
బెడ్ మీద మొగుడు ఉండాలి కానీ శ్రీముఖి బెడ్ మీద టెడ్డి బేర్ లు ఉంటాయి!
ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి తమన్నా సింహాద్రి నిండుగా పెద్ద ముత్తైదువులా వచ్చింది. మొదట్లో బాగా నవ్వించింది కానీ లాస్ట్ లో బాగా ఎమోషనల్ అయ్యింది. "ఓహ్ ఓహ్ మై ఫ్రెండ్ తిడితే " అనే సాంగ్ కి డాన్స్ చేశారు శ్రీముఖి, తమన్నా సింహాద్రి. "నీకొక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను" అని చెప్పింది తమ్మన్న. పెద్ద అట్టపెట్టె ఓపెన్ చేసేసరికి అందులో పింక్ కలర్ టెడ్డి బేర్ చూసి శ్రీముఖి ఫుల్ ఖుషీ ఐపోయింది. "ఈ టైములో బెడ్ మీద మొగుడు ఉండాలి కానీ శ్రీముఖి బెడ్ మీద చాలా టెడ్డి బేర్ లు ఉంటాయి" అని చెప్పింది తమన్నా సింహాద్రి. "తమన్నా గారు మీ ఇద్దరి మధ్య అసలు ఫ్రెండ్ షిప్ ఎలా అయ్యింది. ఒకసారి మీరు చెప్తారు " అని అవినాష్ అడిగాడు. "బిగ్బాస్ నాకిచ్చిన పెద్ద గిఫ్ట్ శ్రీముఖి .వరల్డ్. నా ప్రపంచమే శ్రీముఖి. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు నేను ఇల్లు కట్టిస్తా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు అంది. మాటలు ఎంతో మంది చెప్తారు కానీ ఆ కలను నెరవేర్చటం అనేది మాత్రం అది శ్రీముఖికి సాధ్యం అయ్యింది." అంటూ ఎమోషనల్ అయ్యింది. " నథింగ్ నథింగ్ నేను చేసింది ఏమీ లేదు. నేను ఒకటే ఒకటి చెప్తా తమన్నా ని ఇంకా ఎందుకు చేరదీస్కోలేరో వాళ్ళ అమ్మానాన్న అన్నయ్య అనేది నాకు తెలీదు నేను మాత్రం తనకి ఎప్పటికీ ఉంటానని మాటిస్తున్నాను" అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.
May 07, 2026.webp)
నవదీప్ కి ఇంత పిల్లాడు ఉన్నాడా!
బుల్లితెర మీద జబర్దస్త్ రేంజ్ లో అలరించే కామెడీ షో ఇంతవరకు లేనే లేదు. ఐతే రీసెంట్ గా జీ తెలుగులో కొత్తగా ఒక కామెడీ షో మొదలయ్యింది. అదే మాస్ జాతర. ఆడియన్స్ కి కొద్దికొద్దిగా కనెక్ట్ అవుతూ వస్తోంది. హోస్టులుగా అమరదీప్, దీపికా రంగరాజు, సుప్రీతా ఉన్నారు. జడ్జెస్ గా జానీ మాష్టర్, నవదీప్, బిందు మాధవి ఉన్నారు. ఈ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నవదీప్ ఒక స్కిట్ లో చేసాడు. అది బాగా ఫన్నీగా ఉంది. నవదీప్ భార్యను అంటూ ఒక లేడీ ఆర్టిస్ట్ చేసిన హంగామా మాములుగా లేదు. "ఏయ్ నవదీపు "ఏయ్ నవదీపు ... ఇంట్లో పిల్లాడికి డైపర్ మార్చాలా , వంట చేయాలి… అవన్నీ మానుకుని నువ్వేం చేస్తున్నావ్ ఈడ ..దా ఇంటికి రా " అంది. "నువ్వెవరమ్మా " అంటూ నవదీప్ సీరియస్ గా అడిగాడు. "పెళ్ళాన్నే మర్చిపోయావా నువ్వు " అంది ఆర్టిస్ట్. "ఎవరి పెళ్ళానివమ్మా " అన్నాడు. "నీకే నీకే" అంది. అంతే షాకయ్యాడు నవదీప్. "ఎందుకట్లా అబద్దాలాడుతున్నావ్" సూడు అంటూ తన సంఖ్యలో ఉన్న బిడ్డలాంటి ఒక వ్యక్తిని టేబుల్ మీద నిలబెట్టింది. "సేమ్ కళ్ళు సేమ్ పోలికలు అచ్చం నాన్న పోలికలే" అన్నారు లేడీ ఆర్టిస్టులంతా కలిసి. దానికి నవదీప్ నవ్వలేక చచ్చిపోయాడు.
May 07, 2026
వామ్మో వీళ్ళు ఇంత నాటీ పనులు చేశారా!
