English | Telugu

Karthika Deepam2 : దీపకి విడాకులు..‌‌.అనసూయ సాక్ష్యం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -121 లో....నాకు విడాకులు కావాలని దీప కోర్టులో అడుగుతుంది. దాంతో విడాకులు కావాలంటున్నావ్ కారణం ఉందా అని లాయర్ అనగానే.. ఉంది.. నరసింహా రెండో పెళ్లి చేసుకున్నాడు.. అక్కడ అతని పక్కన కూర్చొని ఉందని దీప చెప్తుంది. ఆ తర్వాత జ్యోతి శోభని విచారిస్తానని బోనులోకి పిలుస్తుంది. నువ్వు నరసింహ రెండో భార్యవేనా అని అడుగగా.. ఎవరు చెప్పారు పక్కన కూర్చొని ఉంటే పెళ్ళాం అయిపోతానా.. మా అమ్మకి తను తెలుసు.. నాక్కూడా తెలుసు.. నాకు ఫ్రెండ్ అంతే అని శోభ అనగానే.. అందరు షాక్ అవుతారు. తను అబద్ధం చెప్తుందని దీప అంటుంది. ఆ తర్వాత మా అత్తయ్య గారు చెప్తారని దీప అంటుంది. కోర్ట్ మధ్యహ్నానానికి వాయిదా పడుతుంది.

వీడియో చూడండి...చెప్పి మోసం చేసాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -173 లో.... సీతాకాంత్ దగ్గరకి రామలక్ష్మి వస్తుంది. ఇంకా నిద్రపోతున్నారా అని తన దగ్గర వరకు వెళ్లి పక్కన కూర్చుంటుంది. ప్రేమగా నా మనసుని దొంగిలించి దొరలా నిద్రపోతున్నావా.. అభిమానం ఉందని మాత్రమే చెప్తున్నారు.. ప్రేమ ఉందని చెప్పట్లేదు బాగా అలసిపోయినట్లున్నారు పడుకోండి అని సీతాకాంత్ ని చూస్తూ రామలక్ష్మి అని వెళ్లిపోతుంటే.. తన చీర కొంగుపట్టుకొని సీతాకాంత్ లాగినట్లు అనిపిస్తుంది. వెంటనే మళ్ళీ వెనకాలకి వచ్చి సీతాకాంత్ మొహంలో మొహం పెడుతుంది. అప్పుడే సీతాకాంత్ నిద్ర లేచి నాతో ఏదైనా చెప్పాలా అని అంటాడు.

జాను లైఫ్ స్టోరీ చూసి ...శేఖర్ మాస్టర్  ఎమోషనల్ 

బుల్లితెరపై సినిమాలు, సీరియల్స్‌తో పాటు కొన్ని షోలు కూడా అలరిస్తున్నాయి. వాటిల్లో క్యాష్, బిగ్ బాస్, లతో పాటు ఢీ డ్యాన్స్ షో ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు కొరియోగ్రాఫర్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే కంటెస్టెంట్లుగా వచ్చి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో టీవీ ప్రేక్షకులను పలకరిస్తోంది. సీజన్ మారినప్పుడల్లా కొత్త వారిని పరిచయం చేస్తూ కొత్తగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకొస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్-2 నడుస్తోంది. దీనికి నందు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇక కంటెస్టెంట్లులకు టీమ్ లీడర్లుగా ఆది, శ్రీసత్య వ్యవహరిస్తున్నారు. జడ్జులుగా నటి హన్సిక, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్ షోకు ఫిదా అయిపోయాడు శేఖర్ మాస్టర్. ఆమె జాను లైరి. తను ఆడితే అలానే చూడాలనిపచిందని శేఖర్ మాస్టర్ చెప్పగా తోటి డ్యాన్సర్స్ సైతం జాను లైరి డ్యాన్స్ కి ఫిధా అయ్యారు.