.webp)
వైష్ణవితో షణ్ముఖ్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫొటోలు!
సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న షణ్ముఖ్.. తాజాగా తన స్నేహితురాలు వైష్ణవి చోడిశెట్టిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని షణ్ముఖ్ ప్రకటించాడు. అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే కొద్ది రోజుల క్రితం వైష్ణవితో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వీరిద్దరూ ఇప్పటికే రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి . ఇక ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అసలు విషయం అభిమానులకు తెలిసింది . పెళ్లి మండపంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన నూతన వధూవరుల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. వైవా షార్ట్ ఫిల్మ్తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి యూట్యూబ్ సిరీస్లు అతడికి బాగా ప్రజాదరణ వచ్చింది . కొన్ని తెలుగు మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించాడు షన్ను. అతడి కెరీర్ ని మలుపు తిప్పింది బిగ్బాస్ రియాలిటీ షో. ఈ షోలో పాల్గొన్న షణ్ముఖ్ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని రన్నరప్గా నిలిచాడు. షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించినప్పటికీ, పర్సనల్ లైఫ్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక దీప్తి సునైనాతో బ్రేకప్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇది కూడా బాగా వైరల్ అయ్యింది. కొంతకాలానికి వైష్ణవి చోడిశెట్టితో షణ్ముఖ్ ప్రేమలో పడ్డాడు. దాంతో నిశ్చితార్థం పెళ్లితో ఒకింటివాడయ్యాడు. https://www.instagram.com/p/DZ46vClk_b3/
Jun 23, 2026 12:59PM.webp)
కోవై సరళగా రోహిణి, శ్రీలక్ష్మిగా సుహాసిని.. లెజెండరీ కమెడియన్స్కు అదిరిపోయే ట్రిబ్యూట్!
ఎంటర్టైన్మెంట్ అనేది ఒక రాజ్యం అయితే. ఆ రాజ్యాన్ని ఏలే రారాజులు మన కమెడియన్లు . లెజెండరీ కమెడియన్స్ అందరిని గుర్తు చేసుకుంటూ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కమెడియన్ స్పెషల్ అని చెప్పాడు ప్రదీప్. నేను ఈరోజు క్యాన్ తెచ్చుకున్నా అన్నారు అలీ. " ఎ సర్ " అన్నాడు ప్రదీప్. "నవ్వుతుంటే ముత్యాలు రాల్తాయేమో ఏరుకుందామని " అంటూ శ్రీదేవి మీద సెటైర్ వేశారు. " ఒకసారి నవ్వితే " అనేసరికి శ్రీదేవి కూడా నవ్వేశారు." జడ్జెస్ కోసం ఇన్నోవేటివ్ గా ఉండాలని క్రాక్డైల్ కుకీస్ చేస్తున్నాను" అన్నాడు నిఖిల్ . " క్రోకడైల్ కుకీస్ తినేది మేమైనా కన్నీళ్లు మాత్రం నీకొచ్చేలా చూస్తే తినడానికి నేను రెడీ " అన్నారు సంజయ్ తుమ్మ. " దాని ముసలి కన్నీరంటరా" అంటూ ఆలీ అనేసారు . "మీ ముందుకి ఓ అద్భుతాన్ని తీసుకొస్తాను. ఆ ఆర్ట్ చూసి ఆర్ట్ ఎవరు ఏసుంటారో గెస్ చేసి వేలం పాట పాడాలి. ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి ఆర్ట్ అది గీసిన ఆర్టిస్టు వాళ్ళకే " అంటూ ప్రదీప్ కుక్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. "మాకింకా పేమెంట్ రాలేదు. మాకొద్దులేండి. " అని తనూజ సెటైర్ వేసింది. "అందుకనే డబ్బుల్తో వేలం పాడట్లేదు. మీకేదైతే వంట చేయడానికి 60 నిమిషాలు టైమ్ ఇస్తామో అందులోంచి మీరు ఎంతో కొంత టైమ్ బయటికి తీసి ఈ వేలం పాట పాడాలి. " అన్నాడు ప్రదీప్. తర్వాత బిడ్డింగ్ మొదలయ్యింది. "ఫస్ట్ టైం ఒక జాతిరత్నం కోసం ఇంత ఫైట్ జరుగుతోంది " అన్నాడు ప్రదీప్. "ఇవాళ ఉంటది మీ అందరికీ. మాములుగా ఉండదు కదా " అన్నారు అలీ. "ఇంతకాలం ఆ పాత చింతకాయ పచ్చడి తిని తిని ఆ మొహాలు చూడలేక చచ్చాను. " అంది రోహిణి కోవై సరళ గెటప్ లో వచ్చి ." నేను న్యాయం చేస్తా" అన్నాడు సీరియల్ నటుడు శ్రవణ్. "ఒక్క నిమిషం న్యాయం చేస్తా " అంటున్నాడేంటి అంది రోహిణి. తర్వాత అవినాష్ ఒక మూవీలోని ఆలీ గెటప్ లో వచ్చి "బాగున్నారా బాగున్నారా బాగున్నారా సవాధికా సావ కొడతా చావ కొడతా" అన్నాడు. " ప్రదీప్ నేను మసాజ్ చేస్తా" అంటూ ఆటపట్టించాడు. తర్వాత నూకరాజు శుభలేఖ సుధాకర్ గెటప్ లో వచ్చి "నేను కొత్తగా. వచ్చిన జాతిరత్నం కామెడీ చేయాలన్నది నా ప్రయత్నం. ఇంతకీ నా వాయిస్ ఎవరిదో గుర్తుపట్టు" అంటూ అడిగాగాడు. " సుధా సుధాకర్, ఐ లవ్ యూ అమ్మా" " అమ్మ ఎప్పుడూ అంతే వెంటనే చెప్పేస్తుంది" అంది రోహిణి . తరవాత సుహాసిని శ్రీలక్ష్మి గెటప్ లో వచ్చి " నన్ను కవిని కాదన్నోడిని కఱ్ఱుచ్చుకుని కొడతా" అంటూ వచ్చింది . "మరి నువ్వు కవి అన్నవాణ్ణి" అంటావు రోహిణి అడిగేసరికి "కవి అన్నవాడిని రాయుచ్చుకుని కొడతా " అంది. " మేడమ్ మీరు చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి గారి గారండీ " అని అడిగాడు ప్రదీప్ ."అవునండి " అంది సుహాసిని.