కుక్కు విత్ జాతి రత్నాలు షో లేటెస్ట్ ప్రోమో మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా రాబోతోంది. ఇందులో నిఖిల్ విజయేంద్ర సింహ, పల్లవి గౌడ, పల్లవి రామిశెట్టి, రాకింగ్ రాకేష్, కళ్యాణ్ పడాలా, ఆషిక వాళ్ళ అమ్మలతో కలిసి వచ్చారు. వాళ్లంతా రాగానే జడ్జ్ శ్రీదేవి "మీరు చెప్పాలి మీ పిల్లలు ఎం అల్లరి చేశారు" అంది. "చెప్పాలంటే చాలా ఉన్నాయి నాన్న అతను చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు" అంటూ నిఖిల్ గురించి వాళ్ళ అమ్మ చెప్పింది. " రిజర్వ్డ్ ఆ ఎంత మంది కోసం టేబుల్స్ రిజర్వ్ చేసాడో తెలుసా వీడు" అని రోహిణి పరువు తీసేసింది. "అత్తయ్య గారు అబ్బాయి చేసిన అల్లరి పనుల గురించి చెప్పండి" అని రోహిణి కళ్యాణ్ పడాలా వాళ్ళ అమ్మను అడిగింది. "సిగ్గుపడతారేంటండి మీరు" అన్నాడు కళ్యాణ్. "మా అబ్బాయి చాలా సైలెంట్ గా ఉంటాడు" అని వాళ్ళ అమ్మ చెప్పింది. " మీకు తెలీదు ఎన్నెన్ని చేశాడో తెలుసా ఎపిసోడ్స్ లో" అంది రోహిణి. "నాకు తెలుసు ఎం చేయలేదు" అని చెప్పింది వాళ్ళ అమ్మ. "ఆరేళ్ళ వయసులో తెలియకుండా ఒకసారి కత్తిరి తెచ్చుకొని జుట్టు అంతా కట్ చేసేసుకుంది" అంటూ పల్లవి రామిశెట్టి వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది. తర్వాత ఆషిక గురించి వాళ్ళ అమ్మ చెప్పింది. "ఆమె పుట్టుకతోనే యాక్టర్ "అని. తరువాత పల్లవి గౌడ వచ్చి వాళ్ళ అమ్మను చూపించి "మా అమ్మ పేరు లక్ష్మి ఈవిడ మా ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మి ఎప్పుడు బానే ఉంది మా ఇంట్లో " అని చెప్పింది. " మా ఇంటి రారా కొంచెం...మా ఇంటికి కూడా రండి" అంటూ శ్రీదేవి, అలీ అడిగారు కామెడీగా. తర్వాత రాకేష్ వాళ్ళ అమ్మను తీసుకొచ్చాడు. "మా అమ్మ జయలక్ష్మి గారు జయలక్ష్మీలో జయం ఎప్పుడు నాకిచ్చేసి లక్ష్మీల మా ఇంట్లో ఉన్న మా అమ్మ మా అమ్మ అంటే చాలా ఎమోషన్ నాకు బేసికల్లీ ఎందుకంటే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా పెంచింది. చాలా ధైర్యంగా పెంచింది ఎక్కడైనా మాట్లాడి ఏదైనా సాధించుకొచ్చేటంత " అని చెప్పాడు."నేనేం ఏదీ కోరుకోలేదు నాకు ఏదైనా ఇవ్వమని దేవుణ్ణి అడగను నా పిల్లలు బాగుండాలి ఎంత సంపాయించావ్ నాన్న అని అడగను ఎంత ఖర్చు పెట్టుకున్నావ్ అని అడగను కాకపోతే మంచి పేరు తెచ్చుకోవాలి అదొక్కటి చాలా ఆస్తులు ఉన్నంత" అని చెప్పింది రాకేష్ వాళ్ళ అమ్మ.
May 07, 2026.webp)
Brahmamudi : ఇందు పెళ్లిలో బిగ్ షాక్.. మదన్ కాకుండా రాజుతో ఏడడుగులు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1025 లో...రాజేష్ తన డబ్బుల కోసం ఐశ్వర్య దగ్గరికి వస్తాడు. నువ్వు ఇలా అయితే ఇవ్వవు.. నేను వెళ్లి మీ ఆంటీని అడుగుతానని రాజేష్ అనగానే నువ్వు వెళ్లి అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వదు.. నేనే ఇస్తాను కాస్త టైమ్ ఇవ్వమని ఐశ్వర్య రిక్వెస్ట్ చేస్తుంది. దానికి రాహుల్ సరే అంటాడు. ఆ తర్వాత లక్కీకి ఐశ్వర్య ఫోన్ చేసి డబ్బు అడుగుతుంది. రాజు తనతో ఫోన్ లో మాట్లాడుతాడు. ఒరేయ్ నాకు డబ్బు ఇవ్వు అంటుంది. ఒరేయ్ అంటూ మాట్లాడుతున్నావని రాజు కోప్పడతాడు. నువ్వు ఇలా మాట్లాడితే నీకన్నా దిగజారి మాట్లాడగలను.. ఉన్నప్పుడు ఇస్తానని రాజు కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకురా అలా మాట్లాడుతున్నావ్.. మనమే డబ్బు ఇవ్వాలని లక్కీ అంటాడు. అర్ధం అయింది. నీకు నా అవసరం అయిపోయింది.. ఇక నాతో నీకేం పని అని లక్కీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఒరేయ్ లక్కీ నేను చెప్పేది విను అని రాజు తన వెనకాలే వెళ్తాడు. ఆ తర్వాత కిచెన్ లో అపర్ణ, స్వాతి ఇందు వంట చేస్తూ సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే రేఖ పిలుస్తుంది. హాల్లో పంతులు గారు కూర్చొని ముహూర్తం చూస్తాడు. పూజ ఏమైనా ఉందా అని స్వాతి అడుగుతుంది. లేదు మదన్ తో ఇందు పెళ్లి అనగానే అందరు షాక్ అవుతారు. వద్దని అపర్ణ కోప్పడుతుంది. ఎంత చెప్పినా రేఖ వినదు. ఆ తర్వాత రేఖ ఇందు, స్వాతి మాట్లాడుకుంటారు. ఇది నీ జీవితం.. తను చెప్పినట్లు చేయకు పెళ్లి అంటే జీవితాంతం తనతో కలిసి ఉండాలని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత స్వాతి ఏడుస్తూ బయట కూర్చొని ఉంటుంది. ఇందు వచ్చి ఏమైందని అడుగుతుంది. నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్తుంది. నువ్వు ఏడవకు అతన్ని నిన్ను కలుపుతాను.. ఎవరు అతను అని ఇందు అడుగుతుంది. రేపు నువ్వు పెళ్లి చేసుకోబోయే మదన్ అని స్వాతి అనగానే ఇందు షాక్ అవుతుంది. అతనికి తెలుసా అని ఇందు అడుగుతుంది. లేదని స్వాతి చెప్తుంది. అతనితో నా పెళ్లి జరగదు ఒకేనా అని స్వాతికి ఇందు ధైర్యం చెప్తుంది. తరువాయి భాగంలో ఇందు, రాజు పెళ్లి చేసుకొని వస్తారు. వాళ్ళని చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 07, 2026.webp)
