భార‌త్‌కు పాక్ మ‌రో షాక్‌.. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబ‌ర్‌..

బాబ‌ర్ అజామ్‌. పాకిస్తాన్ కెప్టెన్‌. ఈ పేరు అంద‌రికంటే ఇండియన్స్‌కే ఎక్కువ గుర్తుంటుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన ఘ‌నుడు. వాడు మామూలుగా ఆడ‌టం లేదు. ర‌న్స్‌తో పాటు రికార్డ్సూ కొల్ల‌గొడుతున్నారు. వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా, భార‌త్‌కు మ‌రో షాక్ ఇచ్చాడు ఈ పాక్ కెప్టెన్‌. టీమిండియా సూప‌ర్ స్టార్ కోహ్లీ రికార్డుతో పాటు భార‌తీయుల గుండెల‌నూ బ్రేక్ చేశాడు బాబ‌ర్‌. తాజాగా, ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచి.. గ్రూప్-2 లో వరుసగా మూడు విక్ట‌రీల‌తో దూసుకుపోతోంది. ఆ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 51 పరుగులు పూర్తి చేసి టీ20 క్రికెట్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆట‌గాడిగా నిలిచాడు. కోహ్లీని దాటేశాడు. 26 ఇన్నింగ్స్‌ల‌తో బాబ‌ర్ 1000 ర‌న్స్ కంప్లీట్ చేశాడు. దీంతో 30 ఇన్నింగ్స్‌లో వెయ్యి ప‌రుగుల‌తో కోహ్లీ పేరున ఉన్న రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టాడు బాబ‌ర్‌.  ఇక‌, కోహ్లీ త‌ర్వాత స్థానంలో.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ (31 ఇన్నింగ్సుల్లో), ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (32 ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36 ఇన్నింగ్సుల్లో) నిలిచారు.  అటు.. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా టీ20ల్లో రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ర‌షీద్‌ఖాన్ త‌ర్వాతి పొజిష‌న్లో.. శ్రీలంక మాజీ బౌలర్ లసిత్ మలింగపై 76 (ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (82 ఇన్నింగ్సుల్లో), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ (83 ఇన్నింగ్సుల్లో) ఉన్నారు. ఇక‌, రషీద్ ఖాన్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు. వ‌న్డేల్లో 44 ఇన్నింగ్సుల్లోనే ర‌షీద్‌ ఈ రికార్డు నెలకొల్పాడు.   ఇలా, బ్యాటింగ్‌లో పాకిస్తాన్ నుంచి బాబ‌ర్‌.. బౌలింగ్‌లో అఫ్ఘ‌నిస్తాన్ త‌ర‌ఫున ర‌షీద్‌ఖాన్‌.. ఇలా అండ‌ర్ డాగ్ టీమ్‌లుగా ప‌రిగ‌ణించే జ‌ట్ల నుంచి ఇలా ప్ర‌పంచ అత్యుత్త‌మ ఆట‌గాళ్లు ఉండ‌టం విశేషం.   

బిగ్ బ్రేకింగ్ : ఈటల రాజేందర్ వాహనాలు సీజ్.. పీఆర్వో అరెస్ట్

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడుతున్నారు. డబ్బులు పంచుతున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించుకుంటున్నారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పోలీసులు షాకిచ్చారు.హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేసి, పీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. అంతకుముందు  ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పదుల సంఖ్యలో కార్యకర్తలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నారని ఆరోపించింది.   

జ‌గ‌న్ ఆట‌క‌ట్టిస్తా.. ప్ర‌భుత్వంపై తిరుగుబాటుకు చంద్ర‌బాబు పిలుపు..

వైసీపీ నాయ‌కుల ఆట‌క‌ట్టిస్తానంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పన్నులతో దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమను హస్తగతం చేసుకొని వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని మండిప‌డ్డారు చంద్ర‌బాబు.  సొంత నియోజకవర్గమైన‌ కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన జోరుగా కొన‌సాగుతోంది. తొలుత లక్ష్మీపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించి.. అక్కడి నుంచి వరదరాజస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. మ‌ధ్య‌లో స్థానికుల‌తో క‌లిసి మాట్లాడారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ప్ర‌భుత్వ పాల‌నా తీరుపై టీడీపీ అధినేత‌కు ఫిర్యాదులు చేశారు స్థానిక ప్ర‌జ‌లు.  అనంత‌రం భారీ ర్యాలీ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. వైసీపీ పాలనలో రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయింద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరెంటు ఛార్జీలు.. ఆర్టీసీ ఛార్జీలు.. ప‌థ‌కాల్లో కోత విధిస్తోంద‌ని చంద్రబాబు మండిపడ్డారు.  

జ‌గ‌న్‌కు సీబీఐకు ఒకే లాయ‌ర్‌.. డైరెక్టర్‌కు రఘురామ ఫిర్యాదు..

అరాచకాలకు కేరాఫ్ వైసీపీ సర్కార్ అనే విమర్శ ఉంది. జగన్‌రెడ్డి ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌తీ నిర్ణ‌య‌మూ వివాదాస్ప‌దం అవుతోంది. అస‌లు జ‌గ‌న్‌కు రాష్ట్రాన్ని పాలించే హ‌క్కే లేదంటూ.. బెయిల్‌పై బ‌య‌ట ఉంటున్న ముఖ్య‌మంత్రిని మ‌ళ్లీ జైలుకే త‌ర‌లించాలంటూ ఎంపీ ర‌ఘురామ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్న‌ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జ‌గ‌న్‌కు ప‌రోక్షంగా సాయ‌ప‌డుతున్న‌ సీబీఐ తీరును త‌ప్పుబ‌డుతున్నారు ర‌ఘురామ‌. జ‌గ‌న్‌-సీబీఐ స‌హ‌కారంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గానే.. మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. జ‌గ‌న్‌రెడ్డి-వైసీపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున కేసులు వాదించే న్యాయ‌వాది పి.సుభాష్‌ను.. సీబీఐ సైతం త‌మ లాయ‌ర్‌గా నియ‌మించుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సీబీఐ తీరును ఎంపీ ర‌ఘురామ తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ఆ నిర్ణ‌యంపై నేరుగా సీబీఐ డైరెక్ట‌ర్‌కు లేఖ రాశారు.  జగన్మోహన్‌రెడ్డి తరపు న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడాన్ని త‌ప్పుబ‌డుతూ సీబీఐ డైరెక్ట‌ర్‌కు లేఖ రాశారు ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు. న్యాయవాది పి.సుభాష్... జగన్ అక్రమాస్తుల కేసులను వాదించారని తెలిపారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య, డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద మృతి సహా, వైసీపీ నేతలు న్యాయమూర్తులను దూషించడంపై కూడా సీబీఐ విచారణ జరుపుతోందన్నారు. ఇలాంటి విచారణ నేపథ్యంలో సీబీఐ తరపున పి.సుభాష్‌ను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించడం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోందన్నారు ర‌ఘురామ‌.  న్యాయమూర్తులపై దూషణల కేసును నేరుగా పర్యవేక్షణ చేయమని హైకోర్టు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తరపున పని చేసిన న్యాయవాదిని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ నియమించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు కోసం సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి.సుభాష్‌ని తొలగించాలని లేఖ‌లో డిమాండ్ చేశారు ర‌ఘురామ‌.   

