కారణం ఏదైనా సభలో రగడే జరిగింది!

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. తొలిరోజునే సభలో గందరగోళ పరిస్థితి కనిపించడంతో స్పీకర్ సభని గంటసేపు వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణకోసం వాయిదా తీర్మానాన్ని ప్రవేశెపెట్టాలని టిఆర్ ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనికి ఒప్పుకోకపోవడంతో టిఆర్ ఎస్ సభ్యులంతా తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతూ పోడియంలోకి దూసుకెళ్లారు. గంటసేపు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాతకూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. టిఆర్ఎస్ సభ్యులు జై తెలంగాణ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లారు. సజావుగా సాగే పరిస్థితి కనిపించకపోవడంతో స్పీకర్ రెండోసారి అరగంటపాటు సభనివాయిదా వేశారు. తిరిగి మూడోసారి సమావేశమైన తర్వాతకూడా అదే పరిస్థితి. ఈసారి సభ రేపటికి వాయిదాపడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి విద్యుత్ సమస్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఫీజులు, కరెంట్, రైతుల సమస్యలు, కరువు లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వంమీద ముప్పేట దాడి చేయాలని గట్టిగా అనుకుని మరీ సభలోకి అడుగుపెట్టిన విపక్షాలు సభలో విలువైన ప్రజా సమస్యలగురించి చర్చించడంకంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంమీదే ఎక్కువ ధ్యాసను చూపించాయి. తెలంగాణ తీర్మానమో లేక విద్యుత్ సమస్యో.. ఏదో ఒకదానిమీద చర్చ జరిపితే ఫలితం కానీ.. సభని సమావేశ పరచలేదంటూ ముందు సొడ్లుపెట్టి, తీరా సభలోకొచ్చాక ఇలా కాలాన్ని వృథా చేయడం ఎంతవరకూ సమంజసమో ప్రజలకోసం పోరాడుతున్న, ప్రజలకోసమే పాటుపడుతున్న నేతలే ఆలోచించుకోవాలి.

కేంద్రం జగన్‌తో లాలూచీ పడిందా?

  కేంద్రం జగన్‌తో లాలూచీ పడిందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయి, చంచల్‌గూడా జైల్లో ఉన్న జగన్‌తో కేంద్రం లోపాయి కారీగా ఒప్పందం కుదుర్చుకుందన్న అనుమానం చంద్రబాబు మాటల్లో వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి ఎన్నికల వరకూ జగన్‌ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్రం అనంతర పరిణామాల ఫలితంగా కొంతమేరకు సానుకూల దృక్పధంతోనే ఉన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. సిబిఐ న్యాయవాదులను మార్చడం ద్వారా జగన్‌ కేసును నీరుగార్చడం ఇందులో ప్రధాన అంశంగా చెప్పవచ్చు. ఇది విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ` జగన్‌ అక్రమాస్తుల కేసులో సిబిఐ తరఫు న్యాయవాదుల్ని ఎందుకు మార్చవలసి వచ్చిందో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయవాదుల్ని మార్చవద్దంటూ సిబిఐ చేసిన విజ్ఞప్తులను కేంద్రం ఏకపక్షంగా ఎందుకు పక్కన పెట్టిందో వివరించాలన్నారు. అవినీతి పరులపై కేసులు నమోదు చేయించి. లోంగదీసుకుని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకే  కేంద్రం ఇటువంటి ఎత్తుగడలు వేస్తోందని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రాబోయో రోజుల్లో జగన్‌ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి! చూద్దాం... ఏం జరుగుతుందో...  

టిడిపికిప్పుడు బంద్ పేరు చెబితే పండగే!

దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎఫ్‌డిఐ అనుమతుల’ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎన్‌డిఎ కూటమి సెప్టెంబర్‌ 20న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆరోజున దేశ వ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు ... పికెటింగులు నిర్వహించాలని తీర్మానించింది. పేదప్రజలపై భారం మోపే ఈ ‘ప్రజావ్యతిరేక’ విధానాలను ఎండగట్టాలని  ఎన్‌డిఎ భాగ స్వామ్య పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలనూ, నిత్యవసరవస్తువుల పెరుగుదలనూ, ప్రభుత్వాస్పత్రుల్లో శిశుమరణాలతో బాటు ఫీజురీఎంబర్స్‌మెంట్స్‌ అంశాలను ప్రజల్లోకి మరింతగా ప్రచారం చెయ్యాలని నిర్ణయించినట్లు దేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాల వారీగా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లుగా కూడా వారు చెబ్తున్నారు.

ఓ ఊరినే అమ్మేశారు!

