టిడిపికిప్పుడు బంద్ పేరు చెబితే పండగే!

దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎఫ్‌డిఐ అనుమతులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎన్‌డిఎ కూటమి సెప్టెంబర్‌ 20న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆరోజున దేశ వ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు ... పికెటింగులు నిర్వహించాలని తీర్మానించింది. పేదప్రజలపై భారం మోపే ఈ ప్రజావ్యతిరేకవిధానాలను ఎండగట్టాలని  ఎన్‌డిఎ భాగ స్వామ్య పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలనూ, నిత్యవసరవస్తువుల పెరుగుదలనూ, ప్రభుత్వాస్పత్రుల్లో శిశుమరణాలతో బాటు ఫీజురీఎంబర్స్‌మెంట్స్‌ అంశాలను ప్రజల్లోకి మరింతగా ప్రచారం చెయ్యాలని నిర్ణయించినట్లు దేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాల వారీగా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లుగా కూడా వారు చెబ్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.