వైఎస్ ఘాట్‌ ర‌చ్చ‌బండ‌.. హైకోర్టుకు అశోక్‌.. తుళ్లూరులో జై భీం.. టాప్‌న్యూస్ @1pm

1. సీఎం జగన్ కుటుంబంలో మరోసారి మనస్పర్ధలు బయటపడ్డాయి. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ ద‌గ్గ‌ర జగన్, షర్మిళ, విజయమ్మ ఎవరికి వారుగా వేర్వేరుగా నివాళులు అర్పించారు. వైఎస్ ఘాట్ ద‌గ్గ‌ర‌ రాత్రి నివాళులర్పించి జగన్ వెళ్లిపోయిన అనంతరం.. షర్మిళ, విజయమ్మ వచ్చారు. ఇడుపులపాయ చర్చిలో కూడా జగన్, విజయమ్మలు వేర్వేరుగా ప్రార్ధనలు నిర్వహించారు.  2. రామతీర్థం రగడపై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలంటూ.. హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్‌ వేశారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.  3. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నకిలీ, ఫోర్జరీ పత్రాలతో బంధువులను విదేశాలకు పంపారని పిటిషనర్ తెలిపారు. చట్టరిత్యా చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని గోనె ప్రకాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  4. ఏపీలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో కూడా నిర్వహించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలుగులో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు ఎందుకు నిర్వహించడం లేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఆరు వారాల్లో పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 5. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందని, త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్ అన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని.. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని సీఎం ర‌మేశ్ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని చెప్పారు.  6. తుళ్లూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి 8 మంది ముస్లింలను ఓ కేసులో జడ్జి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. అయితే, పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని నిందితులు న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను జడ్జి గత రాత్రి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు పంపారు. నిందితుల శరీరంపై గాయాలు ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చారు. వెంటనే 8 మంది నిందితులకు రిమాండ్ రద్దు చేసిన జడ్జి.. వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్‌లో నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేశారు. 7. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరుని తండా సర్పంచ్ భర్త సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పుల్లో కురుకుపోయానని గుగులోతు మోహన్ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికైనా ఫలితం లేదని మోహన్ తెలిపాడు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సరిపోక అప్పులు చేశానని వీడియోలో చెప్పాడు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు లేకుండా పోయిందని మోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 8. ఓ తెలుగువాడి ఎదుగుదలను మరో తెలుగువాడు గుర్తించకపోగా.. చిన్నచూపు చూసే దురలవాట్లు మానుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. తెలుగువాడు రూపొందించిన కొవాగ్జిన్‌ తయారీ సమయంలో నిరుత్సాహ పరచడంతో పాటు, డబ్యూహెచ్‌వో నుంచి అనుమతులు రాకుండా ఉండేందుకు కొంత మంది ప్రయత్నించారని, వారిలో విదేశీయులతో పాటు మనవాళ్లు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి ధోరణి విడిచిపెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.  9. కోనసీమలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. అయినవల్లి మండలం నేదునూరి పెదపాలెంలో ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈనెల 19వ తేదీన కువైట్ నుంచి విజయవాడ మీదుగా కారులో మహిళ వచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా ఓమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్రమత్తం అయిన అధికారులు, కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు.  10. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గురువారం ఉదయానికి 236గా ఉన్న ఒమిక్రాన్ కేసుల‌ సంఖ్య.. శుక్ర‌వారానికి 358కి పెరిగింది. అంటే, ఒక్క రోజులోనే 100కు పైగా ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.   

క‌ట్ట‌ల‌కు క‌ట్ట‌లు.. అవినీతి నోట్ల గుట్ట‌లు.. లెక్కిస్తే 150 కోట్లు..

ఓ వ్యాపారి ఇంట్లో ఐటీ రైడ్స్‌. త‌నిఖీలు కామ‌నే అయినా.. అక్క‌డ క‌నిపించిన సీన్ మాత్రం అస్స‌లు కామ‌న్ కానే కాదు. బ్లాక్‌మ‌నీని ఎవ‌రైనా బినామీల పేరు మీద‌గానో.. ప్రాప‌ర్టీ.. బంగారం.. ఇళ్లు.. రూపంలోనో దాచుకుంటారు. కానీ, ఆ వ్యాపారి మాత్రం అంతా క్యాష్‌లోనే దాచేసుకున్నాడు. అది కూడా త‌న ఇంట్లోనో. ఓకే.. ఏదో దాచుకున్నాడే అనుకుందాం.. సినిమాల్లో చూపించిన‌ట్టు ఏ ర‌హ‌స్య గ‌దిలోనే, సీలింగ్‌లోనో, డ్రైనేజ్ పైపుల్లోనో దాచుకోవాలి కానీ.. ఎంచ‌క్కా.. రెండు బీరువాల్లో బ‌ట్ట‌లు స‌ర్దిన‌ట్టు.. నోట్ల క‌ట్ట‌ల‌ను స‌ర్దేసి.. నీట్‌గా ప్యాక్ చేసి.. ఇంట్లోనే పెట్టుకున్నాడు. త‌న ఇంటిపై ఐటీ రైడ్స్ జ‌ర‌గ‌వ‌నే ధీమానో.. మ‌రేంటో కానీ.. కాన్పూర్‌కు చెందిన ప‌ర్ఫ్యూమ్ త‌యారీ సంస్థ య‌జ‌మాని, స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కుడు అయిన పీయూష్ జైన్ ఇంట్లో జ‌రిగిన ఐటీ రైడ్స్‌లో ఏకంగా 150 కోట్లు న‌గ‌దు రూపంలో బ‌య‌ట‌ప‌డింది. పెద్ద నోట్లు ర‌ద్దు చేసి.. మ‌రింత పెద్ద నోట్లు తీసుకొచ్చింది ఇలాంటి వారి కోస‌మే కాబోలు.  ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన హెటిరో డ్ర‌గ్స్ సంస్థ‌ల్లో ఐటీ దాడుల స‌మ‌యంలోనూ ఇలానే బీరువాల్లో వంద‌ల కోట్ల నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. సేమ్ టూ సేమ్ అలానే.. యూపీ ఎల‌క్ష‌న్స్‌కు ముందు కాన్పూర్‌లో ఎస్పీ లీడ‌ర్ పీయూష్ జైన్ ఇంటిపై ఐటీ దాడులు జ‌రిగాయి. ఆయ‌న‌కు చెందిన పర్ఫ్యూమ్‌ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థ యజమాని పీయూష్‌ జైన్‌ ఇంటికి ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్‌గా ప్యాక్‌ చేసిన కరెన్సీ నోట్ల కట్టలు కన్పించాయి. అధికారులు వెంటనే బ్యాంక్‌ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించారు. గురువారం సాయంత్రం నుంచి క్యాష్ కౌంటింగ్ కొనసాగగా.. శుక్రవారం ఉదయానికి రూ.150 కోట్ల న‌గ‌దు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న జీఎస్‌టీ అధికారులు కూడా ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.   ఆ సొమ్మంతా నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్‌టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది. పీయూష్‌ ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని ఆయన కార్యాలయాలు, గోదాముల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.  వ్యాపారి పీయూష్‌ జైన్.. స‌మాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ పేరుతో పీయూష్‌ ఓ ప్రత్యేక పర్ఫ్యూమ్‌ను కూడా రిలీజ్‌ చేశారు. నోట్ల కట్టలను అధికారులు లెక్కిస్తున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఎస్పీ అవినీతి వాసన’ ఇది అంటూ వైర‌ల్ చేస్తోంది. 

ఏపీ ఐపీఎస్‌ల రీకాల్‌!.. వైసీపీకి వంత‌పాడే ఖాకీల‌పై కేంద్రం యాక్ష‌న్‌!

బెంగాల్‌లో జ‌రిగిన‌ట్టే ఏపీలోనూ జ‌ర‌గ‌నుందా?  ప్ర‌భుత్వానికి తొత్తులుగా మారే పోలీస్ ఉన్న‌తాధికారుల‌ను కేంద్రం రీకాల్ చేయ‌నుందా? చ‌ట్టం, కోర్టుల‌ మాట‌లు విన‌కుండా పాల‌కులకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించే ఐపీఎస్‌ల‌ను వెన‌క్కి ర‌ప్పిస్తుందా?  బెంగాల్‌లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్టే.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు కేంద్రం షాక్ ఇవ్వ‌బోతోందా? అంటే అవున‌నే అంటున్నారు బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్‌. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందని స్పష్టం చేశారు.  ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోందని, త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని సీఎం ర‌మేశ్‌ తెలిపారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని బీజేపీ ఎంపీ హితవు పలికారు.  పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదని.. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని సీఎం ర‌మేశ్ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూశామన్నారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని చెప్పారు.  వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28న బీజేపీ భారీ బ‌హిరంగ‌ సభ నిర్వహిస్తోందని అన్నారు. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని.. అయితే ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు.  సినిమా రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న ఇంటరెస్ట్.. ప్రజా సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు సీఎం ర‌మేశ్‌. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే.. హాళ్లను సీజ్ చేయిస్తారా..? అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంతున్నాయి..? ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా..? అని ప్రశ్నించారు.  మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దశలవారీ మద్య నిషేధం కాదని.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్‌ మండిపడ్డారు. ఏపీలో జరిగే ప్రతీ కార్యక్రమం కేంద్ర నిధులతోనే చేస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే చేపట్టారన్నారు. 

