంగంగా రాళ్ళతో కొట్టి, చెట్లకు కట్టి చంపడం వంటి భయంకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిజానికి, ఎన్నికల అనతరం హింస జరిగిందని, రాజకీయ హత్యలు జరిగాయని, స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికంటే ముందుగా అంగీకరించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆమె పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం తరపున నష్ట పరుహారం ప్రకటించారు. కానీ,ఎన్నికల అనంతర హింసపై సీబీఐవిచారణకే, కాదు అసలు ఎలాంటి విచారణకు అంగీకరించలేదు. అంతే కాదు, హింసాత్మక  సంఘటనలు జరిగిన ప్రాంతాలలో పర్యటించిన, బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించలేదు,  , చివరకు గవర్నర్ పర్యటనలకు మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పర్యటనలను తృణమూల్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కమిషన్ సభ్యుల మీద కూడా దాడులు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదులు అందాయి, అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హింస ఒక రొటీన్ వ్యవహారం అన్నట్లుగా మమతా బెనర్జీ, తేలిగ్గా తీసుకున్నారు.  చివరకు తృణమూల్ హింస రచన విషయం రాష్ట్ర హై కోర్టుకు చేరింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన నేరాలు, ఘోరలపై సీబీఐ విచారణ జరిపించాలని, కోరుతూ దాఖలైన అనేక పిటీషన్లపై విచారణ జరిపిన కలకత్తా హై కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది.  ఇందులో, హత్యలు, మహిళలపై జరిగిన దాడులకు సంబదించిన ఆరోపణలఫై సీబీసి విచారణ జరిపించాలని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు నిచ్చింది. ఇతర కేసుల విచారణకు న్యాయ స్థానం పశ్చిమ బెంగాల్ క్యాడర్’కు చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో, ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసింది. గతంలో,  హై కోర్ట్ ఆదేశాల మేరకు ఎన్నికల అనంతర హింసపై విచారణ జరిపిన జాతీయ మానవహక్కుల సంఘం, సీబీఐ విచారణ సిఫార్సు చేస్తూ జూలై 13న, న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు గురువారం తీర్పు నిచ్చింది.  ఇక అసలు విషయంలోకి వస్తే, రాష్టంలో హింస జరగడం ఒకెత్తు, అయితే, తీర్పులో  న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల అనంతర చెలరేగిన హింస విషయంలో, అసలు విచారణే అవసరం లేదన్నట్లుగా వ్యహరించిన ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చెంప పెట్టులా ఉన్నాయని రాజాకీయ పరిశీలకులు భావిస్తున్నారు. న్యాయమూర్తులు, జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ ఐపీ ముఖర్జీ, జస్టిస్ హరీష్ టాండన్, జస్టిస్ సౌమేన్ సేన్, జస్టిస్ సుబ్రతా తలుక్దార్ టం తీర్పులో, “ హత్య, మానభంగం వంటి హేయమైన నేరాలపై, స్వతంత్ర నేర పరిశోధన సంస్థ, ప్రస్తుత పరిస్థితులలో సీబీఐ, విచారణ అవసరం..అనేక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలో కూడా విఫలమైంది. ఇది, విచారణను పక్కదోవ పట్టించే ముందస్తు ప్రణాళికను తెలియచేస్తుంది” అని పేర్కొంది. అందుకే అంతిమ తీర్పు ఎలా  ఉన్నప్పటికీ, హై కోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మింగుడు పడక పోవచ్చును. ఆమె ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడవలసి ఉంది.  ఇంతవరకు అయితే ఆమె హై కోర్టు ఆదేశాలపై మౌనంగానే ఉన్నారు. ఇక ముందు ఎలా స్పందిస్తారు,విచారణ ఏ మలుపు తిరుగుతుందో చూడవలసి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

రేవంత్‌రెడ్డితో 'కొండా' కిరికిరి.. అందుకు ఓకే అంటేనే హుజురాబాద్‌లో పోటీ!

హుజురాబాద్‌లో గెలుపెవ‌రిది? చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య హోరాహోరీ సాగుతోంద‌క్క‌డ‌. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల ఎపిసోడ్ రంజుగా న‌డుస్తోంది. ఆ ఇద్ద‌రు పోటుగాళ్ల పొట్లాట‌లో మ‌ధ్య‌లో దూరితే.. అస‌లుకే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అందుకే, కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా ఆల‌స్యం చేస్తోంది. పోటుగాడనుకున్న‌ కౌశిక్‌రెడ్డి.. హ‌స్తానికి హ్యాండిచ్చి కారెక్కేయ‌డంతో కాంగ్రెస్‌కు కేండిడేట్ లేకుండా పోయాడు. అందుకే రేసుగుర్రం కోసం పీసీసీ పెద్ద‌లు వేట మొద‌లుపెట్టారు. కొండా సురేఖ అయితేనే.. రాణిరుద్ర‌మ‌లా హుజురాబాద్‌లొ యుద్ధ చేయ‌గ‌ల‌ర‌ని దాదాపు డిసైడ్ అయ్యారు. అయితే, యుద్దానికి సిద్ధ‌మే, కానీ..... మా కండీష‌న్స్ ఇవి అంటూ అధిష్టానం ముందు కొండా ఫ్యామిలీ కొన్ని కొర్రీలు పెట్టింద‌ని తెలుస్తోంది. వాటికి సైతం పీసీసీ ఓకే అన్న‌ట్టు స‌మాచారం.  అస‌లే.. కొండా దంప‌తులు. కాంగ్రెస్‌కు కొరుకుడుప‌డ‌ని నేత‌లు. పార్టీలో ఉంటార‌నే పేరే గానీ.. ఎప్పుడూ పార్టీని ప‌ట్టించుకున్న పాపాన పోరు. త‌మ ఇలాఖాను తాము పరిపాలించుకుంటారంతే. అక్క‌డ వారు చెప్పిందే చెల్లుబాటు అవుతుంద‌ని అంటారు. ఇలా ఏళ్ల త‌ర‌బ‌డి శాయంపేట‌, ప‌ర‌కాల‌ల‌ను ఏలిన కొండా ఫ్యామిలీ.. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరి.. వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ‌, ఎమ్మెల్సీగా కొండా ముర‌ళీ గెలిచారు. ఐదేళ్లు వ‌రంగ‌ల్ సిటీలో ఆగ‌మాగం చేశార‌ని చెబుతారు. కాంగ్రెస్ స్టైల్ పాలిటిక్స్ గులాబీ బాస్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ఇవ్వ‌లేదు. వెంట‌నే మ‌ళ్లీ హ‌స్తం కండువా క‌ప్పేసుకొని.. వ‌రంగ‌ల్ నుంచి త‌న పాత నియోజ‌క‌వ‌ర్గ‌మైన ప‌ర‌కాల సిఫ్ట్ అయిపోయి.. కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీచేసి.. ఓడిపోయారు. ఓట‌మి భారంతో హైద‌రాబాద్‌లో త‌ల‌దాచుకుంటూ.. కాంగ్రెస్‌లో కామ్‌గా ఉండిపోయారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రావ‌డం.. కొండా సురేఖ ఇంటికెళ్లి మ‌రీ మ‌ద్ద‌తు కోర‌డంతో.. పార్టీలో మ‌ళ్లీ కొండా డిమాండ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ‌లాపూర్ ప్రాంతంపై కొండా దంప‌తుల‌కు ప‌ట్టు ఉండ‌టంతో.. కాంగ్రెస్ త‌ర‌ఫున కొండా సురేఖ‌ను బ‌రిలోకి దింపాల‌ని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.  ఓట‌మికి బెద‌ర‌ని, భ‌య‌ప‌డ‌ని కొండా దంప‌తులు హుజురాబాద్ స‌వాల్‌ను స్వీక‌రించేందుకు సై అంటున్నారు. కాక‌పోతే వారు కొన్ని కండీష‌న్స్ పెడుతున్నార‌ని అంటున్నారు. గెలిచినా, ఓడినా ఇప్పుడు హుజురాబాద్ బ‌రితో దిగుతాం.. అందుకు ప్ర‌తిఫ‌లంగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ తూర్పు, భూపాల‌ప‌ల్లి సీట్లు ఇవ్వాలనేది వారి డిమాండ్‌. కొండా సురేఖ‌, కొండా ముర‌ళిల‌తో పాటు వ‌చ్చేసారి వారి కూతురు సుష్మిత సైతం రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అందుకే, త‌మ కుటుంబానికి ఆ మూడు సీట్లు ఇస్తానంటేనే.. ఇప్పుడు హుజురాబాద్‌లో పోటీ చేసి స‌త్తా చాటుతామ‌ని కిరికిరి పెట్టార‌ట‌. ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ తూర్పుల విష‌యంలో పీసీసీ సైతం స‌రేన‌న్నా.. భూపాల‌ప‌ల్లి సీటులో మాత్రం కాస్త కాంట్ర‌వ‌ర్సీ వ‌చ్చింద‌ట‌. ఇటీవ‌ల కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకొచ్చిన గండ్రా స‌త్య‌నారాయ‌ణ భూపాల‌ప‌ల్లిలో బ‌ల‌మైన నాయ‌కుడు. ఆయ‌న అక్క‌డి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గండ్ర‌ను కాద‌ని కొండాకు ఇవ్వడం.. అదీకాకుండా ఎంత గెలిచే స‌త్తా ఉన్నా.. ఒకే ఫ్యామిలీకి మూడు సీట్లు ఇవ్వ‌డం కాస్త ఇబ్బందిక‌ర‌మేనంటున్నారు. కొండా దంప‌తులు మాత్రం త‌మ‌కు ఆ మూడు అసెంబ్లీ స్థానాలు ఇస్తానంటేనే.. హుజురాబాద్‌లో పోటీ చేస్తామంటోంది.  హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువ. కొండా సురేఖ ప‌ద్మ‌శాలి, కొండా ముర‌ళి మున్నూరుకాపు కావ‌డంతో.. పెద్ద సంఖ్య‌లో ఉన్న‌ ఆ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు కాంగ్రెస్‌కే ప‌డుతాయ‌నేది రేవంత్‌రెడ్డి లెక్క‌. పైగా మ‌హిళా అభ్య‌ర్థి. అందుకే, మిగ‌తా పీసీసీ స‌భ్యుల‌ను ఒప్పించి మ‌రీ కొండా కండీష‌న్స్‌కు ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కొండా సురేఖ పేరు అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు. అదే జ‌రిగితే.. హుజురాబాద్‌లో ట్ర‌యాంగిల్ వార్ రంజుగా సాగ‌డం ఖాయం. 

హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్.. తన కల నెరవేరిందన్న సీజేఐ 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో ప్రఖ్యాత కార్యాలయానికి వేదికవుతోంది. అంత‌ర్జాతీయ వాణిజ్య వివాదాల మ‌ధ్య‌వ‌ర్తుల కేంద్రం ఏర్పాటులో కీలక అడుగు పడింది. ఆర్బిట్రేషన్ సెంట‌ర్‌కు చెందిన ట్ర‌స్ట్ డీడ్ రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో తెలంగాణ చ‌రిత్ర‌లోనూ, హైద‌రాబాద్ చ‌రిత్ర లోనూ ఈ రోజు గొప్ప‌దినంగా నిలిచిపోతుంద‌ని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.  హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని  సీజేఐ  జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.   3 నెల‌ల స‌మ‌యంలోనే త‌న క‌ల నిజ‌మ‌వుతుంద‌ని ఎన్న‌డూ ఊహించ‌లేద‌న్నారు.  త‌న క‌ల నిజ‌మ‌య్యేలా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, సీజే హిమా కోహ్లీకి ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు.ఇక్కడ మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆర్బిట్రేషన్ కేంద్ర ఏర్పాటు బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. జూన్‌లో హైద‌రాబాద్‌కు వ‌చ్చాన‌ని, ఆ స‌మ‌యంలో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ గురించి చీఫ్ జ‌స్టిస్‌తో మాట్లాడిన‌ట్లు ఆయన గుర్తు చేశారు. ఈ సెంట‌ర్ గురించి అంద‌రికీ తెలిసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న‌ తెలంగాణ చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీని కోరారు.ఈ మీడియేష‌న్ సెంట‌ర్ ను ఎలా వాడుకోవాల‌న్న దానిపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.  ఎలాంటి వివాదాలు లేని వాతావరణంలో వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుంటారని, ఏ వివాదాలు లేకుండా ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం చూస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు చట్టం వచ్చిందని గుర్తు చేశారు.ప్రపంచంలో తొలిసారిగా 1926లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందని చెప్పారు. అయితే మన దగ్గర ఆర్బిట్రేషన్ కేంద్రం లేకపోవడం వల్ల ప్రతిసారీ సింగపూర్, దుబాయ్ కు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆ బాధ తప్పుతుందన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే బాధ కూడా తప్పుతుందన్నారు.ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ ఏర్పాటులో తెలంగాణ స‌హ‌కారం మ‌రువ‌లేమ‌న్నారు.  ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు అయితే అంత‌ర్జాతీయ ఆర్బిట్రేట‌ర్లు ఇక్క‌డ‌కు వ‌స్తార‌న్నారు జస్టిస్ ఎన్వీ రమణ. పెట్టుబుడిదారులు వివాదాలు లేని వాణిజ్యాన్ని కోరుకుంటున్నార‌ని, అలాంటి వాళ్ల‌కు ఈ సెంట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సీజే తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల‌కు చీఫ్ జ‌స్టిస్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త్వ‌ర‌లోనే సెంట‌ర్ ఫంక్ష‌నింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ స‌క్సెస్ కావాల‌ని ఆయ‌న కోరుకున్నారు. కేవ‌లం అంత‌ర్జాతీయ ఇన్వెస్టెర్లే కాదు, స్థానిక పెట్టుబ‌డిదారుల వివాదాల‌ను కూడా ఇక్క‌డ ప‌రిష్క‌రిస్తార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

తాలిబన్ మద్దతుదారులకు టీఆర్ఎస్ సపోర్ట్! బీజేపీ జాతీయ నేత సంచలనం..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో పోరాటంలో దూకుడు పెంచింది బీజేపీ. కేసీఆర్ టార్గెట్ గా వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు కమలం నేతలు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈనెల 24 నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. హైదరాబాద్ పాతబస్తిలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలు కాబోతోంది బండి యాత్ర. ఇందుకోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తన పాదయాత్రలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకువెళతానంటున్నారు బండి సంజయ్. బండి సంజయ్ పాదయాత్ర పోస్టర్ ను రిలీజ్ చేసిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడు లేనంతగా కేసీఆర్ సర్కార్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టిస్తోందని మురళీధర్ రావు విమర్శించారు. అసెంబ్లీ నడిచే విధానం, కేటాయించే సమయాలు తగ్గిపోతున్నాయని దీని వలన సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. రాజకీయ అవకాశాలు తగ్గి కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా కాని భర్తీ చేయడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో  లేని దుస్థితికి రాష్ట్రం దిగజారిందని చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో... ఉద్యమాలపై లాఠీ దెబ్బలు పెరిగాయని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ సహకారం ఉందని... అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని తెలిపారు యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయని.. ఓయూలాంటి యూనివర్శిటీల్లో కూడా 80 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మురళీధర్ రావు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా టైమ్ కి రావడం లేదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ల విషయంలో కూడా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని... 2019 నాటికి 2.70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని... కానీ ఇప్పటి వరకు 30 వేలు మాత్రమే పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాలిబన్ మద్దతుదారులు, రాజకీయ నాయకులు ఉన్నారని... టీఆర్ఎస్ పార్టీతో కలిసి వారు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నాయకులు తాలిబన్‌లకు సపోర్ట్ చేసేలా ప్రసంగాలు ఇస్తున్నారని ఆరోపించారు.  ఆగస్ట్ 10 వరకు ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని తెలిపారు. 2019 వరకు 2లక్షల ఇండ్లు నిర్మాణం కావలసి ఉండగా ఇప్పటి వరకు 30 వేల ఇండ్లు మాత్రమే నిర్మించారని మురళీధర్ రావు చెప్పారు. పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మహబూబ్ నగర్, నల్గొండ లో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అవినీతి అంటే కేసీఆర్ ఫ్యామిలీ అని ఆరోపించారు. మూసినది లో ఉన్న కాలుష్యం లా టీఆరెస్ లో అవినీతి పేరుకుపోయిందని చెప్పారు. మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని చెప్పారు. కేవలం బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ను ఓడించగలదన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల్లో గొప్ప మార్పును తీసుకువస్తుందని చెప్పారు. బీజేపీ బలోపేతమై తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్నారు.

వైసీపీకి ఆడ‌పిల్ల‌ల ఉసురు!.. జ‌గ‌న్ స‌ర్కారుపై లోకేశ్ మండిపాటు..

ఏపీలో మ‌హిళ‌ల‌పై వ‌రుస‌గా జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యం వ‌ల్లే రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మహిళలపై అరాచ‌కాల‌కు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందన్నారు. గుంటూరులో ర‌మ్య నేల‌కొరిగితే..  అదే గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి అఘాయిత్యానికి గురైందన్నారు. తాజాగా, విజ‌య‌న‌గ‌రం జిల్లా చౌడ‌వాడ‌లో ఉన్మాది పెట్రోల్ పోసి యువ‌తిని త‌గుల‌బెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేశ్‌.  లేని దిశ చ‌ట్టం.. రక్షించ‌లేని దిశ యాప్ పేరుతో ప్ర‌భుత్వం ఆర్బాటంగా ప్రచారం చేయడం సిగ్గు చేటని విమర్శించారు లోకేశ్‌. నిందితుల్ని ప‌ట్టుకుని శిక్షించ‌డంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆడ‌పిల్లల ఉసురు త‌గిలితే వైసీపీకి, ఈ రాష్ట్రానికి మంచిది కాదని లోకేశ్‌ హితవు పలికారు.    ఏపీలో వరుసగా అమానవీయ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని లోకేశ్‌ మండిపడ్డారు. సీఎం ఇంటికి సమీపంలో ఉన్నవారూ అత్యాచారానికి గుర‌య్యారని ఆరోపించారు. వైసీపీ పాల‌న‌లో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భ‌ద్రత లేదని, అంతా భయం భయంగా బతుకుతున్నారని మండిప‌డ్డారు నారా లోకేశ్‌. 

జ‌గ‌న్ ఢ‌మాల్‌.. చంద్ర‌బాబు క‌మాల్‌.. అధికార మార్పు ఖాయమేనా? 

