నా కోసం సీమ సింహం వస్తున్నాడు అన్న దీపికా
ఢీ 20 లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా ఉంది. డాన్స్ ల విషయం పక్కన పెడితే ఆది, పండు, హోస్ట్ నందు, దీపికా కామెడీ స్కిట్ వేరే లెవెల్ లో ఉంది. ఆది రావడమే టేబుల్ మీద కాలేసుకుని కూర్చున్నాడు. పండు ఆది వీపు పడుతున్నాడు. "ఎం నొక్కుతున్నావురా నీ యయ్యా" అన్నాడు ఆది. ఇక పండు సీరియస్ గా ఆది మీద డైలాగ్ వేసాడు. "ఏంట్రా చేతికి నోరొచ్చింది, కళ్ళకు రంగొచ్చింది ఏంటి కామ కళా" అన్నాడు ఆది. "ఇవన్నీ కాదు. నన్ను పంపించేయండి, నాకు వేరే ప్రాబ్లమ్ వచ్చింది" అన్నాడు పండు. "నా అమ్మ, అయ్యా పిలిచాడు, ఇక్కడి కంటే అక్కడ ఎక్కువొస్తది అంటే చేతులూపి సాగనంపటానికి ఎవరనుకున్నవురా కాట్రాజ్..కరకరా నమిలేస్తా..ఇక్కడే ఉండాలి" అన్నాడు ఆది.