English | Telugu

వీడియో చూడండి...చెప్పి మోసం చేసాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -173 లో.... సీతాకాంత్ దగ్గరకి రామలక్ష్మి వస్తుంది. ఇంకా నిద్రపోతున్నారా అని తన దగ్గర వరకు వెళ్లి పక్కన కూర్చుంటుంది. ప్రేమగా నా మనసుని దొంగిలించి దొరలా నిద్రపోతున్నావా.. అభిమానం ఉందని మాత్రమే చెప్తున్నారు.. ప్రేమ ఉందని చెప్పట్లేదు బాగా అలసిపోయినట్లున్నారు పడుకోండి అని సీతాకాంత్ ని చూస్తూ రామలక్ష్మి అని వెళ్లిపోతుంటే.. తన చీర కొంగుపట్టుకొని సీతాకాంత్ లాగినట్లు అనిపిస్తుంది. వెంటనే మళ్ళీ వెనకాలకి వచ్చి సీతాకాంత్ మొహంలో మొహం పెడుతుంది. అప్పుడే సీతాకాంత్ నిద్ర లేచి నాతో ఏదైనా చెప్పాలా అని అంటాడు.

గుడ్ మార్నింగ్ చెప్దామని వచ్చానని కవర్ చేస్తుంది.. అలా చెప్పకపోతే మీ కోసం వచ్చానని చెప్పొచ్చు కదా అని సీతాకాంత్ అనుకుంటాడు నన్ను అడగకపోతే మీ ప్రేమ విషయం మీరే చెప్పొచ్చు కదా అని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు సేవ్ చేసిన అమ్మాయి నందిని.. తన దగ్గరకి ఒకతను వచ్చి సారీ మేడమ్ కంపెనీ మీకు ఇస్తాను అని చెప్పి మోసం చేసాను.. మీకు ఎదరుతిరిగి భయపడుతున్నా అని అతను రిక్వెస్ట్ చేస్తుంటే.. నాకు నమ్మకద్రోహం చేస్తే నేను వదలనని నందిని అంటుంది. ఆ తర్వాత మనం ఇండియాకి వచ్చి బుద్ది చెప్పాలి అనుకున్నది ఈ చోప్రాకీ.. ఇక మన నెక్స్ట్ బిజినెస్ ఏంటి మేడమ్ అంటూ నందిని పిఏ నందినితో అంటుంది. ఆ తర్వాత బోర్డు మెంబర్ ని సందీప్ ఇంటికి పిలుస్తాడు. నేనే చైర్మన్ కావాలి సపోర్ట్ చెయ్యాలనగానే.. లేదు మీ అన్నయ్య నిర్దోషి అని ఋజువు అయింది కదా అని అతను అంటాడు.. అప్పుడే శ్రీలత వచ్చి మచ్చ అయితే పడింది కదా.. మీరు సందీప్ కీ సపోర్ట్ చేస్తే మీ వాటా మీకు అందుతుందని శ్రీలత అంటుంది దాంతో బోర్డు మెంబర్ సరే అంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కీ బయలుదేర్తాడు. షేర్ మార్కెట్ లో షేర్స్ అన్ని పడిపోయాయంట బోర్డు మెంబెర్ మీటింగ్ అరెంజ్ చేశారు వెళ్తున్నామని సీతాకాంత్ అంటాడు. నేను వస్తానని రామలక్ష్మి అనగా.. వద్దని సీతాకాంత్ వెళ్తాడు. మీటింగ్ జరుగుతుంది. అందులో అందరూ సందీప్ గారు చైర్మన్ ఉంటేనే బాగుంటుందని చెప్తారు. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. అవసరం లేదు పక్క వాళ్లు పెట్టె ప్రలోభాలకి తీసుకొని నిర్ణయం తప్పు అవుతుందని రామలక్ష్మి అనగానే.. కంపెనీని పైకి తీసుకొని వచ్చే నిర్ణయం తప్పు ఎలా అవుతుందని బోర్డు మెంబర్ అంటాడు. అయితే ఒక వీడియో చూడండి అని రామలక్ష్మి అంటుంది. తరువాయి భాగంలో నన్ను కాదని కంపెనీ కాపాడుదామని చూస్తున్నావా అని శ్రీలత అనగానే.. నేను కంపెనీని మా అయనని కాపాడుతానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇంత సడెన్ గా నిర్ణయం ఎలా తీసుకుంటారు.. దీని వెనకాల ఎవరో ఉన్నారని సీతాకాంత్ అనగానే.. ఉన్నారు మీ అమ్మ అని రామలక్ష్మి అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.