71 ఏళ్ల న‌వ‌యువ‌కుడు చంద్ర‌బాబు. 48 ఏళ్ల అనుభ‌వ‌రాహిత్యుడు జ‌గ‌న్‌. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మీరే కావాలంటూ చంద్ర‌బాబును న‌వ్యాంధ్ర ముఖ్య‌మంత్రిని చేశారు ఆంధ్రులు. ఒక్క ఛాన్స్ అంటూ అంద‌రినీ న‌మ్మించి అంద‌ల‌మెక్కారు జ‌గ‌న్‌. అమ‌రావ‌తి స్వ‌ప్నం కాంక్షించారు చంద్ర‌బాబు. అద్భుత‌మైన క‌ల‌ల రాజ‌ధాన్ని నిర్మించ త‌ల‌పెట్టారు. కుర్చీ ఎక్క‌గానే మాట త‌ప్పి, మ‌డ‌మ తిప్పి అమ‌రావ‌తిని చిదిమేస్తున్నారు జ‌గ‌న్‌. రాజ‌ధానితో మూడు ముక్క‌లాట ఆడుతున్నారు. పెట్టుబ‌డుల వ‌ర‌ద పారించి ఏపీని స‌న్‌రైజ్ స్టేట్‌గా నిలిపారు చంద్ర‌బాబు. ఉన్న ప‌రిశ్ర‌మ‌లు వెళ్లిపోయేలా చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల ప్ర‌దేశ్‌గా మార్చేశారు జ‌గ‌న్‌. ఉద్యోగుల‌కు జీతాలూ స‌మ‌యానికి రాని దుస్థితి. చంద్ర‌బాబు హ‌యాంలో శాంతి.. సౌర‌భం. జ‌గ‌న్ పాల‌న‌లో అక్ర‌మాలు, అరాచ‌కాలు. కేసులు, అరెస్టులు. ఆల‌యాలు, ద‌ళితుల‌పై దాడులు. మ‌త‌మార్పిడిలు, మ‌హిళ‌ల‌పై ఆగ‌డాలు. ఎంత తేడా.. ఎంత తేడా.. రెండేళ్ల‌లో ఎంత తేడా. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎలా ఉండేది? జ‌గ‌న్ పాల‌న‌లో ఇప్పుడెలా ఉంది? అన్ని ర‌కాల ఎల‌క్ష‌న్స్‌లో గెలుస్తున్నాంగా.. మాకిక తిరుగులేద‌ని విర్ర‌వీగుతున్న వైసీపీకి ఇండియా టుడే- మూడ్ ఆఫ్‌ది నేష‌న్ స‌ర్వే దిమ్మ‌తిరిగే షాక్ ఇవ్వ‌డంతో జ‌గ‌న్‌రెడ్డిలో క‌ల‌వ‌రింత‌. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబులో పుల‌క‌రింత‌. పాల‌క‌ప‌క్షంలో తీవ్ర‌ నిరుత్సాహం.. ప్ర‌తిప‌క్షంలో రెట్టించిన ఉత్సాహం. ఇదే ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌నీయాంశం. డౌట్ ఉంటే టీడీపీ వాళ్ల‌ సోష‌ల్ మీడియా సైట్లు చెక్ చేసుకోండి.. జోష్ మామూలుగా లేద‌క్క‌డ‌... ప్ర‌జ‌ల్లో సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప‌ర‌ప‌తి దారుణంగా ప‌డిపోయింది. ఇండియా టుడే స‌ర్వేలో కేవ‌లం 6 శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అంటున్నారంటే అర్థం ఏంటి? మిగ‌తా 94 శాతం జ‌గ‌న్‌ను అస‌హ్యించుకుంటున్న‌ట్టేగా? జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న‌ట్టేగా? ప్ర‌జ‌ల్లో త‌న‌పై ఇంత‌టి వ్య‌తిరేక‌త‌ను జ‌గ‌న్ సైతం ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. జ‌గ‌న్‌పై దండుక‌ట్టి దండ‌యాత్ర చేయ‌డానికి ఇదే మంచి స‌మ‌యం అంటున్నారు విశ్లేష‌కులు. చంద్ర‌బాబు-లోకేశ్ నాయ‌కత్వంలో టీడీపీ ఇదే జోరుతో పోరాడితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పాల‌నకు మంగ‌ళం పాడ‌టం త‌ప్ప‌దంటున్నారు.   రెండేళ్లుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై టీడీపీ ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా ప్ర‌జాప‌క్షాన పోరాడుతోంది టీడీపీ. 71 ఏళ్ల చంద్ర‌బాబు అసెంబ్లీలో, జూమ్ మీటింగ్స్‌లో జ‌గ‌న్ స‌ర్కారును ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెడుతుంటే.. 38 ఏళ్ల నారా లోకేశ్ దూకుడు మంత్రంతో జ‌గ‌న్‌పై దండ‌యాత్ర చేస్తున్నారు. తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల్లో ఆ ఉత్సాహం సుస్ప‌ష్టంగా క‌నిపించింది. ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ నారా లోకేశ్ నేనున్నానంటూ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌టం పాల‌క‌ప‌క్షానికి బీపీ పెంచుతోంది. అందుకే, లోకేశ్‌పైనా కేసు పెట్టి, అరెస్టు చేసి క‌క్ష్య తీర్చుకుంది ప్ర‌భుత్వం.  ఇండియా టుడే స‌ర్వే త‌ర్వాత‌ మ‌రింత ఉధృత కార్య‌చ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్నారు చంద్ర‌బాబు-లోకేశ్‌లు. భావ‌స్వారూప్య వ‌ర్గాల‌ను కూడ‌గ‌ట్టి జ‌గ‌న్‌ను ఏకాకిని చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల టీడీపీ-బీజేపీ-జ‌న‌సేనలు ప‌ర‌స్ప‌రం కాస్త‌ సానుకూల వైఖ‌రితో ఉంటూ జ‌గ‌న్ స‌ర్కారుపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై లోకేశ్‌ను ఆయుధంగా ప్ర‌యోగించి స‌క్సెస్ అయిన చంద్ర‌బాబు.. మూడ్ ఆఫ్ ది నేష‌న్ సర్వే త‌ర్వాత ఇక తనే స్వ‌యంగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. క‌రోనా మూడోద‌శ త‌ర్వాత‌.. అవ‌స‌ర‌మైతే జిల్లా ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నార‌ట‌. జ‌గ‌న్‌పై జ‌నాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌టం.. రాష్ట్రం తిరోగ‌మ‌నంలో పోతుండ‌టం.. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు మంచి ప‌రిపాల‌నాద‌క్షుల‌నే అభిమానం ఉండ‌టం.. చంద్ర‌బాబు అయితే ఏపీ భ‌విష్య‌త్తు బాగుంటుంద‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉండ‌టం.. ఇలా అనేక అంశాలు చంద్ర‌బాబుకు-టీడీపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని.. పున‌ర్‌వైభ‌వానికి ఇదే మంచి స‌మ‌యమ‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. 

ఇదేమీ రాజ‌కీయం కిష‌న్‌'రెడ్డి'గారు?

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఏపీపై దండ‌యాత్ర‌కు వ‌చ్చారు. రాజ‌కీయ శ‌త్రువును చీల్చి చెండాడ‌డానికి విచ్చేశారు. ఆయ‌న‌కు ప్ర‌ధాని మోదీనే ఆ కార్యాన్ని పుర‌మాయించారు. కేంద్ర పార్టీ డైరెక్ష‌న్‌లో కిష‌న్  ‘జన ఆశీర్వాద యాత్ర’ చేప‌ట్టారు. కేంద్ర మంత్రి వ‌స్తున్నార‌ని క‌మ‌ల‌ద‌ళం క‌ద‌నోత్సాహంతో ఉర‌క‌లెత్తింది. దైవ‌ద‌ర్శ‌నాలు గ‌ట్రా అయిపోయాక.. బెజ‌వాడ‌లో స‌భ పెట్టి ఏపీ స‌ర్కారుపై అటాక్‌కు దిగారు. జ‌గ‌న్‌రెడ్డిపై కిష‌న్‌రెడ్డి ఎంత తీవ్రంగా దాడి చేస్తారోన‌ని ఏపీ బీజేపీ చెవులు రిక్క‌రించి వింటోంది. రోమాలు నిక్క‌బొడిచే స్పీచ్ ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ, మ‌నోడు జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌పై క‌మ‌లం పువ్వుల‌తో దాడి చేశారు. నేను కొట్టిన‌ట్టు చేస్తా.. నువ్వు ఏడ్చిన‌ట్టు చేయి అనే టైప్‌లో ‘జన ఆశీర్వాద యాత్ర’ నాట‌కం ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు.  "కేంద్ర పథకాలు మినహా ఏపీలో అభివృద్ధి జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోంది. ఏపీకి క‌రోనా సాయం అందించాం. జ‌ల వివాదాలను తెలుగు రాష్ట్రాలు సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాలి". ఇంతే. ఇలా చ‌ప్ప‌గా సాగింది కిష‌న్‌రెడ్డి ప్ర‌సంగం. అంత‌కు మించి జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ను ప‌ళ్లెత్తు మాట కూడా అన‌లే. ఏపీలో ‘జన ఆశీర్వాద యాత్ర’ను మ‌మ అనిపించి మంగ‌ళం పాడేశారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి. పార్టీ త‌న‌కు అప్పగించిన కీల‌క టాస్క్‌ను ఇలా సింపుల్‌గా ముగించేశారు.  అక్క‌డితో అయిపోలేదు కిష‌న్‌రెడ్డి గారి క‌మ‌ల‌నాట‌కం. అస‌లైన ఇంట్రెస్టింగ్ సీన్ ఆ త‌ర్వాత జ‌రిగింది. కేంద్రం ఆదేశించింది ఏంటి? ఇత‌గాడు చేసిందేంటి?  కేంద్ర‌మంత్రులంతా ఆయా రాష్ట్రాల‌కు వెళ్లి ‘జన ఆశీర్వాద యాత్ర’ చేప‌ట్టి, ఆయా రాష్ట్రాల్లో బీజేపీని బ‌లోపేతం చేయ‌డం.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ‌తీయ‌డం.. ఆ యాత్ర ల‌క్ష్యం. కానీ, కిష‌న్‌రెడ్డి గారు మాత్రం ఏపీ విష‌యంలో త‌న 'రెడ్డి' బుద్ధి చూపెట్టార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే, ‘జన ఆశీర్వాద యాత్ర’ స‌భ త‌ర్వాత కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.. తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప్యాలెస్‌కు వెళ్లి.. కుటుంబ స‌మేతంగా ఆతిథ్యం స్వీక‌రించ‌డం బీజేపీ శ్రేణుల‌ను అవాక్క‌య్యేలా చేస్తోంది. స్వ‌యాగా కిష‌న్‌రెడ్డే జ‌గ‌న్ ఇంటికి వెళ్ల‌డం ఏంటి? ఆయ‌న‌తో శాలువా క‌ప్పించుకోవ‌డం ఏంటి? అంద‌మైన మెమెంటో స్వీక‌రించ‌డ‌మేంటి? ఒకే డైనింగ్ టేబుల్‌పై కూర్చొని.. ఫ్యామిలీ డిన్న‌ర్ చేయ‌డం ఏంటి? ఏంటి.. ఇదంతా ఏంటి? అంటూ మండిప‌డుతున్నారు క‌మ‌ల‌నాథులు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి వ‌చ్చిన ప‌నేంటి? ‘జన ఆశీర్వాద యాత్ర’ తో చేధించాల్సిన టార్గెట్ ఏంటి? చేతులెత్తేసిన‌ట్టు చేసిన చెత్త ప‌ని ఏంటి? అంటూ సొంత‌పార్టీ నేత‌లో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడుతున్నారు.  అదే కిష‌న్‌రెడ్డి కొన్నిగంట‌ల వ్య‌వ‌ధిలోనే తెలంగాణలో అడుగుపెట్టి.. కేసీఆర్‌ను, కేసీఆర్ స‌ర్కారును ఓ రేంజ్‌లో కుమ్మేశారు. కేసీఆర్ ఫాంహౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని.. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నార‌ని.. తెలంగాణ‌లో ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని.. కేటీఆర్‌కు సీఎం కుర్చీ కోసం కేసీఆర్ అడ్డ‌దారులు తొక్కుతున్నార‌ని.. సీఎం కేసీఆర్ షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ చాలా స్ట్రాంగ్‌గా అటాక్ చేశారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి. ఇది క‌దా కావాల్సింది. ఇలాంటి మాట‌లే క‌దా బీజేపీని నిల‌బెట్టేది. మ‌రి, ఈ విమ‌ర్శ‌లు కేవ‌లం తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాత్ర‌మే చేశారేంటి? ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డిని ఏమీ అన‌క‌పోవ‌డ‌మే కాకుండా.. మ‌రింత‌ దిగ‌జారిన‌ట్టు.. ఆయ‌నింటికే ఈయ‌నెళ్లి.. భోజ‌నానికి క‌క్కుర్తి ప‌డ‌ట‌మేంటి? అని ఏపీ బీజేపీ లోలోన కిష‌న్‌రెడ్డిపై మండిప‌డుతోంది.  జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. కేసీఆర్‌పై కిష‌న్‌రెడ్డి చేసిన ప‌లు విమ‌ర్శ‌లు జ‌గ‌న్‌రెడ్డికే ఎక్కువ వ‌ర్తిస్తాయి. ఏపీని దివాళా తీయిస్తున్న‌ది జ‌గ‌న్‌రెడ్డి.. ఏపీలో ఒకటో తారీఖున జీతాలు ఇవ్వ‌లేని దుస్థితి జ‌గ‌న్‌రెడ్డిది.. అడ్డ‌గోలు ప‌థ‌కాల‌తో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న‌ది జ‌గ‌న్‌రెడ్డి.. ఇవి కాక‌.. ఏపీలో బీజేపీ శ్రేణుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతోంది వైసీపీ.. ఏపీలో మ‌త‌మార్పిడిలు మునుపెన్న‌డూ లేనంతగా జ‌రుగుతున్నాయి.. రెండేళ్లుగా హిందూ దేవాల‌యాల‌పై వ‌రుస దాడులు.. ద‌ళితుల‌పై, ఆడ‌పిల్ల‌ల‌పై దాడులు.. కేసులు, అరెస్టుల‌తో అరాచ‌కం.. స‌హ‌జ సంప‌ద‌ల దోపిడీ.. ఇలా అరాచ‌కానికి కేరాఫ్‌గా మారిన జ‌గ‌న్‌రెడ్డిపై కిష‌న్‌రెడ్డి గారు ఎన‌లేని ప్రేమ క‌న‌బ‌రుస్తూ.. ఇంటికెళ్లి మ‌రీ విందార‌గించ‌డం.. అదే స‌మ‌యంలో మ‌రో సీఎం కేసీఆర్‌పై మాత్రం క‌స్సుమ‌ని బుస‌లుకొట్ట‌డం.. ఇదేమీ 'రెడ్డి రాజ‌కీయం' కిష‌న్‌రెడ్డి గారూ అంటూ సోష‌ల్ మీడియాలో కేంద్ర‌మంత్రిని చెడుగుడు ఆడుకుంటున్నారు నెటిజ‌న్లు. ఒక సీఎంకు షాక్ ట్రీట్‌మెంట్‌.. ఇంకో సీఎంకు ఆశీర్వాద‌మా? అని నిగ్గ‌దీసి అడుగుతున్నారు. ఈ తేడా ఎందుకో కిష‌న్‌'రెడ్డి' గారే చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు.  కేంద్రం ఏపీపై ఆగ్ర‌హంగా ఉంది. ఏపీ చేస్తున్న అప్పుల‌పై మండిప‌డుతోంది. కొత్త అప్పులు చేయ‌కుండా చెక్ పెడుతోంది. జ‌గ‌న్ అండ్ కో కు అడ‌గ్గానే అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా తిప్పించుకుంటోంది. అటు, సీబీఐ సైతం జ‌గ‌న్ విష‌యంలో సపోర్ట్‌గా కాకుండా న్యూట్ర‌ల్‌గా ఉండేలా చేసింది. ఇలా కేంద్రం, కేంద్ర బీజేపీ జ‌గ‌న్‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేస్తుంటే.. కిష‌న్‌రెడ్డి, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి లాంటి కొంద‌రు 'రెడ్డి' నాయ‌కులు మాత్రం జ‌గ‌న్‌'రెడ్డి'తో అంట‌కాగుతున్నార‌నే  విమ‌ర్శ ఉంది. సీఎం కేసీఆర్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ విరుచుకుప‌డ‌టం.. సీఎం జ‌గ‌న్‌కు మాత్రం ఇంటికెళ్లి మ‌రీ ఆశీర్వాదం ఇచ్చిరావ‌డం.. కిష‌న్‌రెడ్డి-జ‌గ‌న్‌రెడ్డిల 'రెడ్డి' రాజ‌కీయానికి నిద‌ర్శ‌నం అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏపీలో బ‌ల‌ప‌డుతున్న బీజేపీకి.. కిష‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న గొడ్డ‌లిపెట్టులా మారిందంటూ క‌మ‌ల‌నాథులే మండిప‌డుతున్నారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డిపై కేంద్ర పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని స‌మాచారం.