ధర్మరాజు జూదంలో భార్యను పోగొట్టుకున్నాడని.. హరిశ్చంద్రుడు తన సత్యవ్రతం కోసం భార్యనే అమ్మేశాడని.. విన్నాం. అది ధర్మం, సత్యం, న్యాయం కోసమన్నది అందరికి తెలిసిన సత్యం. అయితే నేటికాలంలో  కొద్దిగా పలుకుబడి వుందా?, మాటలతో బురిడి కొట్టించగల నేర్పరులా?, కుందేలును కోతిగా చెప్పించగల నేర్పుందా? అట్లయితే... ఓ.కె. ఈ రాష్ట్రంమీదే...?  నిజం.. ఎలా..అని సామాన్యులకు అనుమానమోస్తోందా? ఇదిగో...ఇలా.. గౌనివారిపల్లె రెవిన్యూ గ్రామం (కొండాపురం పంచాయితీ) పరిధిలోని  రాంపురం  గ్రామపరిధిలోని ఓ కుగ్రామంలోని ఈ భూమి అంతా మాదేనంటూ కొందరు దళారులు ‘రికార్డులు సృష్టించి’ పొరుగురాష్ట్రాలకు చెందిన ఓ ప్రైవేటు  కంపెనీకి అమ్మేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విధంగా  ఆ భూమి తమదేనన్నట్లుగా రికార్డులు కూడా సృష్టించేశారట! అలా ఊరునే అమ్మేసుకున్నారు ఆ ఘనులు.  ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి తమ గ్రామాన్ని కాపాడమంటూ ఆ గ్రామస్తులు  వేడుకుంటున్నారట... వీరిని ఇలాగే వదిలేస్తే  ఇప్పుడు ఢిల్లీగా పిలువబడే హస్తినాపురం గతంలో మా పూర్వీకులైన పాండవులేదని.. పట్టాలు పుట్టించి వాటిని మళ్ళీ ఏ తెల్లోడికో అమ్మేయగల నేర్పరులు.  వీరి లిస్టులో   ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాంతాలు కూడా ఉన్నాయేమో!  దేవుళ్ళారా... చారిత్రక పురుషుల వంశజుల్లారా  మా దళారుల కన్ను మీ మీదపడుతుందేమో... బహుపరాక్‌!

చంద్రబాబు ప్రయాణం ఎటువైపు?

తెలంగాణ సెంటిమెంట్ పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ వట్టిపోయింది. పార్టీకి ఎంతో కాలంగా అండగా నిలబడ్డ చాలామంది దిగ్గజాలు ప్రత్యేక రాష్ట్రం స్లోగన్ తో రకరకాల దారులుపట్టిపోయారు. ఇప్పుడు మళ్లీ వాళ్లందర్నీ తిరిగి పచ్చజెండాకిందికి తీసుకురావడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైతే తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయాలనికూడా ఆయన నిర్ణయించుకున్నారు. అక్టోబర్ రెండు నుంచి బాబు మొదలుపెట్టబోయే పాదయాత్రను మామూలుగా ఎప్పటిలాగే తిరుపతి నుంచి ప్రారంభించాలి. ఏ పని మొదలుపెట్టినా తిరుపతినుంచే దాన్ని ప్రారంభించడం చంద్రబాబు సెంటిమెంట్. కానీ.. ఈ సారి తెలంగాణ వాదుల్ని ఆకట్టుకునేందుకు తెలంగాణలోని ఏదో ఒక ప్రాంతంనుంచి యాత్రని మొదలుపెట్టాలని చంద్రబాబుపై కార్యకర్తలు, నేతలనుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలిగి అటకెక్కిన వేణుగోపాలాచారి కిందికి దిగి మళ్లీ బాబుకి జై కొడితే ఆయన నియోజకవర్గంనుంచే యాత్ర ప్రారంభం కావొచ్చని చాలామంది అనుకుంటున్నారు. కానీ.. బాబుకి ఎన్నికలముందు యాత్రను తిరుపతినుంచి మొదలుపెడితేనే కలిసొస్తుందని కొందరు నేతలు వాదిస్తున్నారు. ఇద్దరిమధ్యా నలిగిపోతున్న చంద్రబాబు ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఏదేమైతేనేం మా బాబు మళ్లీ తెలంగాణకి జై కొడుతున్నాడుకదా.. అని టిడిపికి చెందిన తెలంగాణ వాదులంతా సంతోషంతో ఉన్నారు.