Jun 23, 2026 11:56AM
Godhavari: సింహాద్రి గుట్టు రట్టు చేయనున్న జాను.. ఆ డాక్యుమెంట్స్ వెనుక అసలు రహస్యం ఏంటి?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-37 లో.. సూర్య, మురళి వాళ్ళతో కలిసి జాను క్రికెట్ ఆడుతుంది. బావ నువ్వు ఇప్పుడు వేసే బాల్ నాకు ఎదురైన సమస్య లాంటిది. దానిని నేను ఎదుర్కుంటానా లేదా అనేది నా బ్యాటింగ్ పైన ఆధారపడి ఉంటుంది.. బాల్ వెయ్ అని జానూ అనగానే మురళి బాల్ వేస్తాడు. జానూ కొడుతుంది కానీ అది నేరుగా సూర్య చేతిలోకి వెళ్తుంది. అలా జానూ రెండు మూడు సార్లు ప్రయత్నించినా అది సూర్య చేతుల్లోకే వెళ్తుంది. ఇక నాలుగో సారి తన బలాన్ని అంతా కూడగట్టుకొని కొడుతుంది.. అది చాలా దూరం వెళుతుంది. దాంతో జానూకి తన మీద తనకి కాన్ఫుడెన్స్ వస్తుంది. మరోవైపు సింహాద్రి కొడుకు కళ్యాణ్ తో గౌతమి ఫోన్ మాట్లాడుతుంది. నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వెళ్తావని అనుకున్నాను కానీ నువ్వు రాలేదని కళ్యాణ్ తో గౌతమి అనగానే అమ్మో.. మా నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడని కళ్యాణ్ అంటాడు. అప్పుడే సింహాద్రి అటుగా వెళ్తూ కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. ఎవర్రా ఫోన్ లో అని సింహాద్రి అనగానే ఫ్రెండ్ డాడీ అని కవర్ చేస్తాడు. సరే అని సింహాద్రి వెళతాడు. ఇక అదే సమయంలో గౌతమి దగ్గరికి నందు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. సింహాద్రి కొడుకు కళ్యాణ్ తో అని గౌతమి అనగానే ఎందుకు మాట్లాడుతున్నావని నందు అడుగుతుంది. ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నాడో కనుక్కోవడానికి చేశానని గౌతమి కవర్ చేస్తుంది. సింహాద్రి అంకుల్ ఇంట్లోనే ఉన్నాడని గౌతమి చెప్పగానే నందుకి డౌట్ వస్తుంది. దాంతో జాను దగ్గరికి వచ్చి విషయం చెప్తుంది. మరోవైపు సింహాద్రి వాళ్ళ భార్య అరుణకి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఎందుకు శంకర్ అన్నయ్య వాళ్ళ తోట, ఇల్లు అనేటప్పుడే కంగారుపడతాడు. అసలు ఆ రోజు ఆయన చూసిన డాక్యుమెంట్లు ఏంటని అరుణ కబోర్డ్ అంతా వెతుకుతుంది. అందులో తోటకి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి. అవి చూసిన అరుణ షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి సింహాద్రి వస్తాడు. ఏంటండి ఇవి అని అరుణ అడుగగా ఆమె చెంపమీద కొడతాడు. నీ పని కాదు ఇది..టిఫిన్ ఏం చేయాలి.. భోజనం ఏం చేయాలి.. నైట్ కి చపాతీనా, పుల్కానా ఇవి మాత్రమే చూస్కోవాలి.. ఇలాంటి వాటి గురించి పట్టించుకోకూడదని అరుణకి వార్నింగ్ ఇచ్చి గది బయటకు వెళ్తాడు సింహాద్రి. బయట అప్పటికే జానూ, నందు వస్తారు. ఏంటి అంకుల్.. ఏదో గొడవపడుతున్నారు. తోట, డాక్యుమెంట్లు, బ్యాంక్ అని ఏదో మాట్లాడుతున్నారని జానూ డౌట్ గా అడిగేసరికి సింహాద్రి కవర్ చేస్తాడు. నాకు తోట మీద, ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయని జానూ అనగానే నన్నే అనుమానిస్తున్నావా అని సింహాద్రి అంటాడు. మిమ్మల్ని కాదు అంకుల్ ఈ విషయం మీద డౌట్ ఉంది అని నందు అంటుంది. ఆ తర్వాత నందు, జానూలని సింహాద్రి బ్యాంక్ కి తీసుకెళ్తాడు. అక్కడ లోన్ ఇచ్చిన ఆఫీసర్స్ తో సింహాద్రి అమర్యదగా మాట్లాడతాడు. మీరు సంవత్సరం నుండి లోన్ కట్టకుండా ఇలా బ్యాంక్ కి వచ్చి ఎందుకు గొడవచేస్తున్నారని వాళ్ళు తిడతారు. నేను మేనేజర్ తో మాట్లాడాలని జానూ అనగానే సింహాద్రితో పాటు అక్కడి వాళ్ళంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
Jun 23, 2026 11:07AM.webp)
Brahmamudi : రాజ్-ఇందూల సీక్రెట్ బయటపెట్టిన ఐశ్వర్య.. నందు ఎంట్రీతో సీన్ రివర్స్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1065 లో.... పార్టీలో మదన్ ఐస్ క్రీమ్ తింటుంటే స్వాతి వచ్చి లాక్కుంటుంది. మదన్ తన దగ్గర నుంచి లాక్కోవాలని ట్రై చేస్తాడు. అప్పుడే భ్రమరాంబ శేషు చూసి మురిసిపోతారు. మదన్ తో నా కూతురు ఎలా ఉందోనని భ్రమరాంబ హ్యాపీగా ఫిల్ అవుతుంది. మరొకవైపు పార్టీలో పెద్ద స్క్రీన్ పై రాజు, లక్కీ మాట్లాడుకున్న వీడియోని ఐశ్వర్య ప్లే చేస్తుంది. అందులో ఇందు నేను భార్యాభర్తలం కాదని రాజు చెప్పేది ఉంటుంది. అది విని అందరు షాక్ అవుతారు. ఏంటి ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసావా అని భ్రమరాంబ అడుగుతుంది. లేదు పిన్ని అదంతా అబద్ధమని ఇందు చెప్తుంది. అక్క అబద్ధం చెప్పదని స్వాతి అంటుంది. మేం పెళ్లి చేసుకున్నాం.. ఐశ్వర్య కావాలనే ఇదంతా చేస్తుందని ఇందు చెప్తుంది. అయితే సాక్ష్యం ఏంటని ఐశ్వర్య అడుగుతుంది. అప్పుడే నందు ఎంట్రీ ఇస్తుంది. మీకు సాక్ష్యం కావాలి కదా ఇదిగోండి వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అని నందు ఇస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అవన్నీ ఫేక్ వీడియోస్ ఆంటీ.. ఇప్పుడు ఏఐ ద్వారా అలా చేస్తున్నారని ఇందు అంటుంది. అవును పిన్ని అని రాజు అంటాడు కావాలంటే చూడు అని రేఖని ఐశ్వర్య తిట్టినట్లు ఒక వీడియో చూపిస్తాడు. ఇవన్నీ నమ్మొద్దు ఆంటీ అని రాజు అంటాడు. ఐశ్వర్య ఏదో చెప్పబోతుంటే ఆపమని రేఖ తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఇందు, నందు మాట్లాడుకుంటారు. సమయానికి వచ్చి కాపాడావ్ అని ఇందు అనగానే నా గురించి కాదు నానమ్మకి డౌట్ వచ్చినట్లు ఉంది చూడమని నందు చెప్తుంది. మరొకవైపు రాజు గదిలోకి రాగానే ఎందుకు ఆ లక్కీ గాడితో తాగి వాగవని ఇందు కోప్పడుతుంది. రాజు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. తరువాయి భాగంలో ఇందు దగ్గరికి తన క్లయింట్స్ వచ్చి డీలింగ్ కుదర్చుకుంటారు. మీరు ఒక సంతకం పెట్టండి అని ఇందుకి అతను ఫైల్ ఇస్తాడు. ఇందు సంతకం చేస్తుంటే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 23, 2026 11:02AM.webp)
