ప్రత్యేకంగా పార్టీ వెదుక్కుంటున్న కేసిఆర్‌?

  ప్రత్యేకంగా పార్టీని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్న తరువాతే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు నిర్ణయానికి వచ్చారట. అందుకే ఆయన పార్టీని వెదుక్కునే పనిలో పడ్డారు. ఇప్పటి దాకా తెలంగాణా విషయంలో చర్చలతో కాలక్షేపం చేస్తూ వచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం, ప్రత్యేకించి అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనియా పెట్టిన షరుతు మాత్రం టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయటం. ఈ ఒక్క అంశం కేసిఆర్‌ను పెద్దగా ఆలోచింపజేస్తోంది. అసలు పార్టీ పెట్టిన తరువాతే కదా! తాను నాయకునిగా ఎదిగిందీ అన్న విషయం ఆయనలో ఆలోచనను రేకెత్తింది. విలీనం చేసిన తరువాత ఇచ్చిన మాట తప్పేసి తెలంగాణా ఇవ్వబోమంటే అన్న సందేహం ఆయన మెదడును తొలిచేస్తోంది. దీంతో పార్టీలోని ఇతర నాయకులను, కార్యకర్తలను కూడా వదలకుండా సలహాలు అడుగుతూనే ప్రత్యామ్నాయంగా ఏదైనా పార్టీని ఉంచుకోవటం మంచిదన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారు. దీంతో ఇప్పటిదాకా తన కుమార్తె ప్రారంభించిన తెలంగాణాజాగృతిని పార్టీ కింద మార్చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చినది మొదలు ఆమెను రంగంలోకి దింపేందుకు కేసిఆర్‌ ప్రయత్నాలు ప్రారంభించారట.     అయితే టిఆర్‌ఎస్‌తో కలిసి పని చేసిన పలు పార్టీలు ఉండగా కేసిఆర్‌ అంతగా ఆలోచించాల్సిన పనేమిటని ఇతర ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ పార్టీలన్నీ కేసిఆర్‌ మాట వినవు కాబట్టే ఆయన ఆలోచనలో పడ్డారని సన్నిహితులు విశదీకరిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటిదాకా ప్రత్యేక తెలంగాణా ఇవ్వటానికే ఇష్టపడని కాంగ్రెస్‌ దిగి వచ్చినందున విలీనానికి సిద్ధంగానే ఉన్నామని కేసిఆర్‌ తేల్చేయటం కిందస్థాయిలో మాత్రం కొంత నిరసనకు కారణమవుతోంది. ఒకవేళ మాట తప్పితే అన్న కిందిస్థాయి ఆలోచన తెలంగాణాలో పెద్ద చిచ్చును రగల్చవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ తెలంగాణా ఇవ్వటానికి సుముఖత వ్యక్తం చేసినా తెలంగాణా జెఎసి మాత్రం ఈ నెల 30న తెలంగాణామార్చ్‌ కార్యక్రమాన్ని చేపడుతోంది. కేసిఆర్‌ను ఎదిరించి తన ప్రాబల్యం నిరూపించుకునేందుకు జెఎసి ఛైర్మను ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సిద్ధపడ్డారు. అందుకే అసలు పార్టీ ప్రత్యామ్నాయం వెదుక్కుంటున్న కేసిఆర్‌కు ఆయన ఏ మాత్రం మద్దతు ప్రకటించలేదు సరికదా! కొత్తగా నిరసన కార్యక్రమాలకు అజెండా రూపొందిస్తున్నారు. దీంతో ఏ మాత్రం తేడా జరిగినా తమను తెలంగాణాలో నిలదీసే వారి సంఖ్య పెరుగుతుందని భావించే కేసిఆర్‌ తన కుమార్తెతో తెలంగాణాజాగృతిని రాజకీయపార్టీగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వేరే వాళ్లతో పెళ్ళి చేశారని లవర్స్ ఆత్మహత్య