ఓటుకు నోట్లు.. దొంగ ఓటర్లు! ఉప ఎన్నికల్లో అధికార పార్టీల బరి తెగింపు..

ఉప ఎన్నికలు జరుగుతోంది ఒక్క ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదు. ఒక్క బద్వేల్, హుజూరాబాద్  అసెంబ్లీ నియోజక వర్గాలలో మాత్రమే కూడా కాదు. దేశం మొత్తంలో మరో 27 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలకు కూడా ఇదే రోజున ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో,  ఎన్నికల జరుగతున్న తీరుకు, ఇతర రాష్ట్రాలలో ఎన్నికల తీరుకు పొంతన కుదరడం లేదు.  తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి రాను రాను రాజు గుర్రం గాడిద అయ్యింది అన్నట్లుగా ప్రజాస్వామ్య ప్రమాణాలు పతనమవుతున్నాయి. హుజూరాబాద్ లో సుమారు మూడు నెలలకు పైగా సాగిన ఎన్నికల జాతరలో ఇటు పార్టీలు, అటు ప్రభుత్వం కూడా వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. రెండున్నర సంవత్సరాల పదవీ కాలం కోసం ప్రధాన పార్టీలు రెండూ రెండున్నర మూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం చివరకు ఓటుకు ఆరు నుంచి పదివేల రూపాయల వరకు ఓటర్లకు ఇవ్వడం ... డబ్బులు ముట్టని ఓటర్లు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడం, ఇవన్నీ,తెలుగు రాష్ట్రాలలో దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలకు సంకేతంగా నిలుస్తున్నాయి. పతనమవుతున్న ప్రజాస్వామ్య విలువలకు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక సజీవ తార్కాణంగా  నిలుస్తుందంటున్నారు.  ఇంతకాలం  పోలింగ్ కు ముందు ఓటర్లకు డబ్భులు పంచడం ఒక సంప్రదాయంగా మాత్రమే ఉంది. కానీ, ఇప్పుడు, ఓటర్లు రోడ్డు మీదకు వచ్చి ఓటుకు రేటు డిమాండ్ చేస్తున్నారు. అంటే అది హక్కుగా భావించే స్థితికి పరిస్థితి దిగజారింది. ముందు ముందు పండిన పంటకు గిట్టుబాటు ధర లేదా కనీస మద్దతు ధర లాగా ఓటుకు గిట్టుబాటు, కనీస మద్దతు ధరలను డిమాండ్ చేసే రోజులు వచ్చినా రావచ్చును. ఒక్క రెండు రోజుల్లో తెరాస, బీజేపీ పార్టీల అభ్యర్ధులు 250 కోట్ల రూపాయలు ఓటర్లకు పంచారని వస్తున్న వార్తలు నిజమే అయితే, ప్రజాస్వామ్యం అనే మాటకు కొత్త అర్థం వెతుక్కోవలసివస్తుంది.   ఇక్కడ ఇలా ఉంటే సోదర తెలుగు రాష్ట్రం ఏపీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గానికి జరుగతున్న ఉప ఎన్నికలో, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ పోటీలో లేకున్నా, అధికార వైసీపీ, అన్ని రకాల అక్రమాలు సాగిస్తూనే ఉంది. మరీ హుజూరాబాద్ స్థాయిలో కాకపోయినా అక్కడా వైసీపీ ఓటుకు రెండు వేలరూపాల వంతున డబ్బులు పంచుతోంది. తాగినోడికి తాగినంత మందు పోస్తోంది. అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యం, ఉప ఎన్నికను అభాసుపాలు చేశాయి దీనితో పాటుగా, అధికార వైసీపే ఇరుగు పొరుగు నియోజక వర్గాల నుంచి జనాలను బస్సుల్లో తరలింఛి దొంగ ఓట్లు వేయించే వినూత్న ప్రయోగం చేస్తోంది.  నిజానికి  వైసీపీ  తిరుపతి ఉప ఎన్నికలలోనే ఈ ప్రయోగం చేసినిది. ఇప్పడు బద్వేల్ లో కొనసాగిస్తోంది. భవిష్యత్ ‘లోనూ ఇదే పంధాను అనుసరించినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు వినూత్న వికృతులని పరిచయం చేశాయి. 

మీడియా వాహనాలు, రిపోర్టర్ల ద్వారా డబ్బు పంపిణీ..

