అమిత్‌షాతో సుజ‌నాచౌద‌రి.. విజ‌య‌సాయికి భ‌యం ఎందుకు?

ఈ ఫోటో చూడండి.. ఇందులో ఏమైనా ప్ర‌త్యేక‌త క‌నిపిస్తుందా? ఒక‌రు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. మ‌రోక‌రు కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ్య స‌భ్యులు సుజ‌నాచౌద‌రి. వారిద్ద‌రూ బీజేపీ నాయ‌కులే. ఒకే పార్టీ నేత‌లు.. కేంద్రంలో మాజీ స‌హ‌చ‌రులు.. ఏదో మాట్లాడుకుంటున్నారు. పార్ల‌మెంట‌రీ క‌న్స‌ల్టేటివ్ క‌మిటీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ మీటింగ్ సంద‌ర్భంగా అమిత్‌షా-సుజ‌నాలు క‌లిసి మాట్లాడుకుంటూ వెళ్తుండ‌గా తీసిన ఫోటో ఇది. అంతే. దీని వెన‌కా-ముందూ ఇంకేం లేదు. కానీ.. ఈ ఫోటోను చూసి వైసీపీ ఏ2కు వ‌ణుకు పుడుతున్న‌ట్టుంది. జ‌స్ట్ క్యాజువ‌ల్‌గా తీసిన ఈ పిక్‌.. వైసీపీ పెద్ద‌ల‌ను ఉలిక్కిప‌డేలా చేస్తున్న‌ట్టుంది. అందుకే, విజ‌య‌సాయిరెడ్డి గుడ్డు మీద ఈక‌లు లాగుతున్నారు. ఈ ఫోటోకు అర్థాలు-పెడ‌ర్థాలు తీస్తున్నారు. త‌న భ‌యాన్ని ప‌రోక్షంగా వ్య‌క్తం చేస్తూ.. ఈ ఫోటో వెనుక కార‌ణం ఇదీ అంటూ ఓ పులిహోర ట్వీట్ చేశారు. ఇంత‌కీ విజ‌య‌సాయిరెడ్డి క్రియేట్ చేసిన‌ ఆ క‌థ ఏంటంటే... టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ అమిత్‌షాను సుజ‌నాచౌద‌రి ప్రాధేయ‌ప‌డుతున్నారంటూ సీన్ క్రియేట్ చేశారు విజ‌య‌సాయిరెడ్డి. సుజ‌నాచౌద‌రి బీజేపీలో ఉన్నా టీడీపీ కోసం, త‌న రియ‌ల్ బాస్ చంద్రబాబు కోసం ప‌ని చేస్తున్నారంటూ అక్క‌స్సు వెళ్ల‌గ‌క్కారు. ఈ ఫోటో వెనుక ఇంత మ‌ర్మం దాగున్న‌ట్టు.. కామెంట్లు చేశారు. ఆ ఫోటో తీసింది విజ‌య‌సాయిరెడ్డినే కావొచ్చు.. అందుకే వాళ్లిద్ద‌రూ ఏం మాట్లాడుకుంటున్నారో ఆయ‌న‌కు స్ప‌ష్టంగా వినిపించిన‌ట్టుంది. అందుకే అలా జ‌రిగిందంటూ ఇలా ట్వీట్ చేశారేమో.  న‌వ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న‌ట్టు ఉంది విజ‌య‌సాయి తీరు. అమిత్‌షా, సుజ‌నాచౌద‌రీలు వాళ్లేదో న‌డుస్తూ వెళ్తూ చిట్‌చాట్‌గా మాట్లాడుకుంటే.. ఈయ‌న గారు ఆ ఫోటోను ప‌ట్టుకొని ఇంతగా సీన్ క్రియేట్ చేయ‌డం.. వెనుక వైసీపీ ఆందోళ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. చంద్ర‌బాబు ఢిల్లీకి వ‌చ్చిన‌ప్పుడు తాను క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాన‌ని అందుకే క‌ల‌వ‌లేక‌పోయాన‌ని చెప్పారు. ఏపీలో వైసీపీ అరాచ‌క పాల‌న గురించి, టీడీపీ కార్యాల‌యాల‌పై వైసీపీ దాడుల గురించి అమిత్‌షాకు చంద్ర‌బాబు వివ‌రించారు కూడా. ఇక మ‌ళ్లీ అపాయింట్‌మెంట్ ఎందుకు? అడిగితే గిడిగితే టీడీపీ ఎంపీలు ఉన్నారుగా వాళ్లు చూసుకుంటారు? మ‌ధ్య‌లో బీజేపీ నేత‌ సుజ‌నాచౌద‌రి జోక్యం ఏముంటుంది? ఇదంతా.. సుజ‌నాచౌద‌రి బీజేపీలో ఉన్న టీడీపీ-చంద్ర‌బాబు మ‌నిషంటూ త‌ప్పుదారి ప‌ట్టించేందుకు విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న కుతంత్రం మాత్ర‌మే అంటున్నారు. అందుకే, విజ‌యసాయి కుట్ర‌ల‌పై మ‌రో బీజేపీ నేత లంకా దిన‌క‌ర్ కౌంట‌ర్ ఇచ్చారు.  అమిత్‌షా-విజ‌య‌సాయిరెడ్డి క‌లిసున్న ఫోటోను చూసి విజ‌యసాయిరెడ్డికి అంత భ‌య‌మెందుకు అంటూ ట్విట‌ర్‌లో ప్ర‌శ్నించారు. వైసీపీది అస‌మ‌ర్థ ప్ర‌భుత్వం కాబ‌ట్టే.. వారంతాగా భ‌య‌ప‌డుతున్నారంటూ కౌంట‌ర్ వేశారు.  

సీఎం జగన్ కు పశువైద్యుల షాక్.. పని చేసేది లేదంటూ వార్నింగ్

అనంతపురం జిల్లాలో పశు వైద్యులు ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న ఆ పనులు చేయలేమంటూ బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాదు తమను బలవంతం చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగులు ఇచ్చారు. ఇంతకీ వీళ్లు చేయబోతమని ఖరాకండిగా చెబుతున్న పనులు ఏంటో తెలుసా.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తీసుకొచ్చిన గుజరాత్ పాల డెయిరీ అమూల్ విషయంలోనే.  ఏపీలో అమూల్ డెయిరీని ప్రోత్సహిస్తోంది జగన్ రెడ్డి సర్కార్. వాళ్లకు విలువైన భూములు, డెయిరీలను కట్టబెట్టడుతూ రైతులంతా ఆ డైయిరీకే పాలు పోసేలా అధికారులతో పనులు చేయిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ డెయిరీని దెబ్బతీయడమే లక్ష్యంగా అమూల్ ను తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.అమూల్ కోసం టార్గెట్ పెట్టీ మరీ పశువైద్యులతో పని చేయిస్తోంది. అయితే ఆ ఆ డెయిరీ కోసం మేమెందుకు ప్రచారం చేయాలంటూ పశు వైద్యులు అనంతపురం జిల్లాలో ఆందోళనకు దిగారు. అమూల్‌ డెయిరీకి పనిచేయిస్తున్నారని వారు ఆరోపించారు. అనంతపురంలో పశువైద్యులు.. ఆ శాఖ జేడీ కార్యాలయం వద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించారు. అమూల్ సంస్థ.. ఒక్క ఉద్యోగిని కూడా నియమించకుండా, ప్రభుత్వ ఉద్యోగులతో పాలసేకరణ మెంటార్ విధులు అప్పగించిందని పశువైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   పొరుగు జిల్లాల్లో రైతులకు పాల బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న అమూల్ తీరుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.  ఉద్యోగిని కూడా నియమించకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో పనిచేయిస్తోందని ఆరోపించారు.  పశువైద్యులను మెంటర్లుగా నియమించి అమూల్ కే పాలు పోసేలా.. పాడి రైతులకు అవగాహన కల్పించే బాధ్యతలు అప్పగించారని వైద్యులు మండిపడ్డారు.  పశుసంవర్థకశాఖ జేడీ ఛాంబర్ వద్ద పశువైద్యులు బైఠాయించి నినాదాలు చేశారు.

