నాకు సినిమాలతో ఎప్పుడో పెళ్లయిపోయింది...సినిమా నా భార్య
ఆట డాన్స్ షో ప్రతీ వారం ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక ఈ వారం ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో అడివి శేష్ కనిపించాడు. ఆయన మూవీస్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "మీ లైఫ్ లో ఫీల్ మై లవ్ ఏంటి " అని హోస్ట్ సుధీర్ అడివి శేష్ ని అడిగాడు. "నాకు సినిమాలతో ఎప్పుడో పెళ్లయిపోయింది. సినిమాలు చేయడం నా ప్యాషన్ . సినిమా నా భార్య." అని చెప్పాడు. దాంతో పక్కనే ఉన్న జడ్జ్ రాధికా ఒక రేంజ్ లో లుక్ ఇచ్చింది. "అంటే ఒక్కో ఫిలిం అంటే ఒక్కో వైఫ్ ఆ" అని అడిగేసింది. దాంతో అందరూ నవ్వేశారు. వెంటనే సుధీర్ "అలా ఐతే నేను గత 13 ఏళ్ళ నుంచి చేసుకుంటూనే ఉన్నాను. నాది వీక్లీ ఎపిసోడ్ కదా అంటే వీక్లీ ఒక పెళ్లి నాది " అన్నాడు. వెంటనే రాధికా కౌంటర్ ఇచ్చేసింది. "అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ " అన్నమాట అనేసరికి సుధీర్ భయపడినట్టు నటిస్తూ బాబోయ్ వద్దు నాకా పెళ్లి వద్దు అన్నాడు. ఇక అడివి శేష్ మృణాల్ ఠాకూర్ తో కలిసి నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10 న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు క్షణం, గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి మూవీస్ లో నటించాడు. 2010 లో కర్మ అనే మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి పంజా, ప్రభాస్ తో బాహుబలి, శర్వానంద్ తో కలిసి రన్ రాజా రన్ వంటి మూవీస్ తో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
Mar 19, 2026Karthika Deepam2: కార్తీక దీపం 2 లో హై ఓల్టేజ్ డ్రామా.. సుమిత్ర ఆపరేషన్ వేళ ఊహించని ట్విస్ట్!
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులో ఉంది. తాజాగా ప్రసారమైన మంగళవారం నాటి ఎపిసోడ్-621 లో.. సుమిత్ర ప్రాణాలను కాపాడటం కోసం దీప చేస్తున్న పోరాటం, మరోవైపు జ్యోత్స్న పన్నుతున్న కుట్రల మధ్య కథ రసవత్తరంగా సాగుతోంది. జ్యోత్స్న తన తండ్రి ఎవరో తెలుసుకునే క్రమంలో దాస్ను నిలదీస్తుంది కానీ అతను నిజం చెప్పడు. దాంతో నువ్వు ఊహించుకున్నదానికంటే భయంకరంగా ఉంటాయి నా చేష్టలు కానీ నువ్వు నన్ను ఏం చేయలేవని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోతుంది. జ్యోత్స్న తన నిజమైన తండ్రి దాస్ అని నిరూపించాలని ప్రయత్నిస్తుండగా, అతను మాత్రం సుమిత్ర ఆపరేషన్ పూర్తయ్యేవరకు మౌనంగా ఉండాలని అనుకుంటాడు. అయితే జ్యోత్స్న మాత్రం వెనక్కి తగ్గకుండా, తను అనుకున్నది చేసి తీరుతానని సవాల్ విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తల్లీకూతుళ్ల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు, హాస్పిటల్ లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. దీప కూతురు శౌర్య కనిపించడం లేదన్న వార్త కార్తీక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శ్రీధర్ ఫోన్ చేసి శౌర్య మిస్సింగ్ అని చెప్పడంతో కార్తీక్ ఆందోళనగా బయటకు వస్తాడు. కార్తీక్ ప్రవర్తన చూసి దీపకి డౌట్ వస్తుంది. సరిగ్గా అదే సమయంలో సుమిత్ర కుటుంబం హాస్పిటల్ కి చేరుకోవడంతో అక్కడ చిన్నపాటి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న ప్లాన్ ప్రకారం దీప దగ్గరకు పారిజాతం వెళ్లి శౌర్య కనిపించడం లేదని చెప్తుంది. దాంతో దీప టెన్షన్ పడుతుంది. కూతురు కోసం దీప బయటకు వెళ్లాలని చూస్తున్న సమయంలో డాక్టర్ వచ్చి సుమిత్ర ఆపరేషన్ గురించి ప్రస్తావిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండాలని డాక్టర్ చెప్పగానే.. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. దీప ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని పారిజాతం అనుమానంగా అడగడంతో కథలో అసలు ట్విస్ట్ మొదలైంది. సుమిత్రకు ప్రాణదానం చేసేది దీప అని తెలిస్తే పారిజాతం, జ్యోత్స్న ఊరుకుంటారా? శౌర్యను కార్తీక్ వెతికి తీసుకురాగలడా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దీప తన ప్రాణాలను పణంగా పెట్టి సుమిత్రను కాపాడాలనుకోవడంపై అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. రాబోయే ఎపిసోడ్లలో దీప రహస్యం బయటపడుతుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. సుమిత్ర ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మీరు కూడా ఈ ఉత్కంఠభరితమైన మలుపులను చూడాలనుకుంటున్నారా? రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీ అంచనాను మాతో పంచుకోండి!
