ఏపీ రాజధానిలో ఫ్లాట్ల హడావుడి
posted on Sep 8, 2015 @ 10:33AM
ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరులో ఇప్పుడు ఫ్లాట్ల హడావుడి ఎక్కువైంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలు విజయవాడకు తరలివచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సాధ్యమైనంత వరకూ ఇక్కడే ఉండి పాలనా కార్యక్రమాలు చూసుకుంటున్నారు. దీంతో మరిన్ని శాఖలు ఇక్కడికే తరలివస్తున్నాయి. అయితే మొత్తం పాలన వ్యవస్థ ఇక్కడికే వస్తే దాదాపు పాతిక వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి నగరంలో 400 అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి.. దాదాపు 12 వేల ఫ్లాట్ల వరకు అందుబాటులోకి రానున్నాయి.. వీటితో పాటు మరో 10 వేల ఫ్లాట్ల వరకు ఉంటాయని అంచనా. అంతేకాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రైవేటు ఉద్యోగులు.. సాఫ్ట్ వేర్లు తదితరులను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ అంచనాల ప్రకారం బిల్డర్లు భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు హైదరాబాద్, బెంగుళూరులో స్థిరపడిన బిల్డర్లు కూడా ఇక్కడికి వచ్చి భవన నిర్మణాలు చేపడుతున్నారు.