సీక్రెట్ లవ్కు సైలెంట్గా బ్రేకప్.. ధనుష్, మృణాల్ షాకింగ్ డెసిషన్?
సినీ రంగంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వార్తలు రావడం సర్వసాధారణం. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్లోనూ ఒక షాకింగ్ గాసిప్ తీవ్ర కలకలం రేపుతోంది. వైవిధ్యమైన నటనతో మెప్పించే స్టార్ హీరో ధనుష్, అందాల భామ మృణాల్ ఠాకూర్ మధ్య నడుస్తోందని ప్రచారం జరిగిన ప్రేమాయణం ఇప్పుడు ముగిసిందంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ఫిలిం నగర్ సర్కిల్స్లో గట్టిగా వినిపించిన ఊహాగానాలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ధనుష్, మృణాల్ తమ బంధానికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యారట. ఎవరి కెరీర్పై వారు దృష్టి పెట్టేందుకు పరస్పర అంగీకారంతోనే ఈ క్రేజీ జంట సైలెంట్గా విడిపోయినట్లు ట్రెండ్ అవుతున్న వార్తల సారాంశం. అయితే అసలు వీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు, అప్పుడే విడిపోవడానికి దారితీసిన కారణాలు ఏంటనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉన్నాయి. ఈ విడిపోవడం వెనుక ఉన్న అసలు కారణం తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, ఈ ప్రచారంపై అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. గతంలో మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ఈవెంట్లో ధనుష్ సందడి చేయడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు తారలు పలుమార్లు కలిసి కనిపించడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇటీవల వీరిద్దరి పెళ్లి దుస్తుల ఏఐ ఫొటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
Jun 20, 2026 8:01PM
'ది ప్యారడైజ్' మూవీకి ఓటీటీ టెన్షన్.. నాని, శ్రీకాంత్ ఓదెలపై నెట్ఫ్లిక్స్ ఒత్తిడి!
న్యాచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise). బ్లాక్బస్టర్ సినిమా 'దసరా' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ కావడంతో టాలీవుడ్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్కు ఒక ఊహించని తలనొప్పి వచ్చి పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, మరోవైపు డిజిటల్ పార్ట్నర్ అయిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) నుంచి రిలీజ్ డేట్ కోసం విపరీతమైన ఒత్తిడి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ పరిస్థితితో అటు హీరో నాని, ఇటు నిర్మాత తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. నిజానికి, ఈ సినిమా షూటింగ్ను మొదట మార్చి 27న విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. కానీ, క్వాలిటీ విషయంలో రాజీపడని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరికొంత సమయం కావాలని కోరడంతో మేకర్స్ ఆగస్టు 21కి రిలీజ్ డేట్ను మార్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 21 నాటికి కూడా సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం అసాధ్యమని తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా దాదాపు 60 రోజుల షూటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఈ 60 రోజుల టాకీ, యాక్షన్ పార్ట్ పూర్తయిన తర్వాతే మొత్తం సినిమాను ఎడిటింగ్ టేబుల్పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆపై భారీ ఎత్తున పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలి. ఈ భారీ ఆలస్యం కారణంగా మేకర్స్ అనధికారికంగా ఆగస్టు 21 రిలీజ్ డేట్ను కూడా వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు డిసెంబర్ నెలను టార్గెట్గా పెట్టుకుని వర్క్ ప్లాన్ చేసుకుంటుండగా, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ మాత్రం దీనికి అంగీకరించడం లేదని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం ముందుగా అనుకున్న విండోలోనే అంటే సెప్టెంబర్ నాటికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ అంతకంటే ఆలస్యమైతే ఓటీటీ రైట్స్ కోసం కుదుర్చుకున్న డీల్ ప్రైస్ను భారీగా తగ్గించాల్సి ఉంటుందని నెట్ఫ్లిక్స్ హెచ్చరించినట్లు సమాచారం. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో, ఓటీటీ రేట్ తగ్గితే నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆలస్యం కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఓటీటీ రైట్స్ అమౌంట్ తగ్గితే భరించడం కష్టం. గతంలో 'పెద్ది' సినిమా మేకర్స్ కూడా రీషూట్ల కోసం సమయం కావాలనుకున్నా, ఓటీటీ రైట్స్ ప్రెజర్ మరియు బడ్జెట్ ఇష్యూస్ వల్ల జూన్ 4వ తేదీనే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 'ది ప్యారడైజ్' కూడా అదే తరహా సమస్యను ఎదుర్కొంటోంది. అందుకే కనీసం దసరా పండుగ కానుకగా అయినా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి సినిమాను సిద్ధం చేయాలని నిర్మాత దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఓదెల ఈ డెడ్లైన్ను ఎలా అందుకుంటారో చూడాలి.