Karthika Deepam2 : జ్యోత్స్న పెళ్లి కోసం కొత్త కండీషన్.. కార్తీక దీపం 2లో అనూహ్య మలుపులు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -663 లో..... జ్యోత్స్న ఏదో ప్లాన్ తోనే ఇదంతా చేసింది అని కార్తీక్ తో దీప అంటుంది. ఏం చేసినా తనకి సమాధానం నేనే చెప్తానని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి.. బాల్కనీలోకి మీరు ఇద్దరు రండి మాట్లాడాలని అంటుంది. మరొకవైపు మీరేంటి అక్కడ జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తున్నారని శ్రీధర్ తో కాంచన అంటుంది. అది కాదు నాకు జ్యోత్స్న చేసేది కరెక్ట్ అనిపిస్తుందని శ్రీధర్ అంటాడు. కార్తీక్ కి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది కానీ కార్తీక్ చేసుకోలేదు.. జ్యోత్స్న అగ్రిమెంట్ వెనకాల దీప ఉందనిపిస్తుంది. అది నువ్వే కనుక్కోవాలి. ఇప్పుడే కార్తీక్ ని గట్టిగా అడుగుమని శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి కార్తీక్, దీప వెళ్తారు. ఏంటి పిలిచావని కార్తీక్ అడుగుతాడు. నేను ఒక ఆఫర్ ఇచ్చాను కదా .. నా పెళ్లి అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని దానికి మీరు నాకు థాంక్స్ చెప్పాలి కానీ మీరు చెప్పలేదు థాంక్స్ చెప్పించుకోవడానికి పిలిచానని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే.. ఇప్పుడే కిందకి వెళ్లి ఆ వైరాతో చేతులు కలిపావని చెప్తానని దీప అంటుంది. ఏంటి మీ వాళ్ళకి ఏం కాదని కాన్ఫిడెంట్ వచ్చిందా అని జ్యోత్స్న అంటుంది. ఏమైనా అయితే నీ సంగతి చెప్తానని జ్యోత్స్నకి దీప మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత శివన్నారాయణ, దశరత్ లతో కార్తీక్ మాట్లాడతాడు. మనం ఒక సామర్ధ్యం గలా అతన్ని సీఈఓ గా చేసి అతన్ని దగ్గర నుండి చూద్దాం. అతను బాగా వర్క్ చేస్తే అతనితో జ్యోత్స్న పెళ్లి చేద్దామని కార్తీక్ సలహా ఇస్తాడు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ తర్వాత బోర్డు మెంబర్స్ ని జ్యోత్స్న ఇంటికి రప్పిస్తుంది. మీరు సీఈఓగా మీ అల్లుడిని తొలగించారట కదా .. మరి కొత్త సీఈఓ ఎవరు.. ఒకవేళ బయట నుండి ఎవరినైనా తీసుకొని వస్తే మీకు సామర్ధ్యం లేకే బయట నుండి తెచ్చారనుకుంటారని వాళ్ళు అంటారు. నేను ఆలోచిస్తాను.. మీరు వెళ్ళండి అని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సూరజ్ క్యాబ్ కోసం చూస్తుంటే అటుగా వెళ్తున్న జ్యోత్స్న చూసి గిఫ్ట్ షాప్ లో జరిగిన గొడవ గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 07, 2026.webp)
Illu illalu pillalu : వల్లి గర్భం వెనుక అసలు నిజం బయటపెట్టిన డాక్టర్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -464 లో.....నర్మద అక్క ఇంట్లో నుండి ఎక్కడ బయటకు వెళ్ళిపోతుందోనని చాలా టెన్షన్ అయ్యానని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. నీ ముద్దుల అక్కని ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఆపాను కదా అని ధీరజ్ అంటాడు. మరొకవైపు వల్లి తనకి నచ్చినట్లు ఫుడ్ తింటుంది. నర్మద, ప్రేమ దగ్గరికి చందు వచ్చి వల్లి కడుపుతో ఉంది కదా పుల్లటివి తినాలని అన్పిస్తుందని మామిడికాయలు తీసుకొని వచ్చి వల్లికి ఇవ్వమని ఇస్తాడు. మీరే ఇవ్వొచ్చు కదా బావ అని ప్రేమ అంటుంది. తను చేసిన మోసానికి తనని ఎదురుగా చూడలేకపోతున్నానని చందు అంటాడు. ఆ తర్వాత ప్రేమ, నర్మద వెళ్లేసరికి వల్లి వాళ్ళ అమ్మ పంపిన పీతలకూర వేసుకొని తింటుంది. అది చూసి కడుపుతో ఉన్నవాళ్లు పీతల కూర తినొద్దు.. ఆ విషయం మీ అమ్మకి తెలియదా అని నర్మద అంటుంది. వేదవతిని పిలిచి విషయం చెప్తుంది. మీ అమ్మకి ఆ మాత్రం తెలియదా అని వేదవతి కోప్పడుతుంది. నువ్వు ఇంకొకసారి నాకు తెలియకుండా ఏం తినొద్దని వేదవతి చెప్తుంది. తన దగ్గర నుండి బయటకు వచ్చాక.. అసలు వల్లి అక్క కడుపుతో లేదని అనిపిస్తుందని నర్మద అంటుంది. అలా అంటావేంటని వేదవతి అంటుంది. మరి వాళ్ళ అమ్మ పీతల కర్రీ పంపడం ఏంటని నర్మద అనగానే ఆ మాటలు వల్లి వింటుంది. ఏం అంటున్నారు.. నాకు కడుపు లేదా.. నాకు కడుపు వచ్చిందని మీకు కుళ్ళు అని వల్లి అంటుంది. వాళ్ళు అలా అనడం లేదని వేదవతి అంటుంది. ఇప్పుడే హాస్పిటల్ కి వెళదాం పదండి అని వాళ్ళిద్దరిని వల్లి లాక్కొని హాస్పిటల్ కి వెళ్తుంది. డాక్టర్ మీరు చెప్పండి.. వాళ్ళు నాకు కడుపు లేదని అంటున్నారు.. ఇప్పుడే స్కానింగ్ తీసి చూపించండి అని వల్లి అంటుంది. నర్మద, ప్రేమని డాక్టర్ బయటకు పంపించి శ్రీవల్లి చెంపచెల్లుమనిపిస్తుంది. మీ అమ్మ, నువ్వు నాతో నాటకాలు ఆడుతున్నారా.. మీ అమ్మ నా కూతురు కాపురం బాగుండాలని అబద్ధం చెప్పమంటే.. నీకు లేని కడుపుని ఉన్నట్లు చెప్పానని డాక్టర్ చెప్తుంది. దాంతో వల్లి షాక్ అవుతుంది. ఏడుస్తుంది.. నీకు మీ అమ్మ నిజం చెప్పిందనుకున్నా అని డాక్టర్ అంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు నా కాపురం నిలబెట్టాలని డాక్టర్ ని వల్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 07, 2026.webp)