విజయవాడ నుంచి స్పైస్ జెట్ విమాన సర్వీసులు బంద్..

విజయవాడ ప్రజలకు ఇదో  బ్యాడ్ న్యూస్. గన్నవరం విమానాశ్రం నుంచి స్పైస్ జెట్ సంస్థ  విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. ప్రయాణికులు తగ్గడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా 30 శాతం బుకింగ్ లు కూడా జరగడం లేదట. దీంతో ప్రయాణికులు లేని కారణంగా నష్టాలతో విమాన సర్వీసులను నడపలేమని స్పైస్ జెట్ సంస్థ  తెలిపింది. అందుకే గన్నవరం విమానాశ్రం నుంచి సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. రెండు నెలల పాటు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు చెప్పింది.  విమాన సర్వీసులను రద్దు చేసిన స్పైస్ జెట్ సంస్థ.. ఆన్ లైన్ బుకింగ్స్ ను ఆపేసింది. విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లే స్పైస్ జెట్ విమాన సర్వీసులు నడిచేవి. రెండేళ్ల క్రితం వరకు స్పైస్ జెట్ విమానాల్లో 80 శాతానికి పైగా బుకింగులు ఉండేవి. ప్రస్తుతం అవి 30 శాతానికి పడిపోయాయి. విమానాశ్రయంలో రన్ వేను పెంచినప్పటికీ సర్వీసులు తగ్గిపోయాయి. స్పైస్ జెట్ సంస్థ  విమాన సర్వీసులు రద్దు కావడంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ ఖాళీ అయింది.

కొవిడ్ టీకా సురక్షితమే.. కానీ పూర్తి రక్షణ కాదు.. 

దేశంలో కరోనా ముప్పు చాలా వరకు తగ్గింది. తెలంగాణ సహా చలా వరకు రాష్త్రాలలో సెకండ్ వేవ్ సర్దు మణిగింది. మరోవంక, వాక్సినేషన్, టీకాల ప్రక్రియ ఆరంభ అవరోధాలను దాటి, చకచకా ముందకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి నాటికి, అందరికీ టీకా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో, దేశంలో థర్డ్ వేవ్ ప్రభావం అమెరికా సహా ఇతర దేశాలపై ఉన్నంతగా మన దేశంఫై ఉండదని నిపుణులు కొందరు అంటున్నారు.  దేశానికీ మహామ్మారి ముప్పు ఇంకా తోలిగిపోలేదని, ఎప్పుడు ఏ రూపంలో ఎటు నుంచి థర్డ్ వేవ్ ఎటాక్ చేస్తుందో చెప్పే పరిస్థితి లేదనే హెచ్చరికలు ఇటు అధికార వర్గాల నుంచి అటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వస్తూనే ఉన్నాయి. కరోనాకు మందు లేదు, వాక్సిన్ ఒక్కటే రక్ష’ అని ప్రభుత్వాలు, వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు. ఉపేక్ష వద్దు. ప్రతి ఒక్కరు బాధ్యతగా  టీకా వేయించుకోండి ... అని ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారిక సమాచారం మేరకు, కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికీ కూడా వైరస్ సోకుతోందని తెలుస్తోంది. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 87 వేల మందికి కరోనా సోకిందని, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులే  చెబుతున్నారు. అందులో ఒక్క కేరళలోనే దాదాపు 46 శాతం మంది వరకు ఉన్నారు. ఇక ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారిలో, అది కూడా  ఒక్క కేరళలో 80 వేల మందికి కరోనా సోకింది.  ఇలా వాక్సిన్ తీసుకున్నవారిలోనూ కరోనా లక్షణాలు కనిపించడం, కొందరికి కొవిడ్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశగా అధికారులు భావిస్తున్నారు. దేశం మొత్తంలో ఇంతవరకు, 56 కోట్లకు పైగా, వాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. కాగా, 44కోట్ల మందికి ఫస్ట్ డోసు, 12 కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. మొత్తంగా చూస్తే, దేశంలో టీకాలు తీసుకున్న వారిలో 2.6 లక్షల మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అందులో ఫస్ట్ డోసు మాత్రమే తీసుకున్నవారిలో, 1.70 లక్షల మందికి, సెకండ్ డోస్ తీసుకున్నవారిలో 87 వేల మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి  ఒక్క  కేరళలో మాత్రమే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పాటుగా దేశం అంతటా కూడా అప్రమత్తత కొనసాగవలసిందే అని కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్రాలను హెచ్చరించింది.  ఇకా దేశంలో కరోనా తాజా సమాచారం గమనిస్తే, ఇటీవల కాలంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. నిన్న (గురువారం)  36 వేల కేసులు 500కు పైగా మరణాలు సంభవించాయని ఈరోజు (శుక్రవారం) కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.తాజాగా 18,86,271 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,  36,571 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఒక్క కేరళలోనే 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.గడచిన  24 గంటల వ్యవధిలో 540 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో, మొత్తం కేసులు 3.23 కోట్లకు, మరణాల సంఖ్య 4,33,589కి చేరింది.  ప్రస్తుతం దేశంలో 3.63లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 1.12 శాతానికి తగ్గింది. కొవిడ్ రికవరీ రేటు 97.54 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 36 వేల మంది కోలుకోగా,  దేశం మొత్తంలో ఇంతవరాకు కొవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.15 కోట్లుకు చేరింది. మరో వంక జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం ఈ మధ్య వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 57 కోట్ల మార్కును దాటింది. గురువరం ఒక్కరోజునే  54.7లక్షల మంది టీకా వేయించుకున్నారు.