Jun 18, 2026 5:15PM
టాలీవుడ్లో ఊహించని ట్విస్ట్.. మారిన చిరంజీవి, వెంకటేష్ సినిమాల రిలీజ్ ప్లాన్స్!
టాలీవుడ్ లో ఎప్పుడు ఏ క్షణంలో సమీకరణాలు మారిపోతాయో ఊహించడం చాలా కష్టం. అగ్ర హీరోల ప్రాజెక్టుల లైనప్, వాటి షూటింగ్ వేగం ఆధారంగా రిలీజ్ డేట్స్ లో ఊహించని మార్పులు చోటుచేసుకోవడం ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెద్ద ప్రాజెక్టుల కంటే ముందే, ఈ స్టార్ హీరోలు లైన్ లో పెట్టిన ఇతర దర్శకుల సినిమాలు థియేటర్లలోలోకి వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. ఈ పరిణామాలు మెగా ఫ్యాన్స్ తో పాటు విక్టరీ వెంకటేష్ అభిమానుల్లో కూడా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రాజెక్టుల విషయానికి వస్తే, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్ పనులను మేకర్స్ ఎంతో క్వాలిటీతో ప్లాన్ చేస్తున్నారు. అయితే, తాజా ట్రేడ్ టాక్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'మెగా 158', ‘విశ్వంభర’ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంటోందని సమాచారం. విశ్వంభర సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఈ లోపు బాబీ డైరెక్షన్ లో చేసే ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి థియేటర్లలోకి దించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు గట్టిగా వినబడుతోంది. 'మెగా 158'ను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు విక్టరీ వెంకటేష్ (Venkatesh) లైనప్ లో కూడా ఇలాంటి ఆసక్తికరమైన మార్పులే కనిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' (Aadarsha Kutumbam House No: 47) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ చిత్రానికి షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా, జూన్ లోనే షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే ఈ కొత్త ప్రాజెక్ట్ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలోలోకి రానుంది. అనిల్ రావిపూడి మార్క్ స్పీడ్ తో ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తుండటంతో, త్రివిక్రమ్ తో వెంకీ చేయబోయే సినిమా కొంచెం ఆలస్యం కానుందని న్యూస్ వినిపిస్తోంది. ఇలా ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఒకదాని కంటే ఒకటి ముందుగా రిలీజ్ రేసులోకి రావడం బాక్సాఫీస్ వద్ద కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్, అలాగే వెంకటేష్-అనిల్ రావిపూడి ల సక్సెస్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల అఫీషియల్ రిలీజ్ డేట్స్ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Jun 18, 2026 11:16AM
బుచ్చిబాబు కాదు.. ఆ సంచలన దర్శకుడితోనే మహేష్ బాబు నెక్స్ట్ మూవీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (Varanasi) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్పై ఉండగానే, మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ గట్టిగా నడుస్తోంది. రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా సుదీర్ఘ కాలం పడుతుంది, ఆ తర్వాత మహేష్ బాబును అంతకంటే పవర్ఫుల్గా వెండితెరపై చూపించే దమ్మున్న దర్శకుడు ఎవరు అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతోంది. ఈ రేసులోకి ఇప్పటికే 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో పాటు పలువురు టాప్ డైరెక్టర్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ పక్కకు నెట్టేస్తూ ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. తన మార్క్ బోల్డ్, ఇంటెన్స్ మేకింగ్తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల రాత మార్చిన సందీప్ రెడ్డి వంగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలని టాలీవుడ్ ఆడియన్స్ చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ క్రేజీ వెయిటింగ్కు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడిందని, ఈ మైండ్ బ్లోయింగ్ కాంబో దాదాపు ఖరారైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేత ఏషియన్ సునీల్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఇమేజ్కు, సందీప్ రెడ్డి వంగా నయా టేకింగ్కు సరిపోయేలా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి 'వారణాసి' చిత్రం తర్వాత మహేష్ బాబు ఇమేజ్ గ్లోబల్ వైడ్గా మారిపోవడం ఖాయం కాబట్టి, దానికి తగ్గట్టుగానే సందీప్ కూడా పాన్ ఇండియా రేంజ్లో ఈ కథను ప్లాన్ చేశారట. సూపర్ స్టార్ క్లాస్ అండ్ డీసెంట్ లుక్కు, సందీప్ రెడ్డి వంగా మార్క్ అల్ట్రా వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి సినిమా ముగిసేలోపే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' అనే భారీ మూవీ చేస్తున్నారు. 'స్పిరిట్' పూర్తి కాగానే, మహేష్ ప్రాజెక్ట్ పైకి సందీప్ రెడ్డి ఫోకస్ షిఫ్ట్ అయ్యే అవకాశముంది.