Karthika Deepam2: వంటలక్క అల్టిమేట్ ప్లాన్.. జ్యోత్స్నకు మైండ్ బ్లాంక్ అయ్యేలా షాకిచ్చిన కార్తీక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 703లో .. శివన్నారాయణ, దశరథ్, సూరజ్, దీప, జ్యోత్స్న అంతా కలిసి మాట్లాడుకుంటారు. ఇంత ఫుడ్ వేస్ట్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు.. నష్టం రాకుండా చూస్కోండి అని శివన్నారాయణ చెప్తాడు. దాంతో సూరజ్, దీప ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చెప్తారు. మనం ఒక ఆఫర్ పెడుతున్నాం.. వంటలక్క స్పెషల్ మీల్స్ .. లాటరీ ఉంది.. గోల్డ్ కాయిన్స్, అండ్ ఫస్ట్ పది మందికి లాటరీ టికెట్స్ ఉంటాయని సూరజ్, దీప చెప్పగానే ఇప్పటికే లాస్ లో ఉన్నాం.. ఇక ఈ గోల్డ్ కాయిన్, లాటరీ టికెట్స్ అంటే ఇంకా నష్టాల్లోకి వెళ్తామని జ్యోత్స్న అనగానే దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దీనిని ఫ్లాష్ సేల్ లాగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తే జనాలు ఎక్కువగా తీసుకుంటారు. మన ఫుడ్ ని అన్ని రెస్టారెంట్ లకి పంపిస్తే సరిపోతుందని సూరజ్ చెప్తాడు. ఇక మిగిలిన దానిని అనాధాశ్రమానికి ఇవ్వాలని దీప అనగానే సరే నేను ఒప్పుకుంటున్నా అని శివన్నారాయణ అంటాడు. ఇక కార్తీక్, దీప, సూరజ్ అంతా కలిసి ఫుడ్ ను అన్ని రెస్టారెంట్ లకి పంపిస్తారు. ఇక జ్యోత్స్న వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ దీప, సూరజ్ లని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక కాసేపటికి ఒక రెస్టారెంట్ నుండి గణపతి అనే మేనేజర్ దీపకి కాల్ చేస్తాడు. అప్పుడు అక్కడ శివన్నారాయణ, దశరథ్, సూరజ్, జ్యోత్స్న, కార్తీక్ అందరు ఉంటారు. ఫోన్ ను స్పీకర్ లో పెట్టమని కార్తీక్ చెప్పగానే దీప స్ఫికర్ లో పెడుతుంది. అప్పుడు అటునుండి గణపతి అనే మేనేజర్ కాల్ చేస్తాడు. మీరు ఇచ్చిన ఆఫర్ కి జనాలు ఎగబడి ఆర్డర్ చేసుకున్నారు. బాగా సేల్ అవుతున్నాయి. నాకు తెలిసి అన్నీ పూర్తయ్యాయి.. మీరు ఇంకా పంపిస్తే బాగుంటుందని అతను అనగానే దీపతో పాటు కార్తీక్, సూరజ్, శివన్నారాయణ, దశరథ్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అక్కడే ఉన్న జ్యోత్స్నకి దిమ్మతిరిగే పంచ్ ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 23, 2026 10:59AM.webp)
Illu illalu pillalu: వల్లి, సుకన్యలకు గట్టి షాకిచ్చిన నర్మద.. ప్రేమకు ఊహించని ఫోన్ కాల్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-504 లో.. వల్లి, సుకన్య మాట్లాడుకుంటారు. ఆ అక్కచెల్లెళ్ళలని ఎలాగైనా మనమే ఆడుకోవాలని అనుకుంటారు. ఇక రాత్రి కాగానే కచేరి కోసం నర్మద, ప్రేమల దగ్గరికి వల్లి, సుకన్య వెళ్తారు. ఎప్పటిలాగే నర్మద, ఒక ప్రేమ కలిసి గేమ్ స్టార్ట్ చేస్తారు. ఒక కర్ర తీసుకుని కళ్ళకి గంతలు కట్టుకుంటుంది నర్మద.. ఇక ఎవరిని కొట్టాలా అని శ్రీవల్లి , సుకన్య చెప్పినప్పుడు నర్మద కొడుతుంది. అయితే టేబుల్ కింద నర్మద కాలుని ప్రేమ తొక్కుతూ తనకి హింట్ ఇస్తుంటుంది. ప్రేమని కొట్టాలా అని వల్లి అడిగినప్పుడు కాలు తొక్కదు.. వల్లి, సుకన్యల వంతు వచ్చినప్పుడు నర్మద కాలుని ప్రేమ తొక్కుతుంది. అలా వల్లి, సుకన్యలని ప్రేమ, నర్మద ఒక ఆట ఆడుకుంటారు. ఇక సుకన్య దెబ్బలతో డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉంటే అప్పుడే అక్కడికి తిరుపతి వస్తాడు. ఏం అయిందని అడుగుతాడు. దోమలు కుట్టాయని సుకన్య కవర్ చేస్తుంది. ఇక తిరుపతి అది నిజమనుకొని బొగ్గులపై సామ్రానీ వేసుకొని తీసుకొని వచ్చి తన దగ్గర పెడతాడు. ఆ పొగకి దోమలు కాదు నేను పోయేలా ఉన్నానని దానిని పడేస్తుంది. ఇక తిరుపతి నడుస్తుంటే చూసుకోకుండా కాలుతున్న బొగ్గులపై కాలు వేస్తాడు. దాంతో అతని కాలు కమిలిపోతుంది. ఇక అదే అదునుగా చేసుకొని తిరుపతిని ఇల్లంతా నడిపిస్తుంది సుకన్య. మరోవైపు ధీరజ్ కోసం చూస్తుంటుంది ప్రేమ. అదేసమయంలో తనకి కాల్ వస్తుంది. ఆడియన్స్ కోసం ప్రేమకి మేనేజర్ కాల్ చేస్తాడు. ప్రేమ వాయిస్ విని ఫిధా అవుతాడు. ఇక తన డ్యాన్స్ బాగుందని చెప్పి రమ్మని చెప్పగా ప్రేమ సరేనంటుంది. అయితే మేనేజర్ డబుల్ మీనింగ్ తో మాట్లాడతాడు. అది ప్రేమకి అర్థం కాదు. ఆ డ్యాన్స్ లో గెలిస్తే పదిలక్షలు వస్తాయని అతను చెప్పడం మాత్రమే విని సరే వస్తానంటు చెప్తుంది. ఇక ఆ సంతోషంలో ధీరజ్ తో పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంది. అది చూసిన ధీరజ్.. చాలా బాగా చేశావని చెప్తాడు. ఏంటి విషయం అని ధీరజ్ అడుగగా.. ఇలా డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది.. అందులో గెలిస్తే పదిలక్షలు వస్తాయని ప్రేమ చెప్తుంది. వద్దని ధీరజ్ అంటాడు. ఎందుకని ప్రేమ అడుగగా.. నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పినందుకే మీ వాళ్ళు రచ్చ చేశారు..ఇక ఇప్పుడు డ్యాన్స్ అంటే మా ఇంటికి కత్తులు పట్టుకొని వస్తారని ధీరజ్ చెప్పేసి వెళ్తాడు. ప్రేమ ఏం చెప్పినా పట్టించుకోడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 23, 2026 10:56AM.webp)