కేసీఆర్, జగన్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్.. తెలుగు రాష్ట్రాల్లో రచ్చ

ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ ను విస్తరించాలని తనకు వినతులు వస్తున్నాయంటూ ప్లీనరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ మాటలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. అయితే టీఆర్ఎస్, ఏపీ మంత్రులు చేస్తున్న కామెంట్లపై తీవ్రంగా స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని అన్నారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్‌ అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు.  రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే ఏపీలో కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయొచ్చని నాని పేర్కొన్నారు. 

ఉరిగా మారుతున్న వరిసాగు..హుజూరాబాద్ లో కారుకు కంగారు

హుజూరాబాద్ ఉపఎన్నికల తరుణంలో సాగు చేయాల్సిన  పంటల  విషయంపై  క్లారిటీ లేకపోవడం తెలంగాణ సర్కారుకు తలనొప్పిగా మారింది. యాసంగి సీజన్ వచ్చినా రైతులకు ఏ పంటలు వేయాలో చెప్పడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. దీంతో గతేడాది ఇచ్చిన హామీకి సైతం దిక్కు లేకుండా పోయింది. సాగునీటి పారుదలపైనే దృష్టి సారించిన కేసీఆర్.. మిషన్ భగీరథ పేరుతో భారీ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. దీంతో తెలంగాణ అంతటా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. సాగునీటి పారుదల విషయంలో ఇది పాజిటివ్ అంశమైతే... వరిసాగును నియంత్రించాల్సి రావడం నెగెటివ్ అంశంగా మారుతోంది. వరిసాగు గతంలో కంటే రెట్టింపుకన్నా ఎక్కువ కావడంతో దిగుబడి గణనీయంగా పెరిగింది. అయితే ఎఫ్.సి.ఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేసే సామర్థ్యం కన్నా దిగుబడి ఎక్కువవడంతో ఇప్పుడు కంట్రోల్ చేయాాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పట్టించుకోని కేసీఆర్... తెలంగాణలో వరిసాగును విపరీతంగా ప్రోత్సహించారు. పైగా సన్న రకాల వరినే వేసుకోవాలని, దాంతో ఎక్కువ ఆదాయం వస్తుందని సూచించారు. రైతులు కూడా కేసీఆర్ సూచనలు ఫాలో అవడంతో దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేయడం అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితి గత యాసంగిలోనే ఏర్పడడంతో అప్పుడు రైతులు రోడ్డెక్కారు. వరి కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని, తాము ఆరుగాలం పండించిన పంటను ఎవరికి, ఎక్కడ అమ్మాలో తెలియకపోతే తీవ్రంగా నష్టపోతామని, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారంటూ నిలదీశారు. అటు కేంద్రమూ కొనక, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే వరి  రైతుల పరిస్థితేంటని రైతుసంఘాలు ఆందోళన చేశాయి. అయితే వరి పంటను కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితి లేదని గ్రహించిన కేసీఆర్.. వరి వేస్తే ఉరే శరణ్యమంటూ కొత్త స్లోగన్ క్రియేట్ చేశారు. రైతులకు రానున్న ప్రమాద ఘంటిికలు మోగించారు.  ఒకసారి వరి వేయాలని, మరోసారి వద్దని చెప్పిన ముఖ్యమంత్రి.. తాజా పరిస్థితికి పరిష్కారమేంటో చూపలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో యాసంగి పంటపై  ఇప్పటికీ  రైతులకు స్పష్టతనివ్వకపోవడం ప్రభుత్వ ముందుచూపు లేకపోవడమే గాక అధికారుల వైఫల్యంగా మారుతోంది. సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా ఇచ్చే హామీలు తమకు తీవ్రమైన తలనొప్పులు తెస్తున్నాయని అధికారులు వాపోతున్నారు.  కేసీఆర్ కేబినెట్ లోని ఓ మంత్రి వరి వేయాలని ఇప్పుడు కూడా సూచిస్తుండగా క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన కలిగిన కలెక్టర్లు మాత్రం వరి వేయరాదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వరిని ప్రోత్సాహిస్తున్న కారణంగా వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లిలో రైతులంతా వరినే వేశారు. అయితే జూరాల కాలువకు ఆ గ్రామం చివరలో ఉన్న కారణంగా అక్కడి రైతులకు నీరందటం లేదు. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. తమకు నీళ్లిచ్చేదాకా వారిని కదలనిచ్చేది లేదని భీష్మించుకున్నారు. తమ పరిధిలో తాము నీరిచ్చినా జూరాల నుంచి 75 కి.మీ. ఉన్న దగడపల్లి వరకు నీళ్లు రావని, అదీగాక పైనున్న రైతులు మోటార్లు కూడా పెడుతూ నీటిని తోడేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తామేం చేయాలంటూ చేతులెత్తేస్తున్నారు.  ఇప్పుడిదే విషయాన్ని బీజేపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నీరందని రైతులను పోగుచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరుగనున్న దృష్ట్యా రైతుల అంశం కూడా టీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈయేడు వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలన్న భావనతో ఉన్న వ్యవసాయశాఖకు వరి స్థానంలో ఏ పంట సాగుచేయించాలన్న అంశం ఇంకా కొలిక్కి రాలేదు. వానాకాలం వరి పంట చేతికొసున్నా.. ఇంత వరకూ పంటల యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించకపోవడంతో వ్యవసాయ శాఖ పరపతి మంట గలిసింది. అక్టోబర్‌ మొదటి వారంలోపే యాసంగి ప్రణాళిక ప్రకటించాల్సి ఉన్నా సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో పంటల సాగు వివరాలు తెలపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ సమస్య నుంచి రైతులను ఎలా బయటపడేస్తారోనన్న ఆందోళన రైతులోకంలో వినిపిస్తోంది.

నేను మరదలు అయితే కవిత ఏమవుతుందిరా కుక్క! 

తెలంగాణ రాజకీయాల్లో మాటలు హద్దులు దాటుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నిక కేంద్రంగా సాగిన మాటల యుద్దం చల్లారకముందే వైఎస్ షర్మివ, టీఆర్ఎస్ నేతల మధ్య గరంగరం యుద్ధం సాగుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డికి కౌంటరిచ్చారు వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని నిలదీసారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని ఆమె తెలిపారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయన్నారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని ఆమె అన్నారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు.  ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు. మంత్రి నిరంజ‌న్‌రెడ్డి వైఎస్సార్‌టీపీ అధినేత్రిపై బుధవారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ష‌ర్మిల పేరును నేరుగా ప్ర‌స్తావించ‌కున్నా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ష‌ర్మిలను ఉద్దేశించేన‌ని ఈజీగా తెలిసిపోతున్నాయి. దీంతో ఆయనకు ఘాటుగా బదులిచ్చారు షర్మిల. 

మరో 30 ఏండ్లు బీజేపీదే అధికారమట.. రాహుల్ కు షాకిచ్చిన పీకే..

ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారని అంటారు. అదేమో గానీ, కాంగ్రెస్ పార్టీతో, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే)స్నేహం వయసెంతోకానీ, ఆయనేమిటో ఈయనకు బాగా అర్థమైనట్లే వుంది. అందుకే,నిన్నమొన్నటిదాకా, కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి రాహుల్  గాంధీనే పెద్ద ప్రతిబంధకం, రోడ్డు బ్లాక్ అని తేల్చేశారు. ప్రదాని మోడీ పట్ల వ్యతిరేకతతో ప్రజలే బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే భ్రమల్లో రాహుల్ గాంధీ, ఉన్నారని, కానీ అది జరిగేది కాదని స్పష్టం చేశారు. “భారతీయ జనతా పార్టీ ఎక్కడికీ పోదు ... ఇంకా అనేక దశాబ్దాల పాటు దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటుది. అయితే రాహుల్ గాంధీతో వచ్చిన సమస్య ఏమంటే, ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని పడగొడతారనే భ్రమల్లో ఉన్నారు” అంటూ రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. పీకే ఇలా రాహుల్ గాంధీకి వాతలు పెట్టడం ఇటీవల కాలంలో ఇది రెండవ సారి.ఇటీవల రాహుల్ గాంధీ కంటే ప్రియంకా వాద్రా సమర్ధ నాయకురాలని అందుకే రాహుల్ గాంధీ ఆమె ఎదుగుదలను అడ్డుకుంటున్నారని, రాహుల్ ఇమేజ్’ను డ్యామేజి చేశారు.నిజానికి, రాహుల్ గాంధీ నాయకత్వ శక్తీ సామర్ధ్యాల విషయంలో,పీకేకు చాల క్లారిటీ ఉంది. అయినా ఇప్పుడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలోఈ వ్యాఖ్యలు చేయడం వెనక పీకే  మార్క్ వ్యూహం ఉందని అనుకోవచ్చును.  పీకే చేసిన  వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకాగే, తృణమూల్ కాంగ్రెస్ గోవాలో కాలు మోపుతున్న సమయంలో పీకే చేసిన ఈ వ్యాఖ్య ఆయన కాంగ్రెస్’ పార్టీలో  చేరుతున్నారు అంటూ వస్తున్నఊహాగానాలకు కూడా తెరదించినట్లే అంటున్నారు. అయితే పీకే విషయంలో ఏదీ కూడా ఫైనల్ అనుకునే వీలులేదు... ఆయన దేన్నైనా తనకు అనుకులంగా మలచుకుంటారు. ఒక సారి చెపితే వందసార్లు చెప్పినట్లే అనే పిచ్చి సినిమా భ్రమలు ఆయనలో ఏ కోశానా ఉండవు, నిజానికి, ప్రశాంత్ కిశోర్’కు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ గురించి, రాహుల్ గాంధీ గురించి జ్ఞానోదయం అయింది, అనుకుంటే ఆది పోరపాటే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సమూలంగా భూస్థాపితం చేసి, ఆ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టించే వ్యూహంలో భాగంగానే ఆయన ఇంతకాలం ఒక ఫేక్ కహనీని తెరమీద చూపించారు. ఇప్పడు సమయం వచ్చే సరికి, కొత్త స్టొరీ ఎత్తుకున్నారు.  నిజానికి బీజేపీకొన్నిదశాబ్దాల పాటు జాతీయ రాజకీయలకు కేంద్ర బిందువుగా ఉంటుందనే విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. అలాగే,కాంగ్రెస్ పార్టీ ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అస్తమించే దశకు చేరుకుంది. ఇప్పడు బీజీపీ ఆస్థానాన్ని అక్రమించుకుంటోంది. సో .. స్వాతంత్రం తర్వాత 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ, ఓ వెలుగు వెలిగిందో,అదే విధంగా బీజేపీ 40 కాకపోతే 30 కాదంటే 50 ఏళ్ళు జాతీయ రాజకీయ యవనికపై నిలిచి ఉంటుంది, ఈ విషయాన్ని పీకే కంటే ముందు చాలా మంది చెప్పారు.అయితే ఈ సమయంలో అది కూడా తృణమూల్ తొలిసారిగా ఎన్నికల బరిలోకాలు పెడుతున్న గోవాలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనక, పీకే ప్లాన్ ఏమిటన్నదే కీలకం.

అమరావతి యాత్రకు అడ్డంకులు.. తెలుగు రాష్ట్రాలకు కలిపేస్తారా.. జగన్ తో నాగార్జున భేటీ... టాప్ న్యూస

గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్‌ దంపతుల భేటీ అయ్యారు. నవంబర్ 1న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవం ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇస్తున్నారు. 50 మందికి పైగా ఈ అవార్డును ప్రధానం చేస్తారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో చర్చించినట్లు చెబుతున్నారు.  --- సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ రాశారు. ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై లోకేష్  లేఖ రాశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు మూతపడుతున్నాయని విమర్శించారు. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలను, ఆస్తులను దక్కించుకునేందుకే  యత్నిస్తున్నారని తప్పుబట్టారు. తొలగించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ----------- అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు డీజీపీ లేఖ రాశారు. ఇటీవల రైతుల పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి నిరాకరించారు. పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని డీజీపీ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 3 రాజధానులపై నిర్ణయం తీసుకుందన్నారు. రైతులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని డీజీపీ తేల్చి చెప్పారు. -------- గంజాయి సాగు, రవాణాపై మాట్లాడానని తనకు నోటీసులిచ్చారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఆధారాలు సేకరించాలంటూ నానా హంగామా సృష్టించారని చెప్పారు. గంజాయి సాగుతో లోకేష్‌కు సంబంధం ఉందని విజయసాయి అన్నారని చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలని డిమాండ్ చేశారు. ఏపీ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని పవన్ అన్నారని చెప్పారు ------ ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. ----- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. జగన్‌తో లంచ్ చేశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. సినీ పరిశ్రమకు సంబంధించి ఏదైన సమస్య ఉంటే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కలిసి మాట్లాడే సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతోంది.  ---- వరి పంట విషయంలో కోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్ధిపేట కలెక్టర్‌పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని ఏబీఎన్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. వరి పంటపై కేసీఆర్ డొల్లతనం బయటపడిందన్నారు. ధాన్యం కొనబోమని.. టీఆర్ఎస్ రిలీజ్ చేసిన లేఖలో ఎక్కడా లేదన్నారు. ధాన్యం గురించి తాను మాట్లాడితే ఉప్పుడు బియ్యం గురించిన లేఖను రిలీజ్ చేశారని ఆయన ఆరోపించారు ------ కలెక్టర్లు బాగా బలిసి రైతుల మీద మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు డ్రామాలు బంద్ చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతుల పక్షాన కాంగ్రెస్  పోరాడుతుందని ఆయన ప్రకటించారు. నవంబర్1 తర్వాత చలో సిద్దిపేట చేపడతామన్నారు. ------- తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలకు వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కౌంటర్‌ ఇచ్చారు. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని షర్మిల నిలదీసారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని ఆమె తెలిపారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయన్నారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని ఆమె అన్నారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. --------- బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. బాంబే హైకోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. మూడు రోజులుగా ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మొత్తానికి గురువారం ఆర్యన్ ఖాన్‌కు, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ నితిన్ సంబ్రే తీర్పునిచ్చారు. డ్రగ్స్ కేసులో అక్టోబర్ మూడో తారీఖున ఎన్సీబీ అధికారులు ఆర్యన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.  ---

కేసీఆర్‌పై చంద్ర‌బాబు కామెంట్లు.. ఏపీ మంత్రుల ఉలికి'పాట్లు'..