బాబుకి బావమరిదే దిక్కయ్యాడు

చంద్రబాబు తన కుటుంబంతో సహా సినీ హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. బాలయ్యతో పార్టీ బలోపేతంపై, తన రాష్ట్ర పర్యటనపై చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలయ్య పార్టీలో పోషించాల్సిన బాధ్యత, ఎప్పటి నుండి క్రియాశీలకంగా మారాలనే అంశంపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం. కాగా తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణతో పాటు బాబు తనయుడు నారా లోకేష్ కుమార్ కీలక పాత్ర పోషించేందుకు రంగం సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. ఇరువురికి పార్టీలో బాధ్యతలు అప్పగించే విషయమై పార్టీలో కొన్నాళ్లుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బాలకృష్ణతో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ లో కలవాల్సిన ఖర్మ లేదంటున్న వై.ఎస్ విజయమ్మ

వైఎస్ఆర్ సిపి ఏ పార్టీలో విలీనం కాదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేశారు. తమ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాదన్నారు. అలాంటి అవసరం తమకు లేదని చెప్పారు. తమ పార్టీ ఏ పార్టీలోనూ విలీనం కావలసిన అవసరంలేదని చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని గెలిపించారని, అటువంటి పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలవవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. జగన్మోహన రెడ్డికి బెయిల్ కోసం కాంగ్రెస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవలసిన అవసరంలేదన్నారు. 90 రోజులు అయితే బెయిల్ ఇవ్వాలని, బెయిల్ వస్తుందని ఆమె చెప్పారు. 111 రోజుల నుంచి జగన్ను జైలులో పెట్టారు. ఏ ఒక్క అంశంలోనైనా జగన్ అవినీతికి పాల్పడినట్లు రుజువు చేయగలిగారా? అని ఆమె ప్రశ్నించారు. జగన్ బయట ఉన్న 10నెలల్లో సీబీఐ ఏం చెప్పగలిగిందని అడిగారు

బిఏసీ సమావేశం నుంచి టీడీపీ వాకౌట్

ఆదివారం ఉదయం జరిగిన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బిఎసి) సమావేశం నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు నేతలు వాకౌట్ చేశారు. శాసనసభ సమావేశాలు 4రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సమావేశం నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. 20 అంశాలపై 20 రోజులపాటు సమావేశాలు జరపాలని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కోరారు. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీ నామా, కళంకిత మంత్రులపై ముఖ్యమంత్రి వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, శోభానాగి రెడ్డి హాజరయ్యారు. టీడీపీ నుంచి మోత్కుపల్లి నరసింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర పార్టీల శాసనసభ పక్షనేతలు హాజరయ్యారు.

ఐసీసీ అవార్డ్స్ 2012 విన్నర్స్ లిస్ట్

ఏడాది కాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ సంచలనం విరాట్ కోహ్లీని ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. శ్రీలంక స్టార్ ఆటగాడు కుమార సంగక్కర ఐసీసీ 'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుతోపాటు 'టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్', 'పీపుల్స్ చాయిస్' అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. శనివారం కోలాహలంగా జరిగిన కార్యక్రమంలో ఐసీసీ ఈ అవార్డులు అందజేసింది. ఐసీసీ పరిగణనలోకి తీసుకున్న ఏడాది కాలంలో 31 వన్డేలాడిన కోహ్లీ 66.65 సగటుతో 1733 పరుగులు సాధించాడు. అందులో 8 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 183 పరుగులు సాధించి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. దీంతో 32 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ధోనీ, సంగక్కర, లసిత్ మలింగ పోటీలో ఉన్నా కోహ్లీనే ఎంపికచేసింది. తొలిసారిగా ఐసీసీ అవార్డు రావడంపట్ల కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఐసీసీ అవార్డు విన్నర్స్ - క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: సంగక్కర (శ్రీలంక) - టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: సంగక్కర - వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: విరాట్ కోహ్లీ (భారత్) - ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: సునీల్ నరైన్ (వెస్టిండీస్) - స్పిరిట్ ఆఫ్ క్రికెట్: డానియెల్ వెట్టోరి (న్యూజిలాండ్) - టి-20 పర్‌ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్: రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా) - అంపైర్ ఆఫ్ ద ఇయర్: కుమార్ ధర్మసేన (శ్రీలంక) - పీపుల్స్ చాయిస్: సంగక్కర - మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్) - మహిళా టి-20 క్రికెటర్ఆఫ్‌ద ఇయర్: సారా టేలర్ (ఇంగ్లండ్) - అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: జార్జ్ డోక్రెల్ (ఐర్లాండ్)