Podharillu : మృగంలా ప్రవర్తించిన చక్రి.. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మహా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు(Podharillu )'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-141 లో.. మహా రాత్రి వేళ తన గదిలో పడుకుంటే చక్రి తాగిన మత్తులో తన గదిలోకి వెళ్ళి గడియ పెడతాడు. ఇక తాగిన కత్తులో మహా దగ్గరకి వెళ్తుంటే తను లేచి చూస్తుంది. ఏంటి నువ్వు ఇక్కడ అని చక్రిని తోసేస్తుంది. నువ్వు నా భార్య. నేను నీ భర్త అందుకే వచ్చానని చక్రి అనగానే మహా భయపడుతుంది. వెంటనే మహా గడియ తీసుకోబోతుండగా చక్రి వచ్చి తలుపుకి అడ్డుగా నిలబడతాడు. ఏంటి.. ఎక్కడికి వెళ్తావ్.. మనమిద్దరం భార్యాభర్తలమని చక్రి అనగానే మహా కంగారుపడుతుంది. పెద్ది, పెద్ది అని మహా అరుస్తుంది. ఆ అరుపులకి పెద్ది, కేశవ, కన్నా, నారాయణ అందరు వస్తారు. డోర్ తీయడానికి లోపలి నుండి మహా, బయట నుండి కేశవ, కన్నా, పెద్ది వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఇక చక్రిని మహా పక్కకి తోసి డోర్ తీసుకొని వచ్చేస్తుంది. ఇక మహా ఒక పక్కకి వెళ్ళి ఏడుస్తుంది. చక్రిని మాధవ తిడతాడు. అసలు నువ్వు మనిషివేనారా ఒక మృగంలా చేస్తున్నావని మాధవ అంటాడు. నా భార్య దగ్గరికి నేను వెళ్తే తప్పేంటని చక్రి అంటాడు. అసలు మనిషివేనారా అని చక్రి మీద మాధవ చేయి ఎత్తుతాడు.. అది చూసి చక్రి కూడా మాధవ మీద చేయి ఎత్తుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇక కేశవ, కన్నా, మాదవ కలిసి చక్రిని వేరే గదిలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ చక్రిని ఎంత కొట్టినా మొండిమాట మీద ఉంటాడు. నా భార్య దగ్గరికి నన్ను పంపివ్వమని చక్రి అంటుంటే బకెట్ లో వాటర్ తీసుకొచ్చి చక్రి మీద పోసి.. బయటకెళ్ళి గడియపెడతాడు మాధవ. తెల్లారేదాకా డోర్ తీయకండి అని మాధవ అనగానే కన్నా , కేశవ సరేనని బయట ఉంటారు. ఇక మహా ఏడుస్తూ.. మీరందరు నా వాళ్ళు, నాకు రక్షణగా ఉంటారని నమ్మి తలుపుకి గడియకూడా పెట్టలేదని మహా అంటుంది. దాంతో మాధవ, కేశవ, కన్నా బాధపడతారు. ఇక అందరు కలిసి తనకి ధైర్యం చెప్తారు. గడియపెట్టుకొని పడుకోమని మాధవ అనగానే మహా లోపలికి వెళ్తుంది. ఇక బయట కేశవ, కన్నా, మాధవ ఉంటారు. మహా రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే మహా ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోతుంది. అందరు పిలిచినా తను మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఆపీక్ కి వెళ్ళిపోతుంది. ఇక చక్రి బయటకు వస్తాడు. అందరికి సారీ చెప్తాడు . అయినా ఎవరు పట్టించుకోడు.ఇక నారాయణ దగ్గరికి చక్రి వచ్చి మాట్లాడతాడు. నువ్వు చెప్పిన మాటల వల్లే నేను రెచ్చిపోయి ఇలా చేశాను.. మొన్నటి వరకు నా లిమిట్స్ లో నేనున్నాను.. నా హక్కులు నేను ఫాలో అయ్యాను.. నువ్వు,ఆ ఓంకారేశ్వర్ చెప్పిన మాటలకి ఇలా చేశాను.. ఇప్పటికే నన్ను భర్తకా చూడట్లేదు మహా.. ఇప్పుడు అసలు మనిషిలా కూడా చూడదు.. నాకు ఏ పాపం తగిలినా అది నీకు కూడా తగులుతుందని చక్రి అనగానే నువ్వు , మహా కలిసి ఉండాలని నేను అలా చెప్పాను కానీ నీ బుద్ధి ఏం అయింది.. మృగంలా ప్రవర్తించమని చెప్పలేదని నారాయణ అంటాడు. ఆ తర్వాత మహాకి సారీ అని వాయిస్ మెసెజ్ చేస్తాడు కానీ తను చూసినా పట్టించుకోదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 23, 2026 10:53AM.webp)
Jayam Serial : ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రుద్ర.. విశ్వ ప్రయాణానికి బ్రేక్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-301 లో.. సుధాని తీసుకొని విశ్వ సిటీ వదిలివెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. ఇక వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపడానికి రుద్రని పెద్దసారు పంపిస్తాడు. అక్కడ రంగా, గంగ, పైడిరాజు, లక్ష్మీ, విశ్వ, జయ, సుధా అందరు ఉంటారు. ఎవరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. రంగాకి పెద్దసారు వీడియో కాల్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తుంటాడు. పెద్దసారుతో పాటు శకుంతల, ఇషిక, వీరు, ప్రీతీ ఇలా ఇంట్లోని వాళ్ళంతా అక్కడ రుద్ర ఏం చేస్తున్నాడో వీడియో కాల్ లో చూస్తుంటారు. విశ్వ , సుధా వాళ్ళ లగేజీని కార్ లో ప్యాక్ చేస్తాడు రుద్ర. అత్తమ్మా, మామయ్య పదండి బయల్దేరి వెళ్ళండి అని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. నేను వెళ్ళిపోతునందుకు నీకు బాధగా లేదా అని సుధా అడుగుతుంది. ఎందుకు అత్త మీరు ఎక్కడికి వెళ్తున్నారు.. మళ్ళీ ఫంక్షన్ కో పెళ్ళికో వస్తారు కదా అని రుద్ర అంటాడు. ఇంకా ఆలస్యం చేస్తే రాహుకాలం వచ్చేస్తుంది తొందరగా బయల్దేరి వెళ్ళండి అనగానే గంగా వచ్చి.. ఏంటండి.. సుధ అమ్మ అమ్మ వెళ్ళిపోతుంటే ఆపాల్సింది వెళ్ళమని అంటున్నారేంటని రుద్రని అడుగుతుంది. అవన్న తర్వాత మాట్లాడుకుందాం.. ముందుగా వాళ్ళని వెళ్ళనివ్వు అని రుద్ర అనగానే ఎవరికి ఏమి అర్థం కాదు.ఇక జయ , విశ్వ , కార్ లో కూర్చుంటారు. వెళ్తారు. అదంతా ఫోన్ లో చూసిన పెద్దసారు డిస్సప్పాయింట్ అవుతాడు. ఏంటండి.. మా రుద్ర అది చేస్తాడు.ఇది చేస్తాడు వాళ్ళు వెళ్ళనీయకుండా ఆపుతాడని అన్నారు.. ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో అని శకుంతల అనగానే అయ్యో శకుంతల.. రుద్రని అర్థం చేసుకుంది ఇంతేనా అని పెద్దసారు అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. అసలు రుద్ర ఎప్పుడైనా చేసుకొస్తానని చెప్పిన పనిని చేయకుండా వొట్టి చేతులతో వచ్చాడా.. విశ్వ వాళ్ళని ఇక్కడ పంపిస్తున్నాడంటే ఇంకెక్కడో ఆపడానికి ప్లాన్ రెడీ చేసే ఉంటాడని పెద్దసారు అంటాడు. ఇక అనుకున్నట్టుగానే రుద్ర ప్లాన్ చేస్తాడు. బాక్సింగ్ అకాడమీ వాళ్ళు వచ్చి.. సర్ మీరు వెళ్ళడానికి వీల్లేదని అంటారు. దాంతో కొద్ది దూరంలోనే ఉన్న గంగా, రుద్ర, అంతా షాక్ అవుతారు. మీ స్థానంలో ఉండాల్సిన అతను నిరాకరించాడు. మీ భాద్యతలు మీరే నిర్వర్తించాలి.. మీరు సిటీ వదిలి వెళ్ళకూడదని అకాడమీ వాళ్ళు అనడంతో విశ్వ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 23, 2026 10:50AM.webp)
మా ఇంటి బంగారం మూవీపై శ్రీముఖి బోల్డ్ కామెంట్స్!