Jun 16, 2026 5:10PM
పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’లో ప్రభాస్.. గూస్బంప్స్ తెప్పించే క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంతటి ఒక భారీ ప్రకంపన సృష్టించే క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా 'OG' చిత్రానికి సీక్వెల్గా 'OG 2' రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ లోకి రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సరికొత్త లీక్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూమెంట్గా మిగిలిపోవడం ఖాయం. పవర్ స్టార్ మరియు రెబల్ స్టార్ ఒకే స్క్రీన్పై కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కాలర్స్ ఎగరేస్తున్నారు. ఈ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్. ప్రస్తుతం విదేశాల్లో స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న సుజీత్, మరో 10 రోజుల్లో ఇండియాకు తిరిగి రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే నేరుగా పవన్ కళ్యాణ్ను కలిసి 'OG 2' ఫుల్ స్క్రిప్ట్ ను నరేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫైనల్ నరేషన్ మాత్రమే పెండింగ్లో ఉందని, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం ప్రాజెక్ట్ అఫీషియల్గా ఎనౌన్స్ అవుతుందని సమాచారం. 'OG' పార్ట్ వన్ లోనే సుజీత్ తన గత చిత్రం 'సాహో' కథకు, ఈ 'ఓజీ' కథకు ఒక ఇంటర్లింక్ పెట్టేసాడనే టాక్ బలంగా నడుస్తోంది. ఇప్పుడు ఆ కనెక్షన్ను మరింత పెంచుతూ 'OG 2' లో ప్రభాస్ చేత ఒక పవర్ఫుల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇప్పించేందుకు సుజీత్ ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. ఈ భారీ 'సాహో' క్రాస్ ఓవర్ తో టాలీవుడ్ లోనే ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సంబంధించిన టైమ్లైన్ కూడా ఇప్పటికే దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ టీమ్ ఈ సినిమా సీక్వెల్ను కన్ఫర్మ్ చేయగా, మేకర్స్ రాబోయే సెప్టెంబర్ నెలలో అధికారికంగా ఈ సినిమాను అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కేవలం రెండు నెలల గ్యాప్ లోనే, అంటే నవంబర్ నుంచి 'OG 2' రెగ్యులర్ షూటింగ్ను పట్టాలెక్కించేలా పక్కా ప్లానింగ్తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ లుక్ కు తోడు, ప్రభాస్ 'సాహో' క్యారెక్టర్ తో క్యామియో తోడైతే బాక్సాఫీస్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. సుజీత్ సృష్టించబోయే ఈ బిగ్గెస్ట్ యాక్షన్ విజువల్ వండర్ కోసం ఇరు హీరోల అభిమానులు ఇప్పటి నుంచే వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Jun 16, 2026 3:30PM
Ram Charan: శ్రీకాంత్ ఓదెలతో రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్.. సుకుమార్ మూవీ పరిస్థితి ఏంటి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం నెక్ట్స్ లెవెల్ సినిమాలతో దూసుకుపోతున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, తాజాగా విడుదలైన 'పెద్ది' సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని సూపర్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ జోష్లోనే తన భవిష్యత్తు చిత్రాల లైన్అప్ను ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక ప్రాజెక్ట్ కమిటై ఉన్న రామ్ చరణ్, తాజాగా టాలీవుడ్ మాస్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి కలయికలో సినిమా రాబోతోందనే టాక్ సినీ వర్గాల్లో ఒక రేంజ్ హల్చల్ సృష్టిస్తోంది. నేచురల్ స్టార్ నానితో 'దసరా' వంటి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించి, మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఆయన అంతకుమించిన ఒక అత్యంత పవర్ఫుల్ మరియు ఊరమాస్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సెన్సెషనల్ డైరెక్టర్ నానితో 'ది ప్యారడైజ్' అనే సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు చిత్రాలు పూర్తిగా పూర్తి అయిన తర్వాతే, శ్రీకాంత్ ఓదెల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తన తదుపరి భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ చూపించిన ఊరమాస్ పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అలాగే తాజాగా విడుదలైన 'పెద్ది' సినిమాలో కూడా చరణ్ నటనకు, ఆయన మాస్ లుక్కు అభిమానులతో సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటికీ మించి, మరింత ఊరమాస్ లుక్తో పాటు మైండ్ బ్లోయింగ్ క్యారెక్టరైజేషన్ను శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో రామ్ చరణ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్టింగ్ స్టామినా తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. మెగా అభిమానులు ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, రామ్ చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి బలమైన లీకులు అందుతున్నాయి. చిరంజీవి సినిమా తర్వాత చరణ్ ప్రాజెక్ట్ లైన్లోకి రానుండటంతో మెగా కాంపౌండ్లో ఈ కాంబో సరికొత్త సంచలనంగా మారింది. మరి ఈ క్రేజీ అండ్ సెన్సేషనల్ కాంబినేషన్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మేకర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఒకవేళ ఈ మాస్ కాంబో అధికారికంగా సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట మొదలవడం ఖాయం.