దేశంలో డేంజ‌ర్ బెల్స్‌.. ఒక్కరోజులో 100కుపైగా ఒమిక్రాన్ కేసులు..

రావ‌డం లేటేమో కానీ.. వ‌చ్చాక త‌గ్గేదే లే అంటోంది ఒమిక్రాన్‌. వ‌రుస పెట్టి కేసులు పెంచేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గురువారం ఉదయానికి 236గా ఉన్న ఒమిక్రాన్ కేసుల‌ సంఖ్య.. శుక్ర‌వారానికి 358కి పెరిగింది. అంటే, ఒక్క రోజులోనే 100కు పైగా ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్ర‌కారం.. మహారాష్ట్రలో అత్యధికంగా 88 మందికి ఒమిక్రాన్ సోకగా.. 67 మందితో ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇక తెలుగు స్టేట్ తెలంగాణ 38 కేసుల‌తో దేశంలోనే టాప్ 3 లో నిలిచింది. ఏపీ మూడు కేసుల‌తో 13వ స్థానంలో ఉంది. మొత్తం 358 మంది ఒమిక్రాన్ బాధితుల‌కు గాను.. 114 మంది కోలుకున్నారు. మిగ‌తా వారు ఐసోలేష‌న్‌లో ఉన్నారు. మ‌రోవైపు, దేశ‌వ్యాప్తంగా 11లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయ‌గా.. 6,650 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం క‌రోనా కేసులు 3.47 కోట్లు దాటగా.. రికవరీలు 3.42 కోట్లుగా ఉన్నాయి. ప్ర‌స్తుతం యాక్టివ్‌ కేసులు సంఖ్య 77,516గా ఉంది. క్రియాశీల రేటు 0.22 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.40 శాతానికి మెరుగైంది. 24 గంటల వ్యవధిలో 374 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4.79 లక్షలకు చేరింది.    

కొవాగ్జిన్‌పై తెలుగువాళ్లే కుట్ర‌.. జ‌స్టిస్‌ ర‌మ‌ణ సంచ‌ల‌న కామెంట్స్‌..

కొవాగ్జిన్‌. కొవిడ్ పాలిటి బిగ్ వెప‌న్‌. మిగ‌తా అన్ని వ్యాక్సిన్ల‌కంటే మెరుగ్గా ప‌ని చేస్తోంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. ప్ర‌పంచ దేశాల‌కూ భారీగా ఎగుమ‌తి అవుతున్నాయి. అందులోని.. కొవాగ్జిన్ త‌యారీ సంస్థ భార‌త్ బ‌యోటెక్‌ మ‌న తెలుగు కంపెనీనే కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. కానీ, కొంద‌రికి మాత్రం కాదు. కొవాగ్జిన్‌పైనా రాజ‌కీయం చేశారు కొంద‌రు. వ్యాక్సిన్‌పైనా కుల ముంద్ర వేశారు. కొవాగ్జిన్‌ను అడ్డుకోవాల‌ని చూశారు. పెద్ద స్థాయిలో కుట్ర‌లు చేశారు. అలాంటి హార్డిల్స్ అన్నీ దాటేసుకొని.. కొవిడ్ పాలిట సుర‌క్ష వ్యాక్సిన్‌గా దూసుకుపోతోంది కొవాగ్జిన్‌. తాజాగా, సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. కొవాగ్జిన్‌పై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ తెలుగువాడి ఎదుగుదలను మరో తెలుగువాడు గుర్తించకపోగా.. చిన్నచూపు చూసే దురలవాట్లు మానుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. తెలుగువాడు రూపొందించిన కొవాగ్జిన్‌ ఇతర వ్యాక్సిన్‌లతో పోల్చితే ప్రభావంగా పనిచేస్తోందని, కొత్త వేరియంట్‌లను కూడా నిరోధించగలుగుతోందని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ తయారీ సమయంలో నిరుత్సాహ పరచడంతో పాటు, డబ్యూహెచ్‌వో నుంచి అనుమతులు రాకుండా ఉండేందుకు కొంత మంది ప్రయత్నించారని, వారిలో విదేశీయులతో పాటు మనవాళ్లు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి ధోరణి విడిచిపెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. తెలుగువాళ్లంతా  ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జ‌స్టిస్ ర‌మ‌ణ ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రి గురించి చేశారో అంద‌రికీ ఈజీగానే అర్థ‌మైపోతోంది. కొవాగ్జిన్‌ను అడ్డుకోవాల‌ని చూసింది ఏ పాల‌కులో అంద‌రికీ తెలిసిందే అంటున్నారు.  డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రదానోత్సవానికి సీజేఐ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. త‌న వ్య‌క్తిగ‌త అనుభ‌వాల‌నూ చెప్పారు. కోర్టు గదుల్లో రోజుల తరబడి కూర్చోవడం వల్ల వెన్నెముక, మెడ నొప్పితో బాధపడే వాడినని, తనకు గత 20 ఏళ్లుగా ప్రకృతి వైద్యులు డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ చికిత్సను అందిస్తున్నారని, తనతోపాటు సుప్రీం కోర్టులో మరో 10 మంది  న్యాయమూర్తులకు కూడా ఆయనే వైద్యం చేశారని చెప్పారు.  తల్లిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించడం మన సంప్రదాయమని.. తెలుగు భాషను, తెలుగు జాతిని రక్షించుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు నేర్పించడంతోపాటు ఇంట్లో ఉన్న సమయంలో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. 

తుళ్లూరు స్టేష‌న్లో జై భీం త‌ర‌హా టార్చ‌ర్‌!.. మైనార్టీలను చిత‌క్కొట్టిన పోలీసులు!

తెలిసిందేగా ఏపీ పోలీసులంటే ఎలా ఉంటారో. దొరికితే చిత‌క్కొట్టుడే. కుదిరితే థ‌ర్డ్ డిగ్రీ. అది సామాన్యులైనా.. పార్ల‌మెంట్ స‌భ్యులైనా. వారికి తెలిసింద‌ల్లా లాఠీల‌తో కుమ్మేయ‌డ‌మే. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకొని.. నిందితుల‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌డ‌మే...అనే విమ‌ర్శ ఉంది. అందుకు కార‌ణం అధికార పార్టీ పోలీసుల‌కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌డం. తాము చెప్పిన వారిని టార్గెట్ చేస్తే చాలు.. ఇక మీరు మీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేసుకోవ‌చ్చ‌ని హింట్ ఇవ్వ‌డం వ‌ల్లే ఖాకీలు ఇలా రెచ్చిపోతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే.. ఏపీలో క‌స్ట‌డీ టార్చ‌ర్ కేసులు పెరిగిపోతున్నాయ‌ని అంటున్నారు. జై భీమ్ లాంటి దారుణాలు అనేకం జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. తాజాగా.. తుళ్లూరు పోలీస్ స్టేష‌న్లో గ‌త రాత్రి 8మంది ముస్లింల‌ను దారుణంగా చిత్ర‌హింస‌లు పెట్టార‌ని అంటున్నారు. ఈ విష‌యం బాధితులే స్వ‌యంగా న్యాయ‌మూర్తికి చెప్ప‌డంతో విష‌యం వెలుగుచూసింది. తుళ్లూరు పోలీసుల‌పై యాక్ష‌న్ మొద‌లైంది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే.. తుళ్లూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ దుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు పోలీసులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గత రాత్రి 8 మంది ముస్లింలను ఓ కేసులో జడ్జి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. అయితే, పోలీసులు తమను చిత్రహింసలు పెట్టారని నిందితులు న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను జడ్జి గత రాత్రి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు పంపారు.  నిందితుల శరీరంపై గాయాలు ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చారు. వెంటనే 8 మంది నిందితులకు రిమాండ్ రద్దు చేసిన జడ్జి.. వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. స్టేషన్‌లో నిందితులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేశారు. జై భీమ్ తరహా పోలీసులు చితక్కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

సినిమా టికెట్‌ ధరలు పెరిగాయ్..