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ఎపిసోడ్ కి "మా ఇంటి బంగారం "మూవీ టీమ్ వచ్చింది. ఇక ఇందులో సామ్ విత్ శ్రీముఖి ఇంటర్వ్యూ అందరినీ ఆకట్టుకుంది. అలాగే ప్రదీప్ స్పెషల్ హోస్ట్ గా వచ్చాడు. ఇన్నాళ్లు హోస్ట్ గా ఉన్నారు ఆ సినిమాలో సమంత గారితో నటించడం ఎలా అనిపించింది అని అడిగాడు ప్రదీప్. "కొత్తగా అనిపించింది. సమంత గారి పక్కన ఇంకో కోడలు పిల్లగా అన్నప్పుడు ఐనా ఆవిడని హైలైట్ చేస్తారు మమ్మల్ని తొక్కేస్తారు ఎం కనిపిస్తాంలే అనుకున్నాను. అలా కథంతా విన్నాను. సమంత గారిని ఫస్ట్ డే అలా సెట్ లో చూసాక ఓ మై గాడ్" అని అంది శ్రీముఖి. "మీ క్యారెక్టర్ గురించి చెప్పండి " అని సమంత అడిగారు. "బేసిక్ గా శ్రీముఖి అంటే ఏంటి అది కాదు." అని శ్రీముఖి అనేసరికి "కచ్చితంగా అది మా అందరికీ తెలుసు" అన్నారు సామ్. "వంటలు అంత గ్రేట్ గా వండడం రాదు, పిండి వంటలు అసలు రావు, ముగ్గులు వేయడం రాదు." అని చెప్పింది శ్రీముఖి. "అసలు ఆవిడ బంగారం అని మీకు ఎలా అనిపించింది" అంటూ సామ్ డైరెక్టర్ నందిని రెడ్డిని అడిగారు. "శ్రీముఖిని చూసినప్పుడల్లా ఒక తెలుగింటి అమ్మాయిలా అనిపించేది అలాగే చాలా ఎనర్జీ ఆమెలో కనిపించేది. సామ్ ఎనెర్జీతో మ్యాచ్ అవ్వాలి స్క్రీన్ మీద. అలాగే క్యారెక్టర్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా అవసరం. ఐతే శ్రీముఖికి తన టాలెంట్ కి తగ్గ రోల్ రాలేదు" అంటూ నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అనేవి ఈ మధ్య రావడమే లేదు. ఐతే నందిని రెడ్డి ఇప్పుడు ఇద్దరు కాదు స్ట్రాంగ్ లేడీస్ అందరితో కలిపి ఒక ఇంటరెస్టింగ్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు.
Jun 22, 2026 10:40AM
Godavari: మేనమామ ఇల్లు నాదేనంటూ శాంత నోరు మూయించిన జాను!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-36 లో.. జానూ, నందు, శారద అంతా కలిసి వర్షంలో తడుస్తూ రోడ్డు పక్కన ఉన్న చెట్టు కిందకి వెళ్తారు. అక్కడ ఒక పరదా కప్పుకొని తలదాచుకుంటారు. అదంతా సింహాద్రి చూస్తాడు.. తోట, డాక్యుమెంట్లు అంటూ ఆరాతీస్తావా.. ఇప్పుడు చూసావా ఉండటానికి ఇల్లే లేకుండా చేశానంటూ జానూ గురించి సింహాద్రి అనుకుంటాడు. ఆ తర్వాత అందరు వర్షంలో తడుస్తుంటే వాళ్ళని వెతుక్కుంటూ సూర్య, మురళి వస్తారు. అయ్యో జానూ, నందు, అత్త సారీ.. ఈ రోజు నేను ఊళ్ళో లేను. మెటీరియల్ కోసం టౌన్ కి వెళ్ళాను.. ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మురళి అంటాడు. నా ఫోన్ మా అమ్మ చేతిలో ఉంది.. సారీ జానూ అని సూర్య అంటాడు. పదండి మా ఇంటికి వెళదామని మరళి అనగానే వద్దని నందు అంటుంది. ఎందుకని అడుగగా మీ అమ్మ మమ్మల్ని తిట్టేస్తుంది.. మా నాన్న చనిపోతే కూడా రాలేదు.. ఇక మమ్మల్ని ఇంటికి రానివ్వదు. మేమంతా వస్తే మమ్మల్ని తిడుతుందని నందు అంటుంది. అయితే మా ఇంటికి రండి.. మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు అని సూర్య అనగానే వద్దు నేను ఫోన్ చేస్తేనే మీ అమ్మ ఉందని లిఫ్ట్ చేయలేదు.. ఇక మేమంతా వస్తామంటే మీ అమ్మ ఒప్పుకోదు.. మేము రోడ్డుపై ఇబ్బందులు పడ్డా పర్వాలేదు కానీ మా వాళ్ళ నువ్వు ఇబ్బంది పడకూడదని సూర్యతో జాను అంటుంది. ఇక మురళి ఇంటికి వెళదామని అంటే నందు వద్దని అంటుంది. నా కూతురు బాధలో అలా అందే, ఏం అనదు పదండి వెళదామని నందు వాళ్ళ నానమ్మ అంటుంది. ఇక జానూ అందరిని కన్విన్స్ చేస్తుంది. సంబంధం వద్దనుకున్నారనే బాధలో అలా అందే తప్ప.. రక్త సంభంధాన్ని వద్దనుకుంటుందా అని మురళి అందరిని తీసుకెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళాక ఎందుకు తీసుకొచ్చావ్ వీళ్ళందరిని అని మురళి వాళ్ళ అమ్మ శాంతా అడుగుతుంది. ఇక మరళి జరిగిందంతా చెప్తాడు. ఏంటి ఇప్పుడు వీళ్ళంతా మన ఇంట్లో ఉంటారా.. ఇదేమైనా సత్రమా.. అయినా నా తమ్ముడు చనిపోగానే మీతో నాకు సంబంధం తెగిపోయిందని శాంతా అంటుంది. ఇక శాంతా వాళ్ళ అమ్మ బ్రతిమిలాడుతుంది. మొన్న అయిపోయారు.. ఈ రోజు ఇల్లు పోయింది.. మేం ఏం చేయాలని నందు, జాను వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ఇక నందుని శాంతా ఇష్టమొచ్చినట్టు తిడుతుంది. ఇక జానూ మధ్యలో ఎంటర్ అవుతుంది. ఏంటి అత్తా.. ఇప్పుడు మేం ఉండకూడదు ఈ ఇంట్లో అంతేనా అని అనగానే అవునని శాంతా అంటుంది. అయితే మీరు కూడా ఉండకూడదు.. ఎందుకంటే మా మేనమామ ఇంటికి రావడానికి మాకు సర్వహక్కులున్నాయి.. నీకు నచ్చినా నచ్చకపోయినా మేం ఇక్కడే ఉంటామని అనగానే శాంతా ఏం మాట్లాడలేకపోతుంది. ఇక కిన్నెర, నందు, వాళ్ళ అమ్మని, నానమ్మలని జాను లోపలికి తీసుకెళ్తుంది. మరుసటి రోజు జానూ, సూర్య, మురళి ఒక దగ్గర మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే ఒక బాల్ నేరుగా జాను ముఖం మీదకి వస్తుంది . దానిని జానూ క్యాచ్ పడుతుంది. ఇక క్రికెట్ ఆడుదామని జాను అమగానే మరళి, సూర్య షాక్ అవుతారు. నువ్వు బాల్ వెయ్.. అది నా సమస్య.. దాన్ని నేను ఎంత బలంగా కొట్టగలనో చూస్తానని జానూ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 21, 2026 12:36PM