Jun 16, 2026 12:02PM
చేతులు మారిన భారీ ప్రాజెక్ట్.. ఎన్టీఆర్ ప్లేస్లో సూర్య?
కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్లోనూ క్రేజీ కాంబినేషన్లకు సంబంధించిన గాసిప్స్ ఎప్పుడూ హాట్ టాపిక్గా మారుతుంటాయి. తాజాగా తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), బ్లాక్బస్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతోందనే వార్త నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ మీడియా ఈ ఇద్దరి కలయికపై రకరకాల ఆసక్తికరమైన కథనాలను ప్రచురిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరు అగ్రశ్రేణి దిగ్గజాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెరవెనుక ఒక సాలిడ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) చిత్రాన్ని సితార సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సూర్య 50వ చిత్రం కోసం ఈ క్రేజీ కాంబినేషన్ను సెట్ చేయడానికి ప్రొడ్యూసర్ నాగవంశీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ ఇదివరకే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ ప్రాజెక్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తారని కూడా గతంలో నాగవంశీ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇదే బ్యానర్ లో నెల్సన్ డైరెక్ట్ చేయబోయే సినిమా కోసం సూర్య రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ తో అనుకున్న కథలోకి సూర్య వస్తున్నాడా లేక ఇది వేరే కథనా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల 'కరుప్పు' (Karuppu) సినిమాతో భారీ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న సూర్య, ప్రస్తుతం ఒక ఇంటెన్స్ సినిమా తర్వాత పూర్తిస్థాయి లైట్-హార్టెడ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని భావిస్తున్నారట. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ సూర్య బాడీ లాంగ్వేజ్కు పక్కాగా సెట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ను కుదర్చడానికి నాగవంశీ గట్టిగా ప్రయత్నిస్తున్నారని, నెల్సన్ కూడా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హీరో సూర్య ప్రస్తుతం 'ఆవేశం' చిత్ర దర్శకుడు జితు మాధవన్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత ఆయన '5 రూపీ డాక్టర్' (5 Rupee Doctor) బ్యాక్డ్రాప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న జ్ఞానవేల్ చిత్రంలో జాయిన్ కావలసి ఉంది. ఆ ఇంటెన్స్ స్టోరీ పూర్తయిన తర్వాతే నెల్సన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు దర్శకుడు నెల్సన్ కూడా తన తదుపరి కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో 'జైలర్ 2' (Jailer 2) చిత్రంతో పాటు, రజనీ-కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ను కూడా ఆయన లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన 'డ్రాగన్' (Dragon) సినిమాను పూర్తి చేయడంతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ లోగా నెల్సన్ డేట్స్ ని వాడుకుంటూ, సూర్యతో 50వ సినిమాను సితార ప్రొడక్షన్స్ బ్యానర్లో పట్టాలెక్కించడానికి నాగవంశీ స్కెచ్ వేసినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ గనుక అధికారికంగా అనౌన్స్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
Jun 15, 2026 5:21PM‘కరుప్పు’ హిట్తో త్రిష రెమ్యునరేషన్కి రెక్కలొచ్చాయి.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్గా వెలుగువెలుగుతున్న చెన్నై చంద్రం త్రిష ప్రస్తుతం సరికొత్త సెన్సేషన్కు తెరలేపింది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే నటీనటులకు డిమాండ్ ఉంటుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ సీనియర్ భామ, ఇప్పుడు తనకున్న క్రేజ్ను ఊహించని రేంజ్లో క్యాష్ చేసుకునే పనిలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఒక భారీ ద్విభాషా (తెలుగు-తమిళ) చిత్రం కోసం మేకర్స్ త్రిషను సంప్రదించగా ఆమె మైండ్ బ్లాక్ అయ్యే రేటు చెప్పిందట. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించడానికి ఈ సీనియర్ బ్యూటీ ఏకంగా రూ. 15 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. హీరోయిన్ల రెమ్యునరేషన్స్ విషయంలో ఈ స్థాయి ఫిగర్ వినపడటం టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఇటీవల సూర్య హీరోగా వచ్చిన 'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో త్రిష మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఈ వయసులోనూ గ్లామర్, యాక్టింగ్ పరంగా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుండటంతో ఆమె ఖాతాలో వరుసగా పెద్ద ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నాయి. దీంతో త్రిష కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న 'విశ్వంభర' సినిమా కోసం త్రిష దాదాపు రూ. 4 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం. కానీ, 'కరుప్పు' బ్లాక్బస్టర్ తర్వాత ఆమె తన రేంజ్ను ఒక్కసారిగా త్రిబుల్ చేయడంతో సదరు నిర్మాత ఇప్పుడు అవాక్కయ్యారట. ప్రస్తుతం ఆమెను కనీసం రూ. 10 కోట్ల బడ్జెట్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు సదరు చిత్ర బృందం గట్టిగా బేరసారాలు సాగిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీ సూపర్స్టార్ నయనతార రికార్డులను సైతం త్రిష ఈ కొత్త డిమాండ్తో దాటేసేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ వార్తలపై అభిమానులు, సినీ ప్రియులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఈ రూ. 15 కోట్ల డీల్కు సదరు టాలీవుడ్-కోలీవుడ్ నిర్మాతలు తలొగ్గుతారో లేదో చూడాలి.