Podharillu : ఒకే రెసాట్ లో తండ్రీకూతుళ్లు.. మహాకు షాక్ ఇచ్చిన ఆ ఫోటో!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -108 లో..... ఇంట్లో అందరు డిస్టబ్ అయ్యారని మహా రెసాట్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అందరు రెసాట్ కి బయల్దేరి వెళ్తారు. మరొకవైపు ప్రతాప్ తన కుటుంబంతో అదే రెసాట్ లో ఉంటాడు. మహాని గుర్తుచేసుకొని బాధపడుతాడు. ఏంటండి ఇంట్లో ఉంటే అదే ఆలోచిస్తున్నారని ఇక్కడికి తీసుకొని వస్తే ఇక్కడ కూడా అదే ఆలోచిస్తున్నారని లలిత అంటుంది.అది పుట్టలేదు అనుకోండి నాన్న.. మర్చిపోండి అని ప్రతాప్ తో ఆదిత్య అంటాడు. మరొకవైపు మహా వాళ్ళు రెసాట్ లోపలికి వస్తారు. ఇక్కడ అందరం ఒక ఫోటో దిగుదామని మహా అంటుంది. ఆ తర్వాత అందరికి కలిసి ఒక రూమ్.. చక్రి, మహా ఒక రూమ్ తీసుకుంటారు. అందుకు మహా ఆధార్ కార్డు కావాలని చక్రి అంటాడు. ఆధార్ కార్డు లేకపోవడంతో చక్రి, మహా ఫోటో తీసుకొని వాళ్ళకి చూపిస్తే భార్యాభర్తలు అని నమ్ముతారని చక్రి అంటాడు. దాంతో ఇద్దరు కలిసి ఒక ఫోటో తీసుకుంటారు. దాంతో చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మహా వాళ్ళు ఒక టేబుల్ పై భోజనం చేస్తారు. మరొకవైపు కొద్దీ దూరం లో ప్రతాప్ వాళ్ళు భోజనం చేస్తారు. నాకు ఆకలి లేదు డ్రింక్ చెయ్యాలని ఉందని నారాయణ వెళ్తాడు. అప్పుడే రెసాట్ లో మందు కోసం ప్రతాప్ వెళ్తాడు. మందు లేదని అక్కడ వాళ్ళు చెప్తారు. అక్కడే ఉన్న నారాయణ.. ప్రతాప్ ని పిలిచి నా దగ్గర ఒక బాటిల్ ఉంది.. మనం ఇద్దరం షేర్ చేసుకుందామని అంటాడు. దాంతో ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు. ఇద్దరికి ఒకరికొకరు తెలియదు.. దాంతో ప్రతాప్ తన బాధని నారాయణకి చెప్తాడు. అంత ప్రేమగా పెంచానని అంటున్నారు.. నచ్చినవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండేదని నారాయణ అంటాడు. ఆ తర్వాత కాసేపటికి దూరం నుండి ఆదిత్య పిలుస్తున్నాడని ప్రతాప్ వెళ్తాడు. ఆ తర్వాత ఎవరు నాన్న అతను అని ఆదిత్య అడుగుతాడు. ఎవరో తెలియదు బాగా మాట్లాడుతున్నాడని ప్రతాప్ అంటాడు. ఆ తర్వాత చక్రి, మహా మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో మళ్ళీ నారాయణ, ప్రతాప్ కలిసి డ్రింక్ చేస్తారు. ఇద్దరు ఒక ఫోటో తీసుకుంటారు. నా ఫోన్ చిన్నది.. ఆ ఫోటోని నా కోడలికి పంపండి అని నారాయణ అనగానే.. మహా ఫోన్ కి పంపిస్తాడు ప్రతాప్. ఆ ఫోటో చూసి మహా షాక్ అవుతుంది. మా నాన్న, మీ నాన్న కలిసి డ్రింక్ చేస్తున్నారని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 07, 2026
Jayam serial : ఇంటి పెద్దాయన షష్ఠిపూర్తి వేడుక.. గంగ, రుద్రల ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -262 లో.. గంగ, రుద్ర కలిసి శకుంతల పెద్దసారు షష్ఠి పూర్తిచెయ్యాలని అనుకుంటారు. ఆ ఫంక్షన్ కి సుధాని పిలిచి అందరిని ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తారు. హాల్లో అందరు ఉండగా రుద్ర, గంగ వెళ్లి విషయం చెప్తారు. షష్ఠిపూర్తికి శకుంతల పెద్దసారు ఒప్పుకుంటారు. ఇక ఈ రోజు నేను కాలేజీకి వెళ్ళను.. షాపింగ్ కి వెళ్తామని స్నేహ, వంశీ అంటారు. మీరేం కంగారు పడకండి షష్ఠిపూర్తికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటానని రుద్ర అంటాడు. వద్దని శకుంతల అంటుంది. సీతారాముల కళ్యాణం రోజు వీళ్లని వద్దంటే వినలేదు అప్పుడు ఏం జరిగిందో చూసారు కదా.. ఇప్పుడు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వీరు చూసుకుంటాడని శకుంతల చెప్తుంది. అత్తయ్య బావ చూసుకుంటానని అంటున్నాడు కదా.. ఎందుకని వీరు అంటాడు. నేను చెప్పినట్లు చెయ్ అని వీరుపై శకుంతల కోప్పడతుంది. సరే అత్తయ్య అని వీరు అంటాడు. సరే పెద్దమ్మ.. మీరు చెప్పినట్లే వీరు ఏర్పాట్లు చేస్తాడని రుద్ర అంటాడు. అప్పుడే లక్ష్మీ, పైడిరాజు గుమ్మం దగ్గరుండి జరిగింది మొత్తం చూస్తారు. ఆ తర్వాత గదిలోకి వచ్చాక ఎందుకు రుద్రని వద్దన్నావని శకుంతలని పెద్దసారు కోప్పడతాడు. ఇప్పుడు వీరు చేస్తే ఏమవుతుందని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత షష్ఠిపూర్తి వేడుక చేస్తున్నాం తప్పకుండా రావాలని పెద్దసారు, గంగ, రుద్ర కలిసి సుధాకి ఫోన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 07, 2026.webp)
శ్రీముఖి దావత్ లో మిస్సైన బాలు!
