టీవీ5 కేసులో సంచలనం.. అరెస్టులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను మెజిస్ట్రేట్లు గుర్తించుకోవాల్సిందేనని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. అలా పాటించకపోతే మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కేసం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు .. అన్వేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మెజిస్ట్రేట్లు పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మీడియా ప్రతినిధులు , సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టేవారిపై నిబంధనలకు విరుద్దంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీవీ5 ఛైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు హైకోర్టులో పిల్  దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.  కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లోనూ 41ఏ కింద వివరణ తీసుకోకుండా అరెస్ట్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో రిమాండ్ విధించే సమయంలో వ్యక్తుల స్వేఛ్చకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నామన్న విషయాన్ని మెజిస్ట్రేట్లు గుర్తించుకోవాలని హైకోర్టు తెలిపింది. ఇక ఎఫ్ఐఆర్ డౌన్ లోడ్ చేసుకునే వారి నుంచి వ్యక్తిగత సమాచారం కోరడంపైనా పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు అధికారిక వెబ్ సైట్, ఏపీ పోలీస్ సేవా యాప్ లో వ్యక్తిగత సమాచారం కోరడం గోప్యత హక్కును హరించడమేనని కోర్టుకు తెలిపారు. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు ధర్మాసనం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎవరూ ఎక్కడా, సరిగా పాటించడం లేదని అభిప్రాయపడింది. వాటిని పాటించేలా తగిన ఉతర్వులు ఇస్తామంటూ తీర్పును రిజర్వ్ చేసింది. 41ఏ నిబంధనల అమలు విషయంలో పోలీసులకన్న న్యాయస్థానాలకే ఎక్కువ బాధ్యత ఉందన్న హైకోర్టు..సుప్రీంకోర్టు ఆదేశాలను అనుగుణంగా తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపింది.    

విజ‌య‌సాయికి అమిత్‌షా షాక్‌.. జ‌గ‌నన్నకు మైండ్ బ్లాంక్‌..

వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ అమితానందాన్ని ప్ర‌ద‌ర్శించారు. హ‌స్తిన వ‌చ్చిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు కేంద్ర‌ హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదంటూ చంక‌లుగుద్దుకున్నారు. అయితే, విజ‌యసాయి ఆనందం ఎంతోసేపు నిల‌వ‌లేదు. ఆయ‌న ప్రెస్‌మీట్ ముగిసిందో లేదో.. స్వ‌యంగా హోంమంత్రి అమిత్‌షానే చంద్ర‌బాబుకు ఫోన్ చేయ‌డంతో విజ‌యసాయికి దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాంక్ అయి ఉంటుంది. చంద్ర‌బాబు వెళ్లి అమిత్‌షాను క‌లిసుంటే కాస్త రొటీన్‌గా ఉండి ఉండేది.. అదే అమిత్‌షానే సీబీఎన్‌కు ఫోన్ చేసి మాట్లాడ‌టం సంథింగ్ స్పెష‌ల్ అంటున్నారు. ఈ ప‌రిణామం ఇటు వైసీపీకి అటు విజ‌య‌సాయికి అస‌లేమాత్రం రుచించి ఉండ‌క‌పోవ‌చ్చు గానీ.. ద‌టీజ్ సీబీఎన్ అంటూ సోష‌ల్ మీడియాలో తెలుగు త‌మ్ముళ్లు తెగ రెచ్చిపోతున్నారు. ఆ పోస్టులు చూసి విజ‌య‌సాయికి ముఖం మాడిపోయి ఉంటుందంటున్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోరినప్పుడు తాను కశ్మీర్‌ పర్యటన, వివిధ‌ కార్యక్రమాల వ‌ల్ల సమయం ఇవ్వలేకపోయాన‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం, టీడీపీ ఆఫీసుల‌పై దాడులు, డ్ర‌గ్స్‌, గంజాయి దందాలు, పోలీసుల తీరుపై చంద్రబాబు అమిత్‌షాకు వివరించారు.  మామూలుగా చూస్తే.. అపాయింట్‌మెంట్ ఇవ్వ‌నంత మాత్రాన అమిత్‌షా అంత‌టి వాడు చంద్ర‌బాబుకు తిరిగి ఫోన్ చేయాల్సిన అవ‌స‌రం లేదు.. కానీ, చేశారంటే ఏంటి అర్థం? గ‌తంలో సీఎం జ‌గ‌న్‌కు సైతం అమిత్‌షా ప‌లుమార్లు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోయినా.. ఆయ‌నెప్పుడూ తిరిగి ఫోన్ చేసింది లేదు. చంద్ర‌బాబు విష‌యంలో మాత్ర‌మే ఆయ‌నిలా ఫోన్ చేశారంటే.. టీడీపీ విష‌యంలో కేంద్రం-బీజేపీ వైఖ‌రి మారుతోంద‌నేగా..? అంటున్నారు.  వైసీపీపై కేంద్రానికి ఇంట్రెస్ట్ త‌గ్గిపోయింద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల పోల‌వ‌రం ప్రాజెక్టుకు స‌వ‌రించిన అంచ‌నాల నిధులు ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఇక ఏపీలో జ‌రుగుతున్న మ‌త మార్పిడిలు, ఆల‌యాల ధ్వంసంపై ఆర్ఎస్ఎస్ ప‌త్రిక‌లో ఘాటైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా చేస్తున్న అప్పుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతూ వ‌స్తోంది కేంద్రం. ఇలా వైసీపీ విష‌యంలో కేంద్రం వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు వ‌స్తున్న సంద‌ర్భంలో.. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు అమిత్‌షా స్వ‌యంగా ఫోన్ చేసి.. పార్టీ కార్యాల‌యాల‌పై దాడుల గురించి తెలుసుకోవ‌డం రాజకీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఒక్క ఫోన్ కాల్‌.. భ‌విష్య‌త్తులో జ‌రిగే అవ‌కాశ‌మున్న‌ రాజ‌కీయ మార్పుల‌కు నాంది అంటున్నారు. ఈ ప‌రిణామం జ‌గ‌న‌న్న‌కు అస‌లే మాత్రం న‌చ్చ‌క‌పోవ‌చ్చు. 

ఈటలకు ఓటేయాలన్న హరీష్.. క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్..

హుజురాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ప్రచారం తారాస్థాయిలో జరిగింది. ప్రచార గడువు ముగిసే చివరి నిమిషం వరకు ఓటర్ల ప్రసన్నం కోసం అష్టకష్టాలు పడ్డారు  నేతలు. అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం అంతా తానే శ్రమించారు మంత్రి హరీష్ రావు. దాదాపు రెండు నెలలుగా ఆయన నియోజకవర్గంలోనే తిరిగారు. గతంలో ఈటల రాజేందర్ కు ఆప్త మిత్రుడిగా ఉన్న హరీష్ రావు.. ఆయనను ఓడించేందుకు సర్వ శక్తులు ఒడ్డడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ సాగింది. ఈటలకు వ్యతిరేకంగా హరీష్ రావు ప్రచారం చేస్తున్నా.. ఆయన మనసంతా రాజేందర్ వైపే ఉందనే వాదన కూడా వచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అక్కడ తిరుగుతున్నారు కాని.. ఈటలను ఓడించేంత కసిగా ప్రచారం చేయడం లేదనే వాదన కూడా కొన్ని వర్గాల నుంచి వచ్చింది. ఈటల రాజేందర్ కూడా తన ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు కాని హరీష్ రావుపై ఎక్కడ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాదు హరీష్ రావు చాలా మంచోడని, కేసీఆర్ అతన్నిబలి పశువు చేస్తున్నారని కూడా కామెంట్ చేశారు. హరీష్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈటల చెప్పినట్లే హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ దూరంగా ఉండటం జనాల్లోనూ చర్చకు దారి తీసింది. ఓడిపోతామని తెలుసు కాబట్టే తండ్రి కొడుకులు ప్రచారాని రాలేదని, ఓటమిని హరీష్ రావుపై నెట్టేసి అతన్ని వీక్ చేసే కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరిగింది. ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచనంగా మారాయి. అధికార పార్టీని షేక్ చేస్తోంది. హుజురాబాద్ రోడ్ షోలో మాట్లాడిన హరీష్ రావు... డమ్మీఈవీఎమ్ ను ఓటర్లకు చూపిస్తూ ఒకటో నెంబర్ పై బటన్ నొక్కాలని చెప్పారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఈవీఎమ్ లో ఒకటో నెంబర్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ది. అంటే ఒకటో నెంబర్ పై ఓటు వేయమనడం ద్వారా హరీష్ రావు.. ఈటల రాజేందర్ కు ఓటేయమని చెప్పినట్లైంది. హరీష్ రావు వ్యాఖ్యలతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మొదటి నుంచి హరీష్ రావు మనసంతా ఈటల రాజేందర్ పైనే ఉందని, చివరి రోజు అలా బయటికి వచ్చేసిందనే చర్చ జనాల్లో సాగుతోంది.  మరోవైపు అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకు ఓటేయాలని హరీష్ రావు క్లియర్ గా చెప్పారని, అయితే ఈవీఎమ్ ను చూపిస్తున్నప్పుడు పొరపాటున చేయి ఒకటో నెంబర్ పైకి వెళ్లిందని చెప్పారు. పొరపాటున జరిగిన ఘటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ చిల్లర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఒకటో నెంబర్ బటన్ నొక్కాలంటూ మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన మాత్రం ఇప్పుడు హుజురాబాద్ లో వైరల్ గా మారింది. గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. 

బ్రిట‌న్‌లో అమ‌రావ‌తి భ‌ద్రం.. జ‌గ‌న్ పాల‌న‌లో విధ్వంసం!..

అమ‌రావ‌తి. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని. చంద్ర‌బాబు కాంక్షించిన సుంద‌ర‌ స్వ‌ప్నం. జ‌గ‌న్ వ‌చ్చాక అమ‌రావ‌తి ఆగ‌మాగం. రాజ‌ధానిని మూడుముక్క‌లు చేశారు. గ‌త‌మెంతో ఘ‌న‌మైన అమ‌రావ‌తిని మూల‌న‌ప‌డేశారు. పేరుకే ఇప్పుడు అది ఏపీ కేపిట‌ల్‌. ప్ర‌స్తుతం అక్క‌డ నిశ్శ‌బ్దం రాజ్య‌మేలుతోంది. చంద్ర‌బాబు మీద జ‌గ‌న్‌కు ఉన్న కోపం అమ‌రావ‌తికి శాపంగా మారింది. అందుకే, అల‌నాటి అమ‌రావ‌తి ఆన‌వాళ్ల‌ను ప‌రాయి దేశం భ‌ద్రంగా కాపాడుతుంటే.. ఇల‌నాటి జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని నామరూపాలు లేకుండా చేసే కుతంత్రం చేస్తోంద‌ని మండిప‌డుతున్నారు.  అమ‌రావ‌తి కేవ‌లం చంద్ర‌బాబు పెట్టిన పేరు మాత్ర‌మే కాదు. అది పురాత‌న కాలం నుంచీ ఉన్న ప్ర‌ముఖ న‌గ‌రం. ఆ ప్రాంత చారిత్ర‌క వైభ‌వం.. అమ‌రావ‌తి పేరుకున్న ప్రాముఖ్యం గుర్తించే చంద్ర‌బాబు అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధాని చేశారు. అందుకోసం ప్రాచీన‌ చ‌రిత్రను త‌వ్విపోశారు. అమ‌రావ‌తి అన్వేష‌ణ‌లో బ్రిట‌న్ మ్యూజియంలో భ‌ద్రంగా దాగున్న ఆన‌వాళ్లు ఆవిష్కృత‌మ‌య్యాయి. అమ‌రావ‌తి చంద్ర‌బాబు కాలం నాటిది కాదు. వేల ఏళ్ల ప్రాచీన చ‌రిత్ర ఆ నేల సొంతం. బౌద్ధ మ‌తం విరాజిల్లిన ప్రాంతం. అల‌నాటి శిల్పాలు, శాస‌నాలు బ్రిటీష‌ర్ల కాలంలో బ‌య‌ట‌పడ్డాయి. ఆ అపురూప క‌ళాఖండాల‌ను అలాగే లండ‌న్ త‌ర‌లించారు. 120కి పైగా మార్బుల్ రాయితో త‌యారుచేసిన క‌ళాఖండాల‌ను, శాస‌నాల‌ను భ‌ద్రంగా లండ‌న్‌ మ్యూజియంలో ఉంచారు. ఆ అమ‌రావ‌తి ఆన‌వాళ్లు.. ఇప్ప‌టికీ అక్క‌డి మ్యూజియంలో చూడొచ్చు. వాటిని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు స‌ర్వే ఆఫ్ ఇండియా, యునెస్కో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిని ఏలుతున్న జ‌గ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏవైనా ప్ర‌య‌త్నాలు చేస్తారా? ఉన్న‌ అమ‌రావ‌తినే ఆన‌వాళ్లు లేకుండా చేస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం నుంచి.. ఇక గ‌త ఆన‌వాళ్ల‌ను ఆంధ్రుల చెంత‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల‌ను ఆశించ‌గ‌ల‌మా? అంటున్నారు. 

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్.. జగన్ కు జబర్దస్త్ షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చే పరిణామం జరిగింది. ఇటీవల ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, టీడీపీ కార్యాలయాలపై దాడుల ఘటనలతో వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేయడం ఆసక్తిగా మారింది. వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోంది.  బుధవారం మధ్యాహ్నం అమిత్ షా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఏపీలో పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో కలవడం కుదరలేదని, మరోసారి కలుద్దామని చెప్పారు. చంద్రబాబు తనను ఎందుకు కలవాలని అనుకుంటున్నారో అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏపీ పరిస్థితులపై వినతి పత్రం తయారు చేశామని, అది పంపుతున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్రమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగ విధ్వంసం జరుగుతోందని, అలాగే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు తదితర విషయాలను అమిత్ షాకు వివరించారు. అలాగే ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడినా దాని మూలాలు ఏపీకి రావడం, ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు వివరించారు. అదే విధంగా తాము రాష్ట్రపతికి అందించిన వినతిపత్రం, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో, వీడియోతో సహా పంపుతానని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుసుకున్న చంద్రబాబు అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే అమిత్ షా మంగళవారం మధ్యాహ్నం వరకు జమ్మూ కశ్మీర్ నుంచి రాకపోవడం, తర్వాత ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో కలవడం కుదరలేదని ఆయన పేషీ అధికారులు చంద్రబాబు బృందానికి సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు బృందం ఢిల్లీ నుంచి తిరిగొచ్చింది. 