షర్మిల పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై.. అదే దారిలో మరికొందరు? 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీ కమిటీలు ఇంకా పూర్తిగా ఏర్పాటు కాక ముందే ముఖ్య నేతలు ఆమెకు హ్యాండిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్‌టీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత, మొదటి నుంచి షర్మిలకు అండగా నిలిచిన ఇందిరాశోభన్ రాజీనామా చేశారు. వైఎస్సార్ టీపీ పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు  ఓ ప్రకటనలో ఆమె తెలియజేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇందిరా శోభన్ పంపారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? రాజీనామా వెనుక అసలు కారణాలేంటి..? రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు..? అనే విషయాలను ప్రకటనలో నిశితంగా ఇందిరాశోభన్ రాసుకొచ్చారు. ఇందిరా శోభన్  షర్మిల పార్టీకి రాజీనామా చేయబోతున్నారని గతంలోనూ ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ వార్తలను ఆమె ఖండించారు. ఓ సభా వేదికపైనే ఇందిరను షర్మిల కోప్పడిన వీడియోలు వైరల్ గా మారాయి. అప్పుడు కూడా ఆమె రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. కాని తర్వాత కూడా షర్మిల పార్టీలో యాక్టివ్ గా కనిపించారు ఇందిరా శోభన్. తాజాగా మాత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను. ప్రజాజీవితంలోనే ఉంటా. జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తా. ఇదే ఆదరాభిమానాలను ఇక ముందు కూడా మీ నుంచి నాకు ఉంటాయని, నన్ను నడిపిస్తారని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాములు’ అని ఇందిరాశోభన్ ప్రకటనలో తెలిపారు. ‘నా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నమస్కారం.. నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రజాజీవితంలో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమంలో రాష్ర్ట సాధన కోసం కలిసి కోట్లాడినం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశాను’ అని ఇందిరా శోభన్ తన రాజీనామా ప్రకటనలో వెల్లడించారు.  షర్మిల పార్టీకి ఇప్పటికే కొందరు నేతలు రాజీనామా చేశారు .మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాయకులు లోటస్ పాండ్ ఆఫీసులో పెద్ద రగడే చేశారు. తాజాగా కీలక నేత ఇందిరాశోభన్ రాజీనామా చేయడంతో షర్మిలకు పెద్ద షాకే అంటున్నారు. ప్రస్తుతం షర్మిల ప్రతి మంగళవారం జిల్లాలో పర్యటిస్తూ.. దీక్షలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అక్టోబర్ లో పాదయాత్రకు షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కొక్కరుగా నేతలు పార్టీ వీడుతుండటం.. షర్మిల శిబిరంలో ఆందోళన కల్గిస్తోంది. 

జనం బలంతో పునర్జీవనం.. ఇదేనా రేవంత్ రెడ్డి వ్యూహం? 

రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది ఊపొచ్చింది. మొన్న ఇంద్రవెల్లి, నిన్న  రావిర్యాల, దళిత గిరిజన గర్జన సభలు, గ్రాండ్ .. గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దీంతో పార్టీ క్యాడర్, నాయకులలో జోష్ మరింతగా ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీపై రేవంత్ పట్టు పెరుగతున్నకొద్దీ,అధికార తెరాసకు ప్రత్యాన్మాయం ఎవరు అన్న ప్రశ్న పక్కకు పోయింది. తెరాసకు ప్రత్యాన్మాయం కాంగ్రెస్, కేసీఆర్’కు ప్రత్యర్ధి రేవంత్ రెడ్డి  అనే అభిప్రాయం బలపడుతోంది.  రావిర్యాల సభలో రేవంత్ రెడ్డి ఏమి మాట్లాడారు అనేది పక్కన పెట్టినా, కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన ప్రతి స్పందన, ఎవరో అన్నట్లుగా రేపటి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించింది. ఏదో అనూహ్య పరిణామం జరిగితే తప్పించి, ఇక రేవంత్  సారధ్యంలో కాంగ్రెస్  దూకుడు ఆపడం కేసీఆర్ కే కాదు కమల దళానికి కూడా సాద్యం కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీలో గొప్ప జోష్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఏ గెలుపు లేక పోయినా రెంత్ కారణంగా అలాంటి జోష్ వచ్చింది. అయితే బీజేపీలో వచ్చిన జోష్ అట్టే కాలం నిలవలేదు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపీ సిట్టింగ్ సీటు కోల్పోవాదంతో పాటుగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో డిపాజిట్ కోల్పోవడంతో ఎన్నికల గెలుపుతో వచ్చిన జోష్ ఎన్నికల ఓటమితోనే కొట్టుకు పోయింది.   కాంగ్రెస్ విషయానికి వస్తే, 2014 లోనే పార్టీ పడకేసింది. పార్టీ మీద ఉన్న అభిమానంతో , 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజులు రెండుసార్లూ ఒకటి రెండు సీట్లు అటూ ఇటుగా 20 వరకు స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్ధులను  గెలిపించినా,  పార్టీ, నాయకులు ఆ ప్రజాభిమానాన్ని నిలుపుకోలేక పోయారు. ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన శాసనసభ్యుల్లో సగం మందికి పైగా అధికార పార్టీలోకి దూకేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా వృధా, అనే అభిప్రాయం బలపడింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. అందుకే, దుబ్బాక, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. చివరకు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా సాగర్ ఉపఎన్నికలో, ఓడిపోయారు.  నిజానికి, ఒక విధంగా అస్తిత్వ సంక్షోభంలో పడిన కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం అంటే, అది అయ్యేది కాదు, పొయ్యేది కాదన్న అభిప్రాయం ఏర్పడింది. అందుకే, అనేక మంది నాయకులు ఇతర పార్టీలలోకి వెళ్లి పోయారు. అలా వెళ్ళలేని వారు, అజ్ఞాతంలోలి వెళ్లి పోయారు.   ఇలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు పుచ్చుకున్న రేవంత్ రెడ్డి, పోటీ చేసినా ఖాయంగా ఓడి పోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే, పార్టీని జనంలోకి తీసుకుపోయి, తెరాసకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యాన్మాయం అన్న అభిప్రాయం జనం నోట అనిపించుకునేదుకు సభలు సమావేశాలపై దృష్టి పెట్టారని పరిశీలకులకు భావిస్తున్నారు.ఇందులో భాగంగా నిర్వహించిన ఇంద్రవెల్లి, రావిర్యాల సభలు సక్సెస్ అవడంతో మరింతగా జనంలోకి వెళ్లేందుకు, మ‌రిన్ని కార్య‌క్ర‌మాలకు హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు పార్లమెంటు స్థానాల‌ పరిధిలోనే నిర్వహిస్తున్న సభలను ఇక పై అసెంబ్లీ నియోజక వర్గాల స్థాయిలో నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా శాసన సభ నియోక వర్గాల వారీగా నిరసన దీక్షలు చేయబోతున్న‌ట్టు టీపీసీసీ సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లుర‌వి తెలిపారు త్వ‌ర‌లో 48 గంటల దీక్షకు టీపీసీసీ స‌న్నాహాలు చేస్తోంద‌ని ఆయన వెల్ల‌డించారు. కాగా ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు రేవంత్ రెడ్డి దూకుడులోనూ ఒక వ్యూహం, ముందు చూపు ఉన్నాయని అంటున్నారు. వచ్చి పోయే ఉపఎన్నికల కంటే, మరో రెండేళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీకరించి పార్టీని జనంలోకి తీసుకుపోయేందుకు రేవంత్ రెడ్డి చూపుతున్నా చొరవ.. ఆయన  రాజకీయ విజ్ఞతకు నిదర్శనంగానూ పరిశీలకులు భావిస్తున్నారు.  

సీబీఐకి పంజ‌రం నుంచి స్వేచ్ఛ ఇస్తే..! జ‌గ‌న్‌కు జైలే గ‌తా..!

‘సీబీఐ పరిస్దితి పంజరంలో చిలుకలాగ తయారైంది. కేంద్ర ఎన్నికల కమీషన్-ఈసీ, కంట్రోల్ అండ్ అడిట‌ర్ జ‌న‌ర‌ల్‌- కాగ్ లాగ సీబీఐకి కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి’.. అంటూ మ‌ద్రాసు హైకోర్టు కేంద్రానికి ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సీబీఐకి స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉండాల‌నేది ఎప్ప‌టినుంచో వినిపిస్తున్న డిమాండ్‌. పేరుకు ఇండిపెండెంట్ సంస్థేగానీ ఎక్క‌డా స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా సీబీ-ఐ క‌ళ్లు కేంద్ర‌మే పీకేసింద‌నే విమ‌ర్శ ఉంది. కేంద్రం చూడ‌మ‌న్న‌దే  సీబీఐ చూస్తుంది. కేంద్ర క‌నుస‌న్న‌ల్లోనే జాతీయ విచార‌ణ సంస్థ న‌డుచుకుంటుంది. కేంద్ర ప్ర‌భుత్వ‌మే సీబీఐని అన్నివిధాల క‌ట్ట‌డి చేస్తుంద‌నే ఆరోప‌ణ‌లు ఓపెన్ సీక్రెట్‌. తాజాగా మ‌ద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్య‌ల‌పై ఏపీలోనూ ప్ర‌ధానంగా చ‌ర్య జ‌రుగుతోంది. ఎందుకంటే, ఆ సీబీఐ ద‌యాదాక్షిణ్యాల‌పైనే ఆధార‌ప‌డి జ‌గ‌న్‌రెడ్డి బెయిల్ మీద బ‌య‌ట ఉంటూ ఏపీని త‌న ఇష్ట‌మొచ్చిన‌ట్టు పాలిస్తున్నారనే  చర్చ ఉంది. అమ‌రావ‌తిని ఆగం చేసిన పాపాన్ని మూట‌గ‌ట్టుకున్నారని.. టీడీపీ నేత‌ల‌ను కేసుల‌తో వేధిస్తున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశారని.. ఇలా సీఎం జ‌గ‌న్‌పై అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. అక్ర‌మాస్తుల కేసులో బెయిల్‌పై బ‌య‌ట ఉంటూ సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నారంటూ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు కోర్టులో కేసు వేయ‌డం కీల‌క ప‌రిణామం. సీఎం జ‌గ‌న్ వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్తు అంతా సీబీఐ పెట్టిన‌, పెట్ట‌బోయే బిక్ష మీదే ఆధార‌ప‌డి ఉంద‌ని అంటున్నారు. మ‌ద్రాస్‌ హైకోర్టు చెప్పిన‌ట్టు.. సీబీఐని పంజ‌రం నుంచి విడుద‌ల చేస్తే.. జ‌గ‌న్‌కు అస‌లైన సినిమా ఉంటుంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది. ఎంత‌కాద‌న్నా.. కేంద్ర ప్ర‌భుత్వంతో స‌న్నిహిత సంబంధాల ద్వారా.. సీబీఐని మేనేజ్ చేస్తూ జ‌గ‌న్ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని అంటున్నారు.  ఇక‌, సీబీఐ కోర్టులో బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పైనా సీబీఐ వైఖ‌రి వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. క‌ర్ణాట‌క‌లో బ‌ళ్లారికి వెళ్లేందుకు కూడా గాలి జ‌నార్థ‌న్‌రెడ్డిని అనుమ‌తించ‌ని సీబీఐ.. ఏపీలో మాత్రం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయ‌మంటూ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కుండా.. కోర్టు విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేయ‌డం అనుమానాస్ప‌దం అవుతోంది. బెయిల్ ర‌ద్దు చేయ‌మ‌న‌డం.. లేదంటే బెయిల్ కొన‌సాగించ‌మ‌న‌డం.. ఈ రెండూ కాకుండా త‌ట‌స్థంగా ఉండ‌టం.. వ్యూహాత్మ‌క‌మంటున్నారు. జ‌గ‌న్‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసులలో గ‌తంలో సీబీఐ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది. జ‌గ‌న్‌ను దాదాపు రెండేళ్లు జైల్లో ఉండేలా చేసింది. కేంద్రంలో రాజ‌కీయాలు మార‌డంతో.. జ‌గ‌న్‌కు సైతం జైలు నుంచి విముక్తి క‌లిగేలా సీబీఐ స‌హ‌క‌రించింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  అందుకే పంజ‌రంలో ఉన్న‌ సీబీఐకి స్వేచ్ఛ అవ‌స‌ర‌మ‌ని.. ఈసీ, కాగ్‌లానే సీబీఐకి స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఉండాల‌ని చెన్నై హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌కు  స‌ర్వ‌త్రా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అలా జ‌రిగితే.. సీబీఐకి స్వేచ్ఛ ల‌భిస్తే.. జ‌గ‌న్‌లాంటి వారికి ద‌బిడి దిబిడే అంటున్నారు..