  బెంగుళూరుకి చెందిన రమేష్, సౌమ్య ఇద్దరు 2008లో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని వల్ల పెద్దలకు చెప్పారు కాని వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. రమేష్, సౌమ్య ఇద్దరికీ వేరే వాళ్ళతో పెళ్ళి చేశారు. వేరేవాళ్లను పెళ్లి చేసుకున్నప్పటికీ విడిగా ఉండలేక బెంగళూర్ - హైదరాబాద్ రహదారిపై గల యెలహంకలోని కొండప్ప లేఅవుట్‌లో అద్దె గదిలో వారిద్దరు ఉరివేసుకుని మరణించారు. ప్రేమికులిద్దరు చామ్‌నగర్‌లోని కొల్లెగళ్‌లో ఉండేవారు. సౌమ్యకు మాజీ భర్త, ఏడాది వయస్సు గల కూతురు ఉన్నారు. రమేష్‌కు భార్య ఉంది. అతనికి జనవరిలో వివాహమైంది. అతని భార్య ఆరు నెలల గర్భవతి.వారు కొల్లెగళ్‌లోని వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు. తాము కలిసి జీవించలేకపోయామని, అయితే తమ శరీరాలను కలిపి అంత్యక్రియలు చేయాలని, తాము ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని వారు సూసైడ్ నోట్‌లో రాశారు.

జలదృశ్యం వద్దే బాపూజీ అంత్యక్రియలు

    స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్‌బాపూజీ అంత్యక్రియలు జలదృశ్యంలో చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.శనివారం ఉదయం సీఎంతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి జానారెడ్డి భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నెక్లస్ రోడ్డులో , హుస్సేన్ సాగర్ ఒడ్డున ఎలాంటి కట్టడాలు ఉండరాదని కోర్టు ఆదేశాల రీత్యా ,కొంత సందేహ పడింది. అయితే తెలంగాణ వాదులు, తెలంగాణ కాంగ్రెస్ నేతల కోరిక మేరకు చివరకు ప్రభుత్వం జలదృశ్యంలోనే నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. దీనితో తెలంగాణ వాదులు అక్కడ అంత్య క్రియల ఏర్పాట్లు చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమ నేపద్యంలో దీనిపై వివాదం ఏర్పడకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. మరోవైపు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి బాపూజీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఎన్నాళ్లో వేచిన హృదయం...

  యూపిఎ సర్కార్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్ర క్యాబినెట్‌ పునర్‌వ్వవస్థీకరణ జరిగే సూచనలు ఉన్నాయి. ముగ్గురు కొత్తమంత్రులను, కొందరు మంత్రుల శాఖలు మారవచ్చని తెలుస్తోంది. అయితే రాష్ట్రంనుండి మంత్రివర్గంలోకి ఒకరికి స్థానం లభించవచ్చునంటున్నారు. అది కూడా సురాజ్యంకోసంటూ ప్రజారాజ్యాన్ని ఏర్పాటుచేసి తర్వాతకాలంలో కాంగ్రెస్‌లో విలీనం చేసి అందులో ఇప్పటివరకు ప్రముఖనేతగా మారి, గత మంత్రివర్గ ఏర్పాట్లలో మంత్రిపదవి వస్తుందని లోలోపల ఆశించినా.. నేడు ఎన్నాళ్ళగానో ఎదురుచూపులు చూస్తున్న చిరంజీవికి ఆ మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని భావిస్తున్నారు. ఏమో.. అదే జరిగితే.. ఎన్నాళ్ళో వేచిన హృదయం.. ఈనాడే నిజమైందని సంబరపడతారు ఆయన అభిమానులు!

కృష్ణాజలాలు కలుషితం?