హుజురాబాద్ పై వేల కోట్ల బెట్టింగ్స్! పోలీసులకు చిక్కకుండా ఆన్ లైన్ పేమెంట్స్..

తెలంగాణలోని హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు దేశంలో హాట్ హాట్ గా మారింది. బెట్టింగ్ రాయుళ్లంతా ప్రస్తుతం హుజురాబాదే కేంద్రంగానే దందా నడిపిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ హుజురాబాద్ పై పెద్ద ఎత్తున బెట్టింగ్స్ సాగుతున్నాయంటే షాక్ గురికాక తప్పదు.  హుజురాబాద్ లో పార్టీల బలబలాలు మారుతున్నట్లే బెట్టింగ్స్ కూడా మారిపోతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు ఒకవైపే ఉన్న బెట్టింగ్.. ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల మధ్యకు చేరింది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల గెలుపుపై మొన్నటిదాకా రూ. 100, రూ. 200 కోట్ల వరకూ సాగిన పందెం దందా ఇప్పుడు రూ. 1,000 కోట్లకు ఎగబాకిందని తెలుస్త్తోంది. అయితే టీఆర్ఎస్ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందరే గెలుస్తాడనే  ఎక్కువ మంది పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. రూపాయికి.. వెయ్యి రూపాయలు అనే స్థాయిలో బెట్టింగ్స్ నడుస్తున్నాయని..  వెయ్యి నుంచి మొదలైన బెట్టింగ్.. కోట్లకు చేరుతోందిని సమాచారం.  పార్టీల గెలుపోటములతో పాటు అభ్యర్థుల మెజార్టీ, పార్టీల వారీగా వచ్చే ఓట్లపై సైతం బెట్టింగ్​కాస్తున్నారు. మండలాల వారీగా ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందన్న దానిపై బెట్టింగ్స్ కాస్తున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు, పోలింగ్ బూతుల వారీగా కూడా పందేళ్లు నడుస్తున్నాయి. ఓవరాల్ గా ఈటల రాజేందర్‌కు 20 వేల మెజార్టీపై రూ.100కు పదింతలు అనే స్థాయిలో ఉంటే.. గెల్లు శ్రీనివాస్​ గెలుస్తాడని, కనీసం వెయ్యి నుంచి ఐదు వేల ఓట్ల మెజార్టీ వస్తుందని రూ. 1000కి నాలుగింతలు అని బెట్టింగ్ పెడుతున్నారని టాక్. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు చీల్చుతారనే కోణంలో కూడా పందెం వేసుకుంటున్నారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో బెట్టింగ్స్ ఎక్కువగా నడుస్తుంటాయి. దీంతో ఏపీకి చెందిన పందెంరాయుళ్లంతా ఇప్పుడు హుజురాబాద్ పై పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో బద్వేల్‌లో ఉప ఎన్నిక ఉన్నా... అక్కడ పోటీ లేకపోవడంతో హుజురాబాద్ కేంద్రంగానే దందా నడుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా  బెట్టింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారని సమాచారం. ఆంధ్రా నాయకులు ఇక్కడ తెలిసిన వారికి ఫోన్‌ చేసి ఏ పార్టీ గెలుస్తుంది.. ఎంత మెజార్టీ వస్తుంది? అనే వివరాలను ప్రతీరోజూ తీసుకుంటున్నారట. ఇటీవల ఆంధ్రాకు చెందిన కొంతమంది నేతలు, వ్యాపారవేత్తలు, పందెంరాయుళ్లు ప్రత్యేకంగా వాహనాల్లో హుజూరాబాద్‌కు వచ్చి ప్రచార శైలిని అంచనా వేసి, పలు సర్వే నివేదికలను తీసుకొని వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల బెట్టింగ్‌ నిర్వహించే బూకీలు ఆన్‌లైన్‌లోనే దందా నడుపుతున్నారని తెలుస్తోంది. కొంతమంది బూకీలు అటు కరీంనగర్, ఇటు వరంగల్‌లోని పలు హోటళ్లలో మకాం వేశారు. బెట్టింగ్​ పేమెంట్స్​కూడా మొత్తం ఆన్‌లైన్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నట్టు చెబుతున్నారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికపై ఐఏఎస్‌లు, ఉన్నతస్థాయి అధికారవర్గాల్లోనూ ప్రధానంగా చర్చ నడుస్తోంది. బీఆర్కే భవన్‌లోనే ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరో ఇద్దరు ఉన్నతాధికారులు బెట్టింగ్‌కు దిగినట్టు చర్చ నడుస్తున్నది. ఈటల మంత్రిగా పనిచేసిన ఓ శాఖలోని మరో ఇద్దరు సీనియర్​ అధికారులు కూడా పందెం వేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఐపీఎస్ అధికారుల్లోనూ ఇదే చర్చ సాగుతున్నదని, ఇంటెలిజెన్స్ వర్గాలకు ఫోన్​ చేసి పరిస్థితులపై ఆరా తీస్తున్నారని తెలిసింది.   

దీపావళికే జియో-గూగుల్ నెక్స్ట్‌ ఫోన్‌.. తెలుగువారితో క‌నెక్ట్‌ ఏంటి?