రాసలీలల ఆడియో వైరల్.. ఆ వాయిస్ ఏపీ మంత్రిదేనని ప్రచారం

ఆంధ్రప్రదేశ్ లో ఓ రాసలీలల ఆడియా లీకై  వైరల్ గా మారింది. ఓ మహిళతో ఓ వ్యక్తి సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తం 2.20 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో టేపులో ఓ వ్యక్తి  నేరుగా ఓ మ‌హిళ‌కు ఫోన్ చేసి త‌న వ‌ద్ద‌కు రావాలంటూ కోరారు. అంతేకాకుండా త‌న వ‌ద్ద‌కు వ‌స్తే.. అన్ని బాగుంటాయ‌ని.. అన్ని ర‌కాలుగా బాగుంటుంది.. చెప్పిన మాట విను అంటూ త‌న‌దైన శైలిలో ప్ర‌లోభ‌పెట్టే య‌త్నం చేశారు.  ‘‘పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి రా.. ఓ అరగంటలో పంపిస్తా.’’ అంటూ  ఓ వ్యక్తి ఆ మహిళతో సరసాలాడటం ఈ ఆడియోలో వినిపిస్తోంది ఆ వ్యక్తి పిలుపున‌కు ఆ మ‌హిళ స‌సేమిరా అంటుండ‌గానే.. స‌రే మ‌రి నీ ఇష్టం.. నీళ్ల‌ను ద‌గ్గ‌రికి తీసుకురాగ‌లం కాని తాగించ‌లేం క‌దా.. అంటూ మ‌రింత‌గా రెచ్చిపోయారు. ఆ త‌ర్వాత త‌న వ‌ద్దకు వ‌స్తే.. అర‌గంట‌లోనే పంపించేస్తాన‌ని చెప్పాడు సదరు వ్యక్తి.అయితే ఆ మ‌హిళ న‌వ్వుతూనే ఆయన ఆఫ‌ర్ కు స‌సేమిరా అన్నారు. కింద సెల్లార్ వాకింగ్ చేస్తున్నాన‌ని ఆ మ‌హిళ అంటే.. స‌రే వ‌చ్చేయి అర‌గంట‌లో పంపిస్తాను.. నాతో అరగంట కూడా స్పెండ్ చేయలేవా?మాట‌ల‌కు, చేత‌ల‌కు చాలా తేడా ఉంటుంది.. అంటూ ఫ్ల‌ర్టింగ్ చేశారు ఆడియో టేపులో ఉన్న వ్యక్తి.  మహిళతో  సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియోలో ఉన్న వాయిస్ మంత్రి అవంతి శ్రీనివాస్‌దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సంభాష‌ణ‌లను బట్టి  అది అవంతి ఇల్లో, కార్యాల‌య‌మో అని.. ఆయన ఉన్న అపార్ట్‌మెంట్ లో నివ‌సిస్తున్న మ‌హిళే అని, అవంతితో ఆమెకు ముఖ ప‌రిచ‌యం కూడా ఉంద‌ని అర్ధ‌మ‌వుతోందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా మంత్రి రాసలీలలపై సోషల్ మీడియాలో మాత్రం హోరెత్తుతోంది.  గతంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రాసలీలల ఆడియో కూడా లీకై ప్రకంపనలు స్పష్టించింది. మ‌సాజ్ కోసం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌మైన ఓ మ‌హిళ తాను అడిగిన ప‌నుల‌న్నీ చేస్తుందా? అంటూ అడిగి అంబ‌టి రాంబాబు ఆడియోలో అడ్డంగా బుక్ అయిపోయారు. ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా.. దానిని ఖండిస్తూ రాంబాబు చాలా విష‌యాలే చెప్పారు. ఏడాది పాటుగా త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని, అందులో భాగంగానే ఆ ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని అన్నారు. ఆడియోలో ఉన్న వాయిస్ త‌నది కాద‌ని, ఇలాంటి వీడియోల‌ను త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు నమ్మొద్దంటూ చిలుక ప‌లుకులు ప‌లికారు.   ఈ త‌ర‌హా వీడియోలు బ‌య‌ట‌కు రాగానే.. త‌మ‌కేమీ తెలియ‌ద‌ని, కుట్ర‌పూరితంగా త‌మ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ ఎవ‌రో తామంటే గిట్ట‌ని వారు ఈ ఆడియోను బ‌య‌ట‌కు వ‌దిలార‌ని రాజ‌కీయ నేతలు చెబుతుంటారు.  గతంలో అంబ‌టి రాంబాబు కూడా త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని చెప్పారు.  ఆ త‌ర్వాత ఆయ‌న ఆ వ్య‌వ‌హారంపై ఆయన స్పందించలేదు.  త‌న‌పై కుట్ర చేసిన వారెవ‌ర‌న్న విష‌యాన్ని కూడా వెల్ల‌డించ‌లేదు. దీనిని బ‌ట్టి చూస్తుంటే.. తాజాగా విడుద‌లైన ఆడియోపైనా అవంతి కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. 

గ్యాంగ్‌రేప్‌లు కావు.. కట్టు కథలు! తేల్చేసిన హైదరాబాద్ పోలీసులు

పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. మీడియా తెగ హడావుడి చేసింది. దారుణం, కిరాతకం అంటూ వార్తలు ప్రసారం చేశాయి. ఇవి చూసిన జనాలు కూడా ఇంత ఘోరమా అంటూ ముక్కున వేలేసుకున్నారు. జాతీయ మహిళ కమిషన్ కూడా ఎంటరైంది. మహిళా సంఘాల ఆందోళనలు చేశాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరికి అసలు కథ తేల్చారు. అసలేం జరిగిందే తేలడంతో షాకవడం జనాల వంతైంది.  తెలంగాణలో ఆరోపణలు వచ్చిన రెండు గ్యాంగ్ రేప్ ఘటనలు ఫేక్ అని తేలింది. అవన్ని కట్టుకథలేనని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. అత్యాచారం జరగకున్నా యువతి కట్టుకథలు అల్లినట్లు వెల్లడించారు. అత్యాచారం ఘటనలో ఇద్దరు మహిళలు చెప్పిన ఫిర్యాదులో వాస్తవం లేదని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ అంజన్ కుమార్ మీడియాకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాంధీ ఆస్పత్రి ఘటనలో  యువతి చెబుతున్నట్టుగా ఎలాంటీ అత్యాచారం జరగలేదని చెప్పారు. మహిళల వ్యక్తిగత అవసరం కోసమే ఇదంతా చేశారని సీపీ తెలిపారు.  గాంధీ హాస్పిటల్ కు వచ్చిన ఇద్దరి అక్కా చెల్లెలకి కలిపిన కల్లు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న కొద్ది రోజులు కల్లు తాగకపోయే సరికి ఇద్దరు చాలా ఒత్తిడికి గురయ్యారని వివరించారు. ఈ సమయంలోనే అక్క బయటికి వెళ్ళిపోయిందని, అక్కని వెతుకు కుంటూ వెళ్ళిన చెల్లి బయట ఓ సెక్యూరిటీ గార్డుతో మాట్లాడుతూ పరిచయం చేసుకుందని వెల్లడించారు.. ఇది జరిగిన రోజే సెక్యూరిటీ గార్డుతో పరస్పర అభిప్రాయంతో 7వ ఫ్లోర్‌లో లైంగికంగా కలిశారని వెల్లడించారు.. ఆ తరువాత మరొకసారి గాంధీ ఆసుపత్రి సెల్లార్‌లో కూడా ఇలాగే జరిగిందని తెలిపారు.. ఈ క్రమంలోనే తన కోసం అక్క కొడుకు రావడంతో నిస్సహయంగా సెల్లార్ పడి ఉండడం చూసి ఇంట్లో తెలియడం వల్ల బాగుండదనే అభిప్రాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.  ఇక కొన్ని రోజులుగా ఆచూకి లభించకుండా వెళ్లిపోయిన ఆమె అక్క కూడా రెండూ రోజులు పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తితోనే గడిపిందని వెళ్లడించారు. ఈ సంఘటనలోల్యాబ్‌ టెక్నీషియన్‌ తప్పు ఏం లేనట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసును చేధించేందుకు  500 సీసీ కెమెరాలతోపాటు సుమారు 800 గంటల సీసీ ఫుటేజిని పరీశీలినట్టు హైదరాబాద్ సీపీ తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. అలాగే సంతోష్‌నగర్ గ్యాంగ్ రేప్ పూర్తిగా అభూతకల్పన అని పోలీసు అధికారులు తేల్చారు. ప్రియుడు తనని పెళ్లిచేసుకోనని చెప్పడంతో.. అతడిని కేసులో ఇరికించేందుకు ప్లాన్ వేశారని తెలిపారు. తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు రేప్ చేశారంటూ యువతి స్టోరీ అల్లిందన్నారు. రాత్రంతా చాంద్రాయణగుట్టలో తిరిగి.. రేప్ కథను తల్లికి చెప్పిందన్నారు. విచారణలో యువతి చెప్పిందంతా కట్టుకథగా నిర్ధారణ అయిందని పోలీసులు వివరించారు