అప్ప‌ట్లో హాట్ హాట్‌గా న‌డిచింది. ఇప్పుడు చ‌ల్ల‌బ‌డింది. బ‌హుషా అందుకే కాబోలు మ‌ళ్లీ వేడి రాజేస్తున్నారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య రెండు పార్టీలు అగ్గి ఎగ‌దోసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అవ‌స‌రం ఉన్నా లేకున్నా ఏపీ ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే తీసుకొస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఆయ‌న అంతేసి మాట‌లు అన‌గానే.. వీళ్లు ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇవ్వ‌క త‌ప్ప‌నిసరి ప‌రిస్థితి వ‌స్తోంది. ఇలా కేసీఆర్ వ‌ర్సెస్ వైసీపీ నేత‌లు.. టామ్ అండ్ జెర్రీలా ఆటాడుకుంటున్నారు. ఇదంతా జ‌స్ట్ ఆట‌నో.. లేక రియ‌లో తెలీక ప్ర‌జ‌లు క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. మ‌ధ్య‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎంట‌రై రాజ‌కీయాన్ని మ‌రింత రంజుగా మార్చేస్తున్నారు. ఇంత‌కీ తెలుగురాష్ట్రాల మ‌ధ్య ఈ గోలేంటి? ఈ గ‌డిబిడి రాజ‌కీయ‌మేంటి? మాట‌ల మాంత్రికుడు కేసీఆర్‌.. ఇటీవ‌ల పార్టీ ప్లీన‌రీలో ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి ప‌రువంతా తీసేశారు. ఏపీ క‌రెంట్ కోత‌ల‌తో విల‌విల్లాడుతోంద‌ని.. బొగ్గు కొర‌త వేధిస్తోంద‌ని.. ఆంధ్ర‌ అప్పుల మ‌యంగా మారిందంటూ.. ఇజ్జ‌త్ మొత్తం పోగొట్టారు. స‌రైన నాయ‌క‌త్వం, పాల‌నా ద‌క్ష‌త లేక‌పోతే.. రాష్ట్రం ఏపీలా అథోగ‌తి పాల‌వుతుందంటూ త‌న‌ని తాను పొగుడుకుంటూ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ను ఏకిపారేశారు. తెలంగాణ ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాల‌ను చూసి.. ఏపీలో పార్టీ పెట్టాలంటూ అక్క‌డి ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారంటూ త‌న‌దైన స్టైల్‌లో మంట రాజేశారు. అంతే. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. క‌రెంట్ క‌ష్టాలు, అప్పుల తిప్ప‌ల‌పై.. ప‌క్క రాష్ట్ర సీఎం మాట్లాడ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌ ప‌రువంతా కృష్ణాలో క‌లిసిపోయింది. దీంతో.. ఏపీ మంత్రులు తీరిగ్గా, ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌చ్చి.. కేసీఆర్‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డం స్టార్ట్ చేశారు. ముందు స‌జ్జ‌ల స్మూత్‌గా మాట్లాడ‌గా.. తాజాగా మంత్రి పేర్ని నాని కాస్త మ‌సాలా ద‌ట్టించి విమ‌ర్శ‌లు చేశారు. ఇంత‌కీ వారేమ‌న్నారంటే.. ఏపీలో పార్టీ పెడతామంటే ఎవరైనా వద్దన్నారా? ఎవరైనా రావొచ్చు.. ఎక్కడైనా పోటీ చేయొచ్చని సజ్జల సెల‌విచ్చారు. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే తెలంగాణకు మిగులు కరెంటు వచ్చిందని సజ్జల అన్నారు. లేటుగా అయినా లేటెస్ట్‌గా హాట్ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పేర్ని నాని. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా? అంటూ కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పథకాలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర మైక్ పెడితే బాగా చెప్తారని నాని ఎద్దేవా చేశారు.  కొన్ని వారాల క్రితం నీళ్ల జ‌గ‌డంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ఉన్న‌ట్టు సీన్ క్రియేట్ చేసి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల అటెన్ష‌న్‌ను డైవ‌ర్ట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యార‌ని.. అదే స్ట్రాట‌జీని మ‌రోసారి అమ‌లు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. కేసీఆర్ సోమ‌వారం ప్లీన‌రీలో ఈ కామెంట్లు చేస్తే.. గురువారం పేర్ని నాని కౌంట‌ర్ ఇవ్వ‌డం కావాల‌నే చేసిన‌ట్టుగా ఉందంటున్నారు. వాళ్లంతా ఒక‌టేన‌ని.. ఇదంతా డ్రామా అని అంతా అంటున్నారు.  ఇక‌, మ‌ధ్య‌లో చంద్ర‌బాబు ఎపిసోడ్ మ‌రింత ఇంట్రెస్టింగ్‌. కేసీఆర్ ఇలా ఏపీలో క‌రెంట్ కోత‌లు, అప్పులు, బొగ్గు గురించి మాట్లాడ‌గానే.. అలా చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. కేసీఆర్ వ్యాఖ్య‌లు క‌రెక్ట్ అని.. సీఎం జ‌గ‌న్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే ఏపీకి ఇలా క‌రెంట్ క‌ష్టాలు, అప్పుల తిప్పలు దాపురించాయంటూ విమ‌ర్శించారు. అంత‌కుముందు సైతం.. టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో 36 గంట‌ల దీక్ష ముగింపు సంద‌ర్భంగా చంద్ర‌బాబు కేసీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి.. డ్ర‌గ్స్‌, గంజాయిని అరిక‌ట్టాలంటూ ఆదేశించార‌ని.. ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి మాత్రం డ్ర‌గ్స్‌, గంజాయిపై మీటింగ్ పెట్ట‌డానికి స‌మ‌యం కూడా లేదంటూ దుయ్య‌బ‌ట్టారు. ఇలా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు.. కేసీఆర్ కామెంట్ల‌ను బేస్ చేసుకొని.. స‌మ‌యానుకూలంగా జ‌గ‌న్‌ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తుండ‌టం వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. అందుకే ఉలికిప‌డిన‌ట్టు ఏపీ మంత్రులు వ‌రుస‌గా కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్లు ఇస్తూ రాజ‌కీయం ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా స‌జ్జ‌ల మ‌రో అడుగు ముందుకేసి.. కేసీఆర్ ఏదో మాట్లాడతారని.. చంద్రబాబు ఇంకేదో ఆరోపణలు చేస్తారని.. వారిద్దరి మధ్య ఏం అండర్ స్టాండింగ్ ఉందోనని.. ఆరోపిస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలా కేసీఆర్‌-వైసీపీ-చంద్ర‌బాబు ఎపిసోడ్‌ను రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు స‌రైన తీర్పు చెప్పనున్నారు.   

తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌!.. కేసీఆర్ క‌న్నెర్ర‌!