జియోఫోన్ ‘నెక్ట్స్‌’. ఇండియన్స్ ఆస‌క్తికంగా వెయిట్ చేస్తున్న స‌రికొత్త ఫోన్‌. జియో-గూగుల్‌ సంయుక్తంగా తీసుకొస్తున్న జియోఫోన్‌ ‘నెక్ట్స్‌’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ ఫోన్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు జ‌నాలు. తాజాగా, ఈ దీపావళికే జియోఫోన్ ‘నెక్ట్స్‌’ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తామ‌ని తాజాగా గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. జియోతో కలిసి ప్రాంతీయ భాషల్లో.. అందుబాటు ధరలో.. ఫోన్‌ తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.  వివిధ ప్రాంతీయ భాషలు మాట్లేడే వ్యక్తులను కలిపేలా..  దేశంలోని 30 కోట్ల మంది 2జీ వినియోగదార్లను లక్ష్యంగా.. జియోఫోన్‌ నెక్స్ట్‌ 4జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది జియో-గూగుల్‌. ఇండియాకే ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్స్ దీని సొంతం. ఈ టచ్‌స్క్రీన్ ఫోన్‌లో భారత్‌లో పలు భాషలు మాట్లాడే వారికి అనుగుణంగా భాషా-అనువాద టూల్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ ఫీచర్‌ 10 భారతీయ భాషలను కావాల్సిన లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయగలదు.  వాయిస్‌ అసిస్టెంట్‌: ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఓపెన్‌ చేయించొచ్చు. మనకు నచ్చిన భాషలోనే ఇంటర్నెట్‌లోని కంటెంట్‌ పొందొచ్చు. ట్రాన్స్‌లేట్‌: తెరపై ఉన్న ఏ కంటెంట్‌నైనా మ‌న‌కు ఇష్టమైన భాషలోకి అనువాదం చేసుకోవ‌చ్చు.  స్మార్ట్ కెమెరా: స్మార్ట్‌, ప‌వ‌ర్‌ఫుల్‌ కెమెరాతో పలు మోడ్‌లలో నచ్చిన విధంగా ఫొటోలు తీసుకోవచ్చు. నైట్‌ మోడ్‌ కూడా ఉంది. ఆగుమెంటెడ్‌ రియాల్టీ ఫిల్టర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ: ఆటోమేటిక్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో పాటు మెరుగైన బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఎక్కువ కాలం పాటు ఛార్జ్‌ పెట్టకుండానే వాడుకోవ‌చ్చు.  ఇలాంటి అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్న జియోఫోన్ నెక్స్ట్‌.. సామాన్యుల‌కు అందుబాటులో ఉండే ధ‌ర‌లోనే ఉండ‌నుండ‌టం విశేషం. ఇక‌, జియోఫోన్‌లో క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది తిరుపతి, శ్రీపెరంబదూరులో ఆర్‌ఐఎల్‌ గ్రూప్‌నకు చెందిన నియోలింక్‌ యూనిట్లలో తయారవుతుండ‌టం.. తెలుగువారిని ఈ ఫోన్‌తో మాన‌సికంగా క‌నెక్ట్ చేయ‌నుంది. ఇంకేం, ఈ దీపావ‌ళికి జియో ఫోన్ పండ‌గే.  

చర్చీలకు ఎంపీ నిధులా? వైసీపీ మత రాజకీయాలపై విమర్శలు..

అయ్యవారు ఏమి చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని’ సామెత. అదీ కొంతవరకు నయమే, కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ధోరణి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. చేసిన తప్పులను దిద్దుకోవదానికి బదులుగా, ఏపీ  ప్రభుత్వం చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి, తప్పుల పద్దు పెంచుకుంటూ పోతోంది.జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం ఎంత అడ్డగోలుగా సాగుతోందో వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రంలో  క్రైస్తవమత ప్రచారం మూడు ప్రార్థనలు, ఆరు గీతలుగా సాగిపోతోందనే విమర్శలు ఉన్నా.ి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం, మతం మార్పిడులు ప్రభుత్వ సహకారంతో అధికార కార్యక్రమాల స్థాయిలో జరిగి పోతున్నాయని అంటారు.  మంత్రులు, ఎమ్మెల్ల్యేలు, అధికారులు, చిన్నాపెద్ద నాయకులు ఎవరికివారు ముఖ్యమత్రిని ప్రసన్నం చేసుకుని ప్రయోజనం పొందేందుకు.’ఏసునామ’ సంకీర్తన దగ్గరి మార్గంగా భావిస్తున్నారనే టాక్ ఉంది. ఇక హిందూ దేవాలయాలపై జరుగు తున్న దాడులను ఇతోదికంగా ప్రోత్సహించడం, పాస్టర్లకు జీతాలు ఇచ్చి మత ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవడం వంటి పవిత్ర కార్యాలను ముఖ్యమంత్రి స్వయంగా చూసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆ విధంగా ఏసు ప్రభువు రుణం తీర్చుకునే  కార్యాన్ని దేవుని దయతో ముఖ్యమంత్రి  చక్కగా సాగిస్తున్నారని అంటారు. అంతే కాదు, టెండర్లు పిలిచి మరీ ప్రభుత్వ సొమ్ముతో, అవసరం అయితే హిందూ దేవాలయాల ఆదాయం నుంచి నిధులను మరల్చి మరీ, చర్చిల, నిర్మాణం మరమత్తులకు  నిధులు సమకురుస్తున్నారు. పాఠ్య పుస్తకాలలో క్రైస్తవ మత ప్రచార పాఠాలు చేర్చారు. సో, ఎక్కడా ఏ చిన్న అవకాశం వదులుకోకుండా, జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రభువు సేవలో భాగంగా, క్రైస్తవ గ్రామాల నిర్మాణ క్రతువును అత్యంత వేగంగ్ సాగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో క్రైస్తవ మిషనరీల మెప్పును, పొందుతోందని సువార్త సమాచారం.అందులో భాగంగా ఇప్పుడు, ఇటు స్వామి కార్యం, అటు స్వకార్యం కానిచ్చే విధంగా, కొందరు వైసీపీ ఎంపీలు గుట్టు చప్పుడు కాకుండా, తమ ఎంపీ నిధులను చర్చి నిర్మాణాలకు  కేటాయిస్తున్నారు. మాములుగా అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చేది కాదేమో కానీ, వైసీపీ రెబెల్ ఎంపీ, వాసనా పసిగట్టి, వివరాలు సేకరించారు. అంతేకాదు, ఆయన ఇందుకు సంబంధించి నేరుగా ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై కేంద్రం ఆరా తీయడంతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లు తెలుస్తున్నది.  బాపట్లలో వైసీపీ ఎంపి నందిగం సురేష్ తన ఎంపీ లాడ్స్ నుంచి  రూ 43 లక్షలు వెలమవారిపాలెం చర్చి మరమ్మతులు, పునర్మిర్మాణం కోసం కేటాయించడం అప్పట్లో వివాదంగా మారింది.అదేవిధంగా వివిధ జిల్లాల్లో వైసీపీ ఎంపీలు కమ్యూనిటీ హాలు నిర్మాణాల పేరిట ఇస్తున్న నిధులతో ముందు కమ్యూనిటీ హాళ్లు నిర్మించి, ఆ తర్వాత వాటిని చర్చిలుగా మారుస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని రఘురామ కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోడీని  స్వయంగా కలిసినప్పుడు ఫిర్యాదు చేశారు. తమ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను చర్చిలుగా మార్చేందుకు, తమ పార్టీ ఎంపీలు అధికారులపై ఒత్తిడి చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని కూడా అయన పేర్కొన్నారు.ఎంపీ నిధులతో చర్చిలు నిర్మించడం, మరమ్మతులు చేయడం చట్టవిరుద్ధమని రఘురామ కృష్ణం రాజు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. కాగా రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ అనుకూల విధానాలు అవలంబిస్తోందని, మతమార్పిళ్లు శరవేగంగా జరుగుతోందని ఆయన ఇదివరకే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.  రాష్ట్రంలో కొందరు పోలీసు, ఐఏఎస్ అధికారులు బహిరంగంగా క్రైస్తవ వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారని కూడా వెల్లడించారు.  అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్జ గన్ సీఎం అయిన తర్వాత క్రైస్తవులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పిన వీడియాను కూడా, కృష్ణం రాజు ఇంతకు ముందే ప్రధాని కార్యాలయానికి అందించారు. క్రైస్తవ మతం మారిన దళితులు-రెడ్లకే జగన్మోహన్‌రెడ్డి సర్కారు కీలక పదవులిస్తోందని అంటూ ఆ జాబితాను కూడా ప్రధానికి అందించారు. హిందూ ఆలయాలపై వరసగా జరుగుతున్న దాడులను, ఏపీ ప్రభుత్వం అరికట్టలేక పోతోందని అంటూ గతంలో హోమ్ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో ఎంపీ నిధులతో చర్చి నిర్మాణాలు చేస్తున్నవిషయమై  ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని జతపరుస్తూ ప్రధాని లేఖ రాశారు. ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీహాళ్లు తర్వాత చర్చిలుగా మారాయన్న ఆరోపణలపై, విచారణ జరిపించాలని ఎంపీ రాజు ప్రధానిని కోరారు.  జగన్ ప్రభుత్వం ఇప్పటికే రూ 25 కోట్లతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 248 చర్చిలు నిర్మించిందని, ఒక్కో చర్చికి రూ 84 వేల నుంచి కోటి రూపాయల వరకూ ఖర్చు చేసిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ రఘురామ రాజు. దానితో ఎంపీ లాడ్స్‌ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఏపీని కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్యకార్యదర్శికి కేంద్రం లేఖ వ్రాయడంతో జగన్ ప్రభుత్వం ఖంగు తిన్నట్లు తెలుస్తున్నది.