Jayam serial : గంగే సొంత కూతురని నిజం చెప్పేయాలనుకున్న పైడిరాజు.. రుద్ర వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -300 లో.... పైడిరాజు, లక్ష్మి ఇద్దరిని ఇక పని మానెయ్యండి మేం వెళ్తున్నామని వాళ్ళకి డబ్బు ఇస్తాడు. సుధా డల్ గా ఉండడం తో సుధడ ఇక్కడ నుంచి దూరంగా వస్తానని మాటిచ్చావని విశ్వ అంటాడు. వాళ్ళు వెళ్లిపోతున్న విషయం గంగకి లక్ష్మి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో గంగ ఆ విషయం రుద్రకి చెప్తుంది. వాళ్ళని ఆపడానికి రుద్ర బయల్దేరతాడు. మరొకవైపు ఆ విషయం వెంటనే వీరు ఇషికలకి జయ ఫోన్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతేనే మా నాన్నకి నేను కూతురు కాదన్న డౌట్ పోతుందని జయ అంటుంది. అలా వెళ్తేనే ప్రాబ్లమ్.. ఇప్పుడు వెళ్లకుండా ఆపమని వీరు అంటాడు. మరొకవైపు పెద్దసారు యోగా చేస్తుంటే శకుంతల వస్తుంది. మీ చెల్లి ఊరువదిలి వెళ్ళిపోతుందని శకుంతల అంటుంది. ఆ విషయం నాకు తెలుసని పెద్దసారు అంటాడు.. నా చెల్లిని వెళ్లకుండా ఆపడానికి తన మేనల్లుడు రుద్ర ఉన్నాడు కదా.. రుద్ర వెళ్ళాడని పెద్దసారు అంటాడు. ఆ మాటలు వీరు, ఇషిక విని నీలాగే మావయ్యకి కూడా రుద్ర బావ అంటే చాలా నమ్మకం ఉందని వీరుతో ఇషిక అంటుంది. మరొకవైపు విశ్వ నిర్ణయంలో మార్పు ఉండదని పైడిరాజు, లక్ష్మీ కలిసి గంగనే సొంతకూతురు అని చెప్పాలని నిర్ణయం తీసుకొని వెళ్తారు. అయ్యగారు మీకొక విషయం చెప్పాలని చెప్పబోతుంటే అప్పుడే రుద్ర వస్తాడు. మమ్మల్ని ఆపడానికి వచ్చావా అని విశ్వ అనగానే లేదు మావయ్య సెండాఫ్ ఇవ్వడానికి వచ్చానని రుద్ర అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇంకా బ్యాగ్ లు లోపల పెట్టలేదా నేను పెడతానని లాగేజ్ కార్ లో పెడతాడు. రుద్ర వాళ్ళని ఆపుతున్నాడా అని రంగాకి పెద్దసారు ఫోన్ చేస్తాడు. లేదు లగేజ్ కార్ లో పెడుతున్నాడని రంగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 21, 2026 12:29PM
Illu illalu pillalu : భద్రవతి ఇంటికి కోర్టు నోటీసులు.. విశ్వకు ధీరజ్ ఊహించని షాక్!
స్టార్ 'మా'లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -503 లో.. భద్రవతి ఇంటికి కోర్ట్ నుంచి నోటీసులు వస్తాయి. అమూల్యని విషయంలో విశ్వ చేసిన తప్పుకి ధీరజ్ కేసు పెట్టించినదానికి సంబంధించిన నోటీసులు చూసి భద్రవతి షాక్ అవుతుంది. ఇప్పుడు విశ్వకి శిక్ష పడకుండా ఎలా కాపాడుకోవాలని భద్రవతి అంటుంది. ఎందుకు రామరాజు దగ్గరికి వెళ్లి కేసుని క్లోజ్ చెయ్యమని చెప్తే సరిపోతుందని పెద్దావిడ సలహా ఇస్తుంది. దాంతో భద్రవతి తనపై కోప్పడుతుంది. వాడి దగ్గర నేను తగ్గడమేంటి.. ఆస్తులన్నీ పోయినా సరే నా మేనల్లుడుకి శిక్ష పడకుండా చేస్తానని భద్రవతి అంటుంది. మరొకవైపు రామరాజు ఇంటికి కూడా నోటీసులు వస్తాయి. అమూల్య వచ్చి సాక్ష్యం చెప్పాలని అందులో ఉంటుంది. ఇప్పుడు అమూల్య కోర్ట్ కి వెళ్లాలా అని భద్రవతి అంటుంది. నోటీసులో ఉంటుంది. అప్పుడే రేవతి పెద్దావిడ రామరాజు దగ్గరికి వచ్చి.. మీరు కేసు వెనక్కి తీసుకోండి.అప్పుడే నా కొడుకుకి శిక్ష పడదని రేవతి అంటుంది. వాడు చేసిన పనికి కేసు వెనక్కి తీసుకోవడం ఉండదని ధీరజ్ అంటాడు. అన్నయ్య మీరు అయిన ఆలోచించండి అని రేవతి అంటుంది. అన్నయ్య అని పిలిచావ్.. ఏ సాయం అయినా చేస్తాను కానీ ఈ విషయంలో ఏ హెల్ప్ చెయ్యలేనని చెప్పి రామరాజు వెళ్ళిపోతాడు. మరొకవైపు అమూల్య కాలేజీ నుంచి వస్తున్న దారిలో విశ్వ తన కార్ తో అక్కడికి వస్తాడు. అప్పుడే అమూల్య దగ్గరికి ధీరజ్ వచ్చి తీసుకొని వెళ్తాడు. అమ్మో ఇప్పుడు వాడు వచ్చాడేంటని విశ్వ టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత అమూల్యని ఇంటి దగ్గర దింపి ధీరజ్ మళ్ళీ వస్తాడు. ధీరజ్ ని చూసి విశ్వ షాక్ అవుతాడు. ఏంట్రా నా చెల్లి వచ్చే దారిలో ఏం చేస్తున్నావ్.. మళ్ళీ పోలీసులకి ఫోన్ చేసి చెప్పాలా అని ధీరజ్ అనగానే విశ్వ భయపడుతాడు. ఇంకొకసారి ఇలా చేసావంటే నీ సంగతి చెప్తానని వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు వల్లిని నర్మద, ప్రేమ కచేరికి రమ్మని చెప్తారు. దాంతో స్నాక్స్ కూల్ డ్రింక్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రావనుకున్న అక్క వచ్చావని ప్రేమ అంటుంది. నేను రాకపోతే మీరే నా దగ్గరికి వస్తారు కదా అని వల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 21, 2026 12:19PM
Karthika Deepam2 : దీపకు శివన్నారాయణ వార్నింగ్.. సూరజ్కు అదిరిపోయే ఐడియా ఇచ్చిన వంటలక్క!