హుజూరాబాద్ లో డబ్బు పంపిణీ కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల కొనుగోలులో కొత్త దారులు పోతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న మొండి పట్టుదలతో అధికార పార్టీ అనూహ్యమైన ఎత్తుగడలు వేస్తోంది. పోలింగ్ ముందురోజు రాత్రి వరకూ ఓటర్లకు డబ్బు పంపిణీలో ఉన్న పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ... పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా నోట్ల కట్టలతో రెడ్ హేండెడ్ గా పట్టుబడింది.  టీ-న్యూస్ ఫేక్ ఐడీ  కార్డులతో  కొందరు అధికార పార్టీ నాయకులు రిపోర్టర్లుగా బుకాయిస్తూ ఏకంగా బూత్ ల దగ్గరే డబ్బు పంపిణీ చేస్తుండడం ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను నిరాశపరుస్తోంది. అయితే అధికార పార్టీ ఎక్కడెక్కడ, ఏ విధంగా అడ్డదార్లు తొక్కే  అవకాశం ఉందో అంచనా వేసిన బీజేపీ నాయకులు ప్రతి బూత్ దగ్గర కూడా తమ కార్యకర్తలను, ఆయా గ్రామాల్లోని మహిళలను నిఘా కోసం పెట్టారు. వారంతా అధికార పార్టీ ఆగడాలు అడ్డుకునేందుకే పోలింగ్ బూత్ ల దగ్గర కాపలా కాస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఓ స్థానికేతరుడు తాను టీ న్యాస్ రిపోర్టర్ని అంటూ బుకాయిస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ వ్యక్తిని అనుమానించిన స్థానికులు అడ్డుకోవడంతో ఆయన దగ్గర నోట్లు బయటపడ్డాయి.   ఇలా వీణవంక, ఘన్ముక్ల, కమలాపూర్.. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. అనేక చోట్ల టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. వారిని సముదాయించడం, శాంతింపజేయడం, ఆ తరువాత ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా కొనసాగించడం పోలీసులకు సవాలుగా మారింది. ఎన్నికల్లో ప్రలోభాల కోసం ప్రయత్నిస్తున్న కొందరు నాయకులు ఫేక్ ప్రెస్ ఐడీ కార్డులతో బయటకొచ్చే అవకాశం ఉందని, ఎవరైనా పేపర్ పేరు చెప్పి, మీడియా పేరు చెప్పి ప్రలోభపెడితే వారిని నమ్మరాదని, తమకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ముందురోజే హెచ్చరించడం విశేషం. వారు హెచ్చరించినట్టుగానే ఉదయం ఫేక్ టీ-న్యూస్ ఐడీ కార్డులతో బూత్ ల దగ్గర తచ్చాడిన వ్యక్తులు కనిపించడం గమనించాల్సిన అంశం. మరోవైపు ఓటర్లను,  బీజేపీ కార్యకర్తలను, గతంలో టీఆర్ఎస్ లో ఉండి ఈ మధ్యే బీజేపీలో చేరిన పలువురిని అధికార పార్టీ నేతలు బెదిరించడం సంచలనంగా మారుతోంది.  తాము తల్చుకుంటే ఒకే ఒక్క నిమిషంలో మీ అందరినీ మాయం చేస్తామని బీజేపీ నాయకులకు వార్నింగ్స్ ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈటల రాజేందర్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బహిరంగ బెదిరింపులు, బహిరంగ నోట్ల పంపిణీ జరుగుతున్నా ఈసీ అసమర్థంగా వ్యవహరిస్తోందని, అసలు ఈసీ కనుసన్నల్లోనే నోట్ల పంపిణీ జరుగుతుందా అన్న అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు.  టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నా.. అతనికి అన్ని బూత్ లలోకి వెళ్లే అధికారం ఉన్నా.. ఆయన వస్తే ఓటర్లను ప్రలోభపెడతాడని, ఆయన బూత్ ల దగ్గరికి రావొద్దని ఓటర్లు అడ్డుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఇందుకోసం మహిళలు పెద్దసంఖ్యలో ముందుండడం అధికార పార్టీని వణికిస్తోంది. నోట్లు పంచుతున్నారంటూ టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గరున్న నోట్లు కూడా స్వాధీనం చేసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దీన్నిబట్టి నోట్లు పంచే కార్యక్రమం ఎంత పకడ్బందీగా సాగుతుందోో అర్థం చేసుకోవచ్చు

కుప్పంలో చంద్ర‌న్న వ్యూహాలు.. త‌మ్ముళ్ల జేజేలు..

కుప్పం చంద్ర‌బాబు అడ్డా. ద‌శాబ్దాలుగా ఆయ‌నే రారాజు.  ఓటమి ఎరుగని నాయకుడు. వైసీపీ నేత‌లు ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు, దౌర్జ‌న్యాలు, ఆగ‌డాలు చేసినా.. కుప్పంలో చంద్ర‌బాబు చిటికెన వేలు కూడా ట‌చ్ చేయ‌లేమ‌నే విష‌యం వాళ్ల‌కు కూడా తెలుసు. అందుకే, అధికార పార్టీలో అంత అస‌హ‌నం. అది భ‌రించ‌లేకే.. టీడీపీ ఫ్లెక్సీల‌ను చించేయ‌డం.. క‌రెంట్ క‌ట్ చేయ‌డం.. స‌భ‌లో ఉద్రిక్త‌త‌లు రాజేయ‌డం.. లాంటి చిల్ల‌ర చేష్ట‌ల‌కు దిగుతున్నారు. వాట‌న్నిటికీ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు త‌మ్ముళ్లు ధీటుగా జ‌వాబిస్తున్నారు. గ‌ట్టిగా ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ల‌భించిన అనూహ్యం మ‌ద్ద‌తు, భారీ ఘ‌న స్వాగ‌తం చూశాకైనా.. కుప్పంలో బాబు ప‌వ‌రెంతో ప్ర‌త్య‌ర్థుల‌కు తెలిసొచ్చి ఉంటుంది.  ఇక‌, కుప్పంలో చంద్ర‌బాబు రెండోరోజు కీల‌క స‌మీక్ష‌లు జ‌రుపుతున్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎల‌క్ష‌న్ల‌లో వైసీపీకి వార్ వ‌న్‌సైడ్ కావ‌డంతో.. కుప్పంలో అధికార పార్టీ జోరుకు బ్రేకులు వేసేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. చంద్ర‌బాబు ఇలాఖాలో టీడీపీకి షాక్ ఇవ్వాల‌ని అధికార పార్టీ ఎత్తులు వేస్తుంటే.. వారి జిత్తుల‌ను చిత్తు చేసేందుకు స్వ‌యంగా చంద్ర‌బాబే రంగంలోకి దిగారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌తో కుప్పంలో పార్టీ శ్రేణుల్లో స‌మ‌రోత్సాహం నింపుతున్నారు. శ‌నివారం పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వ‌రుస‌ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలపై చర్చిస్తున్నారు. టీడీపీ తరపున  పోటీ చేసే ఆశావ‌హులు భారీగా ఉండ‌టంతో.. అభ్య‌ర్థుల ఎంపిక క‌త్తి మీద సాముగా మారింది. ఇక‌, మునిసిపల్ ఎన్నికల్లో అనుస‌రించాల్సిన‌ వ్యూహాలపై పార్టీ శ్రేణుల‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలోగ్గకుండా.. అధికార పార్టీ ఆగ‌డాల‌ను అడ్డుకునేలా.. కేడ‌ర్‌కు చంద్రబాబు సూచనలు చేశారు. టీడీపీ అధినేత ప‌ర్య‌ట‌న‌తో కుప్పంలో తెలుగు త‌మ్ముళ్ల జోష్ మామూలుగా లేదు.