Jun 14, 2026 2:12PM
సింగం డైరెక్టర్తో రవితేజ భారీ ప్రాజెక్ట్.. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ షురూ!
టాలీవుడ్ లో మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించడంలో ఆయన స్టైలే వేరు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఏదైనా సరే రవితేజ స్క్రీన్పై కనిపిస్తే ఆ వైబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, రవితేజ ఒక పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి(Director Hari)తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు హరి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్యతో ఆయన తెరకెక్కించిన 'సింగం' సిరీస్ (Singham), విక్రమ్తో తీసిన 'సామి' (Saamy), అలాగే విశాల్తో రూపొందించిన 'భరణి', 'పూజ' వంటి చిత్రాలు తెలుగులో కూడా ఎంతటి ఘనవిజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే. హరి మార్క్ సినిమాల్లో స్క్రీన్ప్లే ఎంతో వేగంగా పరిగెడుతుంది. హై-ఎనర్జీ కమర్షియల్ ఎలిమెంట్స్, కుటుంబ సెంటిమెంట్లు, మరియు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లు ఆయన చిత్రాలకు ప్రధాన బలం. ముఖ్యంగా ఆయన సినిమాల్లో హీరోలు వంద శాతం ఇంటెన్సిటీతో, ఎంతో అగ్రెసివ్గా కనిపిస్తూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తుంటారు. రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సరిగ్గా ఇలాంటి హై-స్పీడ్ కమర్షియల్ సినిమాలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లౌడ్ క్యారెక్టరైజేషన్, పంచ్ డైలాగులు, మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్లను పండించడంలో రవితేజ దిట్ట. అందుకే ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ గురించిన వార్తలు రాగానే సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తి మొదలైంది. హరి డైరెక్షన్లో ఉండే విపరీతమైన వేగం, రవితేజ ఎనర్జీ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రవితేజ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' (Irumudi) చిత్రం ఒకటి. ఈ సినిమా షూటింగ్ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇది కాకుండా, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో పాటు మరికొందరు యువ దర్శకులతో కూడా రవితేజ కథల విషయమై చర్చలు జరుపుతున్నారు. ఈ లైనప్ల మధ్య దర్శకుడు హరి ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, సౌత్ ఇండియాలోనే ఇదొక మోస్ట్ అవేటెడ్ మాస్ కాంబినేషన్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Jun 13, 2026 5:25PMరామ్చరణ్ ఫ్యాన్స్కి షాక్.. సుకుమార్ మూవీ RC17 షూటింగ్ వాయిదా? కారణం ఇదే!