సినిమా టికెట్లు భారీగా పెరగనున్నాయి. ఇందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్లలో కనిష్ఠం 50 రూపాయలు ఉండనుండగా.. గరిష్ఠం 150 రూపాయలు ఉండనుంది. మల్టీప్లెక్స్‌ల్లో కనిష్ఠం రూ.100.. గరిష్ఠం రూ.250గా వసూల్ చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్‌ సీట్లకు గరిష్ఠంగా రూ.300గా నిర్దారించారు. టికెట్‌ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం.  ఏపీలోని జగనన్న ప్రభుత్వం  సినిమా టికెట్‌ ధరలను భారీగా తగ్గిస్టే.. తెలంగాణ సర్కార్ మాత్రం సినిమా టికెట్‌ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. టికెట్‌ ధరలకు అదనంగా జీఎస్టీ, నిర్వహణ చార్జీలను కూడా వసూలు చేసుకునే అవకాశం కల్పించడంతో ప్రేక్షకులపై భారీగా భారం పడబోతోంది. టికెట్‌ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరుతూ థియేటర్ల యజమానులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో  కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. థియేటర్లలో టికెట్‌ ధరల ఖరారుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. సినీరంగ ప్రముఖులతో పలుదఫాలు చర్చలు జరిపిన అధికారుల కమిటీ చేసిన సిఫారసుల మేరకుప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.  అయితే, టికెట్లపై జీఎస్టీ, నిర్వహణ  చార్జీలు, ఆన్‌లైన్‌ చార్జీలకు సంబంధించిన వివరాలను వేర్వేరుగా  ప్రింట్‌ చేయాలని సూచించింది. నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లలో టికెట్‌ పై రూ.5, నాన్‌-ఏసీలో టికెట్‌పై రూ.3 వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఉదాహరణకు.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న టికెట్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేయట్లేదు. టికెట్‌ ధర రూ.200గా ఉంటే, ఆన్‌లైన్‌లో దానికి అదనంగా కన్వీనియెన్స్‌ ఫీ కింద రూ.25.31 వసూలు చేస్తున్నారు. కొత్త చార్జీలు అమల్లోకి వస్తే మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ఠ ధర రూ.250కి అదనంగా జీఎస్టీ, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వసూలు చేసే కన్వీనియెన్స్‌ రుసుము, నిర్వహణ చార్జీలు కలుస్తాయి. దీంతో టికెట్‌ ధర భారీగా పెరిగిపోతుంది. నేరుగా థియేటర్లలో టికెట్‌ కొంటే కన్వీనియెన్స్‌ రుసుము తగ్గుతుందిగానీ.. జీఎస్టీ, నిర్వహణ చార్జీల భారం అలాగే ఉంటుంది. 

ఒక‌టి కాదు రెండు.. జ‌గ‌న్‌పై ప‌రిటాల డ‌బుల్ బ్యారెల్ గ‌న్‌..

ప‌రిటాల‌. ఈ పేరు వింటేనే అనంత‌పురంలో కొంద‌రికి పూన‌కం వ‌స్తుందంటారు. అక్క‌డ అనేక గ్రామాల్లో ర‌వీంద్ర అభిమానులు ఉంటారు. ఇప్ప‌టికీ ప‌లు ఊళ్లు వాళ్ల ఏలుబ‌డిలోనే ఉన్నాయంటారు. అవ‌న్నీ టీడీపీకి ప‌ట్టున్న ప్రాంతాలే. ప‌రిటాల కుటుంబానికి పెట్ట‌ని కోట‌లే. కానీ.. జ‌గ‌న్ వేవ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో రాప్తాడులో ప‌రిటాల వార‌సుడు శ్రీరాం ఓడిపోవ‌డం షాకింగ్ ప‌రిణామ‌మే. ఏళ్లుగా ఒకే పార్టీ, ఒకే కుటుంబం అధికారంలో ఉండ‌టమో.. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇద్దామ‌ని అనుకోవ‌డ‌మో.. కార‌ణం ఏదైనా రాప్తాడులో టీడీపీ-ప‌రిటాల ఓడిపోవ‌డం సంచ‌ల‌న‌మే. అయితే, ఓట‌మి ఒక్క‌సారికే ప‌రిమితం చేయాల‌ని ప‌రిటాల కుటుంబం గ‌ట్టిగా డిసైడ్ అయిన‌ట్టుంది. ఈసారి ఒక్క సీటు ఓడినందుకు.. వ‌చ్చేసారి రెండు స్థానాలు కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందుకు త‌గ్గ‌ట్టే.. నియోజ‌క‌వ‌ర్గాల పంప‌కాలు జ‌రిగిపోయాయి. త‌మ‌కు పోటీగా ఎవ‌రూ రాకుండా వార్నింగులు గ‌ట్రా వ‌చ్చేశాయి.   రాప్తాడు నుంచి శ్రీరాం ప్లేస్‌లో సునీత పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, ధ‌ర్మ‌వ‌రానికి ప‌రిటాల శ్రీరాం షిఫ్ట్‌ కానున్నారు. ధ‌ర్మ‌వ‌రం నాదే.. ఎవ‌రు వ‌చ్చినా వ‌దిలేదే లే.. అంటూ శ్రీరాం బ‌హిరంగ హెచ్చ‌రిక చేసేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిన సూర్య‌నారాయ‌ణ ఆ త‌ర్వాత బీజేపీలో చేరడంతో శ్రీరాంకు ధ‌ర్మ‌వ‌రం పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు చంద్ర‌బాబు. రెండేళ్లుగా ప‌రిటాల వార‌సుడు ధ‌ర్మ‌వ‌రంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే, పార్టీని వీడిన సూర్య‌నారాయ‌ణ మ‌ళ్లీ టీడీపీలో చేరి 2024లో పోటీ చేస్తారంటూ స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అది తెలిసి.. ఆల‌స్యం చేయ‌కుండా ఆ ప్ర‌చారానికి, సూర్య‌నారాయ‌ణ‌కి చెక్ పెట్టేలా.. ప‌రిటాల శ్రీరాం త‌న‌దైన స్టైల్‌లో పొలిటిక‌ల్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు.  2024లో ధ‌ర్మ‌వ‌రంలో టీడీపీ నుంచి పోటీ చేసేది తానేన‌ని.. ఒక‌వేళ అలా జ‌ర‌గ‌క‌పోతే తాను రాజ‌కీయాల నుంచి వైదొలుగుతాన‌ని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎవ‌రో వ‌స్తారు.. పోటీ చేస్తారు అంటూ జ‌రిగే ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటూ శ్రీరాం అల్టిమేటం జారీ చేశారు. ఈ ఒక్క ప్ర‌క‌ట‌న‌తో ధ‌ర్మ‌వ‌రం సీటు త‌న‌దేన‌ని తేల్చేశారు. ఇటు మ‌ళ్లీ టీడీపీలో చేరాల‌నుకున్న సూర్య‌నారాయ‌ణ‌తో పాటు.. అటు ప‌రోక్షంగా చంద్ర‌బాబుకు సైతం ధ‌ర్మ‌వ‌రం టికెట్ త‌న‌కే ఇవ్వాల‌నే మెసేజ్ ఇచ్చార‌ని అంటున్నారు. పార్టీలోకి ఎవ‌రైనా రావొచ్చు.. అంద‌రికీ ఆహ్వానం.. కానీ ధ‌ర్మ‌వ‌రం టికెట్ మాత్రం ఆశించొద్దు అనేలా శ్రీరాం శాస‌నం చేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇలా, రాప్తాడులో ప‌రిటాల సునీత‌.. ధ‌ర్మ‌వ‌రంలో ప‌రిటాల శ్రీరాం.. టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచేందుకు.. ఎలాగైనా గెలిచి తీరేందుకు.. సై అంటే సై అంటున్నారు. ఒక‌టి ఓడినందుకు.. రెండు గెలిచి చూపించి.. జ‌గ‌న్‌పై రాజ‌కీయంగా డ‌బుల్ బ్యారెల్ గ‌న్ ఎక్కుపెట్టేందుకు రెడీ అవుతోంది ప‌రిటాల ఫ్యామిలీ. ప‌రిటాల వార‌సుడిగా శ్రీరాం ధ‌ర్మ‌వ‌రం ఎంట్రీ ఎలా ఉండ‌బోతోంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.  