Mar 19, 2026Brahmamudi: మొదలైన ఆస్తి చిచ్చు.. రేఖకు షాకిచ్చిన అపర్ణ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -983 లో..... ఇందు స్వాతి గదిలోకి వచ్చి నవ్వుకుంటారు. భలే కవర్ చేసావని ఇందు అంటుంది. అసలు ఇంటర్వ్యూ ఏమైందని స్వాతి అడుగుతుంది. అంత ఒకే అవుతుంది అనుకునే టైమ్ లో ఒక వెస్ట్ ఫెల్లో వచ్చి చెడగొట్టాడని ఇందు చెప్తుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ని అడిగాను. ఇక నాకు ఎవరు తెలియదని స్వాతి అనగానే పర్లేదే ఏదైనా జాబ్స్ కి అప్లై చేస్తాను.. అవసరం ఉంటే వాళ్ళు మెయిల్ చేస్తారు కదా అని ఇందు అంటుంది. మరొకవైపు బారెడు పొద్దు ఎక్కిన రాజు నిద్ర లేవకపోయేసరికి అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి లేపుతాడు. ఇంతకు బండి ఎక్కడరా అని అతను అనగానే అంత మీ చిన్న కొడుకు వెంకీకి తెలుసు.. వాడు తన ఫ్రెండ్ కి ఇచ్చాడు.. పోలీసులు తీసుకొని వెళ్ళారాని వెంకీ మీదకి రాజు తోసేస్తాడు. వెంకీ తను ఎక్కడ పబ్ కి వెళ్ళిన విషయం తెలుస్తుందో అని సైలెంట్ గా ఉంటాడు. మరొకవైపు ఐశ్వర్య మళ్ళీ తన ఫ్రెండ్ కి కాల్ చేసి పార్టీ అంటూ డిస్కషన్ చేస్తుంది. దాంతో స్వాతి వచ్చి రాత్రి అంత జరిగింది కదా.. ఇంకా బుద్ది రాలేదా.. ఎందుకు ఇలా చేస్తున్నావని ఐశ్వర్యతో స్వాతి అంటుంది. నీకు ఏంత ధైర్యం అని ఐశ్వర్య చెయ్ ఎత్తుతుంది. దాంతో ఇందు వచ్చి ఆపుతుంది. స్వాతి చిన్నపిల్ల తనని చుస్తే నీకు ఎలా కొట్టాలని అన్పిస్తుందని ఇందు అనగానే ఐశ్వర్య కోప్పడుతుంది. మనం తోబుట్టువులమని ఇందు అనగానే మీ అమ్మ మా అమ్మ అక్కచెల్లెలు అంతే. నీ స్థాయి వేరు నా స్థాయి వేరు అని ఐశ్వర్య అంటుంది. నాకు అన్ని తెలుసు.. మీ అమ్మ, మా నాన్నని నానమ్మని చంపేసింది. అందుకే నువ్వు అసలు నచ్చవని ఐశ్వర్య అంటుంది. అదంతా రేఖ వింటుంది. వచ్చి నా మేనకోడలు మాట్లాడిన దాంట్లో తప్పేముందని అంటుంది. ఈ స్వాతికి ఎవరితో స్నేహం చెయ్యాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదని భ్రమరాంబ అంటుంది. ఆ తర్వాత నువ్వు ఇక్కడ పనులు అన్ని పూర్తిచేసి వంట చెయ్యడానికి బయటకి వెళ్ళాలి గుర్తు ఉంది కదా అని రేఖ అనగానే గుర్తు ఉంది ఆంటీ అని ఇందు అంటుంది. ఆ తర్వాత ఇందు పరిస్థితి చూసి ఇక రేఖ పేరున ఉన్న పవర్ అఫ్ అటార్నీని ఇందు పేరున మార్చాలని అపర్ణ అనగానే సుభాష్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 19, 2026illu illalu pillalu : విశ్వకు షాకిచ్చిన ధీరజ్.. ఉగాది