క్రికెట్ బెట్టింగులో హైదరాబాద్ పోలీసులు.. గోవాలో ఇద్దరు అరెస్ట్

వాళ్లు పోలీసులు.. ఇది టీట్వంటీ సీజన్.. గల్లీగల్లీలో బెట్టింగులు కామన్. అయితే వాటిని ఆపాల్సిన పోలీసులే బెట్టింగుల్లో మునిగితేలుతున్నారు. విధులకు డుమ్మా కొట్టి మరీ పందేళ్లు కాస్తున్నారు. ఇలా గోవాలో క్రికెట్ బెట్టింగ్ పెడుతూ ఇద్దరు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది.   గోవా క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు హైదరాబాద్ పోలీసులు పట్టుబడ్డారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతూ ఇద్దరు పోలీసులు చిక్కారు. పట్టుబడిన వారు మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ సయ్యద్,  వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఇమ్రాన్‌గా గుర్తించారు. ఇమ్రాన్ తన చెల్లి పెళ్లి అంటూ లీవ్ పెట్టి గోవాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. గతంలో ఇమ్రాన్ అనేక సార్లు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  ఇమ్రాన్  12 ఏళ్లగా టాస్క్ ఫోర్స్‌లో డ్యూటీ చేస్తుండగా... సయ్యద్ 8 ఏళ్లగా టాస్క్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు.  గోవాలో బెట్టింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు..  పట్టుబడిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

కుప్పంలో చంద్ర‌న్న జోరు.. బ‌ద్వేల్లో దొంగఓట్లు.. హుజురా-వార్‌.. టాప్‌న్యూస్ @1pm

1. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల విషయంపై చర్చించారు. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున  పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక‌, గెలుపు వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్నారు చంద్ర‌బాబు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్డు షో నిర్వ‌హించ‌నున్నారు.  2. ఉప ఎన్నిక సంద‌ర్భంగా బ‌ద్వేలు పరిధిలో బీజేపీ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ నేత సీఎం రమేష్ అన్నారు. ఉపఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను కాకుండా  స్థానిక పోలీసులను రక్షణగా ఉంచుతున్నారన్నారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులను మోహరించారని సీఎం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  3. బ‌ద్వేలు ప‌రిధిలోని గోపవరం పోలింగ్ బూత్‌ దగ్గర వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బూత్‌ నుంచి ఇతర పార్టీల ఏజెంట్ల పట్ల వైసీపీ నేతలు బెదిరింపులకు తెగబడ్డారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో దొంగ ఓట్లు వేసేందుకు ప్ర‌య‌త్నించిన వారిని ప‌ట్టుకొని పోటీసుల‌కు అప్ప‌గించారు గ్రామ‌స్తులు.  4. బద్దేల్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ అన్నారు. బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా  విజయానంద్ పరిశీలిస్తున్నారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే అధికారులు వాటిని మార్చినట్లు తెలిపారు. స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.  5. హుజురాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఉద్రిక్త‌తలు చెల‌రేగుతున్నాయి. వీణవంక మండలం గణుముక్కుల గ్రామంలో పోలింగ్ బూత్‌లో టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేయడం ఏంట‌ని గ్రామస్తులు కౌశిక్‌రెడ్డిని అడ్డ‌గించి.. అక్క‌డి నుంచి వెళ్ల‌గొట్టారు.  6. జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరుల ప్రచారాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మ‌రోవైపు, హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా భారీ ఎత్తున పోలింగ్ న‌మోద‌వుతోంది. మ‌ధ్యాహ్నానికే సుమారు 40శాతం ఓటింగ్ జ‌రిగింది. 7. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని 11వ రోజు పాదయాత్రలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమ‌ర్శించారు. ‘‘రెండుసార్లు అవకాశం ఇస్తే ఎవరు బాగుపడ్డారు. కేజీ టూ పీజీ అని చెప్పి విద్యార్థులను మోసం చేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు అని చెప్పి పేదలను మోసం చేశారు. పెన్షన్లు ఆపి వృద్ధులను మోసం చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి యావత్ తెలంగాణను కేసీఆర్ మోసం చేశారు’’ అని కేసీఆర్‌పై ష‌ర్మిల మండిప‌డ్డారు.  8. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తన రాజకీయ భవిష్యత్ కోసం పోలీసుల కాపలాతో పాదయాత్ర చేశారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు "న్యాయస్థానం నుండి దేవస్థానం" పాదయాత్ర చేస్తూంటే  అడ్డుకోవడం అంటే జగన్ తనని తాను అవమానించుకోవడమే అని విమ‌ర్శించారు. న్యాయ స్థానం అనుమతితో " న్యాయస్థానం టూ దేవస్థానం" ఇక భద్రత, బాధ్యత పోలీసులదే అని లంకా దినకర్ చెప్పారు.   9. రాజమండ్రిలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.  విసన కర్రలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నిరసన తెలిపారు. చేతకాని ముఖ్యమంత్రి ఏపీని పరిపాలిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఆదిరెడ్డి భవానీ తెలిపారు. మ‌రోవైపు, విద్యారంగాన్నిసీఎం జగన్‌రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయ‌కులు మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ఎలా పటిష్ఠం చేయాలో తెలియకుండా, వాటిని మూసేయాలని ఏకపక్షంగా నిర్ణయించడం దారుణమన్నారు. 10.  విశాఖ స్ట్రీల్‌ను అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి  లేదని పర్యావరణ ఉద్యమకారిణి  మేధాపాట్కర్ అన్నారు. స్ట్రీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మ‌న్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ సంఘీభావం పలికారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.   

మేడ‌మ్ 'మ‌మ‌త‌'కు పెద్దోళ్ల స‌పోర్ట్‌!.. బ‌దిలీ బంద్‌!

