కడపలో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన వైఎస్సార్ సి.పి.
కడప జిల్లాలోని పూతలపట్టులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన వై.ఎస్. విజయమ్మ సమక్షంలో సుమారు 4,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా వై.ఎస్. విజయమ్మ మాట్లాడుతూ మీలాంటి కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవసరం, మీ లాంటి కార్యకర్తలే జగన్ ను ముందుండి నడిపిస్తున్నారు. అందుకే జగన్ ను మీ చేతుల్లో పెట్టాను. జగన్ త్వరలోనే బయటికి వస్తాడు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలను, కార్యక్రమాలను వై.ఎస్. జగన్ నెరవేరుస్తాడని ఉద్వేగంగా అన్నారు.