త‌మిళిసై. ప్ర‌స్తుత తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌. అంత‌కుముందు త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ టాప్ లీడ‌ర్‌. అప్ప‌ట్లో బీజేపీ మౌత్‌పీస్‌. ఇప్పుడు కేంద్రానికి. కేంద్రం అంటే.. ప‌రోక్షంగా బీజేపీనేగా!. అందుకే, త‌ట‌స్థంగా ఉండాల్సిన‌ గ‌వ‌ర్న‌ర్ కాస్తా.. స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఆమె వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ రాజ్‌భ‌వ‌న్‌కు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఒక‌ప్పుడు అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. సీఎం కేసీఆర్‌ల మ‌ధ్య ఆత్మీయ బంధం ఉండేది. రెండు భ‌వ‌న్‌ల మ‌ధ్య దూరం చాలా చాలా త‌క్కువ‌గా ఉండేది. కానీ, త‌మిళిసై వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ దూరం బాగా పెరిగిపోయింది. గ‌వ‌ర్న‌ర్‌ను ముఖ్య‌మంత్రి క‌లిసే సంద‌ర్భాలు చాలా అరుదుగా మారాయి. త‌మిళిసై.. బీజేపీ గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే భావ‌న‌లో ప్ర‌గ‌తిభ‌వ‌న్ ఉంది.  ఇక గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. కేవ‌లం ర‌బ్బ‌ర్ స్టాంప్‌లా మాత్ర‌మే ఉండ‌కుండా కొత్త త‌ర‌హాలో స్వ‌తంత్రంగా పనిచేసుకుపోతున్నారు. అదే కేసీఆర్‌కు కంటిగింపుగా మారిందని చెబుతున్నారు. తాజాగా, గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న ఓ నిర్ణ‌యం మ‌రింత దూరం పెంచ‌నుంద‌ని అంటున్నారు. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు పేద, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ పిల్ల‌ల‌కు దూరం కాకుండా ఉండేలా వారికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ భావించారు. అందుకోసం.. ఐటీ, కార్పొరేట్ కంపెనీలు వాళ్లు వాడ‌ని ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల‌ను విరాళంగా ఇవ్వాల‌ని పిలుపు ఇచ్చారు. అవి కావాల్సిన పేద విద్యార్థులు రాజ్‌భ‌వ‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటూ ఫోన్ నెంబ‌ర్‌, ఈ-మెయిల్ ఇచ్చి ఆద‌ర్శంగా నిలిచారు. గ‌వ‌ర్న‌ర్ చేస్తున్న‌ది మంచి ప‌నే. అంతా అభినందించాల్సిన విష‌య‌మే. కానీ, ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నిని.. రాజ్‌భ‌వ‌న్ చేస్తుండ‌ట‌మే.. రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారిందంటున్నారు.  గ‌తంలోనూ ప‌లుమార్లు కేసీఆర్‌ ప్ర‌భుత్వ విధానాల‌ను త‌ప్పుబ‌ట్టారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. అప్ప‌ట్లో స‌ర్కారు పెద్ద సంఖ్య‌లో కొవిడ్ టెస్టులు చేయ‌క‌పోవ‌డాన్ని ప్ర‌శ్నించారు. యూనివ‌ర్సిటీల‌ వైస్ ఛాన్స‌ల‌ర్ల నియామ‌కం ఆల‌స్యంపైనా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్ర‌జా ద‌ర్బార్ పేరుతో రాజ్‌భ‌వ‌న్‌కు సామాన్యుల‌ను ఆహ్వానిస్తూ.. వారి నుంచి స‌మ‌స్య‌ల‌పై విజ్ఞ‌ప్తులు స్వీక‌రిస్తున్నారు. ఇలా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. స‌మాంత‌ర పాల‌న న‌డిపిస్తున్నారంటూ ప్ర‌భుత్వం గుర్రుగా ఉంది. ఇక ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్ స‌ర్కారుపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేయ‌డం.. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫైలును గ‌వ‌ర్న‌ర్ హోల్డ్‌లో పెట్ట‌డం.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు రాజ్‌భ‌వ‌న్‌కు మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే విష‌యం స్ప‌ష్టం చేస్తోంది. అందుకే, గ‌వ‌ర్న‌ర్‌ను నేరుగా క‌లిసే ఉద్దేశ్యం లేక‌నే.. సీఎం కేసీఆర్ ఇటీవ‌ల గాంధీజ‌యంతి రోజున బాపూఘాట్‌కు కూడా వెళ్ల‌లేద‌ని అంటారు. ఇక‌, తాజాగా పేద విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ పిలుపివ్వ‌డం.. రెండు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుగానే అభివ‌ర్ణిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 

మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ షాక్.. 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాకిచ్చింది. నగరంలో నిషేదం ఉన్నా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ఐదు వేల రూపాయల ఫైన్ విధించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు 30 వేల రూపాయల జరిమానా వేసింది బల్దియీ ఈవీడీఎం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో కటౌట్ ఏర్పాటు చేసినందు MLA దానం నాగేందర్ కు ఫైన్ విధించింది. ఈనెల 25న హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మొత్తాన్ని గులాబీ మయం చేశారు అధికార పార్టీ నేతలు, నగరంలో భారీగా కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ , కేటీఆర్ ఫోటోలతో నింపేశారు. టీఆర్ఎస్ జెండాల కట్టేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో నెలువెత్తు స్వాహత తోరణాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్లినరీ రోజున హైదరాబాద్ మొత్తం గులాబీమయంగా కనిపించింది.  నిజానికి గ్రేటర్ పరిధిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడంపై నిషేదం ఉంది. గతంలో చిన్నచిన్న బ్యానర్లు కట్టినందుకే పలువురి నుంచి  ఫైన్ వసూల్ చేసింది బల్దియా. కాని ప్లీనరీ సందర్భంగా నగరం మొత్తం టీఆర్ఎస్ నేతలు పెద్దపెద్ద కటౌట్లు. బ్యానర్లు, ప్లెక్సీలు కట్టినా చూసిచూడినట్టుగా వదిలేసింది. జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర విమర్సలు వచ్చాయి. టీఆర్ఎస్ జెండాల అలంకరణపై బల్దియాకు ఫిర్యాదులు కూడా భారీగానే వెలువెత్తాయి. అయినా అధికారులు స్పందించలేదు. బీజేపీ నేతలు బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన కూడా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అధికారుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే తమ సర్వర్ పని చేయడం లేదని, తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని అప్పుడు కమిషనర్ ప్రకటింటారు. గడచిన కొన్ని రోజులుగా సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైళ్లను నిలిపి వేసిన అధికారులు. ఈరోజు నుండి మళ్లీ ఫైళ్లను వేయడం ప్రారంభించారు. మొదటగా ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జరిమానా విధించారు. 

పంచ్ ప్ర‌భాక‌ర్‌కు హైకోర్టు పంచ్‌.. త్వ‌ర‌లోనే అరెస్ట్‌!