సీక్రెట్ సీఎం.. బొమ్మ సీజ్.. లాక్ డౌనేనా.. టాప్ న్యూస్@7PM

రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్షకులకు చంద్రబాబు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయన్నారు. రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉందని, కనీస మద్దతు ధర లేక వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు.  ------  రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర బాగుంటేనే దేశం బాగుంటుంది అనేదే తమ విధానమని ట్విట్టర్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు ట్విట్టర్​ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్​ నేతృత్వంలో సాగులో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరామన్నారు ---- జగనన్న రహస్య పాలన ఎందుకో అర్ధం కావడం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీలో రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ఇళ్లను కూడా ఎవరికి ఇవ్వడం లేదని విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్‌ ఏదో దేవాలయాలకు చేస్తున్నారని అంటున్నారని, దేవాలయాలకు, చర్చిలకు  రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని చెప్పారు. ------- బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ పర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓటీఎస్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు.కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు. -------- చిత్తూరు జిల్లాలో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. కుప్పంలో నాలుగు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. బీ ఫామ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవడమే సీజ్‌కు కారణమని తెలుస్తోంది. మ్యాట్నీ ఫస్ట్ షో టికెట్లను ఆన్‌లైన్లో బుక్ చేసుకున్న ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే పలమనేరులోనూ మూడు సినిమా థియేటర్లను అధికారులు మూసివేశారు.  ---- హీరో నాని వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ‘‘ప్రేక్షకులను మేమెందుకు అవమానిస్తాం. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి. అందుకే సినిమా టికెట్ల ధరలు తగ్గించాం. మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే అప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. మార్కెట్‌లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా? అని బోత్స అన్నారు.  ---- సినీ హీరోలను దెబ్బ తీయడం, ఇండస్ట్రీని నాశనం చేయడమే జగన్ లక్ష్యమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. సినిమా వారి నుంచి కమిషన్లు రావడం లేదనే జగన్ వారిపై కక్ష కట్టారని చెప్పారు. థియేటర్లపై దండయాత్ర చేసేందుకు అధికారులను పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే పట్టించుకోని జగన్... సినిమా టికెట్ల అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శించారు. ------ ఒమైక్రాన్ కట్టడి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఒమైక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్ట్ చేస్తామన్నారు. కేంద్రం బూస్టర్ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై స్పందించడం లేదన్నారు. ఇతర దేశాలు బూస్టర్ డోస్ ఇవ్వాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.  ----- దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమిళనాడులో తాజాగా 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 30 మంది విదేశాల నుంచి రాగా, ఒకరు కేరళ నుంచి వచ్చారు. మరో ఇద్దరు తమిళనాడులోనే ఒమిక్రాన్ బారినపడినట్టు తెలుస్తోంది. ఈ 33 మందిలో ఇద్దరు తప్ప మిగిలినవారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ కొత్త వేరియంట్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ---- సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి చరణ్ సింగ్ అని... ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు. -- సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రాబోయే సీజన్ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారాను నియమించింది. అసిస్టెంట్ కోచ్ గా ఆసీస్ మాజీ ఆటగాడు, బెంగళూరు మాజీ చీఫ్ కోచ్ సైమన్ కటిచ్ ను తీసుకువచ్చింది. బౌలింగ్ కోచ్ గా సఫారీ దిగ్గజం డేల్ స్టెయిన్ ను నియమించింది. హెడ్ కోచ్ గా టామ్ మూడీ, స్పిన్ బౌలింగ్ కోచ్ గా, వ్యూహ బృందంలో సభ్యుడిగా ముత్తయ్య మురళీధరన్ ను కొనసాగించాలని నిర్ణయించింది.

కేఏ పాల్ చేసిన ఆరు గొప్ప‌ ప‌నులు.. అవేంటో తెలుసా...

కేఏ పాల్‌. ఎవ‌రికీ అర్థంకాని పీస్‌. ప్ర‌పంచ గ‌తినే మార్చేస్తానంటారు. ప్ర‌ముఖుల‌నే శాసిస్తాన‌ని చెబుతారు. మ‌న‌కు తెలీదు గానీ.. తాను చేసిన‌, చేస్తున్న ఘ‌న‌కార్యాలు చాలానే ఉంటాయని బాకా మోగిస్తుంటారు. ఎవ‌రి వ‌ల్లా కాని ప‌నులు.. త‌న‌ వ‌ల్లే సాధ్యం అంటారు. చూట్టానికి, విన‌టానికి కామెడీగా ఉన్నా.. ప‌బ్లిక్‌కు ఫుల్ టైంపాస్‌. టీవీ ఛానెల్స్‌కి ఫుల్ రేటింగ్ పాయింట్‌. ఎవ‌రికీ క‌నిపించ‌రు.. ఎక్క‌డ ఉంటారో తెలీదు.. స‌డెన్‌గా ఊడిప‌డ‌తారు. టీవీ షోల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటారు. లేటెస్ట్‌గా ఓ టీవీ చాన‌ల్లో మాట్లాడారు. నిజ‌మో కాదో తెలీదు కానీ.. ఇటీవల కాలంలో తాను చేసిన కొన్ని గొప్ప‌ పనుల గురించి చెప్పారు. అవేంటో  కేఏ పాల్‌ మాట‌ల్లోనే.... 1. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన‌ మూడు వ్యవసాయ చట్టాల్నిఎత్తేయించా. దేశంలో 70 శాతం మంది రైతులు ఉన్నారు. వారి శ్రేయస్సు కోసం ఏ పార్టీ ముందుకు రాకపోతే.. నేను ఓపెన్ గా రంగంలోకి దిగి.. ఢిల్లీ వచ్చి పెద్ద వాళ్లను కలిశా. కేంద్ర వ్యసాయ మంత్రి రూపాలాగారు ఢిల్లీ సింగ్రిల్లా హోటల్ లో నా దగ్గరకు వచ్చారు. మూడు చట్టాలు వెనక్కి తీసుకునేలా చేశా.  2. ఫేస్ బుక్, ట్విటర్ ను బ్యాన్ చేస్తానని కేంద్రం నోటీసులు ఇస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేశా. కపిల్ సిబల్ ను లాయర్ గా పెట్టుకొని న్యాయం కోసం పోరాడా. ఫేస్ బుక్.. ట్విటర్.. వాట్సాప్ లేకుంటే మొత్తం దేశానికి ఇబ్బంది అని ఫైట్ చేశా. 3. మూడున్నర లక్షల కోట్లు విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూడున్నర వేల కోట్లకు అమ్మేస్తున్నారంటే.. నా సొంత స్టీల్ ప్లాంట్ లా ఫీల్ అయ్యా. నేను పుట్టిన విశాఖకు అన్యాయం జరుగుతుందని భావించా. కోర్టుకు వెళ్లి కేసు పెట్టా. మా వాళ్లను పంపించా. అప్పట్లో శివాజీ మాట్లాడుతూ.. కేఏ పాల్ మాత్రమే దీన్ని అపగలరన్నారు.  4. పది, ఇంటర్ పరీక్షలు ఎవరైనా కరోనా వేళలో పెడతారా? ఈ ఏపీ ముఖ్యమంత్రి తప్పించి. వయసులో పదేళ్లు చిన్నోడు అయినప్పటికీ ఆయన్ను కలవటానికి వెళ్లా. కానీ.. ఆయన కలవనన్నారు. పరీక్షలు నిర్వహించకూడదని నిరాహార దీక్ష చేశా. 20-30 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు జరగకుండా చేశా. పరీక్షలు జరిగితే కరోనా కేసులు ఎంత భారీగా పెరిగేవి? నా కారణంగా ఆంధ్రులకు మేలు కలిగేలా చేశా. 5. 2019 ఎన్నికలు అయ్యాక ఒక డైరెక్టర్ ఓ పిచ్చి సినిమా తీశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టటానికి. ఇంత మంది ఉన్నారు ఎవరైనా కోర్టుకు వెళ్లారా? ఫైట్ చేశారా? నెల రోజుల్లో ఫైట్ చేసి.. 16 ఎడిట్లు చేయించి.. టైటిల్ మార్పించా. ఆ సినిమా తీసినోడి మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చేశా. 6. కరోనా టైంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందలాది స్వచ్చంద సంస్థల్ని మూసేశాయి. పలు క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయి. అమిత్ షాతో ఫైట్ చేసి..రూపాలాతో మాట్లాడి.. 30 వేల ఎన్జీవో సంస్థల మీద పెట్టిన‌ పరిమితుల్ని ఎత్తేయించా. దాని కారణంగా ఐదు కోట్ల మంది సిబ్బందికి ఉపాధిని కల్పించిన వాడినయ్యా. ఇలా.. ఇటీవ‌ల కాలంలో తాను చేసిన గొప్ప ప‌నుల ఇవేనంటూ కేఏ పాల్ చెప్పుకొచ్చారు. వినేవాళ్లు ఉంటే.. కేఏ పాల్ ఎన్నైనా చెబుతారు అని అందుకే అంటారు.   

కుప్పంలో థియేటర్లు సీజ్.. జగనన్నకు ఎందుకంత కక్ష? 

సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. తమ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నా జగన్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమ నిబంధనలు పాటించడం లేదంటూ సీజ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో నాలుగు సినిమా థియేటర్లను అధికారులుసీజ్ చేశారు. బీ ఫామ్ లైసెన్స్ రెన్యువల్ కాలేదంటూ సీజ్‌ చేశారు.  పలమనేరులోనూ మూడు సినిమా థియేటర్లను అధికారులు మూసివేశారు. అనంతపురం నగరంలోని పలు సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టిక్కెట్ల రేట్లతో పాటు లైసెన్స్‌లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. థియేటర్ల ముందు ధరలకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలంటూ థియేటర్ యాజమాన్యాలకు సూచించారు.  సినిమా టికెట్ల అంశంతో పాటు థియోటర్ల సీజ్ పై టీడీపీ సీనియర్ నేత  బుద్ధా వెంకన్న సీరియస్ గా స్పందించారు. సినీ హీరోలను దెబ్బ తీయడం, ఇండస్ట్రీని నాశనం చేయడమే జగన్ లక్ష్యమని అన్నారు. సినిమా వారి నుంచి కమీషన్లు రావడం లేదనే జగన్ వారిపై కక్ష కట్టారని చెప్పారు. థియేటర్లపై దండయాత్ర చేసేందుకు అధికారులను పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే పట్టించుకోని జగన్... సినిమా టికెట్ల అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని బుద్దా వెంకన్న  విమర్శించారు.  

బండి సంజయ్ వల్లే టీఆర్ఎస్ గెలిచిందా? 

ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్ హాట్ గా జరిగాయి. టీఆర్ఎస్ కు పోటీగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి బరిలో నిలిచారు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డైరెక్షన్ లోనే రవీందర్ సింగ్ పోటీ చేశారని.. ఆయనకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని రవీందర్ సింగ్ ఓడించబోతున్నారని ఈటల పదే పదే చెప్పడంతో... ఆయన గెలుపు కోసం ఈటల తెరవెనుక గట్టిగానే ప్రయత్నాలు చేశారని భావించారు. బీజేపీ, కాంగ్రెస్ కు దాదాపు 380 ఓట్లు ఉండటంతో రవీందర్ సింగ్ గెలవొచ్చనే అంచనాలు వచ్చాయి.  కాని ఫలితాల రోజు సీన్ మారిపోయింది. కరీంనగర్ జిల్లాలోని రెండు సీట్లను అధికార పార్టీ గెలుచుకోవడంతో పాటు.. వాళ్లకు ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. కారు పార్టీకి అఫిషయల్ గా 980 ఓట్లు ఉండగా.. కొందరు ఈటలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో దాదాపు 906 ఓట్లు టీఆర్ఎస్ కు ఉన్నాయని లెక్క కట్టగా... ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ అభ్యర్థులకు ఏకంగా 1061 ఓట్లు వచ్చాయి. ఇదే సంచలనమైంది. అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగి ఒక అభ్యర్థి ఓడిపోతారనే ప్రచారం జరిగితే.. ఏకంగా వంద ఓట్లు ఎక్కువ రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.  కారుకు పడిన అదనపు ఓట్లు ఎవరివి?కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ కు జై కొట్టారా? లేక బీజేపీ ఓటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారా? అన్న చర్చలు సాగుతున్నాయి. తమ అభ్యర్థి లేకున్నా కాంగ్రెస్ పార్టీ క్యాంపు నిర్వహించింది. దీంతో కాంగ్రెస్ క్యాంపులో ఉన్న ఓటర్లు కారుకు ఓటేశారని భావించారు. అయితే మంత్రి గంగుల కమలాకర్ మాత్రం బీజేపీ ప్రతినిధులు తమకు మద్దతు ఇచ్చారంటూ బాంబు పేల్చారు. కమలాకర్ వ్యాఖ్యలపై కమలం పార్టీ నేతలు స్పందించలేదు. అంతేకాదు ఎక్స్ అఫిషియో ఓటరుగా ఉన్నా బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటేయలేదు. దీంతో బండి వర్గం ఏదో తేడా చేసిందనే ప్రచారం కరీంనగర్ జిల్లా బీజేపీలో జరిగింది. రవీందర్ సింగ్ ను ఈటల రాజేందర్ నిలబెట్టాడు కాబట్టి... ఆయనకు సంజయ్ వర్గం సహకరించలేదనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈటలకు చెక్ పెట్టడానికే రవీందర్ సింగ్ ఓడిపోయేలా బీజేపీలోని ఓ వర్గం ప్రయత్నించిందనే చర్చ జరిగింది.  తాజాగా ఎమ్మెల్సీ  ఎన్నికల బరిలో నిలిచిన సర్దార్ రవీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసి మరింత కాక రాజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు ఓటు వెయ్యలేదని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ కాంప్‌లకు బీజేపీ కార్పొరేటర్లు వెళ్తే చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. బీజేపీ నుంచి ఆరు ఓట్లు టీఆర్‌ఎస్‌కు వస్తాయని గంగుల కమలాకర్ చెప్తే.. బండి సంజయ్ ఖండించలేదన్నారు. స్మార్ట్ సిటీ అవకతవకలపై ఎంపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు పార్టీని కాపాడుకో సంజయ్ అంటూ రవీందర్ సింగ్ హితవుపలికారు. బండి సంజయ్ ను ఉద్దేశించి రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో సెగలు రేపుతున్నాయి. ప్రచారం జరుగుతున్నట్లుగానే బండి సంజయ్ వర్గం రవీందర్ సింగ్ కు సహకరించలేదా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.  మరోవైపు బీజేపీలో చేరాలని భావించిన సర్దార్ రవీందర్ సింగ్ మనసు మార్చుకున్నారని.. అందుకే ఆయన బండి సంజయ్ ను టార్గెట్ చేశారని అంటున్నారు. కరీంనగర్ నగరానికి చెందిన రవీందర్ సింగ్ చేరికను సంజయ్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఆ కోపంతోనే రవీందర్ సింగ్ అతన్ని టార్గెట్ చేశారని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలతో రవీందర్ సింగ్ చర్చలు జరుపుతున్నారని కూడా అంటున్నారు. అయితే ఈటల రాజేందర్ మద్దతుదారుడిగా రవీందర్ సింగ్ బీజేపీలో చేరుతారా.. లేక బండి సంజయ్ తో తనకు సరిపోదని కాంగ్రెస్ కు జై కొడతారా అన్నది చూడాలి మరీ..    

వీఆర్ఎస్‌కు ఎగ‌బ‌డుతున్న ఏపీ ఉద్యోగులు.. జ‌గ‌న‌న్న ఎఫెక్ట్ మామూలుగా లేదుగా!

గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుతారు. ఉద్యోగం రాగానే హ‌మ్మ‌య్యా అని రిలాక్స్ అవుతారు. ప్ర‌భుత్వ ఉద్యోగం అంత ధీమా మ‌రే వ్యాపార‌మూ, జాబూ ఇవ్వ‌దు. గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ ఉంటే.. పెళ్లి సంబంధాల‌కూ డిమాండ్ పెరుగుతుంది. నెల నెలా ఠంచన్‌గా జీతం.. సెల‌వులు.. జాబ్ సెక్యూరిటీ.. రిటైర్ అయ్యాక పెన్ష‌న్‌.. అన్నీ అనుకూల‌త‌లే. కానీ.... ఏపీలో మాత్రం అలా కాదు. స‌మ‌యానికి శాల‌రీ వ‌స్తుందో రాదో తెలీదు. ఈఎమ్ఐలు ఉంటే ఇక అంతే సంగ‌తి. ఉద్యోగుల‌తో ఎలాంటి ప‌నులు చేయిస్తారో తెలీదు. ఏమేం టార్గెట్లు పెడ‌తారే అర్థం కాదు. ఇక పీఆర్సీ ఇస్తారో లేదో.. ఇస్తే పెర‌గాల్సిన జీతం త‌గ్గేలా ఉందంటున్నారు. అటు సీపీఎస్ ర‌ద్దు ఎప్ప‌టికి అవుతుందో ఏమో తెలీదు. ఇక ఉద్యోగ సంఘాల్లో గ్రూపులు. రాజ‌కీయాలు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ సీఎం అయ్యాక‌ ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగమంటేనే వెగ‌టుపుడుతోంద‌ని అంటున్నారు. అందుకే, ఐదేళ్ల స‌ర్వీస్ ఉన్న‌వాళ్లంతా వీఆర్ఎస్‌కు ఎగ‌బ‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లూ చేసింది చాలు.. ఇక మాకీ ఉద్యోగం వ‌ద్దంటూ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణను తీసుకుంటున్నార‌ట చాలా మంది ఉద్యోగులు.   ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున స్వచ్చంద పదవీ విరమణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న చాలా మంది ఇంజినీర్లు వీఆర్ఎస్‌కు ముందుకొస్తున్నారు. ఇప్పటికి వంద మందికిపైగా దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు తగ్గించాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ప్రక్రియ మొద‌లైందని.. అదే జ‌రిగితే ఉద్యోగులు భారీ మొత్తంలో పదవీ విరమణ ప్రయోజనాలు పోగొట్టుకుంటారని తెలుస్తోంది. పెన్షన్ కూడా సగానికి సగం తగ్గిపోనుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. వెంట‌నే ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. లేదంటే, భారీగా న‌ష్ట‌పోక త‌ప్ప‌ద‌ని విద్యుత్‌ ఉద్యోగులు భావిస్తున్నారు.  ఇష్టం లేక‌పోయినా వీఆర్ఎస్‌కే మొగ్గుచూపుతున్నార‌ట చాలామంది. ఇప్ప‌టికే ఒక‌టో తారీఖున జీతం వ‌చ్చే ప‌రిస్థితి ఎప్పుడో పోయింది. పీఆర్సీతో జీతం మ‌రింత త‌గ్గుతుంద‌ని తెలుస్తోంది. నెల నెలా ఈ శాల‌రీ టెన్ష‌న్ కంటే.. మంచి ప్రైవేట్ కంపెనీ చూసుకొని చేరిపోతే.. బెట‌ర్ అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట సీనియ‌ర్ ఉద్యోగులు. త‌మ అనుభ‌వానికి ప్రైవేట్ సంస్థ‌ల్లో ఇక్క‌డికంటే మంచి జీతం.. అది కూడా టైమ్‌కి వ‌స్తుంద‌ని.. అందుకే వంద‌లాది మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌కు అప్లై చేస్తున్నార‌ని అంటున్నారు. జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కంలేక.. ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు ఇలా ఉద్యోగాలు వీడేందుకు పోటీప‌డుతుండ‌టం బ‌హుషా మ‌రే రాష్ట్రంలోనూ ఉండ‌క‌పోవ‌చ్చు. 