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఒకవైపు సంతోషం, మరోవైపు కాస్త ఆందోళన కలిగించే వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. రీసెంట్గా బ్లాక్బస్టర్ హిట్తో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్, ఇప్పుడు తన తదుపరి సినిమాల షూటింగ్స్కు భారీ విరామం ప్రకటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఏకంగా రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరణ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ శారీరకంగా ఎంతో శ్రమించాల్సి వచ్చిందట. ముఖ్యంగా ‘పెద్ది’ చిత్రంలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, హై-వోల్టేజ్ క్రీడా సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మెగా పవర్ స్టార్కు కొన్ని చిన్నపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పాత గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి చరణ్ ఒక చిన్న సర్జరీ చేయించుకోనున్నట్లు టాక్. సర్జరీ అనంతరం వైద్యుల సలహా మేరకు ఆయన కొన్ని నెలల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోనున్నారట. ఈ హెల్త్ బ్రేక్ కారణంగా, ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ చేయాల్సిన మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ (RC17) షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభమయ్యేలా లేదు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ ఏడాది చివర్లోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ, ఇప్పుడు ఏకంగా జనవరి 2027కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, వచ్చే ఏడాది వెండితెరపై రామ్చరణ్ సందడి ఉండకపోవచ్చు. మళ్లీ చరణ్ను థియేటర్లలో చూడాలంటే అభిమానులు 2028 వరకు వేచి చూడాల్సిందే. ఈ వార్త మెగా ఫ్యాన్స్ను కాస్త అప్సెట్ చేస్తున్నప్పటికీ, తమ హీరో ఆరోగ్యమే తమకు ముఖ్యమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘చిట్టిబాబు’ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ ఇచ్చిన సుకుమార్, ఈసారి చరణ్ను ఎలా చూపిస్తారో అనే అంచనాలతో ఈ ప్రాజెక్ట్పై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ వాయిదా వార్తలపై అటు మెగా కాంపౌండ్ కానీ, ఇటు సుకుమార్ టీమ్ కానీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Jun 13, 2026 3:55PMఎన్టీఆర్ ఫ్యాన్స్కు షాక్.. నెల్సన్ దిలీప్కుమార్ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడనుందా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్న నెల్సన్ దిలీప్కుమార్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైవిధ్యమైన డార్క్ కామెడీ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఈ దర్శకుడు, ప్రస్తుతం ఒక విచిత్రమైన డైలమాలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో భారీ పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం ఉండగా, మరోవైపు కోలీవుడ్ దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్లను ఒకే స్క్రీన్పై చూపించే అరుదైన మల్టీస్టారర్ ఛాన్స్ ఆయన తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన రాబోయే ప్రాజెక్టుల లైన్అప్ను సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. 'డ్రాగన్' సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది సస్పెన్స్గా మారింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పట్టాలెక్కించేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదే గనుక నిజమైతే, నెల్సన్తో అనుకున్న కాంబినేషన్ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ గ్యాప్లో నెల్సన్ దిలీప్కుమార్ ముందుకు ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమిళ సినిమా చరిత్రలోనే కలలో కూడా ఊహించని విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక మెగా మల్టీస్టారర్ స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారట. భారతీయ సినీ రంగంలోనే ఇదొక చరిత్ర సృష్టించే ప్రాజెక్ట్ కానుండటంతో, నెల్సన్ సైతం ఈ క్రేజీ మల్టీస్టారర్ను పట్టాలెక్కించేందుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రజనీకాంత్కు 'జైలర్' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నెల్సన్, ప్రస్తుతం 'జైలర్ 2' పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సీక్వెల్ సాధించే ఫలితంపైనే నెల్సన్ తదుపరి అడుగులు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ 'జైలర్ 2' కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తే, రజనీ-కమల్ కాంబోకు మరింత హైప్ రావడం ఖాయం. అటు ఎన్టీఆర్ కూడా వరుస అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల, వీరిద్దరి కాంబినేషన్ కుదరడానికి మరికొన్నేళ్లు పట్టేలా ఉంది. ఈ పరిణామాలు ఎన్టీఆర్ అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తున్నాయి. ఎన్టీఆర్, నెల్సన్ కాంబోలో రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఈ ఆలస్యం మింగుడుపడటం లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ థియేటర్లలోకి రావాలంటే 2028 వరకు వేచి చూడాల్సిందేనని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ ప్రాజెక్టులపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ల సినిమా సెట్స్ పైకి వెళ్తే ఇండియన్ సినిమా రేంజ్ మారుతుందని కొందరు అంటుంటే, తారక్-నెల్సన్ మాస్ కాంబోనే బెస్ట్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ గందరగోళానికి తెరపడాలంటే హీరో ఎన్టీఆర్ లేదా డైరెక్టర్ నెల్సన్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Jun 11, 2026 12:27PM
'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్.. రాయలసీమ గడ్డ మీద యంగ్ టైగర్ గర్జన!
అక్కినేని యువ హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ 'లెనిన్' (Lenin) బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీ కిషోర్ అబ్బూరు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారి సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ను పెంచింది. ఈ ప్రమోషన్లలో భాగంగా టాలీవుడ్ వర్గాల్లో ఒక సంచలన వార్త జోరుగా హల్చల్ చేస్తోంది. 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ను ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమా కథాంశం రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగనుండటం, ముఖ్యంగా హీరో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చిత్తూరు యాసలో మాట్లాడనుండటంతో తిరుపతిలో ఈవెంట్ చేయడం ద్వారా లోకల్ ఆడియన్స్కు మరింత సులువుగా కనెక్ట్ అవ్వచ్చని చిత్ర బృందం భావిస్తోంది. అయితే ఈ ఈవెంట్కు గెస్ట్గా రాబోయే స్టార్ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మెగా ఈవెంట్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చీఫ్ గెస్ట్గా హాజరుకానున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీతో ఎన్టీఆర్కు ఉన్న ప్రత్యేక అనుబంధం, అలాగే అఖిల్ అక్కినేని, ఎన్టీఆర్ మధ్య ఉన్న పర్సనల్ సాన్నిహిత్యం కారణంగా ఈ వేడుకకు రావడానికి తారక్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మాస్ ప్రమోషనల్ ప్లాన్ గనుక వర్కవుట్ అయి, జూన్ 26 రిలీజ్ కంటే ముందే యంగ్ టైగర్ తిరుపతి గడ్డపై అడుగుపెడితే అటు అక్కినేని అభిమానులు, ఇటు నందమూరి అభిమానుల ఉత్సాహానికి అవధులు ఉండవు. రాయలసీమ వేదికగా సాగబోయే ఈ అరుదైన మల్టీస్టార్ వేడుకకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను' మూవీ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరవ్వడం విశేషం.
