జైపాల్ రెడ్డికి సీఎం కుర్చీ?

"రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని మార్చేసి ఆ స్థానాన్ని జైపాల్ రెడ్డికిచ్చేస్తారు. బదులుగా కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర కేబినెట్ బెర్త్ కూడా ఖరారయ్యింది. " ఏపీ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారమిది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. సీనియర్ నేతలు ఈ విషయాల్ని ఖండిచండంలేదు అలాగని రూఢి చేయడమూ లేదు. లోపల్లోపల ఏదో జరుగుతోంది.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్విరాజ్ చవాన్ తో పాటు ఎపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుని, ఈ రెండు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహారాష్ట్రకు నారాయణ రాణేని, ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం. శుక్రవారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్‌లతో సోనియా గాంధీ చర్చలు జరిపారని, త్వరలోనే నిర్ణయం అమలౌతుందని తారా స్థాయిలో వార్తలు షికారు చేస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.