ఎమ్మెల్యే రోజాకు అసమ్మతి సెగ.. నగరి వైసీపీలో రచ్చ రచ్చ 

ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అసమ్మతి నేతలు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. అసమ్మతి నేతలు అయిదుగురు పోటాపోటీగా సీఎం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించడంతో .. అసలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు అనే డైలమాలో కేడర్ పడిపోయింది. దీంతో నగరిలో అసమ్మతి రాజకీయం ముదిరి పాకాన పడింది. ఎమ్మెల్యే రోజా అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.  అయితే తమ వల్లే ఆమె రెండుసార్లు ఎమ్మెల్యే అయిందంటూ.. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన అసమ్మతి నాయకులు బాహటంగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఓ వీధి నాటకంగా మారిందనే టాక్ వైరల్ అవుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రోజా కేవలం ఎనిమిది వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైయస్ జగన్ ప్రభంజనం కనిపిస్తున్నా ఆమె కేవలం రెండు వేల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం రోజాపై తిరుగుబాటు చేస్తున్న సదరు నాయకులు గత రెండు ఎన్నికల్లోనూ రోజా గెలుపు కోసం కృషి చేశారు. కానీ 2019 ఎన్నికల తర్వాత రోజా కుటుంబ పాలనకు తెర తీశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఈ అయిదు మండలాలకు అయిదుగురు కుటుంబ సభ్యులను ఇన్‌ఛార్జ్‌లుగా రోజా నియమించారని సమాచారం. దీంతో ఈ మొత్తం వ్యవహారాలన్నీ వీరే చూసుకుంటున్నారు.  ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన నేతలు.. పార్టీ కోసం తమ చేతి చమురు వదిలించుకున్న నేతల.. మాటలు ప్రభుత్వ కార్యాలయాల్లో చెల్లుబాటు కాని విధంగా తయారైందని సదరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ పార్టీ గాలే వీచింది. అలాగే నగరి నియోజకవర్గంలో కూడా ఏకపక్షంగా వైయస్ఆర్ సీపీ గెలుపొందింది. సదరు ఎన్నికల్లో అసమ్మతి నాయకులు ఫ్యాన్ పార్టీకీ వ్యతిరేకంగా పనిచేశారని.. అయినా తమ పార్టీ సునాయసంగానే గెలుపొందిందని రోజా వర్గం భావిస్తుంది. ఆ క్రమంలో సదరు అయిదు మండలాల నేతలను ఈ రోజా వర్గం దూరంగా పెట్టింది.  స్థానిక సంస్థలో నిండ్ర మండలం నుంచి మెజార్టీ ఎంపీటీసీలను చక్రపాణి రెడ్డి వర్గం కైవసం చేసుకుంది. అయినప్పటికీ రోజా తన వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపీపీ చేసింది. ఇది అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం అసమ్మతి నాయకులంతా ఏకమై పోయి..  రోజా నాన్ లోకల్ అనే అంశాన్ని తెరపైకీ తీసుకు వచ్చి రచ్చ రచ్చ  చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటూ.. వారికే తాము సహకరిస్తామంటూ అసమ్మతి నేతలు బల్లగుద్దీ మరి అధిష్టానానికి చెబుతున్నారు.  ఆ క్రమంలోనే ఇటీవల జరిగిన సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఈ రెండు వర్గాలు పోటా పోటీగా భారీ ఎత్తున నిర్వహించాయి. పుత్తూరులో ఎలుమలై పట్టణం మొత్తం భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని అర్ధరాత్రి మరో వర్గం వారు చింపి వేయడంతో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగగా.. వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నగరి,  నిండ్ర ,వడమాలపేట ,పుత్తూరు, విజయపురం మండలాలకు చెందిన ఐదుగురు నేతలు తమ అనుచరులతో భారీగా ర్యాలీ నిర్వహించి..  ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీకి గత పది సంవత్సరాలుగా పనిచేసిన వారిని కాకుండా ఇప్పుడు పార్టీలో చేరిన వారికి ఇక్కడ న్యాయం జరుగుతుందంటూ వారు విమర్శులు గుప్పించారు. రాష్ట్రమంతా జగనన్న పాలన జరుగుతుంటే.. నగరి నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే రోజా కుటుంబ పాలన నడుస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎమ్మెల్యే రోజా తన బలాన్ని నిరూపించుకోవడానికే సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఉపయోగించుకున్నారు.. ఆ క్రమంలో విందు వినోదాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగనన్నకు ప్రియమైన చెల్లెలనని.. తాను ఏమి చెప్తే అది జగనన్న వింటారని, అందువల్లనే అసమ్మతి నాయకులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టానని రోజా పేర్కొంటుండగా...  మరోవైపు నగరి నియోజకవర్గంలోని ఆసమ్మతి నాయకులకు మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి, ఆమె భర్త కుమార్‌కు ఈడిగా కార్పొరేషన్ పదవి కట్టబెట్టడంతోపాటు అదే మండలానికి చెందిన చక్రపాణి రెడ్డిని శ్రీశైలం ఆలయ పాలక మండలి ఛైర్మన్‌గా నియమించడంలో మంత్రి పెద్దిరెడ్డి కీలకంగ వ్యవహరించారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అయితే ఎమ్మెల్యే రోజా మాత్రం తనకు ఎదురే లేదనే ధోరణిలో ముందుకు దూసుకుపోతున్నారు.  చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను విమర్శించడంలో ఎమ్మెల్యే రోజా ముందు ఉన్నారు. కానీ రోజా విమర్శలకు ప్రతి విమర్శలు చేసే నాయకులు మాత్రం చిత్తూరు జిల్లా టీడీపీలో కనిపించడం లేదనేది సుస్పష్టం. కానీ రోజా విమర్శల ఎఫెక్ట్ ఆమెకే ఇబ్బందిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషఖులు పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడుపై రోజా విమర్శల వర్షం కురిపించినా అంతా లైట్‌గానే తీసుకున్నారు. కానీ నారా భువనేశ్వరిపై రోజా కామెంట్స్‌ను మాత్రం ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారన్న సంగతి తెలిసిందే.  మరోవైపు కేబినెట్ విస్తరణలో రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ అని అనుచరులు ప్రచారం అయితే చేసుకుపోతున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడం..  మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ భారీగా నగదు ఖర్చు చేయడంతో జగన్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అయింది. కానీ వాపును చూసి బలుపు అనే రీతిలో రోజాతోపాటు ఆమె అనుచర గణం వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్టమ్మనాయుడు రెండో కుమారుడు జగదీష్ తన సోదరుడు భాను ప్రకాష్‌కి వ్యతిరేకంగా పని చేశారు. ఈ నేపథ్యంలో రోజా గెలుపు సాధ్యమైందనే ప్రచారం అయితే నియోజకవర్గంలో బలంగా ఉంది. మొత్తం మీద రోజాకి మాత్రం ఈ అయిదుగురు నేతల వల్ల నగరి నియోజకవర్గంలో తీవ్ర ఎదురుగాలి వీస్తుందనేది మాత్రం స్పష్టమవుతోంది.

అవనిగడ్డ... టీడీపీ గ్రౌండ్ రియాల్టీ..