మేడ‌మ్ మ‌మ‌త‌. తెలుసుగా. ఆమె గురించి తెలీక‌పోయినా ఈ ఫోటో చూస్తే గుర్తుప‌ట్టేస్తారు. తెలంగాణ ఉద్య‌మం ఫాలో అయిన వారంద‌రికీ ఈమె సుప‌రిచిత‌మే. అప్ప‌ట్లో ఉద్య‌మంలో ఫుల్ యాక్టివ్ ఉండేవారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీస‌ర్స్‌-టీజీవోల త‌ర‌ఫున గ‌ట్టిగా పోరాడారు. ప్ర‌స్తుత మంత్రి, అప్పటి టీజీవో లీడ‌ర్ శ్రీనివాస్‌గౌడ్ త‌ర్వాత‌.. నెంబ‌ర్ 2గా చెలామ‌ని అయ్యారు. యూనియ‌న్ త‌రఫున ప్ర‌తీ ఫ్రేమ్‌లో ఆమె ఉండేవారు. తెలంగాణ రాష్ట్రం సాకారమ‌య్యాక‌.. ఆమె పోరాటానికి త‌గిన గుర్తింపుతో పాటు, మేడ‌మ్‌కు ప్ర‌మోష‌న్ కూడా ల‌భించింది. అస‌లు మమతకు పదోన్నతి ఇవ్వడంపైనా వివాదం ఉంది. ఆమె కంటే ప‌దుల‌మంది సీనియర్లు ఉన్నప్పటికీ జోనల్‌ కమిషనర్‌గా ప్రమోషన్ ద‌క్కింది. అలా ఏళ్లుగా.. ఓ వెలుగు వెలుగుతూ వ‌చ్చిన మ‌మ‌త‌కు స‌డెన్‌గా షాక్ త‌గిలింది.    ఇప్పుడు మమత మున్సిపల్ కమిషనర్‌. సుదీర్ఘ కాలంగా కూకట్‌పల్లిలో పని చేస్తున్నారు. ఇటీవ‌ల ఎల్బీనగర్‌కు బదిలీ చేయ‌డం ఆమెకు ఊహించ‌ని ప‌రిణామం. ఆ.. న‌న్నే ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తారా? అంటూ మేడ‌మ్ క‌న్నెర్ర చేశారు. దెబ్బ‌కు సాయంత్రానిక‌ల్లా బ‌దిలీ ఉత్తర్వులు మారిపోయాయి. ఆమెను కూకట్ పల్లిలోనే కొనసాగించాలని మార్చిన‌ ఆర్డ‌ర్ వ‌చ్చేసింది. అదీ మ‌మ‌త ప‌వ‌ర్‌.  అవినీతి ఆరోపణలు ఉండటం.. సుదీర్ఘకాలంగా పని చేస్తూండటంతో.. గ్రేట‌ర్ ప‌రిధిలోని ఐదుగురు జోనల్ కమిషనర్లను ఒక్క సారిగా బదిలీ చేశారు. ఇందులో మమత కూడా ఉన్నారు. వెంటనే ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు మ‌మ‌త త‌ర‌ఫున రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. క‌ట్ చేస్తే.. మమత బదిలీ అగిపోయింది. మిగిలిన వారి బ‌దిలీలు యధావిధిగా జరిగిపోయాయి. మ‌మ‌త మేడ‌మ్ ప‌ర‌ప‌తి ఏంటో గ్రేట‌ర్ క‌మిష‌న‌ర్‌కు తెలిసొచ్చింది. అయితే.. ఎప్పుడో ఉద్య‌మంలో యాక్టివ్‌గా ఉన్నార‌నే కార‌ణంతో.. ఇన్నేళ్లైనా ఆమెకు అంత ప్ర‌యారిటీ ఇవ్వ‌డం.. ప‌దోన్న‌తి, కావల‌సిన పోస్టింగ్‌లోనే కూర్చోబెట్ట‌డంపై మిగ‌తా ఉద్యోగ సంఘాల నేత‌లు, స‌హ‌చ‌ర ఉద్యోగులు మండిప‌డుతున్నారు. 

రెండు నెలల్లో 50 కోట్ల మద్యం.. తాగేసిన హుజురాబాద్ జనం..

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అత్యంత కాస్ట్లీగా మారింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల్లో హుజురాబాద్ నిలిచిపోతుందని అంటున్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే నియోజకవర్దంలో రాజకీయం వేడెక్కింది. జూలై నుంచే ఓటర్లకు ప్రలోభాలు మొదలయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ లో పీక్ స్టేజీకి చేరాయి. గత రెండు నెలలుగా హుజురాబాద్ ఓటర్లు పండుగ చేసుకున్నారు. మందుకు ఢోకా లేకుండా పోయింది. ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశాయి. తాగేవారికి తాగినంతగా మద్యం ఇచ్చారు. పోటా పోటీ ప్రచారం తో పాటు మద్యం మాంసం విందులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మద్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు తేదీ సమీపిస్తున్న రోజు ల్లో ప్రతి రోజు దాదాపు గా రెండు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గురు శుక్ర వారా ల్లో నియోజక వర్గంలో భారీ గా మద్యం పంపిణీ జరిగి నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం పొంతన లేని సమాధానం చెబుతున్నారు. గతేడాది మాదిరి గానే మద్యం అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చూపెడుతున్నారు. హుజురాబాద్ లో ఖర్చు చేసిన మద్యాన్ని వివిధ జిల్లాల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఎవరీ కంట పడ కుండా డంప్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ నెల లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 76 కోట్ల 19 లక్షల 22 వేల రూపాయల మద్యం అమ్మ కాలు జరిగాయి. హుజురాబాద్ లో పరిధిలో 11 కోట్ల 3 లక్షల 64 వేల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. జమ్మికుంట లో 12 కోట్ల 24 లక్షల 64 వేల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక అక్టోబర్ నెలలో జిల్లాలో 84 కోట్ల 64 లక్షల రూపాయల మద్యాన్ని అమ్మారు. ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ లో 11 కోట్ల 53 లక్షలు జమ్మికుంట లో 13 కోట్ల 21 లక్షల రూపాయల వ్యాపారం జరిగింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో 48 కోట్ల 2 లక్షల 28 వేల రూపాయల మద్యం అమ్మినట్లు చెబుతున్నారు. ఈ మద్యం లెక్కలు కేవలం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోవి మాత్రమే. అయితే హుజురాబాద్ పక్కనే ఉన్న వరంగల్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల పరిధిలోని షాపుల నుంచి భారీగా మద్యం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా గత రెండు నెలల్లోనే హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 60 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగినట్లు చెబుతున్నారు.