వసూళ్లు చేసుకోండి.. వాళ్ల జోలికి మాత్రం రాకండి! ఎంపీడీవోకు వైసీపీ నేత వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బహిరంగంగానే బరి తెగిస్తున్నారు కొందరు నేతలు. ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు.. అధికారులపైనా జులుం ప్రదర్శిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ముఖ్య నేత ఎంపీడీవో అధికారిని ఓపెన్ గానే బెదిరించాడు. ఆయన అధికారికి వార్నింగ్ ఇచ్చిన ఆడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వసూళ్లు చేసుకోండి.. లంచాలు తీసుకోండి.. కాని వాళ్ల జోలికి మాత్రం వెళ్లకండి అంటూ వైసీపీ నేత చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది.  ప్రభుత్వ అధికారులపై వైసీపీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సమక్షంలోనే ప్రభుత్వ అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. వలంటీర్ల జోలికి వస్తే ఖబడ్దార్ అని ఎంపీడీవోను శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. వాలంటీర్లకు కేవలం ఐదు వేలు  మాత్రమే ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఐదు వేల రూపాయలతో మోటార్ సైకిల్ పెట్రోల్, టీ ఖర్చులు కూడా రావడం లేదన్నారు. అలాంటి వలంటీర్లపై లేనిపోని అభాండాలు వేసి సస్పెండ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ ఎంపీడీవో‌ను శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. " నీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. పబ్లిక్ సర్వెంట్ వలంటీర్ల జోలికి రావద్దు. నాయకుల మాటలు విని వలంటీర్ల జోలికి వస్తే నీ ఉద్యోగం ఊడుతుంది. మీ ఎంపీడీవో కార్యాలయాన్ని చుట్టుముట్టి జరిగిన తప్పులను ఎండగడతాం" అని ఎంపీడీవోను శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. " మీ వసూళ్ళు మీరు చేసుకోండి, లంచాలు తీసుకోండి, కాంట్రాక్టులు మీరు చేసుకోండి, మీ దోపిడీ మీరు చేసుకోండంటూ" అధికారులకు శ్రీనివాస్‌రెడ్డి సలహా ఇచ్చారు. శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాలంటీర్ల కోసం మాట్లాడటం బాగానే ఉంది కాని.. అధికారులను లంచాలు తీసుకోమని చెప్పడం ఏంటని జనాలు నిలదీస్తున్నారు. ఎంపీడీవోను వైసీపీ నేత బెదిరించడంపై ఉద్యోగ సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

తాలిబన్ల సీక్రెట్ మీటింగ్.. ఇక అరాచకమేనా?  

ఆఫ్ఘనిస్థాన్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అఫ్గానిస్తాన్‌లోని అనేక నగరాలు, పట్టణాలలోస్థానిక ప్రజలు జాతీయ జెండాలతో ర్యాలీలు తీశారు.  జలాలాబాద్‌లో నిరసనకారులు.. తాలిబాన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరోవైపు కాబూల్ ను క్యాప్చర్ చేసిన మరుక్షణం నుంచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్ల అధినాయకత్వం రహస్య మంతనాల్లో మునిగిపోయింది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ అజ్ఞాత ప్రదేశంలో అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలకమైన సమాచారం పంచుకున్నారు. రెండురోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూ బాహ్య ప్రపంచంలోకి రాావడానికి 48 గంటల సమయం తీసుకుంది. ఆ సమాచారం ప్రకారం తాలిబాన్ సుప్రీమ్ లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా.. ఆఫ్ఘనిస్థాన్ లో అడ్మినిస్ట్రేషన్ ను పర్యవేక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. దాదాపుగా ఇదే ఫైనల్ కావచ్చని తాలిబన్ అధికార ప్రతినిధి జబిఉల్లా ముజాహిద్ ట్విట్టర్లో అనౌన్స్ చేశాడు. పరిపాలనపరంగా ఆఫ్ఘనిస్థాన్ కు నిర్ణయించిన పేరును, దాని ఎంబ్లెమ్ ను కూడా ఆయన విడుదల చేశాడు. దాని ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ ను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ (ఐ.ఇ.ఎ.) గా నామకరణం చేసినట్లు వెల్లడించారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్లో పరిపాలన అనేది ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థలోకి మారుతోంది కాబట్టి.. అది కూడా అకస్మాత్తుగా చేతులు మారుతున్న అధికారం ఎలాంటి అనూహ్యమైన పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘన్లో ఓవరాల్ ఇంచార్జీ ఎవరు.. అధ్యక్షుడిగా ఎవరుంటారు... పరిపాలనను ఎలా నిర్వహిస్తారు... ఉద్యోగులను ఎలా రిక్రూట్ చేస్తారు.. తక్షణం కావాల్సిన సైన్యాన్ని ఎలా సమకూర్చుకుంటారు.. ఇప్పుడున్న అమెరికా, నాటో సైన్యాన్ని ఏం చేస్తారు.... పైలెట్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు.. ఇలాంటి ప్రశ్నలన్నీ ముసురుకుంటున్నాయి. ఇలాంటి దశలో ఈ రహస్య సమావేశం నుంచి కొంతవరకు క్లారిటీ రావడం విశేషం.  ఆఫ్ఘనిస్థాన్లో పరిపాలనను పర్యవేక్షించే సుప్రీం లీడర్ కు ముగ్గురు డిప్యూటీలు ఉంటారు. వారిలో ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ ఒకరు. అలాగే హక్కానీ నెట్వర్క్ ఇంచార్జ్ గా ఉన్న సిరాజుద్దీన్ హక్కానీ రెండో వ్యక్తి. ఇక దోహాలో తాలిబన్ రాజకీయ ప్రధాన కార్యాలయానికి నాయకత్వం వహిస్తున్న అబ్దుల్ ఘనీ బరాదర్ మూడో డిప్యూటీగా ఉంటారు. ఈ ముగ్గురి సహకారంతో అఖుంద్జాదా పరిపాలన పర్యవేక్షిస్తారు. ఆఫ్ఘన్లో పరిపాలన కోసం ఓ మండలిని ఏర్పాటు చేస్తారని, ఆ మండలి పర్యవేక్షణలోనే మిగతా నెట్వర్క్ అంతా పనిచేస్తుందని నిర్ణయించారు. మండలికి టాప్ రేంజ్ లో ఉన్న అఖుంద్జాదానే దేశాధ్యక్షునికి సమాన హోదాలో ఉంటారని, అయితే ఆయన డిప్యూటీల్లో ఎవరికైనా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి తాను పైనుంచి సూపర్ వైజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని స్పోక్స్ పర్సన్ జబిఉల్లా చెబుతున్నాడు. దీన్నిబట్టి మరిన్ని దఫాల చర్చలు జరిగి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని గానీ, తాత్కాలిక ప్రభుత్వాన్ని గానీ ఏర్పాటు చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ ప్రభుత్వ నమూనా ఎలా ఉంటుందనేది కూడా పూర్తి నిర్ణయం జరగలేదు. మొత్తానికి షరియా-లా ప్రకారమే ఉంటుందని, అదే తమకు ఫైనలని చెబుతున్నారు.  ఇక ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లకు ఇప్పటికిప్పుడు ఎదురవుతున్న భద్రతాపరమైన సమస్య ఏంటంటే... తమను తాము రక్షించుకోవడం ఎలా? ఎందుకంటే తాలిబన్లకు పెద్దసంఖ్యలో సాయుధ సైనికులు ఉన్నారు గానీ... ఆకాశమార్గాన ఎదురయ్యే దాడులను ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు. తమ దగ్గర ఇప్పుడైతే పైలట్లు లేరని... టర్కీ, జర్మనీ, యూకేల్లో రహస్యంగా శిక్షణ పొందుతున్న తమవారిని రప్పించుకుంటామంటున్నారు. ఆఫ్ఘన్ నుంచి పొరుగుదేశాల్లో ల్యాండై ఉన్న మిలిటరీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తమకు తిరిగివ్వాలని ఆయా దేశాలకు వర్తమానం పంపుతున్నారు. ఆఫ్ఘన్ కు చెందిన 22 మిలిటరీ ప్లేన్లు, 24 హెలికాప్టర్లు ఉజ్బెకిస్తాన్లో ఉన్నాయి. వాటిని తిరిగివ్వాలంటున్నారు. అలాగే దేశంలోని వైమానిక స్థావరాల్లో, సైనిక స్థావరాల్లో ఉన్న విమానాలను నడిపే సామర్థ్యం తమకు లేదని బాహాటంగానే చెబుతుండడం విశేషం. మరోవైపు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నవారిని పైలట్లు వచ్చి ఉద్యోగాల్లో చేరాలని కోరుతున్నామంటున్నారు.  ఇక ఆఫ్ఘన్లో అమెరికా-నాటో దళాల నుంచి సుశిక్షితులైన సైనికులు సాయుధులై దాదాపు 3 లక్షల మంది అక్కడే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 20 ఏళ్లలో నాటో దళాలు వేలాది మంది తాలిబన్లను కాల్చి చంపాయి. మరిప్పుడు తాలిబన్ల రాజ్యం వచ్చాక నాటో సైనికుల్ని ఏం చేస్తారన్నది ఆందోళన రేపుతోంది. తాలిబన్లు తాము అనుకున్నదానికన్నా చాలా తొందరగా వచ్చారని అగ్రరాజ్యాధినేత బైడెన్ చెప్పడం కలవరం కలిగిస్తోంది. అంటే దళాలన్నింటినీ షిఫ్టు చేయాలనుకున్నా చేయలేకపోయారని బైడెన్ ఆందోళన చెందుతున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటారా... లేక నాటో దళాలను దేశం విడిచి పోవాలని హెచ్చరిస్తారా అన్నది ఇంకా ఎటూ తేలలేదు. ఒకవేళ ఘనీ మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ వస్తా అంటున్నాడు కాబట్టి... త్వరలోనే మళ్లీ సాయుధులైన నాటో దళాల సహకారం తీసుకొని యుద్ధం కొనసాగిస్తాడా అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు... ఆయుధాలు చేబూనిన నాటో సైనికులను నియంత్రించేవారు ఎవరూ లేకపోవడంతో రోడ్ల మీద పడి అరాచకం సృష్టిస్తారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఇలాంటివాటిని నయా తాలిబన్ అధినాయకత్వం ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి..