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప‌రిస్థితిని బేరీజు వేయ‌డానికి శాంపిల్‌గా కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుని విశ్లేషిస్తే అనేక ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూస్తున్నాయి. అవనిగడ్డ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో రెండుసార్లు మాత్రమే టీడీపీ ఓడిపోయింది. వంగవీటి రంగా వేవ్ ఉన్న 1989లోనూ, వైఎస్సార్ వేవ్ వచ్చిన 2009లోనూ అవనిగడ్డలో టీడీపీదే గెలుపు. 1999, 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గ‌ట్టెక్కింది. అది కూడా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న లుకలుకల వల్లే. సింహాద్రి సత్యనారాయణ, సైకం అర్జునరావుల‌ వర్గ పోరుతో ఆ సమయంలో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. పార్టీ పరిస్థితులపై సమాచారం ఉన్నా హైకమాండ్ పట్టించుకోకపోవడంతో.. ఆ రెండు సార్లు చేతులారా అవనిగడ్డ స్థానాన్ని కాంగ్రెస్ కు కట్టబెట్టినట్లైంది. 2004లో ఓటమి తర్వాత హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. రెండు గ్రూపులు కలిసి పనిచేసేలా చేయడంతో పాటు మూడో వ్యక్తిని బరిలోకి దింపింది. దీంతో 2009లో రాష్ట్రమంతా వైఎస్సార్ హవా వీచినా.. అవనిగడ్డలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. నాయకత్వం సమిష్టిగా పని చేస్తే అవనిగడ్డలో టీడీపీని ఓడించడం అసాధ్యమని 2009 ఎన్నికలతో రుజువైంది.  అయితే 2014లో అవనిగడ్డలో మరో చారిత్రాత్మక తప్పిదం చేసింది టీడీపీ అధినాయకత్వం. దశాబ్దాల పాటు టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన మండలి బుద్ద ప్రసాద్ ను పార్టీలోకి తీసుకుంది. ఇది 2014 ఎన్నికల్లో కొంత లాభించినా.. ఆయ‌న చేరిక ఎంత త‌ప్పిద‌మో ఆ తర్వాత తెలిసొచ్చింది. పార్టీకి తీరని నష్టం కలిగించింది. 2014లో చంద్రబాబు వేవ్ లో గెలుపొందిన మండలి బుద్దప్రసాద్.. పార్టీ పుట్టిని ముంచేశారు. గ్రూప్ రాజకీయాలతో కోలుకోలేని దెబ్బ తీశారు. బుద్ధ‌ప్ర‌సాద్‌ ఎమ్మెల్యేగా గెలిచాకా అవనిగడ్డలో టీడీపీ ముక్కలైపోయింది. స్థానిక నేతలను పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ గ్రూపులు తయారయ్యాయి. నియోజకవర్గ వ్యాపంగా టీడీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో గ్రూపులు త‌యార‌య్యాయి. గ్రామాల్లోనూ విచ్చిన్న‌క‌ర రాజ‌కీయాలే.  అవ‌నిగ‌డ్డ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పని చేయాల్సిన మండలి బుద్ద ప్రసాద్.. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన కంఠమనేని రవిశంకర్ ను అణగదొక్కడంపైనే ఫోక‌స్ పెట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలను పట్టించుకోకుండా రవిశంకర్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పని చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రవిశంకర్ పోటీ చేయడంతో టీడీపీకి బాగా డ్యామేజ్ జ‌రిగింది. వైసీపీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. బుద్ధ ప్ర‌సాద్‌కు కాకుండా.. మిస్ట‌ర్ క్లీన్‌గా ముద్రున్న‌.. సోష‌ల్ స‌ర్వీస్‌లో ముందున్న ర‌విశంక‌ర్‌కు టీడీపీ టికెట్ ఇచ్చుంటే.. 2019 ఎన్నిక‌ల్లో అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఈజీగా విజయం సాధించేదని స్థానికుల మాట‌. టీడీపీలో బుద్ధ ప్ర‌సాద్ ఆధిప‌త్య రాజ‌కీయాలే తమకు కలిసి వచ్చిందని వైసీపీ కూడా భావిస్తోంది. మండలి కాకుండా, ర‌విశంక‌ర్‌ టీడీపీ నుంచి పోటీ చేసుంటే తాము ఓడిపోయి ఉండేవార‌మ‌ని వైసీపీ నేత‌లు ఇప్ప‌టికీ అంటుంటారు. ఇలా, అవ‌నిగ‌డ్డ సీటు వైసీపీ ఖాతాలో ప‌డ‌టానికి మండలి బుద్దప్రసాద్ వ్యవహార శైలితో పాటు టీడీపీ అధినాయకత్వం తీరే కార‌ణ‌మ‌నేది త‌మ్ముళ్ల భావ‌న‌.  ఇక, 2019 ఎన్నికల తర్వాత మండలి బుద్దప్రసాద్ కనిపించకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారో పార్టీ నేతలకు కూడా తెలియని పరిస్థితి. తెలుగు మహాసభలు, కవులు, కళాకారుల కార్యక్రమాల్లో తప్ప రాజ‌కీయ వేదిక‌ల్లో ఎక్కడా అడ్ర‌స్ లేకుండా పోయారు. టీడీపీ కార్యకర్తలను కనీసం పట్టించుకోవ‌ట్లేదు. చివరకు పార్టీ అధినేత సతీమణిని అసెంబ్లీలో ఘోరంగా అవమానించినా కనీసం స్పందించలేదు. నిజానికి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలే చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని నీచంగా టార్గెట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాకు చెందిన నేతలు తీవ్రంగా స్పందించాలి. తెలుగు భాష అంటూ గొప్ప‌ల‌కు పోయే బుద్ధ ప్ర‌సాద్‌లాంటి వాళ్లు భువ‌నేశ్వ‌రి ఎపిసోడ్‌లాంటి సున్నిత అంశంలో స్పందించక‌పోవ‌డం దారుణం. నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉన్నా.. కార్యకర్తలను సమీకరించి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేలా చేయ‌డంలో మండలి బుద్దప్రసాద్ పూర్తిగా విఫలమయ్యారు. ప‌లు అంశాల్లో, జ‌గ‌న్ ఆగ‌డాల‌పై ఎప్పటిక‌ప్పుడు స్పందించాల్సిన అవనిగడ్డ నేతలు.. ఎప్పుడూ సైలెంటుగా ఉండిపోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. య‌ర‌ప‌తినేని అధికారంలో లేక‌పోయినా డైన‌మిక్‌గా పాలిటిక్స్ చేస్తూ.. వైసీపీకి చెక్ పెడుతున్నారు. మ‌రి, అవ‌నిగ‌డ్డ‌లో మండ‌లి ఏం చేస్తున్నారు? పక్క జిల్లాలో వేలాది మందితో ఆందోళన చేస్తే.. అవ‌నిగ‌డ్డ‌లో కనీసం పది మంది కార్యకర్తలను కూడా సమీకరించలేని చేత‌గానిత‌నం మండలి బుద్దప్రసాద్‌ది. ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవని ఇప్ప‌టికే తేలిపోయింది. నలుగురు డబ్బా కొట్టేవాళ్లను పక్కన పెట్టుకుని, కార్యకర్తలను పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయని.. ఆయ‌న తీరు టీడీపీకి ఏమాత్రం ప‌నికిరాద‌ని అంటున్నారు. పార్టీ నేతలందరిని ఒకేతాటిపై నడిపించడం, కార్యకర్తలకు అండగా నిలబడితేనే పార్టీకి ప్రయోజనం. మండలి లాంటి వాళ్లు టీడీపీకి ఏమాత్రం ఉప‌యోగం లేద‌ని స్థానికంగా పెద‌వి విరుస్తున్నారు. అవనిగడ్డ లాంటి పార్టీకి గట్టి పట్టున నియోజకవర్గంలో పరిస్థితులు చేజారిపోతున్నా అధినాయకత్వం పట్టించుకోకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు మేల్కోని నియోజకవర్గంలో ఎవరితో పార్టీకి నష్టం? ఎవరి వల్ల ఉపయోగం? అన్న నిజాలు తెలుసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందో అంచనా వేసి.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని అవనిగడ్డ తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు.  ఇప్పటికైనా టీడీపీ అధినాయక‌త్వం అప్ర‌మ‌త్త‌మై.. అవనిగడ్డలో సరైన నేతను ప్రోత్సహించాల‌ని.. గతంలో చేసిన తప్పిదాన్ని స‌రిదిద్దుకోవాల‌ని.. ఈసారి గెలుపు గుర్రాన్నే బ‌రిలో దించాల‌ని.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు సూచిస్తున్నారు. మార్పు మంచికే అంటున్నారు. 'మెగా' షాక్‌!.. దిగ్గ‌జానికే దిక్కులేదా? జ‌గ‌న‌న్నా మ‌జాకా!

అయ్యయ్యో.. కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కింద పడిపోయారు. ఆయన బొక్కా బొర్లా పడ్డారు. అయితే ఆయన కాలు జారో, ప్రమాదానికి గురై కింద పడి పోలేదు.. కబడ్డీ ఆడుతూ ఆయన కింద పడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగింది.  ఆముదాలవలసలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను అసెంబ్లీ స్పీక్ర తమ్మినేని ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా ఆటగాడిలా మారిపోయారు. ఒక టీమ్ తరపున కూతకు వెళ్లారు. ఉత్సాహంగా ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి కాలు జారి కిందపడిపోయారు. దీంతో వెంటనే ఉండే సెక్యూరిటీ గార్డులు ఆయనను పైకి లేపారు. అయితే కింద పడిపోయినా స్పీకర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పీవీకి దండేయ లేదు, దండం పెట్టలేదు! శత జయంతి ఉత్సవాలు ప్రచారానికేనా? 