పచ్చడి వేళ ఇంట్లో హైడ్రామా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -422 లో..... భాగ్యం వాళ్లకి శ్రీవల్లి వీడియో కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఆ ధీరజ్ గాడు ప్రేమని దూరం పెట్టాడని చెప్తుంది. మన గురించి రాకుండా నేను వాళ్ళ సైడ్ మాట్లాడానని శ్రీవల్లి అనగానే నువ్వు ఆ ఇంట్లో ఎలా నెగ్గుకాస్తావో అనుకున్న కానీ తెలివిగా చేస్తున్నావని భాగ్యం మెచ్చుకుంటుంది. అవన్నీ నా పోలికలు అని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత విశ్వ తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాడు. ఆ అమూల్య పీడ విరగడ అయింది. ఇక నా కూతురు పరువు పోయింది.. అందరు నువ్వే తన భర్త అనుకుంటున్నారని రేపు నా కాళ్ళ దగ్గరికి వస్తారని విశ్వ గర్వంగా చెప్తాడు. మరొకవైపు రామరాజు, తిరుపతి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. వాడికి ఎంత ధైర్యం బావ మన ఇంటి ఆడపిల్లని కిడ్నాప్ చేస్తాడా వాడి కాళ్ళు విరగ్గొడుతానని తిరుపతి అంటాడు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వాడి కాళ్ళు ఇప్పుడే విరగ్గొడుతానని రామరాజు వెళ్తాడు. మరొకవైపు సాగర్, ధీరజ్ తో చందు మాట్లాడుతాడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మీ భార్య లు అంత పెద్ద విషయం ఎందుకు దాచారని చందు అంటాడు. నాన్నే కరెక్ట్.. నాకు పెళ్లి చేసి మంచి అమ్మాయిని తీసుకొని వచ్చాడు. తనకి ఎప్పుడు మావయ్య పరువు కుటుంబం అనే ఆలోచిస్తుందని చందు అంటాడు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది వదిలేయ్ బావ వాళ్ళు చిన్న పిల్లలు అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే తిరుపతి వచ్చి మీ నాన్న ఆ విశ్వ పైకి గొడవ కీ వెళ్ళాడని చెప్పగానే ముగ్గురు కొడుకులు వెళ్తారు. రామరాజు వెళ్లి ఆ విశ్వని కొడుతుంటే ముగ్గురు కొడుకులు వెళ్లి ఆపుతారు. ఆ తర్వాత నర్మదతో సాగర్ మాట్లాడకుండా కింద చాపపై పడుకుంటాడు. అలాగే ధీరజ్ కూడా ప్రేమతో మాట్లాడకుండా నేలపై పడుకుంటాడు.ఆ తర్వాత అమూల్యని ధీరజ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తాడు. విశ్వపై కిడ్నాప్ కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసి ఉగాది పచ్చడి వేదవతి అందరికి పెడుతుంది. ప్రేమ, నర్మద చెయ్ పట్టేసరికి శ్రీవల్లికి పెట్టమని ఇస్తుంది. ప్రేమ, నర్మద బాధపడేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. తరువాయి భాగంలో విశ్వని కొట్టారని సేనాపతి గొడవకి వస్తాడు. అప్పుడే పోలీసులు వచ్చి విశ్వని అరెస్ట్ చేస్తారు. వేదవతి, భద్రవతికి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 19, 2026Jayam Serial : ఇషికకు ఇందుమతి వార్నింగ్.. గంగ తల్లిదండ్రుల వేటలో లక్ష్మి!