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇక ఈ షోకి చాలామంది బుల్లితెర సెలబ్రిటీస్ వచ్చారు. అలాగే శ్రీముఖి అందరికీ దావత్ ఇచ్చింది. అలాగే ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే శ్రీముఖి వాళ్ళ అమ్మను తీసుకొచ్చింది. శ్రీముఖి వాళ్ళ అమ్మ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వీడియోస్, మోటివేషనల్ స్టోరీస్ తో దుమ్ము దులుపుతోంది. ఇక ఇప్పుడు ఈ షోకి నల్ల చీర కట్టుకుని వచ్చింది. అంటే శ్రీముఖి వాళ్ళ అమ్మను చూసేసరికి ఫుల్ జోష్ తో "నల్లంచు తెల్లచీర " సాంగ్ వేసుకుంది. వాళ్ళ అమ్మ స్టెప్పులేసింది. "నా ఎనర్జీ మొత్తం పోగేసి ఈ బ్రాండ్ ని తయారుచేసాను" అనేసరికి అందరూ గట్టిగా అరుపులు కేకలు పెట్టారు. "మొట్టమొదటి సారి శ్రీముఖి తన తల్లితో కలిసి ఇస్తున్న శ్రీముఖి దావత్" అంటూ స్టేజి మీద టేబుల్ వేసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తో ఫుల్ జోష్ తో ఈ దావత్ ని ఇచ్చింది. ఇక స్పెషల్ అట్రాక్షన్ గా తమన్నా సింహాద్రి కూడా వచ్చింది. అలాగే జ్యోతక్క, నిఖిల్ మెళియక్కాల్, ప్రియాంక జైన్, విజె సన్నీ, సుహాసిని వంటి వాళ్లంతా వచ్చారు. ఇక నెటిజన్స్ ఐతే శ్రీముఖి పక్క బాలు ఉంటే బాగుండేది కదా..ఎందుకు పిలవలేదు అని అడుగుతున్నారు. శ్రీముఖి వాళ్ళ అమ్మ పుట్టిన రోజులు ఓకే రోజు కావడంతో ఈ దావత్ ఇచ్చినట్టు లతా శ్రీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది.
May 06, 2026.webp)
వంశితతో ఎంగేజ్ ఐన ప్రవీణ్!
పటాస్, జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ లైఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ద్వారా అతనికి విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే . ఈ షోలో ఇంద్రజతో ఒక మదర్ రిలేషన్ ఏర్పడడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమెను అమ్మలా భావించే ప్రవీణ్, తన ఎంగేజ్మెంట్ సందర్భంలో ఇంద్రజ నుంచి ప్రత్యేక ఆశీస్సులు అందుకోవడం అతనికి మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న డ్యాన్సర్ వంశితని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దాంతో ఇప్పుడు ప్రవీణ్ నిశ్చితార్థం చేసుకున్నాడు . ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్గా మారాయి. తోటి బుల్లితెర నటీనటులు, స్నేహితులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రష్మీ గౌతమ్, షబీనా, సత్య శ్రీ వంటి వారు హృదయపూర్వకంగా విషెస్ చెప్పారు. ప్రవీణ్ ప్రయాణం పటాస్ అనే షోతో స్టార్ట్ అయ్యింది తర్వాత జబర్దస్త్ లో మంచి కామెడీ టైమింగ్ తో అందరినీ అలరించాడు. ఆర్ధికంగా కూడా కాస్త సెటిల్ ఐనట్టు తెలుస్తోంది.బుల్లితెరలో ప్రేమపెళ్లిళ్లు కొత్తేమీ. అదే ట్రెండ్లో ప్రవీణ్-వంశిత జంట కూడా తమ వాళ్ళ లవ్ గురించి అందరికీ చెప్పారు . ప్రస్తుతం వీరి పాత ఫోటోలు, సెల్ఫీలు కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ జంటకు ఆశీస్సులు అందిస్తున్నారు. దేవుడు ఆలస్యం చేసిన మంచే చేస్తాడు, సూపర్ జోడి, అన్నా నీకు అమ్మా నాన్న లేకపోయిన అమ్మలా చూసుకునే భార్య వచ్చింది అన్నయా, మీ జంట సూపర్ వున్నారు నీ కోసం దేవుడు ఈ అమ్మాయిని ఉంచాడు . ఏది మంచి ఏది చెడు అని దేవుడికి తెలుసు అందుకే కొన్ని మన జీవితంలో తొలగించి, కొన్ని ఇస్తాడు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
May 06, 2026
Kruthika : లండన్ వెళ్లాల్సిన కృతిక.. హీరోయిన్ ఎలా అయింది!