దివంగత, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతిని పురస్కరించుకుని అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఆయన రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, పలువురు మంత్రులు కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు, జ్ఞాన భూమిలో యోగ నిద్రలో ఉన్న తెలంగాణ బిడ్డ, పీవీకి నివాళులర్పించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె  సురభి వాణీదేవి, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌజ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కాంగ్రెస్‌ సీనియర్‌ వి.హన్మంతురావుతో పాటు పలువురు ప్రముఖులు పీవీ ఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించారు.అయితే, ఎంత మంది వచ్చినా రావలసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రాలేదు. నివాళులు అర్పించలేదు.  అలాగని  పీవీ నరసింహ రావు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు గౌరవం లేదని కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలను, 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు  తెలంగాణ ప్రభుత్వం ఎంతో  ఘనంగా నిర్వహించింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా, ‘కోట్ల’ పండగగా పీవీ శత జయంతి ఉత్సాలను నిర్వహించారు. కేకే, రమణాచారి వంటి పెద్దల సారధ్యంలో ఏర్పడిన కమిటి చాలా చాలా ‘ఘనం’ గా  ఏడాది పొడుగునా ఉత్సవాలను నిర్వహించింది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గత సంవత్సరం జూన్ 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన పీవీ శత జయంతి ముగింపు వేడుకలను కుడా అంతే ఘనంగా నిర్వహించారు. జ్ఞానభూమిలో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్’ గా నామకరణం చేశారు.ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీపై ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు అని పొగిడారు. పీవీని ఎంత గౌరవించుకున్నా తక్కువే అని కేసీఆర్‌ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖ‌ర‌మ‌ని కొనియాడారు.  అంత గౌరవం ఉన్న ఆయన ఇంతలోనే అంతటి మహనీయుని ఎందుకు మరిచి పోయారు? ఎందుకు విస్మరించారు.. ప్రగతి భవన కు కూతవేటు దూరంలో ఉన్న జ్ఞానభూమికి వెళ్లి   గుప్పెడు పూలేసి.. ఓ దండం పెట్టి వచ్చేందుకు కేసీఆర్’ కు ఎందుకు మనసు రాలేదు ?  అంటే, సమాధానం అందరికీ తెలిసిందే. రేవు దాటే దాకా ఓడ మల్లయ్య .. రేవు దాటిన తర్వాత బోడి మల్లయ్య ఇదే కదా .. కేసీఆర్ నైజం, అన్ని అనేవాళ్ళు అంటున్నారు. అప్పటి అవసరాల కోసం కేసీఆర్ పీవీని గౌరవించారు. శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాదు, పీవీ కుమార్తె, సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి. పీవీ సెంటిమెంట్’ ప్లస్ క్యాస్ట్ ఈక్వేషన్’ కలిపి ఆమెను గెలిపించుకోవడమే కాదు, దుబ్బాక, జీహెచ్ ఎంసీ వరస ఓటముల నుంచి కాసింత ఉపశమనం పొందారు. ఇప్పుడు అలాటి అవసరం ఏదీ లేదు కాబట్టి .. పీవీ పుష్పగుచ్చానికి కూడా నోచులోలేదు. కేసీఆర్ మాత్రమే కాదు, కేకే కూడా ..పీవీ విగ్రహనికి దండేయ లేదు .. దండం పెట్టలేదు. 

ఉత్తరాఖండ్ లో రావత్ హ్యాండ్సప్.. మరి, తెలంగాణ రేవంత్?

మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలిందా? మరో పెద్ద కష్టం వచ్చి పడిందా? అంటే రాజకీయ విశ్లేషకులు  అవుననే అంటున్నారు. వచ్చే సంవత్సరం (2022) ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఉత్తరాఖండ్ ఒక్కటే. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని పుష్కలంగా మూట కట్టుకుంది. ఐదు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చినా ఫలితం లేకుండా పోయింది.  అదీకాక, ఉత్తరాఖండ్’ లో బీజేపీ కాదంటే కాంగ్రెస్ తప్ప మరో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అయితే, కాంగ్రెస్ పార్టీలో సయోధ్యత ఏక పోవడంతో  ఈ అవకాశాన్ని కూడా హస్తం చేజార్చుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎన్నికల ప్రచార సారధి, హరీష్ రావత్ చేతులెత్తేశారు. సంస్థాగత సహకారం లేకుండా ప్రచార బాధ్యతలు నిర్వర్తించడం తనవల్ల కాదని స్పష్టం చేశారు. పార్టీ సహాకారం లేక ఎన్నికల మహా సముద్రాన్ని ఈదడం తన వల్ల కావడం లేదని  ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్త పరిచారు. గాంధీల కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడు, పార్టీలో ట్రబుల్‌షూటర్‌గా పేరున్న సీనియర్‌ నాయకుడు హరీశ్ రావత్‌ తొలి సారిగా  కాంగ్రెస్‌ అధిష్ఠానంపై బహిరంగంగానే అసంతృప్తి గళం వినిపించారు. హై కమాండ్‌ నుంచి తనకు సరైన సహకారం లభించడం లేదంటూ వరుస ట్వీట్లలో ఆరోపించారు. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి, అన్నట్లుగా పార్టీ వదిలేసిందని ఆయన అవేదన వ్యక్తపరిచారు. ఇంతవరకు చేసింది చాలు ఇక విశ్రాంతి తీసుకోమని అంతరాత్మ ప్రభోదిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. అంటే, పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాననికొంచెం కష్టంగానే మనసులోని బాధను,భావాన్ని ట్వీట్ ద్వారా వ్యక్తపరిచారు. హరీష్ రావత్ ట్వీట్ చేసింది, ఉత్తరాఖండ్ గురించే అయినా, తెలంగాణ సహా కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి ఇంకా అవకాశం ఉన్న చాలా వరకు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి  ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సరైన సమయంలో పార్టీ అధిష్టానం సరిగా స్పందించక పోవడం వల్లనే, పార్టీ నాయకులు ప్రత్యాన్మాయం వైపు చూస్తున్నారని అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ పనితీరుపట్ల రావత్, చేసిన ట్వీట్ అలోచింప చేసేలా వుందని అంటున్నారు. రావత్ హిందీలో చేసిన ట్వీట్ లో ‘‘ఇది వింతగా అనిపిస్తోంది కదూ..! ఎన్నికలనే మహా సముద్రంలో నేను ఈదుతున్నాను. ఇలాంటి సమయంలో సంస్థ(పార్టీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి) నాకు అండగా ఉండాల్సింది మాని.. ప్రతికూల పాత్ర పోషిస్తోంది. అధికారంతో కొందరు ఇక్కడ మొనళ్లను(మోసగాళ్లను) వదిలిపెట్టారు. పెద్దల ఆదేశాలతో నేను ఈ సముద్రంలో ఈదుతుంటే, వాళ్ల నామినీలు మాత్రం నా కాళ్లు, చేతులు కట్టేయాలని చూస్తున్నారు. ఇదంతా చూస్తూ నా మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. హరీశ్ రావత్‌ ఇక చాలు..! చాలా కాలం నుంచి ఈదుతున్నావ్‌.. ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది.. అని నా అంతరాత్మ చెబుతున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఇదే డైలమాలో ఉన్నాను. కొత్త సంవత్సరం నాకో కొత్త మార్గం చూపిస్తుందని ఆశిస్తున్నా’’ అని రావత్‌ ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నట్లు పరోక్షంగా ప్రకటించారు.అంటే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెప్పకనే  చెప్పారు. ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌లో రావత్‌ అత్యంత కీలక నేత. గతంలో 2014 నుంచి 2017 వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అంతుకుముందు ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. కాబట్టి రావత్ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బగానే పరిశీలకులు భావిస్తున్నారు. రావత్ కేవలం బాధ్యతల నుంచి తప్పు కుంటారా, రాజకీయ సన్యాసమే స్వీకరిస్తారా? ఇంకో పార్టీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా అన్నది పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒక్క రావత్  నే కాదు, రేవంత్ వంటి సత్తా ఉన్న నాయకుల కాళ్ళు చేతులు కట్టేస్తున్న సో కాల్డ్ సీనియర్స్,ను కట్టడి చేయకుండా వదిలేసి, వారిని నిర్వేదానికి గురి చేస్తోంది. ఈరోజు రావత్ అయితే రేపు రేవంత్ కావచ్చును, కానీ చివరకు నష్ట పోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అంటున్నారు విశ్లేషకులు.