వాడో పెద్ద వెద‌వ‌..అంటారు. కోతికి కొబ్బ‌రి చిప్ప‌లా.. వాడికి సోష‌ల్ మీడియా..అని విమ‌ర్శిస్తుంటారు. వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ.. ప్ర‌తీదానికీ టీడీపీని త‌ప్పుబ‌డుతూ.. శాడిజం ప్ర‌ద‌ర్శిస్తుంటార‌ని చెబుతారు. అద్దూఅదుపూ లేని అడ్డ‌గోలు పోస్టుల‌తో.. ఊర‌కుక్క మాదిరి నోటికొచ్చిన‌ట్టు వాగుతూ.. విదేశాల్లో న‌క్కి.. ఏపీలో చిచ్చు రాజేస్తుంటాడ‌ని మండిప‌డుతుంటారు. సోష‌ల్ మీడియాలో పంచ్ ప్ర‌భాక‌ర్ చేసేంత‌ ర‌చ్చ‌..రొచ్చు.. మ‌రెవ‌రూ చేయ‌ర‌ని అంటారు. అదే ఊపులో, అదే బ‌లుపుతో, అదే వెర్రిత‌నంతో.. త‌న వెనుక‌ వైసీపీ ఉంద‌నే విచ్చ‌ల‌విడిత‌నంతో.. కోర్టుల‌పైనా నెగ‌టివ్ పోస్టులు పెట్టాడు. కోర్టు తీర్పుల‌నే త‌ప్పుబ‌డుతూ.. త‌ప్పుడు కామెంట్లు చేశాడు. క‌ట్ చేస్తే.. పంచ్ ప్ర‌భాక‌ర్‌కే పంచ్ ప‌డింది. జ‌డ్జిల‌పై వివాదాస్ప‌ద పోస్టులు పెట్టిన కేసులో ఆయ‌న‌పైనా సీబీఐ విచార‌ణ జ‌రుగుతోంది. కాక‌పోతే.. వాడు మ‌న‌ దేశంలో లేడుగా. అందుకే, అరెస్ట్‌ కాస్త ఆల‌స్యం అవుతోంది. కానీ, కోర్టులు, సీబీఐ త‌ల్చుకుంటే.. ఎంత‌టి వాడినైనా లొంగ‌దీసి.. సంకెళ్లు వేసి ప‌ట్టుకొచ్చి.. న్యాయ‌స్థానాల ముందు నిల‌బెడ‌తాయ‌నే విష‌యం వాడికింకా అర్థం కావ‌ట్లేదు. కాస్త‌ లేటైనా.. ప‌నిష్మెంట్ మాత్రం ప‌క్కా అంటున్నారు.  తాజాగా, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జ‌రుగుతున్న తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా, పంచ్‌ ప్రభాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. తెలుగువారి  ఆత్మగౌరవాన్ని ప్రభాకర్ దెబ్బ తీస్తున్నాడని, అతనిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని గ‌ట్టిగా నిలదీసింది హైకోర్టు.  తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోలేదంటూ.. స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అశ్విని కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పంచ్ ప్ర‌భాక‌ర్‌కి కనీసం ఒక్క నోటీసు కూడ ఇవ్వలేక పోయారని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు నోటీసులు ఇవ్వాలని.. ప్రభాకర్‌ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఆగ్ర‌హం చూస్తుంటే.. పంచ్ ప్ర‌భాక‌ర్‌కు బిగ్ పంచ్ ప‌డే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్టే ఉన్నాయి. 

బీజేపీకి టీడీపీ, జనసేన మద్దతు? బద్వేలు ఫార్మూలా అసెంబ్లీకి రిపీట్!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. రాజకీయ చర్చల్లో తరచూ వినిపించే ఈ మాట, ఇప్పుడు, ఉప ఎన్నిక జరుగతున్న కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గంలో  వినిపిస్తోంది. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య  చనిపోవడంతో ఉపఎన్నిక జరుగుతున్నఈనియోజక వర్గం నుంచి వైసీపే అభ్యర్ధిగా ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సంప్రదాయాన్ని మన్నించి తెలుగు దేశం, జనసేన ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించాయి. అయితే, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్ధులను బరిలో దించాయి. బీజేపీ యువ నేత పనతల సురేశ్ బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్ల్యే కమలమ్మ పోటీ చేస్తన్నారు. చిత్రంగా తెలుగు దేశం, జన సేన పార్టీలు రెండూ కూడా, అనధికారికంగానే అయినా, బీజీపీ అభ్యర్ధికి మద్దతు నిస్తున్నాయి. దీంతో మాజీ మిత్రులు (బీజేపీ, టీడీపీ, జనసేన) ఒకటవుతాయానే చర్చ మొదలైంది. స్థానిక నేతల చొరవతో, బీజేపీకి తెలుగు దేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు సహకరిస్తున్నారే కానీ, పార్టీల స్థాయిలో ఎలాంటి ఒప్పందం లేదని బీజేపీ, టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాకు చెందిన బీజేపీ కీలక నాయకులు సత్యకుమార్, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డికి స్థానిక టీడీపీ నేతలతో మొదటినుంచీ మంచి సంబందాలే ఉన్నాయి. సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి అయితే, టీడీపీలో ఎదిగారు, ఎన్నికలలో గెలిచారు. అందుకే, స్థానిక  నాయకులు క్యాడర్ వ్యక్తిగత స్థాయిలో బీజేపీకి సహకరిస్తున్నారని అంటున్నారు. ఇలా అనుకోకుండా, మాజీ మిత్రుల నుంచి అందుతున్న మద్దతుతో, అసలు పోటీలో ఉండదనుకున్న బీజేపీ.. పోలింగుకు రెండురోజుల ముందు, అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆరంభంలో కాంగ్రెస్ రెండవ స్ధానంలో ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు బీజేపీ రెండవ స్థానంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.నిజానికి బద్వేలో  బీజేపీ నియోజకవర్గంలో, కనీసం డిపాజిట్ తెచ్చుకునే పాటి ఓటు కూడా లేదు.అంతే కాదు, బీజేపీకి అన్ని పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ బూత్ ఏజెట్లు, స్లిప్పులు పంపిణీ చేసేవారు, పోలింగ్‌బూత్‌ల వద్ద టేబుల్ వేసుకుని కూర్చునేంత సంఖ్యలో కార్యకర్తలు- యంత్రాంగం కూడా లేరన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ కొరత లేకుండా టీడీపీ కర్యకర్తలు పనిచేస్తున్నారు.  టీడీపీ నేతలు కూడా తమ పార్టీ బరిలో లేకపోవడం, స్థానికంగా వైసీపీ నేతల దాడులు, తమ పార్టీ కార్యకర్తలకు పథకాలు వర్తింపచేయకపోవడం, ఉన్నవాటిని తొలగించడం వంటి కారణాలతో ఉప ఎన్నికలో బీజేపీకి అనుకూలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇంతటితోనే బీజేపీ,టీడీపీ ఒకటై పోతయ్యా అంటే .. కాకపోవచ్చును. కానీ ఆ దిశగా ఇదొక అడుగు అని అయితే అనుకోవచ్చును.  

మాజీ 'మిస్‌ తెలంగాణ' సూసైడ్ అటెంప్ట్‌.. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌.. పోలీసులు అల‌ర్ట్‌

ఆమె మాజీ 'మిస్‌ తెలంగాణ'. ఏం క‌ష్టం వ‌చ్చిందో.. ఎవ‌రు మోసం చేశారో తెలీదు కానీ.. సూసైడ్ చేసుకోవాల‌ని అనుకుంది. సెల‌బ్రిటీ కావ‌డంతో ఆమెకు సోష‌ల్ మీడియాలో చాలా మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారు. ప్ర‌తీ చిన్న విష‌యం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసే అల‌వాటు ఉంది. చిన్న చిన్నవే పోస్ట్ చేసే తను.. సూసైడ్ చేసుకునే అంత పెద్ద మేట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌కుండా ఎలా ఉంటుంది? అదే ప‌ని చేసింది. తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ.. ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టింది. క‌ట్ చేస్తే.. క‌థ సుఖాంతం. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే... హైద‌రాబాద్‌లో ఉండే మాజీ మిస్ తెలంగాణ.. త‌న ఇంట్లో ఆత్మహత్యకు ప్ర‌యత్నించారు. ఉరి బిగించుకున్న ఆమె ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్ చూసిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని రక్షించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి కార‌ణం ఏంట‌ని ఆరా తీస్తున్నారు. ల‌వ్ మేట‌రా? కెరీర్ అంశ‌మా? మ‌రేదైన ఇష్యూనా అనే దిశ‌గా ద‌ర్యాప్తు చేస్తున్నారు.   

పీకే డైరెక్షన్ లో కొత్త పార్టీ! తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఆట వారిదే..