ఒకవైపు రాయలసీమ, మరోవైపు తెలంగాణా, ఇంకోవైపు కోస్తాంధ్రాలకు కృష్ణాజలమే ఆధారం. కొత్తగా హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు కూడా ఈ జలమే తీరుస్తోంది. అటువంటి కృష్ణానదీ జలాలు కలుషితమయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రంగుమారి (లేతాకుపచ్చ) కనబడుతోంది. దీంతో యావత్తు రాష్ట్రం కలవరపడుతోంది. కారణం పరిశీలిస్తే పారిశ్రామిక వ్యర్థాలు కృష్ణాజలాల్లోకి వదిలారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కాలుష్య కారకులను గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. నూనె వంటి జిడ్డు కలిగిన వ్యర్థాలు కలవటం వల్లే కృష్ణాజలం దుర్గాంధాన్ని కూడా వెదజల్లుతోందని అర్థమవుతోంది. ఈ వార్త తెలిసి అన్ని ప్రాంతాల్లోనూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటిదాకా తమ తాగునీటి అవసరాలు తీరుస్తున్న కృష్ణాజలాలను కలుషితం చేసిన వారిని వదిలిపెట్టొద్దని పలు ప్రాంతాల నుంచి అధికారులకు విన్నపాలు వస్తున్నాయి. తమ వాటాల కోసం వాదులాడుకునే సమయాన్ని అనుకూలంగా మలుచుకుని కొందరు పారిశ్రామికవేత్తలు జలాలను కలుషితం చేశారని ఆందోళనలూ వ్యక్తం అయ్యాయి. నిత్యం పర్యాటకుల సందడితో రద్దీగా ఉండే శ్రీశైలంలో ఈ కాలుష్యజలం చూసేందుకు, కారకులను పసిగట్టేందుకు కర్నూలు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి కొందరు పరిశోధకులు కూడా రంగంలోకి దిగారు. రోజుల వ్యవధిలో జలం కలుషితమైందన్న సమాచారం తెలుసుకున్న వీరు తమ దగ్గర ఉన్న పరికరాలతో బయలుదేరారు. ఒకవైపు సాగుకు కూడా కృష్ణాజలమే పలుజిల్లాలకు ఆధారం. అందువల్ల రైతులు కూడా ఈ కాలుష్యానికి కారణమైన పారిశ్రామికవేత్తలపై గుర్రుగా ఉన్నారు. ఈ కాలుష్యానికి కారకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజావాజ్యం వేసేందుకు కొందరు న్యాయవాదులు సిద్ధమయ్యారు.       శ్రీశైలంలో వాస్తవపరిస్థితులను చిత్రీకరించి హైకోర్టు ముందు వాటిని  ఉంచి సరైన చర్యలు కోరాలని న్యాయవాదులు ఉత్సుకతతో ఉన్నారు. అలానే ప్రకాశం, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మీడియా కూడా ఈ కాలుష్యకారణాలు అన్వేషించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టులో కనిపిస్తున్న కాలుష్యం ఆధారంగా దగ్గరలో ఉన్న పరిశ్రమల వివరాలను మీడియా ప్రతినిధులు సేకరిస్తున్నారు. డ్యామ్‌లోకి ఈ వ్యర్థాలు వదిలే సాహసం చేసినందుకు దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కథనాలు తయారవుతున్నాయి. ఎగువ పరివాహక ప్రాంతంలోనే ఈ కాలుష్యాన్ని విడుదల చేసిన పరిశ్రమ ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. డ్యాంక్రస్టర్‌గేట్లు కుడి, ఎడమ గట్ల వెంబడి ఈ ఆయిల్‌ వంటి పదార్థం ఆనవాళ్లు అధికారులు గమనించారు. ఈ వ్యర్థం క్రమేణా తెట్టులా తేలుతోందనీ గుర్తించారు. దీని వల్ల నీటిదుర్గంధం సందర్శకుల ముక్కుపుటలు అదిరేలా వ్యాపిస్తోంది. ఏమైనా కృష్ణావంటి జీవనది ఉనికిని దెబ్బతీసే ఈ కాలుష్యంపై అన్ని ప్రాంతాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కారణమైన పరిశ్రమల విషయం రోజుల్లోనే గుర్తించాలని పరివాహకప్రాంతవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలుష్యకారకమైన ఆ పరిశ్రమల లైసెన్సులు కూడా రద్దు చేసి భవిష్యత్తులో ఇటువంటి దర్భురపరిస్థితి ఎదురవకుండా చూడాలని కోరుతున్నారు.

బాబే లక్ష్యంగా చిరు మెగారోల్‌?

తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పాదయాత్రలు, టూర్‌ ఎదుర్కోవడమే లక్ష్యంగా చేసుకుని రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి మెగారోల్‌ పోషించనున్నారు. రాజకీయతెరపై తన ప్రత్యర్థిగా చంద్రబాబును చిరంజీవి ఎంచుకున్నారు. పీఆర్పీ(ప్రజారాజ్యంపార్టీ) వ్యవస్థాపకునిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుపై తనదైన శైలిలో వాగ్భాణాలు వదిలిన చిరు తన పార్టీని విలీనం చేశాక కూడా కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఆ బాధ్యత భుజాన్న మోస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీకి తానేమి చేశానని ప్రశ్నించకుండా చిరంజీవి జాగ్రత్తపడబోతున్నారు. చంద్రబాబు పర్యటన డైరీ(వివరాలు) సేకరించి దానికి కొంచెం ముందస్తుగా ఆరోగ్యయాత్రను చేపడుతున్నారు.     తన అభిమాన సంఘాలను, తన సామాజిక వర్గమైన కాపులను కలుపుకుపోయేందుకు ఈ యాత్రను ఉపయోగించుకోవాలని చిరంజీవి తహతహలాడుతున్నారు. తన సామాజిక నేతలే అభిమానసంఘాల్లో కీలకభూమిక నిర్వహిస్తున్నందున ఈ యాత్ర ద్వారా వారిలో ఉత్సాహం నింపాలని చిరు ప్రయత్నం. ఇప్పటికే తన సామాజికవర్గ నేతలు చిరంజీవి ఏమి పలకరించటం లేదని విసుగును వ్యక్తం చేస్తున్నారు. అలానే కాంగ్రెస్‌ పార్టీలో విలీనాన్నీ వ్యతిరేకించి మౌనంగా ఉన్నారు. అందుకని ఈ యాత్ర నిర్వహించి వారందరినీ కలుపుకుంటూ పోతే తన బలం పెరుగుతుందని సన్నిహితుల సూచనలను చిరు పాటిస్తున్నారు. ఇటీవల కుటుంబపరంగా కూడా సామాజికవర్గానికి చిరు దూరమయ్యారు. తన కుమారుడు రామ్‌చరణ్‌తేజకు అపోలో అధినేత కుమార్తెను ఇచ్చినందుకు కొందరు కాపులు వ్యతిరేకించటం చిరంజీవి గమనించారు. దీంతో సామాజికవర్గానికి దగ్గరగా వెళ్లి ఆరోగ్యయాత్ర పేరుతో అభిమానులను కూడగట్టుకోవాలని చిరంజీవి ప్రణాళిక వేసుకున్నారు.    అందుకే గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి యాత్రలో మెగామెడికల్‌క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపుల ద్వారా ఒకవైపు ప్రజలకు, మరోవైపు అభిమానులకు, ఇంకోవైపు బ్లడ్‌బ్యాంకు నిర్వాహకస్థాయిలో ఉన్న నేతలకు దగ్గర అయ్యేందుకు వ్యూహరచన చేశారు. అంతేకాకుండా చిరంజీవి తన యాత్రలో బస కూడా సామాజికవర్గనేతల ఇళ్లు ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావాలని చిరంజీవి భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో విషజ్వరాలు ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతాలను కూడా ఎంపిక చేసుకునేందుకు చిరంజీవి కసరత్తులు చేస్తున్నారు. ఈ యాత్రలో ముందస్తుగా కాంగ్రెస్‌ అందించే సామాజికపథకాలను కూడా ప్రచారం చేస్తారు. అంతేకాకుండా చంద్రబాబు వల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఉండదన్న భావన తన మెడికల్‌ క్యాంపు  పరిసర ప్రాంతాల్లో కలిగించేందుకు చిరు కొంత శిక్షణ సన్నిహితుల నుంచి పొందారని సమాచారం. ఆరోగ్యం, అభివృద్థి అనే రెండు నినాదాలు కాంగ్రెస్‌కు రెండు కళ్లు అని చెబుతూనే చంద్రబాబు పెద్ద మోసగాడని చిరంజీవి తన ఆరోగ్యయాత్రలో చాటనున్నారు.   చిరంజీవి రాజకీయతెరపై ఈ తరహా ప్రయత్నం చేపట్టడమే తొలిసారి అని పీఆర్పీ నేతలు, కాంగ్రెస్‌ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వపరంగా కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. పర్యటనలో అభిమానులు స్పందించకపోతే అధికారుల సహకారం పొందేందుకు సైతం చిరంజీవి వెనుకాడరని సన్నిహితులు అంటున్నారు. ఏమైనా చిరంజీవి కాంగ్రెస్‌ పెద్దగా పోషించే ఈ రోల్‌ సక్సెస్‌పై ఆయన రాజీకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. చంద్రబాబును ఎండగట్టడంలో విజయవంతమైనా, మెగామెడికల్‌క్యాంపుల్లోనూ, అభిమానులను చేరదీయటంలోనూ సఫలీకృతమైనా కేంద్రమంత్రి పదవి ఖాయమని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఏమీ చేయకుండానే పదవి ఆశించే బదులు ఇంత చేశామనిపించుకునేందుకు చిరంజీవి చేస్తున్న కృషికి అభిమానుల నుంచి మాత్రం బెస్టాఫ్‌లక్‌ అని మెసేజ్‌లు వస్తున్నాయట. ఈ యాత్ర చిరు భవిష్యత్తును మారిస్తే వారి మెసేజ్‌లు నిజంగానే బెస్టాఫ్‌లక్‌ అవ్వొచ్చు.