హాస్పిటల్లో అమ్మాయిల మసాజ్

బయట బోర్డు చూసిన వారంతా అది హాస్పిటల్ అని అనుకుంటారు. కాని అందులో మందులు గానీ, ఇంజక్షన్లు గానీ ఉండవు, లోపలికి అడుగుపెడితే గానీ తెలియదు అందులో మస్త్ మసాజ్‌లు జరుగుతున్నాయని. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను నగరానికి తీసుకొచ్చి వారితో మసాజ్ సెంటర్లు నడుపుతున్నారు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా, పోలీసులకు సమాచారం తెలియ కుం డా నిర్వాహకులు వీటిని నడుపుతున్నారు. బర్కత్‌పుర చమాన్ వద్ద డాక్టర్ నేహ ఎంజే ఖైబాన్ అపార్ట్‌మెంట్ 101 ఫ్లాట్‌లో ఐదేళ్ల క్రితం హోలిస్టిక్స్ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. క్లినిక్‌లోకి వెళ్ళగానే అందులో పనిచేసే వ్యక్తి వివరాలు తీసుకొని, అమ్మాయిలతో మసాజ్ చేయిస్తానని చెప్తాడు. అతనికి 1500 ఇచ్చి లోపలి వెళ్ళగానే మసాజ్ చేయడానికి ఒక అమ్మాయి రెడీగా ఉంటుంది. ఆ పక్కనే ఉన్న రెండు బెడ్‌రూమ్‌ల్లో ఖరీదైన మంచాలు ఉంటాయి. మసా జ్‌కు వచ్చే వారు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 2000 నుంచి రూ. 3000 వసూలు చేస్తూ ఆస్పత్రి ముసుగులో మసాజ్ సెంటర్ నడుపుతున్నారు. ఈ చాటుమాటు వ్యవహారాన్ని ప్రముఖ దమ్మున్న ఛానల్ బట్టబయలు చేసింది.

జైపాల్ రెడ్డికి సీఎం కుర్చీ?

"రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని మార్చేసి ఆ స్థానాన్ని జైపాల్ రెడ్డికిచ్చేస్తారు. బదులుగా కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర కేబినెట్ బెర్త్ కూడా ఖరారయ్యింది. " ఏపీ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారమిది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. సీనియర్ నేతలు ఈ విషయాల్ని ఖండిచండంలేదు అలాగని రూఢి చేయడమూ లేదు. లోపల్లోపల ఏదో జరుగుతోంది.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్విరాజ్ చవాన్ తో పాటు ఎపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుని, ఈ రెండు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహారాష్ట్రకు నారాయణ రాణేని, ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం. శుక్రవారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్‌లతో సోనియా గాంధీ చర్చలు జరిపారని, త్వరలోనే నిర్ణయం అమలౌతుందని తారా స్థాయిలో వార్తలు షికారు చేస్తున్నాయి.

చిరంజీవి ఫ్యాన్స్ రచ్చ రచ్చ

ఏలూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల  సమావేశంలో చిరంజీవి ఫ్యాన్స్  రచ్చ రచ్చ చేశారు. సమావేశం జరిగిన వేదికపై చిరంజీవి ఫ్లేక్సీ లేకపోవడంపై వారు గొడవ చేశారు. కన్నా లక్ష్మినారాయణ ఏర్పాటు చేసిన  కాంగ్రెసు పార్టీ కార్యకర్తల సమావేశంలో స్టేజిపై చిరంజీవి ఫోటో పెట్టలేదని చిరంజీవి ఫ్యాన్స్ సమావేశాన్ని అడ్డుకున్నారు. కన్నా లక్ష్మినారాయణ సర్దిచెప్పే ప్రయత్నం చేసిన వారు వినలేదు, ఈ సమయంలో కోటగిరి విద్యాధర రావు జోక్యం చేసుకుని చిరంజీవి అంటే మీకు ఎంత అభిమానం ఉందో మాకూ అంతే అభిమానం ఉందని కాంగ్రెసులో చిరంజీవిని గుర్తించే రోజు వస్తుందని  అన్నారు.  చిరంజీవి మీద అభిమానం ఉంటే గొడవ చేయడం మానుకోవాలని చెప్పారు.  ఆయన సరే వారు వినక పోవడంతో చిరంజీవి బొమ్మ తీసుకుని వచ్చి వేదికపై పెట్టారు. దీంతో చిరంజీవి అభిమానులు శాంతించారు.

కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫోటో

కేట్ మిడిల్టన్ బ్రిటిష్ యువరాజు విలియమ్స్‌ను కొన్ని రోజుల క్రితం పెళ్ళి చేసుకుంది. బ్రిటిష్ యువరాజు విలియమ్స్‌ను హాలిడే ట్రిప్‌లో తన భర్తతో కలిసి నగ్నంగా స్నానం చేసిన ఫోటోలను తీసి, ఆ ఫోటోలను ‘Closer' అనే మేగజైన్ ఇటీవల కవర్ పేజీపై ప్రచురించి సంచలన సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన బ్రిటన్ రాజు సదరు మేగజైన్‌పై లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కొన్ని రోజుల క్రితం యువరాజు విలియమ్స్ అతని తమ్ముడు అయిన హ్యారీ కొంత మంది అమ్మాయిలతో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ప్రచురించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.