తెలుగు రాష్ట్ర రాజకీయాలు చాలా చాలా వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీలు బలహీనపడుతున్నాయి. దీంతో కొత్తగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. జాతీయ పార్టీలు మేమున్నామంటూ ముందుకొస్తున్నాయి. పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త నాయకులు తెరమీదకు వస్తున్నారు. అయినా ఎవరు అవునన్నా ఎవరు కాదన్న తెలంగాణలో తెరాస ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత  వ్యతిరేకత ఉన్నా, అక్కడక్కడా, అప్పుడప్పుడు కొన్ని ఎదురుదెబ్బలు తిన్నా, ఇంకా ఇప్పటికీ, రాష్ట్ర రాజకీయాలపై తెరాస ఆధిపత్యమే కొనసాగుతోంది. అలాగే, తెరాస మీద కుటుంబ ఆధిపత్యం ముఖ్యంగా  తండ్రీ కొడుకుల ఆధిపత్యమే కొనసాగుతోంది.  కొద్ది నెలల క్రితం రాజన్న రాజ్యం నినాదంతో దివంగత  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలా, వైఎస్సార్ టీపీ  పార్టీని ఏర్పటు చేశారు. సదస్సులతో మొదలుపెట్టి  మంగళవారం దీక్షల మీదగా, ఇప్పుడు వైఎస్ బాటలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగిస్తున్నారు. అయితే  ఆమె తెరాస ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నా, ఆమె  ఎవరు వదిలిన బాణం, ఎందుకోసం, ఏ లక్ష్యంతో పార్టీ పెట్టారు? అనే విషయంలో ఎవరి అనుమానాలు వారికున్నాయి. ఆమె తెలంగాణ రాజకీయ తెర మీద ఒక ప్రశ్నగానే మిగిలి పోయారు.  అలాగే ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, ఉద్యోగానికి రాజీనామా చేసి, బీఎస్పీలో చేరారు. ఆయన కూడా తెరాస ప్రభుత్వ్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటైన విమర్శలే చేస్తున్నారు. అయినా ఆయన సొంత సర్కిల్ మినహా ఇతర వర్గాల్లో అంతగా కదలిక రాలేదు. నిజానికి, కారణాలు ఏవైనా, ఇటు షర్మిల అటు ప్రవీణ్ కుమార్  ఈ ఇద్దరినీ నడిపించే రిమోట్ కంట్రోల్ ఇంకొకరి చేతుల్లో ఉందనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అందుకే, తెలంగాణ ప్రజలు ఆ పార్టీలను పట్టించుకోవడం లేదు. అదలా ఉంటే, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండూ తెరాసకు ప్రత్యాన్మాయంగా ఎదిగేందుకు పోటాపోటీగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అయితే, రెండు ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు సమాంతరంగా ఎదిగి రావడం వలన తెరాస ప్రయోజనం పొందే ప్రమాదం ఉందని, రాజకీయ వర్గాలలో చాలా కాలంగా వినస్తోంది.  అలాగే ముక్కోణపు పోటీలో తెరాస బలహీనపడినా చివరాఖరుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న జాతి వైరం కారణంగా, తెరాస కీలకంగా మారుతుందని, కేసీఆర్ కుటుంబ పాలనే కొనసాగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బలిదానాలు పునాదులుగా, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ కుటుంబ(తెరాస) ఆధిపత్యాన్ని తప్పించి, ఉద్యమ లక్ష్యాలను  ముందుకు తీసుకుపోయే  ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యంగా, మరో ఉద్యమ  పార్టీ  ఏర్పాటుకు ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల వెనక జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్న ఒక సీనియర్ నేతతో పాటుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ కూడా  ఉన్నట్లు సమాచారం.  నిజానికి, ప్రశాంత్ కిశోర్ ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే గత కొంత కాలంగా రాష్ట్రంలో తెరాస పాలనను అంతమొందించే లక్ష్యంతో, కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న విభిన్న స్థాయిల్లో చర్చలు జరుపుతున్న తెరాస మాజీ నేత ఢిల్లీలో మకాం చేసి, తెరాసను గద్దె దించే ఏకైక లక్ష్యంతో  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మరో పార్టీ ... వలన ఎవరికీ మేలు జరుగుతుంది. ఇది ఇప్పటికైతే జవాబు లేని ప్రశ్న అనే అంటున్నారు.

జ‌గ‌న్ ఇంట్లో 'నాగ్' లంచ్‌ మీటింగ్‌.. అందుకేనా? ఆ ప‌ని కోస‌మేనా?

సీఎం జ‌గ‌న్‌రెడ్డిని క‌లిసిన హీరో నాగార్జున‌. సినిమా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్‌తో క‌లిసి విందు భోజ‌నం. ఇదీ న్యూస్‌. పైపైన చూస్తే ఇంతే. కానీ, ఆస‌క్తిగా గ‌మ‌నిస్తే ఈ భేటీ వెనుకు ఇంకేదో మేట‌ర్ ఉంద‌నే అనుమానం. ఇంత‌కీ ఏంట‌ది? జ‌గ‌న్‌-నాగార్జున స‌మ‌వేశానికి కార‌ణం ఏమై ఉంటుంది?  సినీ ప‌రిశ్ర‌మ సమ‌స్య‌ల‌పై మాత్ర‌మే చ‌ర్చించాల‌నుకుంటే.. టాలీవుడ్ త‌ర‌ఫున నాగార్జున మాత్ర‌మే ఎందుకు వెళ‌తారు? ఇంత‌కుముందు ఎప్పుడూ అలా వెళ్ల‌లేదే. చిరంజీవి, నాగార్జున‌, సి.క‌ల్యాణ్‌, దిల్‌రాజు, సురేశ్‌బాబు, రాజ‌మౌళి.. ఇలా హేమాహేమీలంతా క‌లిసి సీఎం జ‌గ‌న్ ఇంటికి వెళ్లేవారు. అలా కాకుండా నాగ్ మాత్ర‌మే వెళ్లారంటే.. అది టాలీవుడ్ మేట‌ర్ కాక‌పోవ‌చ్చ‌ని తేలిపోతోంది. మ‌రి, నాగార్జున తాడేప‌ల్లి ప్యాలెస్‌కు ఇంకెందుకు వెళ్లి ఉంటారు? 'మా' గురించి అని కూడా అనుకోలేం. ఎందుకంటే.. మంచు విష్ణుతో జ‌గ‌న్‌రెడ్డికి ద‌గ్గ‌రి బంధుత్వ‌మే ఉంది. కాబ‌ట్టి, విష్ణును కాద‌ని మా అంశాల గురించి మాట్లాడ‌టానికి అక్కినేని చొర‌వ తీసుకునే అవ‌కాశ‌మే లేదు. ఇక చైత‌న్య‌-స‌మంత‌ల ఫ్యామిలీ గురించి ముఖ్య‌మంత్రితో మాట్లేడేదేముంటుంది.. అది వారి ప‌ర్స‌న‌ల్‌ ఫ్యామిలీ మేట‌ర్‌. ఇవేవీ కాక‌పోతే.. నాగార్జున స‌డెన్‌గా తాడేప‌ల్లికి ఎందుకు వెళ్లుంటార‌నే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా ఒక్కోటి ఎలిమినేట్ చేసుకుంటూ పోతే.. చివ‌రాఖ‌రికి చిరంజీవి ద‌గ్గ‌రికొచ్చి ఆగుతోంది విష‌యం. చిరు కోసం మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెర‌ప‌డానికే నాగార్జున.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసుంటార‌ని అంటున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌, టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై ఇటీవ‌ల చిరంజీవి ఓపెన్‌గా సీఎం జ‌గ‌న్‌కు రిక్వెస్టులు చేశారు. ద‌య‌చేసి.. ప్లీజ్ మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండంటూ వేడుకున్నారు. చిరులాంటి వారు అంత దీనంగా మాట్లాడ‌టం చూసి.. సీఎం జ‌గ‌న్ టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌ను అస‌లేమాత్రం ప‌ట్టించుకోకుండా.. ఎంత‌లా టార్చ‌ర్ చేస్తున్నారో అంటూ తెగ చ‌ర్చ న‌డిచింది. ఏపీ ప్ర‌భుత్వ తీరును ఇలా చిరంజీవి దీనంగా త‌ప్పుబ‌ట్టారో లేదో.. ఆ వెంట‌నే త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాన్ సీన్‌లోకి వ‌చ్చి జ‌గ‌న్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. స‌న్నాసుల నుంచి దిగ‌కుండా.. ఆన్‌లైన్ టికెటింగ్‌పై జ‌గ‌న్‌ను, వైసీపీని ఆటాడుకున్నారు. అప్ప‌టి నుంచీ మెగా ఫ్యామిలీపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గుర్రుగా ఉన్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో త‌న‌ భేటీ జ‌ర‌గాల్సి ఉన్నా.. ఆల‌స్యం చేస్తూ వ‌చ్చారు.  మ‌రోవైపు, త‌మ పార్టీ మ‌నిషి మోహ‌న్‌బాబు త‌న‌యుడు, త‌న ద‌గ్గ‌రి బంధువు విష్ణు 'మా' అధ్య‌క్షునిగా బ‌రిలో దిగితే.. త‌మ వారికి పోటీకా నిలిచిన ప్ర‌కాశ్‌రాజ్‌కు మెగా కుటుంబం స‌పోర్ట్ చేయ‌డం కూడా జ‌గ‌న్‌కు ఆగ్ర‌హం తెప్పించింద‌ని అంటున్నారు. అందుకే, జ‌గ‌న్‌ను కూల్ చేసేందుకే.. చిరు త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ నాగ్‌.. తాడేప‌ల్లి వెళ్లార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్‌కు మొద‌టి నుంచీ నాగార్జున మంచి క్లోజ్ కాబ‌ట్టి.. ఆయ‌న చెబితే వినే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. నాగ్‌ను ముందుంచార‌ని టాక్‌. చిరంజీవి త‌ప్పేమీ లేద‌ని స‌ర్ది చెప్పి.. మ‌ళ్లీ మ‌రో మీటింగ్‌కు ముహూర్తం పెట్టించ‌డానికి నాగార్జున‌ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది.   