మంత్రి కొడాలి నానిపై తిరుగుబాటు.. బెదిరింపుల‌పై రేష‌న్ డీల‌ర్ల మండిపాటు..

ఆ వ‌ర్గం ఈ వ‌ర్గం అనే కాదు.. ఏపీలో అన్నివ‌ర్గాలు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నాయి. పాల‌న‌లో అనుభ‌వం లేక‌.. అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. య‌ధారాజా త‌దా మంత్రులు.. అంతా క‌లిసి ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను, యంత్రాంగాన్ని భ్ర‌ష్టు పట్టిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. తాజాగా, బూతులు మాట్లాడే మంత్రి కొడాలి నాని శాఖ‌లో అల‌జ‌డి చెల‌రేగింది. రేష‌న్ డీల‌ర్లు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం స‌మ్మెకు సై అన్నారు. త‌న స‌హ‌జ‌శైలిలో మంత్రి కొడాలి నాని.. రేష‌న్ డీల‌ర్ల‌నూ బెదిరించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో.. వారంతా ఏకంగా మంత్రిపైనే తిరుగుబాటు జెండా ఎగ‌రేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... రేషన్ డీలర్ల సమ్మెపై  మంత్రి కొడాలి నాని చేసిన‌ వ్యాఖ్యలను రేషన్ డీలర్ల అసోసియేషన్ ఖండించింది. రేషన్ డీలర్ల సమ్మె చేస్తుంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమని రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లీల మాధవరావు అన్నారు. ప్రభుత్వం డీలర్లను బెదిరించడం మానుకొవాలని.. తమను వారి బిడ్డలుగా భావించి సమస్య పరిష్కరించాలని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిప‌డ్డారు. డీలర్ల సమస్యలపై ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించామని.. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లోనే సమ్మె చేయాల్సి వస్తోందని చెప్పారు. గోతాలపై ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. మ‌రి, రేష‌న్ డీల‌ర్ల సమ‌స్య‌ల‌ను మంత్రి కొడాలి నాని తీరుస్తారా?  లేక‌, విప‌క్షాల‌ను బెదిరించిన‌ట్టే.. బెదిరింపుల‌తో డీల‌ర్ల‌ను దారికి తెచ్చుకుంటారా? చూడాలి...  

మ‌ట‌న్ తింటున్నారా? బీఅల‌ర్ట్‌.. గొర్రెల‌కు ఆంత్రాక్స్‌..

బ‌ర్డ్‌ఫ్లూ తెలుసుగా. కోళ్ల‌కు బ‌ర్డ్‌ఫ్లూ సోకితే ఇక అంతే సంగ‌తి. ల‌క్ష‌ల్లో కోళ్ల‌ను ఖ‌న‌నం చేసేస్తారు. ప్ర‌జ‌లు చికెన్ తినాలంటేనే భ‌య‌ప‌డిపోతారు. ఇలా బ‌ర్డ్‌ఫ్లూ న్యూస్ వ‌చ్చిందో లేదో.. అలా చికెన్ ధ‌ర‌లు ఢ‌మాల్ అంటాయి. కోళ్ల‌కు బ‌ర్డ్‌ఫ్లూ లానే.. గొర్రెల‌కు ఆంత్రాక్స్. తాజాగా, వ‌రంగ‌ల్ జిల్లాలో 4 గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో చ‌నిపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. గొర్రెల్లో ఆంత్రాక్స్ చుట్టేస్తోందా? మ‌ట‌న్ తిన‌డం సేఫేనా?  త్వ‌ర‌లోనే మ‌ట‌న్ రేట్లు ప‌డిపోనున్నాయా?  సండే వ‌చ్చిందంటే మ‌ట‌న్‌కు ఉన్నంత డిమాండ్ మ‌రేదానికీ ఉండ‌దు. మ‌ట‌న్ షాపుల ముందు పెద్ద పెద్ద క్యూలు. గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేసి మ‌రీ.. మ‌ట‌న్ కొని..క‌మ్మ‌గా వండుకొని తింటారు. చికెన్‌తో పోలిస్తే.. మ‌ట‌న్ చాలా కాస్ట్‌లీ అయినా కూడా మ‌ట‌న్ తిన‌కుండా ఉండ‌లేరు చాలా మంది. అలాంటి మ‌ట‌న్ ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డింది. తింటే అనారోగ్యం వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు. అందుకు కార‌ణం ఆంత్రాక్స్‌.     వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో 4 గొర్రెలు ఆంత్రాక్స్‌ వ్యాధితో మృతి చెందడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేయడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా బయటపడకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  మ‌ట‌న్‌ కొనేముందు.. వాటిని పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో క‌న్ఫామ్ చేసుకోవాల‌ని చెబుతోంది. వ్యాధి సోకిన గొర్రెలు, మేక‌ల‌ మాంసాన్ని తినడం, తాకడం, అమ్మడం చేయవద్దని గొర్రెల కాపరులకు, మ‌ట‌న్ అమ్మ‌కం దారుల‌కు, ప్రజలకు విజ్ఞ‌ప్తి చేసింది ప్ర‌భుత్వం. ఒక‌వేళ తెలీక ఆంత్రాక్స్ సోకిన గొర్రె, మేక‌ మ‌ట‌న్ కొన్నా.. వండేట‌ప్పుడు బాగా ఉడికించి తినాల‌ని అధికారులు సూచిస్తున్నారు.   