వరంగల్ దళిత దండోరా సభకు రాహుల్.. కేసీఆర్ ను వణికించేలా రేవంత్ ప్లాన్ 

తెలంగాణ పీసీసీ చీఫ్ గా తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి.. వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఒక రకంగా అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పీసీసీ చీఫ్ కాగానే చలో రాజ్ భవన్ పిలుపుతో సర్కార్ కు చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి. తర్వాత దళిత గిరిజన దండోరా సభలతో గర్జిస్తున్నారు. మొదట ఇంద్రవెల్లిలో నిర్విహంచిన దండోరా సక్సెస్ కావడంతో అదే ఊపుతో రావిర్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేశారు.  దండోరా సభలకు జనాలు పోటెత్తడం.. సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగాలు అనూహ్య స్పందన వస్తుండటంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే జోష్ తో వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి.  కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణకు వస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 17న వరంగల్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఆ సభకు రాహుల్ గాంధీ వచ్చేలా స్కెచ్ వేస్తున్నారు. వరంగల్ సభకు రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అంతలోపే వారానికొకటి చొప్పున మరో నాలుగు దళిత దండోగా గిరిజన సభలు నిర్వహించబోతున్నారట. చివరి సభగా తెలంగాణ విమోచన దినోత్సవం అయిన సెప్టెంబర్ 17న రాహుల్ గాంధీని రప్పించి .. దాదాపు ఐదు లక్షల మంది భారీ సభకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అసంతృప్తిని చల్లార్చి సీనియర్లను మచ్చిక చేసుకొని.. అందరికీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి చాలా పకడ్బందీగా ముందుకెళుతున్నారు. పార్టీ బలోపతంపై స్పష్టమైన లక్ష్యంతో రేవంత్ ముందుకెళుతున్నారు.  బహిరంగ సభలతో పాటు నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్లు తెలిసింది. బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని స్పష్టమైన సంకేతాలు పంపాడట.. ఈ క్రమంలోనే 119 నియోజక వర్గాలకు ఇంచార్జి ఎలా పని చేశారో వారి పనితీరుకు ఇదో కొలబద్దగా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.. క్షేత్ర స్థాయిలో పని చేసిన వారి పనితీరుతోనే పార్టీ బాగు పడుతుందని ఈ క్రమంలోనే 17 పార్లమెంట్ లలో ప్రత్యేక నివేదికలు తయారు చేయాలని నిర్ణయించారు. ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు అయినా నియోజక వర్గంలో వారి పనితీరు పైన నివేదిక ఇవ్వాలని తన టీంకు పురమాయించాడట.పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలని సూచించారు.నియోజకవర్గంలో ఉన్న నాయకులకు సమన్వయ కర్తలు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దళిత, గిరిజనులే టార్గెట్ గా  రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వర్గాలకు గతంలో కాంగ్రెస్ అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూనే.. ప్రస్తుత కేసీఆర్ సర్కార్ ఎలా మోసం చేస్తుందో చెప్పేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని, ఆరోగ్య శ్రీని ఆపేశారని. అంశాలను ఏజెండాలో చేర్చాలని రేవంత్ నిర్ణయించుకున్నారట. బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అమలు చేసి ఉంటే వేలాది దళిత, గిరిజన కుటుంబాలు ఆత్మ గౌరవంతో బతికేవని ఉద్యోగాల అంశాన్ని నెత్తిన ఎత్తుకోవాలని రేవంత్ నిర్ణయించారు.గ్రేటర్ హైదరాబాద్ లో వరదల్లో కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తా అని ఎగ్గొట్టాడని..హైదరాబాద్ లో 10 వేలు ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఎలా ఇస్తారన్న అంశాన్ని హైలెట్ చేయాలని రేవంత్ ప్లాన్ సిద్ధం చేశారని అంటున్నారు.ఇందులో భాగంగా ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని అంటున్నారు. 

నోట్ల కట్టలు కాదు కట్టు బట్టలతో పారిపోయా.. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ వస్తానంటున్న ఘనీ

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షడు ఆష్రఫ్ ఘనీ.. దేశం విడిచి పారిపోయిన 3 రోజుల తరువాత మొదటిసారిగా మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడిన వీడియోను పలు అరబ్ చానల్స్ ప్రసారం చేశాయి. తాలిబన్లు కాబూల్ ను ఆక్రమించుకుంటూ ఉండగానే ఘనీ అధ్యక్ష భవనం ఖాళీ చేసి ఎవరి కంటా పడకుండా పారిపోయారు. అతను కిర్గిజిస్తాన్, తుర్కిమెనిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కడికో పారిపోయి ఉంటాడని అనుమానించారు. అయితే తాను అరబ్ ఎమిరేట్స్ లో తల దాచుకున్నానని తనకుతానుగా రివీల్ చేశారు. తాను ఎందుకు ఆఫ్ఘనిస్థాన్ విడిచి వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకున్నారు. దేశం మీద జరిగిన దురాక్రమణను ఖండిస్తూ దేశ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.  నేను చెప్పులు విప్పి, కనీసం షూ వేసుకునే టైమ్ కూడా లేదని, అలాంటి పరిస్థితుల్లో తాను కాబూల్ ను వీడాల్సి వచ్చిందని చెప్పారు. తాను భారీ ఎత్తున సొమ్ముతో ఉడాయించినట్లు వచ్చిన పుకార్లను ఎవరూ నమ్మవద్దని, గొప్పనైన ఆఫ్ఘనిస్థాన్ సంస్కృతిని మలినం కాకుండా చూసేందుకు, అరాచక శక్తుల మీద తిరుగుబాటు చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ వస్తానని నమ్మబలుకుతున్న ఘనీ.. అందుకోసం తాను సంప్రదింపుల్లో మునిగిపోయినట్లు చెప్పడం ఆసక్తి రేపుతోంది. పాతికేళ్లలో రెండోసారి కాబూల్ ను కబ్జా చేసిన తాలిబన్లు ఈసారి రెచ్చిపోయిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. పరిపాలన ఎవరి చేతుల్లోకి వెళ్తుందో, పాలనను ఎలా ఆర్డర్ లో పెడతారో అర్థం కాని పరిస్థితులు పేరుకుపోయిన క్రమంలో ఘనీ సంప్రదింపుల ముచ్చట... మరేదైనా విదేశీ శక్తుల అండకోసం ప్రయత్నిస్తున్నాడా అన్న అనుమానాలకు తావిస్తోంది.  తాను అక్కడే ఉంటే గనక కొత్తగా ఎలక్టయ్యే అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తిని తాలిబన్లు బహిరంగంగా ఉరి తీసి ఉండేవారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అల్లకల్లోలానికి కారకులయ్యేవారని.. అయితే అలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు, ఆ ఉపద్రవం నుంచి ప్రజలను కాపాడేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో యూఏఈ వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చారు ఘనీ. ఆఫ్ఘన్ ప్రజల మర్యాదను, వారికి దక్కాల్సిన న్యాయాన్ని అందించేందుకు శతవిధాలా కృషి చేస్తున్నట్లు యూఏఈ నుంచి వాయిస్ వినిపించారు. తన పాలనలో ఆఫ్ఘన్ సాధించిన అభివృద్ధిని కాపాడుకోవాలని, అరాచక శక్తుల చేతుల్లోకి దేశ వారసత్వాన్ని వెళ్లకుండా చూడాలని, ఇందుకోసం ప్రజలంతా కలిసి రావాలని కోరారు. ప్రజలకు సేవలందిస్తూ గౌరవ ప్రదంగా చనిపోవడానికి తానెప్పుడూ భయపడేవాణ్ని కానని, కేవలం ప్రపంచంలో ఆఫ్ఘనిస్థాన్ గౌరవ మర్యాదలకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే కాబూల్ ను వీడినట్లు చెప్పుకొచ్చారు. ఖజానాలోని సొమ్మంతా తీసుకొని వచ్చినట్లు వచ్చిన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  అయితే ఘనీ స్టేట్ మెంట్ మీద నెటిజన్ల నుంచి వ్యతిరేక కామెంట్లే ఎక్కువొస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ ముస్లిం సమాజం తాలిబన్లను స్వాగతిస్తుండగా... ఘనీ చెబుతున్నవన్నీ కల్లబొల్లి కబుర్లంటూ ట్రోల్ చేస్తున్నారు. ఘనీ 169 మిలియన్ డాలర్ల సొమ్ముతో ఉడాయించాడని, సూట్ కేసుల నుండా కరెన్సీ కట్టలు సర్దుకొని తాలిబన్లకు చిక్కకుండా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయితే ఆయన ఫస్ట్ వాయిస్ అనేది అత్యంత బలహీనంగా ఉందని, మళ్లీ కాబూల్ కు వెళ్తే ఘనీని కాల్చి చంపడమో, ఉరి తీయడమో ఖాయమని, అమెరికా తొత్తు అయిన ఈ ముసలి వ్యక్తికి చావే సరైన శిక్ష అంటూ అత్యధిక మంది ముస్లింలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఘనీ నిజంగా ఆఫ్ఘనిస్థాన్ రావడం సాధ్యమేనా.. తాను  అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నదాంట్లో ఎంతవరకు వాస్తవముంది... అసలు అమెరికా, నాటో దళాలే వెనుదిరిగిపోతే ఒంటరి ఘనీ ఏం చేస్తాడన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిమీద క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.