అడ్డగోలు జీవోలపై హైకోర్టులో కేసు.. జగన్ సర్కార్ కు చిక్కులేనా?

ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలకై ఎన్నుకునే ప్రజాప్రభుత్వాల్లో దాపరికం ఎంత తక్కువగా ఉంటే అంత మంచింది. అందుకే ప్రభుత్వాలు తమ విధాన పరమైన జీవోలను పబ్లిక్ డొమెన్ లో ఉంచుతాయి. 2009 నుంచి ఆన్ లైన్ లో జీవోలను ఉంచటం.. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్ని డౌన్ లోడ్ చేసి.. చూసుకునే అవకాశం ఉంది. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం రూల్స్ మార్చేసింది. జీవోలను వెబ్ సైట్ లో పెట్టడం మానేసింది. అడ్డగోలుగా జీవోలు ఇస్తుండటం వల్లే... వాటిని వెబ్ సైట్ లో పెట్టడం లేదనే ఆరోపణలు వచ్చాయి. జీవోలను  ఆన్ లైన్ లో ఉంచకూడదన్న జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాల విషయంలో వారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానంగా  మరో వారంలో కౌంటర్‌ వేయాలని పిటిషనర్లకు సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.    ‘జీవోఐఆర్‌’ సైట్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచకపోవడం మరోవైపు అత్యల్ప సంఖ్యలో జీవోలను ఏపీఈ గెజిట్‌ వెబ్‌సైట్లో ఉంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 7న జారీచేసిన జీవో 100ను సవాలు చేస్తూ.. జీఎంఎన్‌ఎస్‌ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ‘తెలుగువన్‌.కామ్‌’ డిజిటల్‌ మీడియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కంఠంనేని రవిశంకర్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. ప్రభుత్వాలు పాలనా నిర్ణయాల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. జగన్ సర్కార్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రభుత్వ కౌంటర్ ఎలా ఉండబోతోంది, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నది ఆసక్తిగా మారింది. 

విచ్చలవిడిగా డబ్బు..హుజురాబాద్ ఉప ఎన్నిక రద్దు?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణి జరుగుతోంది. ఓటుకు 10 వేల రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కవర్లలో డబ్బులు పెట్టి పంచుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ఓటర్లు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ లో ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప  ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో పోరాటం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ను కలిసి విజ్ఞప్తి చేయనుంది.  ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీఈసీని కలవబోతున్నారు.  అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్ లో ఓటర్లను టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందుకు తగిన ఆధారాలను సీఈసీకి సమర్పించబోతోంది.ఓటుకు 6 వేల రూపాయల నుంచి 10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. బహుమతులు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు, అధికార దుర్వినియోగం తదితర అక్రమాలు జరిగాయని ఆరోపణ.. మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని, ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అడ్డగోలు అక్రమాలు, ఎన్నికల నిబంధనల అతిక్రమణలు ఎక్కడా జరగలేదని ఆరోపణ లతో ఫిర్యాదు చేయనున్నరు.  కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈనెల 30న హుజురాబాద్ పోలింగ్ జరగనుంది. 

శ్రీశారదా పీఠానికి 15 ఎకరాలు.. ఏపీ కేబినెట్ పచ్చజెండా..

అమరావతిలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు, రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం లభించింది. యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ పడింది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు, అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు తీర్మానం చేసింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి జగన్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విశాఖలో తాజ్‍వరుణ్ బీచ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్.. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం లభించింది. ఇక వచ్చేనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ మంత్రివర్గం నిర్ణయించింది. 

హుజురాబాద్ పోలింగ్ కు ముందు కేసీఆర్ కు బిగ్ షాక్.. కారులో కలవరం..

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన, అన్ని పార్టీలకు సవాల్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొన్ని గంటలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ తగిలింది. హుజురాబాద్ లో ప్రభుత్వ పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం అమలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  హుజూరాబాద్ లో దళితబంధు నిలిపివేత అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోమని హైకోర్టు తేల్చి చెప్పింది. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఇటీవల ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై టీఆర్ఎస్ తోపాటు పలువురు కోర్టుకు ఎక్కడంతో విచారణ జరిపిన కోర్టు తాజాగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నికల వేళ.. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేయకుండా కొందరు కోర్టుకు ఎక్కగా.. దానిపై విచారించిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు పథకాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికలో దీని ప్రభావం ఉంటుందనే చర్చ సాగుతోంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రతాపం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు పథకం ప్రకటించి కోర్టు ఆదేశాలతో నిలిపివేసిన టీఆర్ఎస్ సర్కార్ కు గట్టి దెబ్బ తగిలింది. జనాలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడే అదే జరుగబోతోందని.. దళితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందంటున్నారు.  మరోవైపు దళిత బంధుకు సంబంధించి హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని.. అక్కడ దళితబంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్ లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కడ సురేష్ కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తోపాటు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్ లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.