పాక్ ఫ్యాన్స్ కు కశ్మీర్ పోలీసుల షాక్.. 'ఉపా' కేసులు నమోదు..

ఆటల్లో గెలుపోటములు సహజం. గెలిచిన జట్టు సంబరాలు చేసుకోవడం కామన్. క్రికెట్ లో ఇది కొంత ఎక్కువగా ఉంటుంది. గెలిచిన జట్టుతో పాటు ఆ దేశంలోనూ సంబరాలు జరుగుతాయి. అయితే ఒక్క ఇండియాలో మాత్రమే మరో సీన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ పరాయి దేశం చేతిలోఇండియా ఓడిపోయినా.. కొందరు మూర్ఖులు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. పాకిస్తాన్ జట్టు భారత్ పై గెలిస్తే సంతోషం వ్యక్తం చేస్తూ క్రాకర్స్ కాల్చుతుంటారు. ఇలాంటి ద్రోహుల తాట తీస్తున్నారు పోలీసులు. కశ్మీర్ లో వైద్య విద్యార్థులపై ఏకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసులు పెట్టి జైలుకు పంపారు.  టీట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇండియాపై పాక్ గెలుపు సాధించడాన్ని ఆస్వాదిస్తూ కశ్మీర్‌ లోయలో పలుచోట్ల విద్యార్థులు కేరింతలు కొట్టారు. సంతోషంతో డ్యాన్సులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.   వీడియో ఆధారంగా విచారణ జరిపిన  జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు .. పాక్ గెలుపుపై  సంబరాలు చేసుకున్న వైద్య విద్యార్థులపై రెండు ఠాణాల పరిధిలో కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద వీరిపై అభియోగాలు మోపారు. అయితే మానవతా దృక్పథంతో విద్యార్థులపై కఠినమైన ఉపా కేసుల్ని ఉపసంహరించుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను జమ్మూ-కశ్మీర్‌ విద్యార్థుల సంఘం కోరింది.  రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఇదే అంశంపై ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పాక్‌ విజయాన్ని ప్రస్తావిస్తూ ‘మనం గెలిచాం’ అనే అర్థంతో వాట్సప్‌లో ఆమె స్టేటస్‌ పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆమెను విధుల నుంచి తొలగించింది. 

టీటీడీ బోర్డులో నేర‌చ‌రితులా?.. ఇదేమి చోద్యం? హైకోర్టు ఆగ్ర‌హం..

రెండున్న‌రేళ్లుగా టీటీడీ బోర్డు నిత్యం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. జంబో బోర్డుతో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు బాగా కావ‌ల‌సిన‌వారంద‌రికీ టీటీడీలో చోటు క‌ల్పిస్తున్నార‌నే ఆరోప‌ణలు ఉన్నాయి. పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార‌, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులను భారీగా బోర్డులోకి తీసుకుంటున్నార‌నే విమ‌ర్శ ఉంది. తాజాగా, నేర‌చ‌రిత్ర ఉన్న వారినీ స‌భ్యులుగా నియ‌మించడం వైసీపీ ప్ర‌భుత్వం తీరుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకమండలి సభ్యులుగా నేర చరిత్ర ఉన్న వారిని నియమించారంటూ.. జీవోను సవాల్ చేస్తూ  బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. భానుప్రకాష్ పిటిషన్‌పై న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు.  భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ను పాలకమండలి సభ్యుడిగా నియమించడంపై పిటిష‌న‌ర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ధర్మాసనం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.  మ‌రోవైపు, టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించిన జీవోను ఇటీవ‌ల‌ హైకోర్టు నిలిపివేయడంతో.. ప్ర‌భుత్వం దొడ్డిదారి కోసం ప్ర‌య‌త్నిస్తోంది. చట్ట సవరణ రూపంలో మార్గం సుగమం చేసుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు 52మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ సెప్టెంబరులో జీవో నెం.568 & 569 జారీ చేసింది. అయితే దేవదాయచట్టం-1987 ప్రకారం టీటీడీ బోర్డుకు ఛైర్మన్‌, 29మందికి మించని సభ్యులను మాత్రమే నియమించాలని, ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి అవకాశం లేదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆ జీవోల అమలును నిలిపివేసింది. దీంతో చట్టంలో సంబంధిత సెక్షన్లకు సవరణలు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ప్రత్యేక ఆహ్వానితులను కూడా టీటీడీ బోర్డు సమావేశాలకు ఆహ్వానించే అవకాశం కల్పించడం, నియామకాలకు అవకాశం ఇచ్చేలా సవరణ చేయనున్నారని తెలుస్తోంది. సీఎం జగన్‌ అధ్యక్షతన 28న జరగనున్న కేబినెట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని స‌మాచారం.

ఓటుకు ఆరు వేలు.. హుజురాబాద్ లో పండుగే పండుగ..

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లకు ప్రలోభాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా.. వారం రోజుల ముందు నుంచే మనీ, మందు పంపిణి మొదలైంది. బుధవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో.. ఆ తర్వాత ఓటర్లకు భారీగా నజరానాలు ముట్టచెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డబ్బులతో పాటు మందును రహస్య స్థావరాల్లో డంప్ చేశారని తెలుస్తోంది.  నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచే డబ్బుల పంపిణి మొదలు పెట్టారని తెలుస్తోంది. కమలాపూర్ మండలంలో సోమవారమే అధికార పార్టీ ఓటర్లకు డబ్బులు ఇచ్చిందని తెలుస్తోంది. ఒక్కో ఓటుకు ఆరు వేలు రూపాయలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కమలాపూర్ మండలంలో ఓట్ల పంపిణికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏ వీడియోలో ఆరు వేల రూపాయలను కవర్ లో ప్యాక్ చేసి ఓటర్ ఇచ్చినట్లుగా ఉంది. ప్యాక్ లో 12 ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి. ఓటుకు ఆరువేల చొప్పున పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం నియోజకవర్గ వ్యాప్తంగా 121గ్రామాలలో పంపిణీ జరుగుతున్నట్టు ప్రచారం అధికార పార్టీకి ధీటుగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ఓటర్లను డబ్బులు పంపిణి చేస్తున్నారని తెలుస్తోంది. డబ్బులు, మందు పంపిణికి సంబంధించి ప్రధాన పార్టీలు ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దింపాయంటున్నారు. స్థానిక నేతలతో సంబంధం లేకుండానే వాళ్లు నేరుగా ఓటర్ల దగ్గరకు వెళ్లి డబ్బుల కవర్లు ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఓటుకు ఆరువేలు ఇస్తున్నారని, హోరాహోరీగా ఉన్న చోట 10 వేల వరకు ఇచ్చేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసిందని చెబుతున్నారు.   మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. అయితే అధికార పార్టీ నేతలను వదిలేస్తూ బీజేపీ నేతలపైనే పోలీసులు నిఘా పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సహకారంతోనే టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కమలం నేతలు మండిపడుతున్నారు. 

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిపై క‌త్తితో దాడి.. జూబ్లీహిల్స్‌లో క‌ల‌క‌లం..