స్టార్ 'మా'లో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -702 లో..... సూరజ్ ఫుడ్ తీసుకొని డెలివరీ చెయ్యడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు ఫుడ్ మేం ఆర్డర్ చెయ్యలేదని చెప్తారు. అతను మోసం చేసాడని సూరజ్ కి అర్థమవుతుంది. ఆ తర్వాత దీపని శివన్నారాయణ తిడతాడు. నీ అజ్ఞానంతో ఒక పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేసావ్.. ఇప్పుడు మళ్ళీ లక్షల్లో నష్టం తెచ్చి పెట్టావని శివన్నారాయణ కోప్పడతాడు. అతని మాటలు చూస్తే అలా లేవు పెద్దయ్య.. ఇలా మోసం చేస్తాడు అనుకోలేదని దీప అంటుంది. ఇక క్షమించనని శివన్నారాయణ అంటుంటే తను మట్టిమనిషి సర్ ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నష్టానికి బాధ్యత వహిస్తుందని కార్తీక్ అంటాడు. అప్పుడే మేనేజర్ వచ్చి అతను ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని అంటాడు. వాడు బ్యాంకు క్లోజ్ ఉన్న రోజు చెక్ ఇచ్చాడు అంటేనే అర్థం చేసుకోవాలి. ఇక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ దీప ఆఫీస్ లో అడుగుపెట్టడానికి వీల్లేదని శివన్నారాయణ అనగానే ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వమని దీప రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో శివన్నారాయణ సరే అంటాడు. సాయంత్రం వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నాను.. ఈ ప్రాబ్లమ్ క్లియర్ చెయ్యకపోతే దీప ఇక ఆఫీస్ కి రానవసరం లేదని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సూరజ్ డల్ గా కూర్చొని ఉంటాడు. ఏంట్రా పొగరుబోతోడా ఈ కాఫీ తీసుకోమని జ్యోత్స్న వస్తుంది. ఏంట్రా మాట పడిపోయిందా అని జ్యోత్స్న అనగానే ఇదంతా ఎవరో కావాలనే చేశారు.. నువ్వే చేసావని సూరజ్ అంటాడు. నువ్వు నాతో చేతులు కలుపు నీకు మంచి జాబ్ ఇస్తానని జ్యోత్స్న అంటుంది. ఐ లవ్ యు అని సూరజ్ చెప్తాడు దాంతో జ్యోత్స్న కోప్పడుతుంది. మరొకవైపు దీప డల్ గా ఉంటుంది. అప్పుడే సూరజ్ వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఏం చెయ్యాలో నాకు పెద్దగా తెలియదు.. మీరు గతంలో టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు ఫుడ్ మిగిలితే ఏం చేశారని సూరజ్ అడుగుతాడు. మా నాన్న టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు లాటరీ పెట్టాము. అందులో గెలిచినవాళ్ళకి ఫుడ్ ఫ్రీ అని పెట్టేవాళ్ళం. ఆ తర్వాత మిగిలిన ఫుడ్ ని హాస్పిటల్ ముందుకు వెళ్ళి ఫుడ్ ఫ్రీగా పెట్టేదాన్ని అని దీప చెప్పగానే.. మంచి ఐడియా ఇచ్చారు రండి అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 21, 2026 12:12PM
Brahmamudi: ఇందు, రాజుల పెళ్లి గుట్టు విప్పేసిన ఐశ్వర్య.. రేఖకు మైండ్ బ్లాక్!
స్టార్ 'మా' లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1064 లో..... ఈ ఐశ్వర్య ఏంటి ఇంకా ఫోన్ చెయ్యలేదని లక్కీ అనుకుంటాడు. అప్పుడే రాజు ఎక్కడున్నాడని తన దగ్గరికి చలపతి -లక్ష్మీ వస్తారు. నాకు తెలియదు అంకుల్ అని లక్కీ చెప్తాడు. నీకు వాడి గురించి తెలియకుండా ఉండదు. నిజం చెప్పమని కోప్పడుతాడు. నిజం అంకుల్ వాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నానని లక్కీ అంటాడు. అప్పుడే రాజు నుంచి ఫోన్ వస్తుంది.ఏంట్రా తెలియదన్నావని చలపతి అంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ లో పెట్టి మాట్లాడు లేదంటే చంపేస్తానని చలపతి అనగానే లక్కీ లిఫ్ట్ చేస్తాడు. ఒరేయ్ ఎక్కడున్నావ్ రా ఇక్కడ పార్టీ స్టార్ట్ అయిందని అంటాడు. ఫోన్ కట్ కాగానే తెలియదన్నావ్ ఇప్పుడు చెప్పు ఎక్కడున్నాడని చలపతి అడుగుతాడు. మరొకవైపు ఇందు కొత్త సీఈఓ అని రేఖ తనని స్టేజ్ పైకి తీసుకొని వెళ్తుంది. మీకు కంపెనీ గురించి ఏం తెలుసని అక్కడికి వచ్చిన అతను అడుగుతాడు. నాకు మా రేఖ ఆంటీ అంతా చెప్పింది బిజినెస్ గురించి నేర్పించిందని ఇందు చెప్తుంది. ఇందు మాట్లాడుతుంటే ఒక క్లయింట్.. మేం మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు.. మీ కంపెనీకి కస్టమర్స్ మీ ఈ రేఖ వచ్చాక తనపై నమ్మకం లేక వెళ్లిపోయాం. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు చాలా నమ్మకంగా ఉంది ఇప్పుడు నీ కంపెనీకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తానను అతను అంటాడు. మరొకవైపు చలపతి, లక్ష్మి పార్టీ దగ్గరికి వస్తారు. లక్కీ గాడు చెప్పిన అడ్రెస్ ఇదే అంటూ లోపలికి వెళ్తాడు. వాళ్ళని అపర్ణ చూసి మీరు ఇక్కడ ఏంటని అడుగుతుంది. మా అబ్బాయి రాజు ఇక్కడ ఉన్నాడని తెలిసిందని లక్ష్మీ అనగానే వీళ్లకి వాళ్ళకి పెళ్లి అయినట్లు తెలియదని ఇందు చెప్పింది కదా అని అపర్ణ అనుకుంటుంది. మీరు ఇక్కడే ఉండండి రాజుని తీసుకొని వస్తానని అపర్ణ అంటుంది. అపర్ణ వెళ్లి రాజుకి చెప్పగానే రాజు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. నేను ఇందు ఇక్కడ బిజినెస్ పని మీద వచ్చామని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళు వెళ్లడం రేఖ చూస్తుంది. ఎవరు వాళ్ళు అని రాజుని రేఖ అడుగుతుంది. మరి లోపలికి తీసుకొని రాకుండా పంపిస్తున్నావని రేఖ అంటుంది. రాజు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. తరువాయి భాగంలో ఐశ్వర్య అందరి ముందు రాజు, లక్కీ మాట్లాడుకున్న వీడియో ప్లే చేస్తుంది. అందులో నాకు ఇందుకి పెళ్లి కాలేదు యాక్టింగ్ చేస్తున్నామని రాజు అనడం విని అనడం రేఖ వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 21, 2026 12:04PM.webp)