ఐసీసీ ట్వంటీ-20, జింబాబ్వే అవుట్

ప్రపంచ కప్‌లోగ్రూప్-సిలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రి కా జింబాబ్వేను ఓ ఆటాడుకుంది. 32.4 ఓవర్లలోనే ముగిసిన ఈ మ్యాచ్ కేవలం సఫారీల షోగా సాగింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన డివిల్లీర్స్ సేన 10 వికెట్లతో సునాయాసంగా వి జయం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో కొన్ని జట్లు ఇంకా బ రిలోకి దిగకముందే.. వరుసగా రెండో ఓటమి మూటగట్టుకున్న జింబాబ్వే ఇంటిదారి పట్టింది. టోర్నీలో నిష్క్రమించిన తొలి జ ట్టు ఇదే. 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మరో 44 బంతులు మిగిలుండగానే, వికెట్ కూడా నష్టపోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. రిచర్డ్ లెవీ (43 బంతుల్లో 6 సిక్సర్లతో 50 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు ఆమ్లా (33 బంతుల్లో 3 ఫో ర్లతో 32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. కలిస్ (4/15), మోర్నీ మోర్కెల్ (2/16) ధాటికి పూర్తి ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 93 పరుగులే చేయగలిగింది. జట్టులో ఎర్విన్ (37) టాప్ స్కోరర్. కాగా ఎర్విన్, మత్సికెన్యేరి (11) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. స్టెయిన్ (1/9) పొదుపుగా బౌలింగ్ చేశాడు. కలిస్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

ఢిల్లీలో గవర్నర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో తీరికలేని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఇవాళ ప్రధానమంత్రితో భేటీ కానున్నారు. అలాగే హోంమంత్రి షిండేను కలిసి నివేదక సమర్పించనున్నారు. శాంతి భద్రతలపైనే నరసింహన్‌ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. టి-మార్చ్‌ వాయిదా పడాలనే తాను కోరుకుంటున్నానని అదంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని ఆజాద్‌తో భేటీ తర్వాత గవర్నర్‌ వెల్లడించారు. నిన్న నరసింహన్ సోనియాతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై జనాభిప్రాయాన్ని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని ఆయన వివరించినట్టు తెలుస్తోంది. నెలాఖర్లో వినాయక నిమజ్జనం, అక్టోబర్‌ ఫస్టు నుంచి కాప్‌ సదస్సు ఉన్న నేపథ్యంలో 30న తలపెట్టిన టి-మార్చ్‌పైనా నివేదిక సమర్పించారని సమాచారం.

యూపిఏకు ములాయం మద్దతు

  ములాయం సింగ్ యాదవ్ యూపిఏ ప్రభుత్వాన్ని ఆపద సమయంలో ఆదుకున్నారు. యూపీఏ సర్కాకు బయట నుంచే మద్దతు ఇస్తామని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. అయితే డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. మతతత్వ శక్తులు అధికారంలో రాకూడదనే యూపీఏకు మద్దతునిస్తున్నామని ఆయన తెలిపారు. ఎఫ్‌డిఐ, పెట్రో పెంపు వంటి కేంద్రం నిర్ణయాలను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు టిఎంసి మంత్రులు రాజీనామా చేయనున్నారు. మమత బయటకు వెళ్లిపోవడంతో సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి కష్టాల్లో పడింది. అయితే నిన్నటి వరకు బయటి నుండి యూపిఏకి మద్దతిస్తూ ఎటూ తేల్చని ములాయం ఈ రోజు కేంద్రానికి మద్దతు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