వాళ్లిద్ద‌రూ బంధువులు. ఇన్నాళ్లూ వారి మ‌ధ్య మంచి రిలేష‌నే ఉంది. త‌రుచూ క‌లుసుకోవ‌డం.. వ‌చ్చిపోవ‌డం.. అంతా మ‌నం-మ‌నం రిలేష‌న్‌. కానీ, కొంత‌కాలంగా వారి మ‌ధ్య విభేదాలు.. త‌రుచూ గొడ‌వ‌లు.. అరుచుకోవ‌డాలు.. తిట్టుకోవ‌డాలు. క‌ట్ చేస్తే.. క‌త్తితో దాడి. ఒక్క‌సారిగా షాక్‌. ఇంత‌కీ వారిమ‌ధ్య అస‌లేం జ‌రిగింది? క‌త్తితో దాడి చేసుకునే వ‌ర‌కూ ఎందుకొచ్చింది? ఇంకేముందు డ‌బ్బుల మేట‌రే. ఓ భూమి గొడ‌వే వారి బంధుత్వాన్ని హ‌త్యాయ‌త్నం వ‌ర‌కూ తీసుకొచ్చింది. అస‌లేం జ‌రిగిందంటే... హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రియ‌ల్ ఎస్టేట్‌ వ్యాపారిపై దాడి జరిగింది. రవీందర్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బేగంపేట ప్రాంతంలో విక్రయించిన స్థలానికి సంబంధించిన కమీషన్‌ సొమ్ము రూ.6 లక్షల వ్యవహారంలో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌రెడ్డి.. రవీందర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో రవీందర్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు దాడికి పాల్పడిన మోహన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు న‌మోదు చేశారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.    

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జీషీట్.. హంతకులెవరంటే? 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం పులివెందుల కోర్టులో ప్రిలిమినరీ ఛార్జీషీట్  దాఖలు చేసింది సీబీఐ. నలుగురు నిందితుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ 90 రోజుల రిమాండ్ గడువు ముగుస్తున్నందున సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2019 మార్చితో తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు వైఎస్ వివేకానందరెడ్డి. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే హత్య జరగడంతో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఈ కేసులు మొదట ఏపీ పోలీసులే విచారించారు. అయితే వివేకా కూతురు సునీతా రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వివేదా హత్య కేసులో సీబీఐ అధికారులు ఏడాదిపాటు దర్యాప్తు చేసి ఇప్పటివరకూ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ ను ఈ ఏడాది ఆగస్టు 4న అరెస్ట్ చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ 9న సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో మొత్తం నలుగురి ప్రమేయం ఉందని సీబీఐ ప్రాథమిక విచారణలో తేల్చింది. వారిలో ఎర్ర గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి డ్రైవర్ దస్తగిరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అవే విషయాలు పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా సీబీఐ పలు సార్లు విచారించింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని కూడా ప్రశ్నించింది.  అయితే సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? హత్యకేసులో ఎవరి పాత్ర ఉందనే విసయాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు. మరికొద్దిరోజుల్లోనే సీబీఐ అధికారులు పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఛార్జిషీట్ లో వివేకా హత్యలో అసలు పాత్రధారులు సూత్రధారుల ప్రమేయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.  

ధూళిపాళ్ల మ‌ళ్లీ టార్గెట్‌.. నరేంద్రకు నోటీసులు

ఏం మార‌లేదు. ప్ర‌భుత్వ తీరు ఏమాత్రం మార‌డం లేదు. క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల్లో అధికార పార్టీ అస‌లే మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఒక్కొక్క‌రిగా టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తోంది. పాత-కొత్త విష‌యాల‌న్నీ బ‌య‌ట‌కు తీసి.. లేనిపోని చిక్కులు సృష్టించి.. టీడీపీ నేత‌ల ఆర్థిక మూలాల‌ను, ప‌ర‌ప‌తిని దారుణంగా దెబ్బ కొడుతోందని అంటున్నారు.. ప్ర‌శ్నిస్తే కేసులు.. నిల‌దీస్తే నిష్టూరాలు. ఏపీలో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా ఉన్న‌ట్టుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. అన్నిరంగాల్లో విఫ‌ల‌మైన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు.. ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే.. విప‌క్ష నాయ‌కుల‌ను భ‌యభ్రాంతుల‌కు గురి చేసేందుకు.. పాల‌క ప‌క్షం నిర్విరామంగా ప్ర‌య‌త్నిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.  తాజాగా, టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్‌ నోటీసులు జారీ చేశారు. సహకార చట్టం 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తోంది. పాల రైతుల కుటుంబ సభ్యులకు రాయితీతో అక్కడ వైద్యం అందిస్తున్నారు.  ఇప్ప‌టికే ధూళిపాళ్ల‌ను దెబ్బ‌కొట్టేందుకు సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే కుట్ర చేశారు. న‌రేంద్ర‌ను అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించి క‌క్ష్య తీర్చుకున్నారు. హైకోర్టుకు వెళ్లి మ‌రీ సంగం డెయిరీని కాపాడుకున్నారు ధూళిపాళ్ల‌. అది వ‌ర్క‌వుట్ కాలేద‌నుకున్నారో ఏమో.. ట్ర‌స్ట్ నుంచి న‌రుక్కొస్తున్నార‌ని మండిప‌డుతున్నారు ధూళిపాళ్ల న‌రేంద్ర‌.   

కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ కుట్ర? 

తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మరికొన్ని గంటల్లో ముగియనుండటంతో నేతలు స్పీడ్ పెంచారు. హోరాహోరీగా పోరాడుతున్న అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికలో అంతా తానే వ్యవహరిస్తున్న మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు బీజేపీ నేతలు.  హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో హరీష్‌రావుపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీష్ రావు అని అన్నారు. హుజురాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని వ్యాఖ్యానించారు.  గతంలో కేటీఆర్‌ని ఓడించాలని కుట్ర పన్నిందే హరీష్ రావని ఆరోపించారు. దుబ్బాకలో చెల్లని హరీష్ రావు హుజురాబాద్‌లో చెల్లుతారా అంటూ విజయశాంతి దుయ్యబట్టారు. 