పొదరిల్లు సీరియల్ లో మహా పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది నటి కృతిక ఉమాశంకర్. కర్ణాటకకి చెందిన కృతిక స్టార్ మాలో ప్రసారమవుతున్న 'మగువ ఓ మగువా' సీరియల్తో తెలుగు ఆడియన్స్ కు తొలిసారి పరిచయమైంది. ఇందులో సింధూర పాత్రలో నటించి మెప్పించింది. ఇది నడుస్తుండగానే 'పొదరిల్లు' సీరియల్లో హీరోయిన్ గా అవకాశం లభించింది. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో 'పొదరిల్లు' సీరియల్ కి టీఆర్పీ అత్యధికంగా ఉంది. మరి ఈ సీరియల్ కథేంటో ఓసారి చూసేద్దాం.. నారాయణ కొడుకులు మాధవ, కేశవ, చక్రి, కన్నా.. ఓ మిడిల్ క్లాస్ ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఓ శాపం ఉంటుంది. ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగదని, వాళ్ళ కొడుకులకి పెళ్ళిళ్ళు కావు అని నారాయణ వాళ్ళ చెల్లెలు తాయారు శాపం పెడుతుంది. దాంతో ఆ ఇంటికి ఏ ఆడపిల్ల రావడానికి ఇష్టపడదు. అయితే తాయారు కూతురు గాయత్రీ మాత్రం నారాయణ పెద్దకొడుకు మాధవని ఇష్టపడుతుంది. మాధవ, గాయత్రీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చచ్చిపోతామంటూ తాయారు ఆమె భర్త ఇద్దరు కలిసి గాయత్రీని బెదిరిస్తారు. ఇక అదే ఇంటికి అనుకోని పరిస్థితుల్లో చక్రిని పెళ్ళి చేసుకొని మహాలక్ష్మి వస్తుంది. ఇక తను ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు కానీ మాధవ, కన్నాల మంచితనం, అమాయకత్వం చూసి వారితో పాటే అదే ఇంట్లో ఉంటుంది. ఒక మంచి జాబ్ చూసుకొని సెటిల్ అవ్వాలనుకున్న మహాలక్ష్మి ఒక మిడిల్ క్లాస్ ఇంట్లోకి వెళ్తుంది. అయితే చక్రిని మాత్రం తను భర్తగా అంగీకరించదు. మరి మహాలక్ష్మి తన లక్ష్యం నెరవేర్చుకుంటుందా..చక్రిని భర్తగా అంగీకరిస్తుందా తెలియాలంటే ఈ 'పొదరిల్లు' సీరియల్ చూడాల్సిందే. తాజాగా కృతికకి స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో ' బెస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ ఫిమేల్ ' అవార్డ్ లభించింది. అది తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది కృతిక. ఇక తను తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్న విషయాలు షేర్ చేసుకుంది. తను మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్లాలనుకున్నప్పుడు తనకి సీరియల్ లో ఛాన్స్ వచ్చిందని, అప్పుడు వాళ్ళ అమ్మే తనకి సపోర్ట్ చేసిందని చెప్పింది. వాళ్ళ నాన్నని ఒప్పించేలా వాళ్ళ సపోర్ట్ చేసినట్టుగా కృతిక చెప్పుకొచ్చింది. తెలుగులో ప్రభాస్ నా ఫేవరెట్ హీరో.. మిర్చి సినిమా అంటే చాలా ఇష్టం.. ప్రభాస్ పాత సినిమాలన్నీ నేను చూశాను.. అత్తారింటికి దారేది సినిమా కూడా నాకు ఇష్టం.. టాలీవుడ్లో నా క్రష్.. మహేష్ బాబు, ప్రభాస్. హీరోయిన్లలో అయితే అనుష్క,త్రిష, సౌందర్య, శ్రీదేవి.. అంటే ఇష్టమని కృతిక చెప్పింది. ఇక కృతిక ఉమాశంకర్(Kruthika Umashankar) కి ఇన్ స్టాగ్రామ్ లో 144K ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా పొదరిల్లు సీరియల్ వంద ఎపిసోడ్ లు పూర్తిచేసుకుంది. మరి మహా పాత్రలో కృతిక ఎలా నటిస్తుందో కామెంట్ చేయండి.
May 06, 2026.webp)
Anshu Reddy : అమెరికా తర్వాత థాయ్లాండ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న అన్షు రెడ్డి ఫోటోలు!
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి ఉండే క్రేజే వేరు. అందులోను 'ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్' కి మరీను. ఎందుకంటే ఈ సీరియల్ లో రామరాజు అలియాస్ ప్రభాకర్, వేదవతిలకి ముగ్గురు కొడుకులు. ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్ తో ఫేమస్ అయ్యారు. చిన్నోడు ధీరజ్ తన భార్య ప్రేమ.. వీరిద్దరి జంటకి క్యూట్ ఆన్ స్క్రీన్ జంటగా పేరుంది. ఇక పెద్దోడు చందు భార్య శ్రీవల్లి. తను విలన్ గా లేడీ కామెడియన్ గా పేరు తెచ్చుకుంది. ఇక నడిపోడు సాగర్. అతని భార్య నర్మద. నర్మద పాత్రలో నటిస్తుంది అన్షు రెడ్డి. ఈ సీరియల్ లో ఆమె కట్టు బొట్టు చూస్తే అబ్బా భార్య అంటే ఇలా ఉండాలబ్బా అని సీరియల్ చూసేవాళ్లకి అనిపిస్తుంటుంది. ముఖ్యంగా సాగర్ని చూస్తే.. వీడు మామూలు లక్కీ కాదని కుళ్లుకుంటారు. అన్షు రెడ్డి తన నటనతో ఒకవైపు ఆన్ స్క్రీన్ మీద మెప్పిస్తుంటే మరోవైపు పర్సనల్ లైఫ్ లో నిత్యం వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది. గత నెలలో అమెరికాకి వెళ్ళొచ్చిన అన్షురెడ్డి అక్కడ దిగిన ఫోటోలని తన ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా థాయ్లాండ్ కి వెళ్ళింది అన్షు రెడ్డి. ఇక అక్కడ దిగిన ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. అన్షురెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో 992K ఫాలోవర్స్ ఉన్నారు. ఇల్లు ఇల్లాలు సీరియల్ లో పద్ధతిగా కనపడే ఈ తెలుగింటి అమ్మాయి నటన మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