నాపై కేసీఆర్ పంతం.. ఈట‌ల సంచ‌ల‌నం..

హుజురాబాద్‌లో పోలింగ్‌ పోటెత్తుతోంది. ఓట‌ర్లు భారీగా త‌ర‌లివ‌చ్చారు. పెద్ద పెద్ద క్యూ లైన్ల‌తో ఓపిగ్గా ఓటేస్తున్నారు. అర్థ‌రాత్రి వర‌కూ చీక‌ట్లో సైలెంట్‌గా డ‌బ్బుల పందేరం సాగిందంటున్నారు. ఉద‌యం సైతం.. అక్క‌డ‌క్క‌డా డ‌బ్బుల క‌ట్ట‌లు ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఓ న్యూస్ ఛానెల్ ప్ర‌తినిధి పైస‌లు పంచుతున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో అత‌న్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. రిపోర్ట‌ర్ల ముసుగులో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి.  ఇక టీఆర్ఎస్ చీఫ్ ఎల‌క్ష‌న్ ఏజెంట్‌గా ఉన్న కౌశిక్‌రెడ్డి ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్ల‌గా.. అక్క‌డే ఉన్న ఈట‌ల‌ వ‌ర్గీయులు ఆయ‌న్ను అడ్డుకున్నారు. బ‌ల‌వంతంగా అక్క‌డి నుంచి పంపించేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను ఏ బూత్‌లోకైనా వెళ్లొచ్చిన కౌశిక్‌రెడ్డి చెప్పినా.. గుంపుగా ఎందుకొచ్చావ్‌? ఓట‌ర్ల‌ను ఎందుకు ప్ర‌భావితం చేస్తున్నావంటూ.. స్థానికులు కౌశిక్‌రెడ్డిని అక్క‌డి నుంచి త‌రిమికొట్టారు. పెద్ద‌గా ఉద్రిక్త‌త‌లు లేకున్నా.. ఉద్రిక్త వాతావ‌ర‌ణం మాత్రం కొన‌సాగుతోంది.  ఇక‌, ఉద‌య‌మే క‌మ‌లాపూర్‌లో ఓటు వేశారు బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌. హుజూరాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని ఈటల ఆరోపించారు. నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని.. రూ.వందలకోట్లు పంపిణీ చేశారని ఆయ‌న‌ ఆరోపించారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బు అందలేదని చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని మండిప‌డ్డారు.  ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో చూడొద్దని సీఎం కేసీఆర్‌ పంతం పట్టినట్టున్నారని.. అందుకే అధికార యంత్రాంగం సాయంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా దీన్ని ఎదుర్కోకపోతే సమాజం బానిసత్వంలోకి వెళ్లిపోతుందని.. ఆత్మగౌరవరం, ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటల రాజేంద‌ర్‌ పిలుపిచ్చారు.  

భారతవర్ష.. పూలబాల విరచిత అద్భుత రచన..

బహుభాషా కోవిదుడు పూలబాల రచించిన 1265 పేజీల భారతవర్ష 21 వ శతాబ్దపు అతిపెద్ద తెలుగు ప్రబంధ కావ్యం.  యూజిసి జాతీయ స్థాయి సమావేశాల్లో పాల్గొని ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో ప్రసంగించిన పూలబాల  ఆంధ్రప్రదేశ్ నుంచి ఫ్రెంచ్ లో నవల రచించిన తొలి తెలుగు రచయిత.   ప్రపంచ సాహిత్యంలో భారతవర్ష వైశిష్టత: ప్రపంచ సాహిత్య చరిత్రలో  వేయి పేజీలు దాటిన గ్రంధాల రచనకు కనీసం 10 సంవత్సరాల సమయం  తీసుకున్నారు.  గాన్ విత్ ద విండ్ 10 సంవత్సరాలు, జురాసిక్ పార్క్ 10 సంవత్సరాలు,  లె మిజరబుల్స్ 12 సంవత్సరాలు కాగా  1265 పేజీల భారతవర్ష  రచనా  సమయం 8 నెలలు.  ఆ రచయితలంతా వాడుక భాష లో రాసారు . కానీ భారతవర్ష  రచయిత పూలబాల  ప్రాచీన భాష లో (గ్రాంధికం లో)  చందోబద్ద పద్యాలతో కావ్య రచన చేశారు. తెలుగు భాషకు బంగారు పల్లకి:  భారతవర్ష ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఆధ్యాత్మిక శృంగారకావ్యం.  ప్రేమ, శృంగారాలను   పాండిత్యం తో రంగరించి  సాహిత్య సరదాలు అద్ది, ఆధ్యాత్మిక, వైద్య, వైమానిక, సాంకేతిక రంగాల్లో అబ్బురపరుచు అరుదైన   విషయజ్ఞానాన్ని హృద్యమైన భాష తో మేళవించిన బహు విషయ జ్ఞాన భండారం భారతవర్ష.   పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని  సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి  తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధకావ్యం భారతవర్ష.   స్నేహధర్మానికి, ప్రేమబంధాలకి పెద్ద పీటవేసి మానవసంబంధాలకు బ్రహ్మ రథం పడుతుంది ఈ  ఆధ్యాత్మిక శృంగారకావ్యం.  భారతవర్ష ఇతివృత్తము: గ్రాంధిక తెలుగున రచించిబడిన ఈ ఆధునిక శృంగార ప్రబంధ కావ్యమందు ప్రౌఢమైన, హృద్యమైన గద్యముతో పాటు తరళ, శార్దూల, మత్తేభ ఉత్పలమాల, చంపకమాల పద్యాలు చదువరులను అలరించు విధముగా ఉంటాయి. మంచిభాషమంచిజీవితానికినాంది. మంచిసాహిత్యం మంచి సమాజానికి నాంది. భారతవర్ష ఇతివృత్తము భారతీయసంస్కృతికి పెద్దపీట వేసి క్రోధము, కామము క్షణికావేశములు. ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనము, అటువంటి ధర్మమునకు మూలము సంస్కృతి అని , ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజేస్తుంది. అన్నిరకముల  భాషాభూషణాలు  శబ్ద అర్థాలంకారాలు  గల భారతవర్షలో  వేయికి పైగా ఉపమానాలు వాడబడ్డాయి. సర్వాలంకార భూషిత కావ్య కన్య భారతవర్ష త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.   