కొండా లక్ష్మణ్ బాపూజీకి శాసనసభ నివాళి

  రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్ బాపూజీ మృతికి నేతలు సంతాపం తెలిపారు. సభ్యులంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించి బాపూజీకి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ(96) ఈ రోజు ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొండ లక్ష్మణ్ బాపూజీ హైదరాబాద్ లోని తన స్వగృహంలోఈ రోజు మృతి చెందారు. 27 సెప్టెంబర్1915 జన్మించిన బాపూజీ సొంత ఊరు ఆదిలాబాద్ జిల్లా వాంకిడి. 1969లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమంలో పాల్గోన్నారు. తెలంగాణా కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలిమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ. 2009 తెలంగాణ ఉద్యమంలో కుడా బాపూజీ కీలక పాత్ర పోషించారు. ఆయనకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పడి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇంటియా ఉద్యమంలో బాపూజీ చురుకుగా పాల్గొన్నారు. బాపూజీ మృతి పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు, మాలమహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు బాబూజీ మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. రెండు రోజుల కిత్రం ఖైరతాబాద్ మహా గణపతికి నల్గొండ జిల్లాలో తయారు చేసిన 72 అడుగులు కండువాను బాపూజీ చేతుల మీదుగా సమర్పించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ విగ్రహం పై లోక్ సభ స్పీకర్ కు నాయుడు లేఖ

  పార్లమెంట్ ఆవరణలో దివంగత తెలుగుదేశం అధినేత ఎన్ టి రామారావు విగ్రహాన్ని స్థాపించడానికి కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ కు లేఖ రాశారు. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహన్ని డొనేట్ చేసేందుకు కుటుంబ సభ్యుల్లో పది మంది ఆమోదం తెలిపారని, పురందేశ్వరి కావాలనే రాజకీయం చేస్తున్నారని, ఈ వివాదాన్ని ఇంతటితో ఆపివేసి విగ్రహ ప్రతిష్టకు తమకు అనుమతి ఇవ్వాలన్నారు. సంబంధిత లేఖను ఎంపీ నామా నాగేశ్వరరావు ద్వారా 7.05.2010 తేదిన లోక్ సభ డైరెక్టర్ సుందర్ సింగ్ కు అందజేశామని చెప్పారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ఎన్ టి రామారావు అంటే తమకు గౌరవం ఉందని, స్పీకర్ బాలయోగి టైంలోనే విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశామని వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందున వల్లే మేమే విగ్రహాలు డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. విగ్రహాలు డొనేట్ పై 2006 లో తమ పార్టీ ఎంపీ ఎర్రన్నాయుడుతో లోక్ సభ డిప్యూటి సెక్రెటరికి లేఖ పంపించామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాల ప్రతిష్ఠకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని, ఇప్పుడు పార్లమెంట్ ఆవరణలో విగ్రహాల ప్రతిష్ఠకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వాలని కోరారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ కన్నుమూత

  స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ(96) ఈ రోజు ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొండ లక్ష్మణ్ బాపూజీ హైదరాబాద్ లోని తన స్వగృహంలోఈ రోజు మృతి చెందారు. 27 సెప్టెంబర్1915 జన్మించిన బాపూజీ సొంత ఊరు ఆదిలాబాద్ జిల్లా వాంకిడి. 1969లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమంలో పాల్గోన్నారు. తెలంగాణా కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలిమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ. 2009 తెలంగాణ ఉద్యమంలో కుడా బాపూజీ కీలక పాత్ర పోషించారు. ఆయనకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పడి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇంటియా ఉద్యమంలో బాపూజీ చురుకుగా పాల్గొన్నారు. బాపూజీ మృతి పట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు, మాలమహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు బాబూజీ మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. రెండు రోజుల కిత్రం ఖైరతాబాద్ మహా గణపతికి నల్గొండ జిల్లాలో తయారు చేసిన 72 అడుగులు కండువాను బాపూజీ చేతుల మీదుగా సమర్పించిన విషయం తెలిసిందే.