Jun 10, 2026 4:22PM
Prabhas: ప్రభాస్ కోసం ‘ధురంధర్’ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్.. ఆ హీరోలను కాదని రెబల్ స్టార్తో భారీ మూవీ!
'బాహుబలి' సిరీస్ తెచ్చిన అంతర్జాతీయ గుర్తింపుతో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్న ప్రతి టాప్ డైరెక్టర్ ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు గంటున్నారు. భారీ యాక్షన్ డ్రామాలు, విజువల్ వండర్స్, పాన్ ఇండియా మార్కెట్ ఉన్న కథలకు ప్రభాస్ కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. తాజాగా ఈ అగ్ర దర్శకుల జాబితాలోకి బాలీవుడ్ నుంచి మరో క్రేజీ డైరెక్టర్ వచ్చి చేరారు. అతనే హిందీలో సంచలన చిత్రాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar). 'ధురంధర్' వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు ఆదిత్య ధర్, తన తదుపరి భారీ యాక్షన్ డ్రామా కోసం ప్రభాస్ను సంప్రదించినట్లు సమాచారం. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన గత చిత్రం 'ధురంధర్ 2' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా సాధించిన క్రేజ్ మరియు సక్సెస్ను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రాన్ని మరింత భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన తదుపరి సినిమా స్క్రిప్ట్ కోసం చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఈ కథాంశం కేవలం బాలీవుడ్ స్థాయికి పరిమితం కాకుండా, గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉండాలని ఆయన భావిస్తున్నారు. అందుకే, సౌత్ నుండి నార్త్ వరకు ఏ హీరో అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలరో ఆలోచించగా, ఆయన చూపు ప్రభాస్ వైపే మళ్లింది. విశేషం ఏమిటంటే, ఆదిత్య ధర్తో సినిమా చేసేందుకు ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు సౌత్ కి చెందిన కొందరు అగ్ర హీరోలు కూడా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ దర్శకుడు మాత్రం ఆ స్టార్ హీరోలందరినీ పక్కన పెట్టి, కేవలం ప్రభాస్తోనే తన తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆయా హీరోల కంటే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, ఆయనకున్న మాస్ ఇమేజ్ మరియు పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు ఉన్న క్రేజ్, ఈ చిత్రానికి ప్రాణం పోస్తాయని దర్శకుడు బలంగా నమ్ముతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న 'ఫౌజి', 'స్పిరిట్', 'కల్కి 2' వంటి చిత్రాలతో అత్యంత బిజీగా ఉన్నారు. భారీ ప్రొడక్షన్ హౌస్లు సైతం ప్రభాస్ కాల్షీట్ల కోసం వేచి చూస్తున్న తరుణంలో, ఆదిత్య ధర్ ఈ ప్రాజెక్ట్ను ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా రూ. 1000 కోట్ల మార్కును సునాయాసంగా దాటేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్పై అధికారిక ప్రకటన రానప్పటికీ, సోషల్ మీడియాలో ఈ చర్చ మాత్రం ట్రెండింగ్లో ఉంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే, ఆదిత్య ధర్-ప్రభాస్ కలయికలో సినిమా అంటే అది ఒక విజువల్ వండర్ అని సోషల్ మీడియా వేదికగా తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Jun 10, 2026 9:47AM
Peddi: రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. బుచ్చిబాబుతో మరో భారీ ప్రాజెక్ట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్లో వచ్చిన గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం 'పెద్ది' (Peddi) ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 292.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ భారీ విజయంతో జోష్లో ఉన్న మెగా అభిమానులకు సరికొత్త క్రేజీ అప్డేట్ అందుతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రెండో సినిమా కూడా రాబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలోనే బుచ్చిబాబు చెప్పిన మరో వైవిధ్యమైన పాయింట్ చరణ్కు బాగా నచ్చిందట. 'పెద్ది'తో పోలిస్తే కథ, హీరో పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటాయని టాక్. దీంతో ఈ కాంబోలో రెండో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం. అయితే ఈ లోగా రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ ను పూర్తి చేయనున్నారు. మెగా పవర్ స్టార్ తన 17వ చిత్రం 'RC17'ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై లేదా ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమా కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు, దీని ఓపెనింగ్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతుందని చెప్తున్నారు. భారీ అంచనాలున్న 'RC17' షూటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాత, రామ్ చరణ్ మళ్లీ బుచ్చిబాబు దర్శకత్వంలో తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'పెద్ది' చిత్రంతో రూ. 300 కోట్ల మార్కును అందుకుంటున్న ఈ బ్లాక్బస్టర్ జోడీ మళ్లీ కలవబోతుండటం మెగా ఫ్యాన్స్కు డబుల్ ధమాకా లాంటిదే. సుకుమార్ సినిమా తర్వాత రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అప్పుడే టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Jun 9, 2026 9:21AM