కౌశిక్ రెడ్డిని తరిమికొట్టిన ఓటర్లు.. హుజురాబాద్ లో హై టెన్షన్..

తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారాలు చేస్తున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు చేసుకుంటున్నారు.  వీణవంక మండలం ఘన్ముక్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థి కాకపోయినప్పటికీ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అది గమనించిన బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నావ్  అంటూ కౌశిక్‌ను నిలదీశారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించారు.

బద్వేలులో తిరుపతి స్కెచ్! దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ లీడర్స్? 

ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక జరగుతున్న కడప జిల్లా బద్వేలులో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం తొలి గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఉదయం తొమ్మిది గంటల వరకు మొదటి రెండుగంటల్లో 10.45శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.  ఉప ఎన్నికలో భారీ మెజార్టీ గెలవాలని భావిస్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని తెలుస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తరహాలోనే బయటినుంచివ్యక్తులను తీసుకొచ్చి బద్వేలులో దొంగ ఓట్లు వేయించేందుకు ప్లాన్ చేసిందని చెబుతున్నారు. వైసీపీ ప్లాన్‌లో భాగంగా డీఆర్డీఏ‌కి సంబంధించిన ఓ డ్వాక్రా మహిళను దొంగ ఓట్ల కోసంరంగంలోకి దింపినట్లు సమాచారం. అలాగే అట్లూరు మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలతో పాటు ఇతరులతో మొత్తం కలిపి 600 మందిని వైసీపీ రంగంలోకి దింపినట్లు సమాచారం.వీరందరిని స్థానిక వైసీపీ శ్రేణుల ఇళ్లలో ఉంచి ఈ ఉపఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు ప్లాన్ చేస్తునట్లు సమాచారం. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ కొందరు దొంగ ఓటర్లను గుర్తించింది. వాళ్లను ప్రశ్నించగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని,దొంగ ఓట్లు వేయిస్తుందని కమలమ్మ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి కూడా వైసీపీ నేతలు రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు చేశారు. 

మంగళవారం మరదలమ్మా అని గౌరవించా... మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ

తెలంగాణ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి మంగళవారం మరదలు అంటూ తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. మంత్రి కామెంట్లపై తీవ్ర విమర్శలు రావడం, కుక్క అంటూ షర్మిల కౌంటర్ ఇవ్వడం మరింత కాక రాజేసింది. దీంతో తన మాటలపై వివరమ ఇచ్చారు మంత్రి నిరంజన్ రెడ్డి. తన వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుని ఉంటే, అందుకు పశ్చాత్తాప పడుతున్నానని మంత్రి చెప్పారు. అయినా తాను ఎవరి పేరును ఉపయోగించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను మరోసారి గమనించాలని సూచించారు. "మంగళవారం మరదలమ్మా" అంటూ చివరన అమ్మా అని మర్యాద ఇచ్చానని స్పష్టం చేశారు. సంస్కారం ఉన్న వారికి తన మాటలు సంస్కారవంతంగానే ఉంటాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.  షర్మిల తన తండ్రి సమకాలికుడైన కేసీఆర్ ను ఏకవచనంతో సంబోధిస్తుండడం సరైన పద్ధతేనా? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి.  తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ టార్గెట్ గా దూుకుడుగా వెళుతున్నారు. కేసీఆర్ తో పాటు సీఎం కుటుంబ సభ్యులపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ మంగళవారం మరదలు బయలుదేరింది అంటూ వ్యాఖ్యానించగా తీవ్ర విమర్శలు వచ్చాయి.   