Godhavari: జాను కుటుంబం రోడ్డున పడేలా చేసిన సింహాద్రి.. సూర్య సాయం అందుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి (Godhavari ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-35 లో.. జాను వాళ్ళ ఇంటికి బ్యాంక్ అధికారులు, పోలీసులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని చెప్తారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. మాకు ఒక గంట టైమ్ ఇవ్వండి సర్.. సింహాద్రి అంకుల్ తో మాట్లాడి తీసుకొస్తామని నందు, జాను వెళ్తారు. సింహాద్రి ఇంటికి వాళ్ళు వెళ్తే అక్కడ అతను ఉండడు. ఇక అతని భార్యని మా ఇంటి పత్రాలు మీ దగ్గర ఉన్నాయా.. అంకుల్ ఇంట్లో లేరా అని నందు, జాను అడుగగా ఇంట్లో లేడని తను చెప్తుంది. నాకు ఏ పత్రాలు తెలియవని ఆమె చెప్పగానే అంకుల్ వస్తే మా ప్రాబ్లమ్ చెప్పండి అని చెప్పేసి జానూ, నందు వెళ్తారు. మరోవైపు జానూ, నందు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తిరిగి వారి ఇంటికి వెళ్ళడం అంతా చూస్తుంటాడు సింహాద్రి. ఇక బయటకొచ్చేసిన నందు, జాను మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దామని నందు అడుగగా ఒకసారి ఫోన్ ఇవ్వు అని తీసుకొని సూర్యకి కాల్ చేస్తుంది జానూ అదేసమయంలో సూర్య వాళ్ళ అమ్మతో కారులో వెళ్తుంటాడు. ఆ అమ్మాయితో తిరుగకు.. ఫోన్ మాట్లాడకు అని వాళ్ళ అమ్మ చెప్తుంటుంది. అప్పుడే జానూ కాల్ చేయడంతో సూర్య చూస్తాడు. సూర్య వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని కాల్ కట్ చేస్తుంది. జానూ మళ్ళీ ట్రై చేస్తుంది. సూర్య వాళ్ళ అమ్మ మళ్ళీ కట్ చేస్తుంది. ఇక చేసేదేమీ లేక వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చాక పోలీసులు ఇంకా బ్యాంక్ అధికారులతో నందు, జానూ మాట్లాడతారు. మా నాన్న లోన్ తీసుకున్నట్లుగా మాకు తెలియదు.. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని వాళ్ళు అంటారు. మాకు అవన్నీ తెలియదు.. మేము నోటీసులు పంపించాం.. గడువు అయిపోయింది.. మీరు ఖాళీ చేయాలని అధికారులు, పోలీసులు చెప్తారు. జానూ ఎంత మాట్లాడినా వాళ్ళు వినకపోయేసరికి జానూ వాళ్ళ అమ్మ పోలీస్ కాళ్ళ మీద పడబోతుంటే తనని జానూ ఆపుతుంది. ఈ ఇల్లు మా నాన్న కష్టార్జితం.. ఎలాగైనా దీన్ని కాపాడుకుంటామని జాను అనగానే మీరు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని పోలీసులు అంటారు. ఇక ఎంత రిక్వెస్ట్ చేసినా అధికారులు, పోలీసులు వినకపోయేసరికి జాను, నందు, వాళ్ళ అమ్మ, నానమ్మ అందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వాళ్ళ ఇల్లుని అధికారులు సీజ్ చేస్తారు. అదంతా సింహాద్రి దూరం నుండి చూస్తుంటాడు. జానూ వాళ్ళ ఇంటికి మురళి వస్తాడు. ఇంటిని సీజ్ చేయడం చూసి షాక్ అవుతాడు. వెంటనే వారిని వెతకడానికి బైక్ పై తిరుగుతుంటాడు. అదే సమయంలో సూర్య వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 20, 2026 11:16AM.webp)
Brahmamudi : రేఖకు చుక్కలు చూపించిన రాజు.. ఇందు పార్టీలో ఊహించని ట్విస్ట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1063 లో.. వెంకి ఫుడ్ డెలివరి చేసి అలసిపోతాడు. భోజనం చేద్దాం అనేసరికి తను తెచ్చుకున్న భోజనం పాడవుతుంది. దాంతో వాటర్ తో సరిపెట్టుకుంటాడు. అప్పుడే నందు వస్తుంది. నా వల్లే కదా ఇన్ని కష్టాలు పడుతున్నావని నందు అంటుంది. నువ్వేం చేసావ్.. జాబ్ చూసి మంచి పని చేసావ్.. నేనే నీకు థాంక్స్ చెప్పాలని వెంకీ అంటాడు. మరొకవైపు ఇందు సీఈఓ అయిందని తెలియడానికి పార్టీ ఏర్పాటు చేస్తారు. పార్టీలో సీతారామయ్య ఫోటో పెడుతారు. అది రేఖ చూసి ఎవరు ఆ ఫోటో పెట్టారని కోప్పడుతుంది. ఫోటో తీసెయ్యబోతుంటే ఆగండి అని రాజు ఎంట్రీ ఇస్తాడు. ఆ ఫోటో పెట్టించింది మనమే అని రాజు అంటాడు. అవును కానీ ఎందుకు అలా చేసావని రేఖ అడుగుతుంది. ఇప్పుడు ఇది తీసెయ్యండి అని కోప్పడుతుంది. అసలు మీకు బిజినెస్ రాదు పిన్ని అని రాజు అనగానే ఏం మాట్లాడుతున్నావని రేఖ కోప్పడుతుంది. ఇప్పుడు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టె క్లయింట్స్ అందరు కూడా సీతారామయ్య గారిని చూసే కదా పెట్టేది.. మరి అలాంటప్పుడు ఆయన ఫోటో లేకుండా ఎలా.. ఇప్పుడు తన ఫోటో చూసి అందరూ క్లయింట్స్ వస్తారని రాజు అంటాడు. దానికి రేఖ కూల్ అవుతుంది. ఆ తర్వాత చాలా మంచి పని చేసావ్ రాజు ఇన్నాళ్లుగా నా వాళ్ల జ్ఞాపకాలు కూడా లేకుండా చేసింది ఆ రేఖ అని రాజుతో అపర్ణ అంటుంది. మరొకవైపు రేఖ తరుపు క్లయింట్స్ ఏం మాట్లాడుకుంటున్నారని ఇందు వాళ్ళ మాటలు వింటుంది. మరొకవైపు రాజు కొంతమంది క్లయింట్స్ ఏం అనుకుంటున్నారని వాళ్లతో మాట్లాడతాడు. మీరు అచ్చం రాజ్ లాగా ఉన్నారని క్లయింట్స్ అంటారు. నేను ఇందు భర్తని అని రాజు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 20, 2026 11:14AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