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -220 లో..... ఇందుమతిని రంగా రెచ్చగొడుతాడు. దాంతో ఇషికని తన గ్రిప్ లో పెట్టుకోవాలని ఇందుమతి అంటుంది. ఇషిక వెళ్లి కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. నాకు చెయ్యడం రాదని ఇషిక అనగానే అయితే నా కొడుకుకి నీకు విడాకులు ఇస్తానని ఇందుమతి అనగానే ఇషిక భయపడి తీసుకొని వస్తానని వెళ్ళిపోతుంది. ఇందుమతి దగ్గరికి రంగా వస్తాడు. మీరు చాలా గ్రేట్ మేడమ్ అని రంగా అనగానే నా పర్ఫామెన్స్ ఎలా ఉందని అడుగుతుంది. మేడం సర్ మేడం అంతే అని రంగా అంటాడు. ఆ తర్వాత రంగా బయటకు వెళ్లి ఆ ఇంగ్లీష్ మేడమ్ ని ఇషిక పైకి రెచ్చగొట్టాను ఒక ఆట అడేసుకుందని రంగా చెప్పగానే గంగ నవ్వుకుంటుంది. కానీ నువ్వు, బావ ఇంకా దగ్గర కావాలని రంగా అంటాడు. అంటే ఎలా అని గంగా అడుగుతుంది. నువ్వు బావ సర్ అని కాకుండా బావ, ఏవండీ, డార్లింగ్ అని పిలువు అని రంగా చెప్పగానే గంగ సిగ్గుపడుతుంది. నువ్వు ప్రొద్దున గుడికి వెళ్ళావ్ కదా.. ప్రసాదం బొట్టు తీసుకొని తన దగ్గరికి వెళ్ళు కుంకుమ కళ్ళలో పడితే నువ్వు ఊదు అని రంగా ప్లాన్ చెప్తాడు. దాంతో గంగ బొట్టు పట్టుకొని రుద్ర దగ్గరికి వెళ్ళి బొట్టు పెడుతుంది. అలాగే చూస్తుంది. ఏంటని రుద్ర అడుగుతాడు. కళ్ళలో బొట్టు పడుతుందేమోనని గంగ అంటుంది. పడట్లేదు కానీ ఇక్కడ నుండి వెళ్ళొపో అని రుద్ర అంటాడు. అప్పుడే గంగకి కళ్ళలో కుంకుమ పడుతుంది. దాంతో రుద్ర తన కళ్లలో ఉదుతాడు. అదంతా రంగా చూసి ప్లాన్ సక్సెస్ అనుకుంటాడు. ఆ తర్వాత లక్ష్మీ పాత సూట్ కేసులో గంగ అసలైన పేరెంట్స్ అడ్రెస్ కోసం వెతుకుతుంది. అడ్రెస్ చూసి ఈ అడ్రెస్ ఎక్కడో వివరాలు కనుక్కోమని పైడిరాజుకి లక్ష్మి అడ్రెస్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంట్లో నేను చెప్పినట్లు ఏది జరగడం లేదని పెద్దసారుతో శకుంతల అంటుంది. అప్పుడే రుద్ర వచ్చి మీతో మాట్లాడాలని పెద్దసారుతో అంటాడు. తరువాయి భాగంలో గంగ పేరెంట్స్ పిన్ని బాబాయ్ కాదని రుద్రకి రంగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 19, 2026Podarillu Serial: మహా, చక్రిల విడాకుల వ్యవహారం.. కేశవకు తెలిసిపోతుందా?