May 06, 2026
Brahmamudi : ఇందు ఆస్తి కోసం రేఖ మాస్టర్ ప్లాన్.. మదన్ ఎంట్రీతో కథ అడ్డం తిరుగుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1024 లో.....రాజు, కావ్య రాసిన వీలునామా చూసి రేఖ, భూషణ్ షాక్ అవుతారు. వీలునామా ప్రకారం ఇందుకి పెళ్లి అయితేనే తనకి ఆస్తులు సొంతం అవుతాయని అందులో ఉంటుంది. దాంతో రేఖ డిస్సప్పాయింట్ అవుతుంది. నా సంతకం చెల్లదు నానమ్మ ఎందుకంటే అమ్మానాన్న వీలునామాలో నాకు పెళ్లి అయితేనే ఆస్తులు నా సొంతం అవుతాయన్నట్టు ఉందని అపర్ణ వాళ్ళకి ఇందు చెప్పగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు ఈ విషయం నీకెలా తెలుసని అపర్ణ అడుగుతుంది. రాత్రి లాయర్ ఫోన్ చేసి చెప్పాడు.. అందుకే నేను అంత కాన్ఫిడెంట్ గా వేలిముద్ర వేసానని ఇందు చెప్తుంది. ఆ తర్వాత భ్రమరాంబ, భూషణ్ , రేఖ టెన్షన్ పడుతారు. ఇన్ని రోజులు ఎంతో ఉహించుకున్నాం.. ఇలా జరుగుతుంది అనుకోలేదని శేషు అంటాడు. నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసని రేఖ తన కొడుకుకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా మార్నింగ్ వరకు ఇక్కడ ఉండాలని చెప్తుంది. మరొకవైపు రాజు పడుకొని ఉంటాడు. తనవంక చలపతి, లక్ష్మీ చూస్తుంటారు. గొప్పింటి బిడ్డ ఇన్ని రోజులు ఈ ఇంట్లో కష్టాలు పడ్డాడని అనుకుంటారు. తనకి ఏదో కల వచ్చిందని అంటాడు కదా ఇప్పుడు మనం నిజం చెప్పొద్దూ ఎందుకంటే నిజం తెలుసుకొని ఆ రేఖకు ఎదురువెళ్తే కష్టం అని లక్ష్మీతో చలపతి అంటాడు. మరుసటి రోజు రేఖ కొడుకు మదన్ వస్తాడు. అర్జెంట్ గా రమ్మన్నారు ఎందుకని అంటాడు. ఇందుని పెళ్లి చేసుకోవాలని అంటుంది. నేను చేసుకోనని మదన్ చెప్తాడు. ఆస్తులు మన చేతికి వచ్చాక విడాకులు ఇవ్వు నీకు నచ్చిన పెళ్లి చేసుకోమని రేఖ అంటుంది. ఆ తర్వాత ఏంటి రేఖ నువు ఏం చేస్తున్నావ్ నీ కొడుకుకి నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తామని అనుకున్నాం కదా అని భ్రమరాంబ అంటుంది. మీకేం ఉందని మీ అమ్మాయిని నాకు కోడలు చేసుకుంటానని రేఖ అనగానే భ్రమరాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 06, 2026.webp)
Karthika Deepam2: శ్రీధర్కు హార్ట్ స్ట్రోక్.. సీఈఓ పదవి కోసం జ్యోత్స్న పంతం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -662 లో... శ్రీధర్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. తనకి ఇంకొకసారి హార్ట్ స్ట్రోక్ వస్తే బ్రతకరు అని డాక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి వెళ్లి కాంచన వాళ్ళు మాట్లాడుతారు. శ్రీధర్ కి రెస్టారెంట్ నుండి ఫోన్ లు వస్తాయి. మీకు ఇక రెస్ట్ కావాలి సీఈఓ పోస్ట్ కి రాజీనామా చెయ్యండి అని కాంచన చెప్తుంది. ఆయనకి రెస్టారెంట్ టెన్షన్స్ ఉన్నాయి కార్తీక్.. కొంచెం ఆలోచించండి.. మీ నాన్న గురించి చివరికి స్వప్న విషయంలో కూడా టెన్షన్స్ అని కాంచన అంటుంది. కాశీ మీరిద్దరు మాట్లాడుకొని ఆయనకు టెన్షన్స్ లేకుండా చెయ్యండి అని కాంచన అంటుంది. స్వప్నని తీసుకొని కాశీ ఇంటికి వెళ్తాడు. మరొకవైపు కార్తీక్, కాంచన, శ్రీధర్ ముగ్గురు శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. శ్రీధర్ నీరసంగా కన్పించడంతో అల్లుడికి ఏమైందని పారిజాతం అడుగుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కార్తీక్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ విషయం మాకు చెప్పలేదని శివన్నారాయణ అడుగుతాడు. పాపం నిన్న దీప చెప్పబోతుంటే జ్యోత్స్న అడ్డుపడిందని పారిజాతం అనగానే జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత నాన్న ఆయనకి టెన్షన్ వద్దు సీఈఓగా వద్దు అలాగే నా కొడుకు కూడా రాడు అని కాంచన చెప్తుంది. అల్లుడిని వద్దని చెప్తున్నా కానీ కార్తీక్ ది నా చేతిలో లేదు.. వాడు ఒప్పుకుంటే వాడు రాకుండా ఉండేలా చేస్తాను కానీ వాడు ఒప్పుకోడని శివన్నారాయణ అంటాడు. నా పెళ్లి జరిగే వరకు ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వదని జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు మీ నాన్న కోసమైనా మనం కలిసిపోదామని స్వప్నతో కాశీ అనగానే పెళ్లికి ముందు అమ్మ లేదు అన్న సింపథీ.. పెళ్ళయాక డబ్బు లేదని.. ఇప్పుడు మా నాన్నని అడ్డు పెట్టుకున్నావా అని కాశీపై స్వప్న కోప్పడుతుంది.ఆ తర్వాత ఇప్పుడు మావయ్య స్థానంలో ఎవరు సీఈఓగా ఉంటారని జ్యోత్స్న అంటుంది. ఆ విషయం గురించి నువ్వు ఆలోచించకు.. మావయ్య గారు చూసుకుంటారని సుమిత్ర అంటుంది. దాంతో కార్తీక్ తన పేరెంట్స్ ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 06, 2026.webp)