ఏపీలో ముందస్తు ఎన్నికలకు స్కెచ్? కేసీఆర్ బాటలో జగన్.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది? ఓ వంక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం, మరో వంక అప్పు తలుపులు కూడా మూసుకు పోతున్న వైనం. అయినా అప్పులు చేయందే పూట గడవని గడ్డు పరిస్థితి.  తాజాగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుంది. ఇక రూ.10,500 కోట్ల వార్షిక రుణ పరిమితిలో మిగిలింది, ఆ పై రూ.500 కోట్లే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఐదు నెలలు మిగిలే ఉన్నాయి, ఈ ఐదు నెలలు బండి నడిచేదెలా? అయితే. కేంద్రం కాళ్లు   పట్టుకోవాలి,కాదంటే వెంకన్న జేబులు కొట్టాలి, అదీ కాదంటే, ఆస్తులు అమ్మేయాలి లేదా మందు బాబుల, సామాన్యుల మీద దుడ్డుకర్రతో దాడి చేయాలి, చార్జీలు, పన్నులు పెంచాలి, అవసరం అయితే అదీ ఇదీ ఇంకొన్ని కూడా చేయవలసి రావచ్చును. కానీ, ఎంతగా దిగాజారినా, బెగ్, బారో, స్టీల్ సూత్రాలు ఎన్ని పాటించినా, మరో రెండున్నర సంవత్సరాలు బండి లాగించడం అయ్యే పని కాదు.  ఆ నిజం, మన కంటే ముఖ్యమంత్రి, అయన సలహాదారులకే బాగా తెలుసు.. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి దేవుని నమ్ముకుని, దేవుని దయతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయానికి వచ్చారు. అవును, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ సీఎం జగన్ రెడ్డి, ముందస్తు ఎన్నికలకు ముందడుగు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో పాటించిన పద్ధతినే, ఇప్పుడు జగన్ రెడ్డి ఏపీలో ఫాలో అయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా,ఇప్పటికే, ప్రశాంత్ కిషోర్ టీమ్ కుడా రంగంలోకి దిగింది.  సర్వేలు మొదలయ్యాయి.ఏరి వేతలు, కుడికాలు, తీసివేతలు, అన్నీ మొదలయ్యాయి.ప్రజాగ్రహానికి గురవుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకుహెచ్చరికలు వెళుతున్నాయి.   అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని భయపెడుతోంది ఒక్క ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు, జగన్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలనలో అన్ని వ్యవస్థలు సుందర ముదనష్టంగానే తయారయ్యాయి. పాడుబడని వ్యవస్థంటూ ఏదీ మిగలలేదు.అన్ని వ్యవస్థలు ఒకే విధంగా  అఘోరిస్తున్నాయి, అందుకు  కళ్ళ ఎదుటే అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. ముఖ్యమంత్రి, పోలీసు బాసుల స్వీయ పర్యవేక్షణలో వైసీపీ ‘బీపీ’ బ్యాచ్ యద్దేచ్చాగా ఎవరి మీదనైనా దాడులు చేస్తుంది. అంతే కాదు, వైసీపీ పాలనతో ప్రజలు విసిగి వేసారి పోయారు. ఒక్కొక్క వర్గం తిరగ్ బడుతోంది. ప్రస్తుత పరిస్థితినే గమనించినా, ఓ వంక జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఎయిడెడ్ స్కూల్స్ మూత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన సాగుతోంది. “నీ అమ్మ ఒడి వద్దు, ఇంగ్లీష్ మీడియం వద్దు,  నాడు నేడు కుట్రలు వద్దు, మా బడులు మూత పెట్టవద్దు” అంటూ తల్లి తండ్రులు ఆందోళన చేస్తున్నారు.  మరో వంక రేషన్ డీలర్లు రోడ్డెక్కారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్ధులు, ఉపాధ్యులు ఎవరికీ వారు ఎవర్గానికి ఈ వర్గం ఆందోళన బాట పడుతున్నారు. ఇలా రోజు రోజుకు పరిస్థితి విషమిస్తున్ననేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులే కాకుండా, జాతీయి స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా జగన్ రెడ్డిని భయ పెడుతున్నాయి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చిన నేపధ్యంలో 2024 లోక్ సభ ఎన్నికల నాటికి, జాతీయ రాష్ట్ర స్థాయిల్లో, రాజకీయ సమీకరణలు మారే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.ఈ నేపధ్యంలో లోక్ సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల జరిగితే అసెంబ్లీ ఫలితాలపై జాతీయ అంశాలు  ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే, జగన్ రెడ్డి ముందు చూపుతో ముందడుగు వేస్తున్నారని, ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అలాగే,అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2023 ప్రదమార్దంలో, ఏపీ అస్సెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ముందస్తుకు వెళ్ళినంత మాత్రం చేతనే జగన్ రెడ్డికి ప్రజలు మరో అవకాశం ఇస్తారా, లేక, ‘ఒక్క ఛాన్స్ అన్నావ్, ఇచ్చాం, పాలన చూశాం, సత్తా తెలిసిపోయింది .. ఇక చాలు పోయిరా అనిసాగనంపుతారా,అనేది .. చెప్పేందుకు ఇంకొంత సమయం అవసరం. అయితే, బటన్ నొక్కి పైసలు జనం ఖాతాల్లోకి వేసినంత మాత్రాన జనం  సంతృప్తి చెందుతారు అనుకోవడం పొరపాటే అవుతుందని అంటున్నారు.

డ్ర‌గ్స్‌ హబ్‌గా ఏపీ.. గంజాయిపై జ‌న‌సేనాని గ‌రం గ‌రం..

డ్ర‌గ్స్‌-గంజాయి. కొంతకాలంగా ఏపీ రాజ‌కీయాలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. దేశం ఉలిక్కిప‌డేలా గుజ‌రాత్‌ ముంద్రా పోర్టులో ప‌ట్టుబ‌డిన వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ విజ‌య‌వాడ అడ్ర‌స్‌కే వ‌స్తున్నాయంటే మాట‌లా? బాలీవుడ్‌లో గాంజా దొరికితే కూడా.. అది విశాఖ నుంచే ముంబైకి స‌ప్లై అయింద‌ని ఏకంగా ఎన్‌సీబీనే ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం. ఇంత‌కు ముందు ఎప్పుడైనా ఏపీలో ఇలాంటి డ్ర‌గ్స్ సీన్ చూశామా? జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లోనే ఇలాంటి విప‌రీత ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌ని మండిప‌డుతున్నారు. అడ్డుకునే వాళ్లు లేక‌.. ప‌ట్టుకునే వాళ్లు ప‌ట్టించుకోక‌.. పాల‌కుల ఉదాసీన‌త వ‌ల్లే ఇలా ఏపీ డ్ర‌గ్స్‌-గంజాయికి కేరాఫ్‌గా మారింద‌ని అంటున్నారు. ఆ విష‌యం ప్ర‌శ్నిస్తే.. అధికార పార్టీకి బీపీ పెరిగింది. వీధి రౌడీల్లా టీడీపీ ఆఫీసుపై ప‌డి విధ్వంసం సృష్టించారు. ఆ కేసులో ఇంత‌వ‌ర‌కూ అరెస్టులు జ‌ర‌గ‌లేద‌నే విమ‌ర్శలు కూడా ఉన్నాయి.  ఏపీలో డ్ర‌గ్స్‌, గంజాయి దందాపై లేట్‌గా అయినా, లేటెస్ట్‌గా రియాక్ట్ అయ్యారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదక ద్రవ్యాల హబ్‌గా మారిందని ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందంటూ.. వ‌రుస‌ ట్వీట్లు చేశారు.  ‘‘గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి’’ అని పవన్ ట్వీట్ చేశారు.   ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీలు చేసిన మీడియా ప్ర‌సంగ‌ వీడియో క్లిప్‌ల‌తో మ‌రో రెండు ట్వీట్లు చేశారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.