AK47 Release Date: దసరా బరిలో వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా.. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ లో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ సినిమాలకు రచయితగా అద్భుతమైన సంభాషణలు అందించిన త్రివిక్రమ్, తొలిసారిగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ కెరీర్లో 77వ ప్రాజెక్ట్గా వస్తున్న ఈ క్రేజీ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ (AK47) అనే వెరైటీ టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా మారిన ఈ చిత్రం విడుదలపై ఒక న్యూస్ వినిపిస్తోంది. రాబోయే దసరా పండుగను టార్గెట్ చేస్తూ 2026 అక్టోబర్ 16న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. (Aadarsha Kutumbam House No 47) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) దాదాపు భారీ బడ్జెట్తో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ వినడానికి పక్కా ఫ్యామిలీ డ్రామాలా అనిపించినప్పటికీ, ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు మరియు మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇటీవల చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. మొదట ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యూజిక్ డైరెక్టర్ థమన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లోనే వెంకటేష్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా, చేతిలో ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మధ్యలో నవ్వుతూ కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ‘మల్లీశ్వరి’ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వస్తున్న ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సుమారు 100 కోట్ల బడ్జెట్ కావడం, దసరా లాంటి పెద్ద హాలిడే సీజన్ కలిసి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Jun 8, 2026 4:05PMక్రేజీ అప్డేట్.. నందమూరి బాలకృష్ణకు విలన్గా డా.రాజశేఖర్!
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న ఆయన, దీని తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఒక భారీ ప్రాజెక్ట్ను (NBK 112) లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ‘అధికారానికి ఓ ఆశయం తోడైతే’ అనే పవర్ఫుల్ క్యాప్షన్తో ఇటీవల అనౌన్స్ అయిన ఈ చిత్రంపై అప్పుడే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ క్రేజీ మూవీకి సంబంధించి ఒక సంచలన గాసిప్ ఫిలిం నగర్ సర్కిల్స్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో నటసింహాన్ని ఢీకొట్టే అత్యంత పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం దర్శకుడు కొరటాల శివ ఒక ఊహించని స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నట్లు టాక్. తనదైన మేనరిజంతో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ను ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎంపిక చేసినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. కథలో ఈ విలన్ క్యారెక్టరైజేషన్ ఎంతో విభిన్నంగా, మైండ్ గేమ్ తరహాలో సాగుతుందని, అందుకే రాజశేఖర్ అయితేనే పర్ఫెక్ట్ జోడి అని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే చిత్ర బృందం రాజశేఖర్ను సంప్రదించగా, కథలోని పవర్ఫుల్ లైన్ మరియు తన పాత్ర ప్రాధాన్యత నచ్చి ఆయన కూడా ఈ ప్రాజెక్ట్లో నటించేందుకు సానుకూలంగా స్పందించినట్లు వినికిడి. ఒకవేళ ఇదే నిజమైతే వెండితెరపై బాలయ్య - రాజశేఖర్ తలపడే సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో వీరిద్దరూ సమకాలీన హీరోలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో పోటీ పడ్డారు, ఇప్పుడు ఒకే ఫ్రేమ్లో హీరో, విలన్లుగా చూడటం నిజంగా విశేషమే. ఇక ఈ సినిమా బ్యాక్డ్రాప్ విషయానికొస్తే.. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త ఊరమాస్ అవతార్లో కనిపించబోతున్నారట. ముఖ్యంగా చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పూర్తిస్థాయి మాఫియా నేపథ్యంలో, అత్యంత ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశంతో పాటు, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాలో హైలైట్గా నిలవనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్రేజీ కాంబినేషన్పై నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ కాంబో సెట్ అయితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ఈ భారీ యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ ఊహించని క్రేజీ అప్డేట్పై చిత్ర యూనిట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి!
Jun 7, 2026 5:05PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