యుపిఎకి ములాయం వార్నింగ్

యుపిఎలో సంక్షోభం ముదురుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యుపిఎ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ బాటలోనే ఆయన నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్‌డిఐలపై యుపిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ఆయన కాంగ్రెసు నాయకత్వాన్ని హెచ్చరించారు. తాజాగా ములాయం యుపిఎ ప్రభుత్వానికి దూరం జరిగి, తృతీయ కూటమికి పునాదులు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. యుపిఎకు ఇప్పటి వరకు ఎస్పీ వెలుపలి నుంచి మద్దతు ఇస్తూ వస్తోంది. ఎస్పీకి 22 మంది లోకసభ సభ్యులున్నారు. వీరి మద్దతు యుపిఎకు కీలకం.     అయితే మద్దతు ఉపసంహరించుకునే విషయంపై మమతా బెనర్జీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎస్పీ, తెలుగుదేశం, వామపక్షాలు గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యుపిఎ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తాయి. ఢిల్లీ ర్యాలీలో పాల్గొనడానికి ములాయం సింగ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. ఈ ర్యాలీలో ములాయం సింగ్, వామపక్షాల నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి, ఎబి బర్దన్‌లతో పాటు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

వెనక్కి తగ్గేది లేదంటున్న మమతా

మంగళవారం యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. నిర్ణయం తీసేసుకున్నాం, ఇక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. యూపిఏ తీసుకున్న విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. రాజీనామాపై తమ పార్టీ కేంద్రమంత్రులు వెనక్కి తగ్గరన్నారు. అదే సమయంలో కాంగ్రెసు ముందు ఆమె తన డిమాండ్లు మరోసారి బహిరంగంగా ఉంచారు. డీజిల్ ధరను రూ.3 తగ్గించాలని, గ్యాస్ సబ్సిడీని 24 సిలిండర్లకు పెంచాలని, ఎఫ్‌డిఐల విషయంలో మాత్రం తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. కాంగ్రెసు నేతలు తమతో చర్చలు జరపలేదన్నారు. కాంగ్రెసు దుష్ప్రచారం వల్ల అయోమయం ఏర్పడుతోందన్నారు.

సోనియాతో నరసింహన్ మంతనాలు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ గురువారం సోనియా గాంధీని కలిశారు. వీరిద్దరి మధ్య రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగి౦ది. తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం . గత రాత్రి గవర్నర్ నరసింహన్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. కాగా జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. అధికారిక కార్యక్రమాలపై సీఎం ఢిల్లీ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వివరించాయి. తెలంగాణ సహా, రాష్ట్ర నాయకత్వ మార్పుపై ఏఐసీసీ అగ్రనాయకత్వం ఇటీవల లోతుగా చర్చలు సాగించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వామపక్షాలు భారత్‌బంద్ పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న పలువురు కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేలు విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్టాయి. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి.   మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ధర్నా చేపట్టాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోలన కారులు నిరసన తెలపడంటో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం మద్దిలపాలెంలో విపక్షాలు రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేపై కార్యకర్తలు కబడ్డీ ఆట ఆడుతూ నిరసన తెలిపారు. విజయనగరం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.

టి 20 ప్రపంచ కప్‌లో టీమిండియా బోణి

టి-20 ప్రపంచ కప్‌లో టీమిండియా అతికష్టమ్మీద బోణి చేసింది. అదీ పసికూన అఫ్ఘానిస్థాన్‌పై. బుధవారం జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో ధోనీసేన 23 పరుగులతో పోరాడిగెలిచింది. 160 పరుగుల లక్ష్యంతో బ రిలోకి దిగిన అఫ్ఘాన్లు 19.3 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటయ్యారు. నబీ 31, సాదిక్ 26, నవ్రోజ్ 22, షాజద్ 18 పరుగులు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన పూర్తి ఓవర్లలో ఐదు వికెట్లకు 159 పరుగులు సాధించింది. ఓపెనింగ్ జోడీ గంభీర్ (10), సెహ్వాగ్ (8) మరోసారి విఫలమగా, సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) మెరుపులు మెరిపించాడు. రైనా (33 బంతుల్లో 6 ఫోర్లతో 38) రాణించడంతో పాటు చివర్లో ధోనీ (9 బం తుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 18 నాటౌట్) దూకుడు ఆడాడు. యువరాజ్ 18 పరుగులు చేశాడు. అఫ్ఘాన్ బౌలర్ షాపూర్ రెండు వికెట్లు తీశాడు. కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.