అసైన్డ్, అటవీ భూములకు పాస్ బుక్కులు! వైసీపీ ఎమ్మెల్యే కబ్జాలో వేల ఎకరాలు?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దేన్ని వదలకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అధికారులతో కుమ్మకై... లేదంటే వాళ్లను బెదిరించి తమ ఇష్టం వచ్చినట్లుగా అరాచకాలకు పాల్పడుతూ.. కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేకు చెందిన అక్రమ బాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు టీడీపీ నేత. ఎమ్మెల్యే అక్రమాలు చూసి అంతా షాకవుతున్నారు.  గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోనూ ఓ భారీ భూ దందాను వెలికి తీశారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు. 2019 ఎన్నిక‌ల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు విజ‌యం సాధించారు. వైసీపీ ప్రభుత్వమే రావడంతో ఆయన అక్ర‌మాల‌కు తెర తీశారని జీవీ ఆరోపించారు. బొల్లాప‌ల్లిలోని భూముల‌ను కేంద్రంగా చేసుకుని ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు భారీ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని చెప్పారు. టీడీపీ నేత జీవీ చెప్పిన వివరాలు ప్రకారం... బొల్లాప‌ల్లిలోని అసైన్డ్ భూముల‌కు కూడా ఎమ్మెల్యే పాస్ బుక్కులు ఇప్పించేశారు. స్థానిక త‌హ‌శీల్దార్‌ను అడ్డం పెట్టుకుని ఈ దందాను న‌డిపించారు. ఒక్కో పాస్ పుస్త‌కానికి రూ.10 వేల చొప్పున ఏకంగా 7 వేల‌కు పైగా పాస్ బుక్కులు ఇప్పించేశారు. ఇలా పాస్ బుక్కుల మీద‌కు ఎక్కిన భూముల్లో చుక్క‌ల భూములు, పోరంబోకు భూములు, ప్ర‌భుత్వ భూములు ఉన్నాయి. పాస్ బుక్కులు ఇప్పించడమే కాదు.. ఈ భూముల‌ను తర్వాత త‌న‌కు కావ‌ల‌సిన వారి పేర్ల‌పైకి మార్చేసి వాటికి పాస్ బుక్కులు కూడా ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మ నాయుడు ఇప్పించేశారని జీవీ తెలిపారు. ఇవే పాస్ బుక్కుల‌ను బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా ఇప్పించేశార‌ట. ఈ రుణాల్లో మెజారిటీ భాగాన్ని బొల్లా త‌న జేబుల్లో వేసుకున్నారని జీవీ ఆరోపించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు దాదాపు 10 కోట్ల రూపాయలు స్వాహా చేశారని చెబుతున్నారు.ఆ ప‌ని పూర్తి కాగానే.. బొల్లాప‌ల్లి ప‌రిధిలోని అట‌వీ భూముల‌కు కూడా బొల్లా పాస్ పుస్త‌కాలు ఇప్పించేసుకున్నార‌ట‌. ఇవే భూముల‌ను కేంద్రంగా చేసుకుని విప‌క్షంలో ఉండ‌గా.. ఈ భూముల‌న్నింటినీ పేద‌ల‌కు హ‌క్కు ప‌త్రాలు ఇప్పిస్తామ‌ని బొల్లా చెప్పిన వైనాన్ని గుర్తు చేస్తూ జీవీ ఆంజ‌నేయులు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూముల‌ను ఆస‌రా చేసుకుని అధికార యంత్రాంగాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు పాల్ప‌డిన అవినీతి దందాపై సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని జీవీ ఆంజ‌నేయులు డిమాండ్ చేశారు. బొల్లా అవినీతి దందాకు సంబంధించి ఆధారాల‌ను జీవీ ఆంజ‌నేయులు మీడియా సమావేశంలో బ‌య‌ట‌పెట్టారు. సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిగితే బొల్లాకు సంబంధించిన మ‌రిన్ని మేర అక్ర‌మాలు వెలుగు చూసే అవ‌కాశాలున్నాయ‌న్నారు. అసైన్డ్ భూముల‌ను పేద‌ల‌కు కాకుండా త‌న‌కు అనుకూలంగా ఉన్న వారి పేరిట రాయించుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు బొల్లాపల్లి లో తిరిగే పరిస్థితి లేదని జీవీ హెచ్చ‌రించారు.పేద రైతుల దగ్గర పాసు పుస్తకాలకు వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఎమ్మెల్యే బొల్లాను చొక్కా ఊడదీసి కొడతారని ఆయ‌న‌ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో సెంటు భూమి ఇచ్చి పేదలను దగా వైసీపీ చేశారని జీవీ విమర్శించారు. ఈ భూ పంపిణీలో కూడా ఎమ్మెల్యే బొల్లా రూ.18 కోట్లు కాజేశారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బొల్లాపల్లి భూ అక్రమాలపై ఎమ్మెల్యే బొల్లా పై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. మొత్తంగా బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు అవినీతి దందాను జీవీ వెలుగులోకి తీసుకుని వ‌చ్చిన నేప‌థ్యంలో వినుకొండ‌లో ఈ విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

మాజీ మిస్ తెలంగాణ మళ్లీ ఆత్మహత్యాయత్నం..

హైదరాబాదులో బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించిన మాజీ మిస్ తెలంగాణ హాసిని రెండ్రోజుల వ్యవధిలో మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. మొన్న ఫ్యాన్ కు ఉరేసుకున్న యువతి, నేడు మున్నేరులో దూకింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బ్రిడ్జి పైనుంచి మునేటిలోకి దూకి హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కృష్ణా జిల్లా నందిగామలో బైక్‌ పైవచ్చి కాలువలోకి  హాసిని దూకింది. ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రిడ్జి పైన వాహనాన్ని నిలిపి నీటిలోకి దూకింది. హాసినిని బ్రిడ్జి పైనుంచి  దూకడం గమనించి స్థానికులు రక్షించారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. 21 ఏళ్ల కలక భవాని అలియాస్ హాసిని స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా బూదవాడ గ్రామం. మోడలింగ్ పై ఆసక్తితో హైదరాబాదులో ఉంటోంది. 2018లో హాసిని మిస్ తెలంగాణ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. రెండ్రోజుల కిందట హిమాయత్ నగర్ లోని తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుంది.తాను చనిపోతున్నానంటూ కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జగిత్యాలకు చెందిన ఓ స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెళ్లేసరికి చున్నీ ముడి జారిపోవడంతో ఫ్యాన్ నుంచి మంచంపై పడిపోయిన స్థితిలో హాసిని ఉంది. దాంతో ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు విషయం వివరించగా, వారు వచ్చి ఆమెను కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. అయితే నందిగామ సమీపంలోని కీసర వద్ద ఈ రోజు మున్నేరు బ్రిడ్జిపై నుంచి దూకేసింది. స్థానికులు సకాలంలో గుర్తించి కాపాడడంతో ఆమె ప్రాణాలకు ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ప్రస్తుతం నందిగామ ఆసుపత్రిలో హాసిని చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందులతోనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు హాసిని మొన్న పోలీసులకు వెల్లడించింది. 

వరి వద్దంటే గంజాయి సాగు చేయాలా! బీజేపీ ఎంపీ కామెంట్ల కలకలం..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు హాట్ కామెంట్లతో కాక రాజేస్తున్నారు. సీఎం‌ కేసీఆర్, కేటీఆర్‌లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, క్యాబినెట్ మంత్రులను గొర్రెలతో పోల్చాడు. కేటీఆర్ మగాడైతే ప్రజాక్షేత్రంలో‌ తమతో పోరాడాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు బానిసత్వం చేయటం కంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి చావటం మేలని విమర్శించారు.  వ్యవసాయం, ధాన్యం కొనుగోలుపై లైవ్ డిబేట్‌కు రెడీ.... నిరంజన్ రెడ్డి ఇంటికి రావటానికీ సిద్ధమేనా? అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. వరి విత్తనాలు బదులు.. గంజాయి విత్తనాలు అమ్మాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కాళ్ళు మొక్కినందుకే సిద్దిపేట కలెక్టర్ డ్యూటీలో ఉన్నాడన్నారు. పండించిన ప్రతి గింజను కొంటానన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు ఎంపీ. తెలంగాణ బ్రాండ్‌తో బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తామన్న కేసీఆర్ ఎక్కడ? అని ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ మంత్రి గంగుల పంట కొంటానంటే.. హరీష్, జగదీష్ రెడ్డిలు కొనమంటున్నారని.. రైతులు ఎవరి మాటలు నమ్మాలన్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 20 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్‌కు కేంద్రం బోనస్ ఇస్తోందన్నారు.