Illu illalu pillalu : సాగర్ ఎగ్జిట్ ప్లాన్కు చెక్ పెట్టిన ధీరజ్.. నర్మదను కాపాడిన ఐదు లక్షల బాకీ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -463 లో.......అందరు రాత్రి భోజనం చేస్తారు. సాగర్ ని వేదవతి పిలుస్తుంది. సాగర్ మాత్రం రామరాజు అవమానించాడు అని కోపంగా ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి బ్యాగ్ తో హాల్లోకి వస్తాడు. అది చూసి అందరు షాక్ అవుతారు. ఏంటి నడిపోడా అని వేదవతి అడుగుతుంది. ఈ ఇంట్లో ఉండలేను అమ్మ దొంగదారిన జాబ్ తెచ్చుకున్నానని అందరి ముందు అవమానిస్తుంటే ఎలా ఉంటుందని సాగర్ అంటాడు. రా నర్మద అని సాగర్ అంటాడు. సాగర్ ఏంటి చిన్నపిల్లాడిలాగా ప్రతిసారీ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటున్నావని నర్మద కోప్పడుతుంది. నువ్వు వస్తావా.. నన్ను వెళ్ళమంటావా అని సాగర్ కోప్పడతాడు. వెళ్ళరా.. ఏంటి బెదిరిస్తున్నావా రోజుకి నాలుగుసార్లు వెళ్తానంటావని ధీరజ్ అంటాడు. ఏంట్రా ఉండమనాల్సింది పోయి.. వెళ్ళమంటున్నావని వేదవతి అడుగుతుంది. నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నాన్నకి ఇవ్వాల్సిన అయిదు లక్షలు ఇచ్చేసి వెళ్ళు అని ధీరజ్ అంటాడు. ఇస్తానని సాగర్ అంటాడు. బయటకు వెళ్ళాక ఇవ్వనంటే పరిస్థితి ఏంటని రామరాజు అంటాడు. నువ్వు డబ్బు ఇస్తేనే వెళ్ళనిస్తానని అంటున్నాడని ధీరజ్ అంటాడు. సరే ఇచ్చేసి వెళ్తానని సాగర్ లోపలికి వెళ్తాడు. సారీ వదిన అన్నయ్యని ఆపడానికి డబ్బు అడిగానని నర్మదతో ధీరజ్ అంటాడు. నీకే థాంక్స్ చెప్పాలని నర్మద అంటుంది. నువ్వే ఈ కుటుంబం ముక్కలు కాకుండా ఆపుతావని ధీరజ్ తో వేదవతి అంటుంది. మరొకవైపు వల్లి వాళ్ళ అమ్మకి వల్లి జరిగింది చెప్తుంది. అప్పుడే చందు వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి. ఇంట్లో విషయాలు మీ అమ్మకి చెప్పొద్దని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత సాగర్ తో నర్మద గొడవపడుతుంది. అదంతా రామరాజు వాళ్లు వింటారు. మరొకవైపు నర్మద ఎక్కడ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందోనని ప్రేమ డల్ గా ఉంటుంది. అదే విషయం ధీరజ్ తో చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 06, 2026.webp)
Podharillu : కన్నా ప్రశ్నలకు మాధవ మౌనం.. ట్రిప్కు వెళ్లిన మహా టీమ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -107 లో...... కన్నా మూడ్ డైవర్ట్ చెయ్యడానికి మహా తనని తన ఇష్టమైన ప్లేస్ కి తీసుకొని వెళ్తుంది. అక్కడ తన మనసు మారేలా మాట్లాడుతుంది. ఇద్దరు ఇంటికి వస్తారు. మాధవ కిచెన్ లో వంట చేసుకుంటూ.. వీళ్ళద్దరు ఇంకా ఇంటికి రాలేదనుకుంటాడు. ఆలోపే కన్నా హాల్లో మళ్ళీ డల్ గా కూర్చొని ఉంటాడు. జరిగింది మర్చిపోమని చెప్పాను కదారా.. ఎందుకు గుర్తుచేసుకుంటన్నావని మాధవ అడుగుతాడు. మా అమ్మ నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళింది.. అందరు అన్నట్లు మా అమ్మని అయన పెళ్లి చేసుకోలేదా.. అమ్మలా చూసుకోమని నీ దగ్గర ఉంచి వెళ్లిందా అని కన్నా అడుగుతాడు. మాధవ వాటికి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. నువ్వు ఇంకొకసారి ఇంట్లో నుండి వెళ్ళిపోతే నా మీద ఒట్టే అని మాధవ అనగానే ఇంకెప్పుడు వెళ్ళను అన్నయ్య అంటాడు. ఆ తర్వాత మహా హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ నవ్వుకుంటుంది.అప్పుడే చక్రి వస్తాడు . సరదాగా బయటకు వెళదామా అని అడుగుతాడు. వెళదాం కానీ అందరం వెళదాం.. గాయత్రి బాధ నుండి పెద్ది బయటకు రావాలి.. కన్నా కూడా జరిగింది మార్చిపోవాలని మహా అంటుంది. దాంతో చక్రి ఒక్కొక్కరిగా అందరిని ట్రిప్ కి వెళ్ళడానికి ఒప్పిస్తాడు. అందరు బ్యాగ్ తో బయటకు వస్తారు. అప్పుడే నారాయణ కార్ లో ఎంట్రీ ఇస్తాడు. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత అందరు బయల్దేరతారు. దారిలో అందరు చలువ కళ్ళద్దాలు(స్పెక్ట్స్) కొనుక్కొని సెల్ఫీ దిగుతారు. మహాకి దగ్గరగా చక్రి నిల్చొని ఫోటో దిగబోతుంటే మహా కోపంగా చూస్తుంది. తరువాయి భాగంలో మహా వాళ్ళందరు రెసాట్ కి వెళ్తారు. అక్కడ భోజనం చేస్తారు. నారాయణ పక్కన వెళ్లి డ్రింక్ చేస్తాడు. అదే రెసాట్ లో మహా వాళ్ళ నాన్న ప్రతాప్ కూడా ఉంటాడు. నారాయణతో కలిసి డ్రింక్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 06, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