స్టార్ మా ఛానెల్లో ప్రతిరోజూ ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'పొదరిల్లు'. రోజుకో సరికొత్త మలుపుతో సాగుతున్న ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 73 మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహా, చక్రిల మధ్య జరుగుతున్న హైడ్రామా వీక్షకులలో క్యూరియాసిటీని అమాంతం పెంచుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్లో విడాకుల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. తన భార్య మహా ఎలాగైనా తనకు విడాకులు ఇస్తుందని భయపడిన చక్రి.. తమకు పెళ్లి చేసిన కానిస్టేబుల్ను ఆశ్రయించడం ఆసక్తిగా మారింది. విడాకులు ఆపేలా చేయాలని చక్రి కోరడంతో, ఆ కానిస్టేబుల్ నేరుగా మహాకు ఫోన్ చేసి లాయర్ ఎంక్వయిరీ పేరుతో అబద్ధాలు ఆడి వివరాలు ఆరా తీయడం కథలో హైలైట్గా నిలిచింది. దీంతో మహా తన విడాకుల ఆలోచనను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, అసలు తమ పెళ్లి సమయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా పెళ్ళి ఎలా జరిగిందనే అనుమానం మహాలో మొదలైంది. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు వివరాల కోసం తన వదిన హారికకు ఫోన్ చేయడం, అలాగే మాధవను కూడా పెళ్ళికి కావాల్సిన అడ్రెస్ ప్రూఫ్ డాక్యుమెంట్ల గురించి ఆరా తీయడం కథలో సరికొత్త ట్విస్ట్కు దారి తీస్తోంది. సాధారణ కుటుంబ కథా నేపథ్యంతో మొదలైన 'పొదరిల్లు' అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. నటీనటుల సహజ నటన, ఎక్కడా బోర్ కొట్టించని స్క్రీన్ ప్లే ఈ సీరియల్ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రత్యేకించి మహా, చక్రిల మధ్య నడిచే ఎమోషనల్ అండ్ కన్ఫ్యూజింగ్ ట్రాక్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రధాన జంట కథతో పాటు.. గాయత్రి పెళ్లి ఫిక్స్ కావడం, శైలు స్కూటీ పాడై కేశవ దగ్గరికి వెళ్లడం వంటి ఉపకథలు కూడా సీరియల్ వేగాన్ని పెంచుతున్నాయి. ప్రతి పాత్రా కథలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిని మరల్చకుండా ఎంగేజింగ్గా ముందుకు తీసుకెళ్తున్నాయి. మహా విడాకుల నిర్ణయం మార్చుకుంటుందా లేదా అసలు నిజాలు తెలుసుకుని చక్రికీ బుద్ధి చెబుతుందా? మహా, చక్రిల విడాకుల వ్యవహారం కాస్తా కేశవ చెవిన పడటంతో కేశవ ఈ జంటను ఏమని ప్రశ్నిస్తాడు? గుట్టు రట్టవుతుందా? తదితర విషయాలు తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ కోసం వేచి చూడాల్సిందే!
Mar 19, 2026
Brahmamudi: తాగిన మైకంలో ఐశ్వర్య అరెస్ట్.. ఇందు పేరు మీదకు ఆస్తుల బదిలీ!
స్టార్ మా ఛానెల్లో టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. మంగళవారం 982 నాటి ఎపిసోడ్లో ఐశ్వర్య చేసిన పనికి కుటుంబ సభ్యులంతా షాక్కు గురయ్యారు. తాగిన మైకంలో రోడ్డుపై వెళ్తున్న ఐశ్వర్యను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో కథ అడ్డం తిరిగింది. పోలీస్ స్టేషన్లో ఐశ్వర్య పరిస్థితిని చూసిన ఇన్స్పెక్టర్ తీవ్రంగా మందలిస్తారు. అయితే ఐశ్వర్యను డ్రాప్ చేయడానికి వచ్చిన లక్కీని రాజు వచ్చి విడిపిస్తాడు. విషయం తెలుసుకున్న ఇందు, స్వాతి అక్కడికి చేరుకుని ఐశ్వర్యను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో నందు తారసపడి ఇందు పద్ధతిని మెచ్చుకుంటూనే, ఐశ్వర్య ప్రవర్తనను తప్పుబడుతుంది. కానీ ఇందు మాత్రం ఎవరినీ తక్కువ చేసి మాట్లాడొద్దని హితవు పలుకుతుంది. ఇక ఇంటికి చేరుకున్నాక అసలు డ్రామా మొదలైంది. ఇందు, స్వాతిలు దొంగచాటుగా రావడాన్ని గమనించిన రేఖ, భ్రమరాంబలు వారిని నిలదీస్తారు. అయితే స్వాతి తన తెలివితేటలతో సీన్ను మార్చేస్తుంది. ఐశ్వర్య తాగిన విషయాన్ని దాచిపెట్టి, రేఖ ప్రేమ కోసం తాము ఎంత తపిస్తున్నామో అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో భ్రమరాంబ కరిగిపోతుంది. దీంతో ఆ గండం గడిచినట్లు కనిపిస్తోంది. ఈ సీరియల్ ప్రారంభం నుండి మధ్యతరగతి మరియు సంపన్న కుటుంబాల మధ్య ఉండే బంధాలను అద్భుతంగా ఆవిష్కరిస్తోంది. ప్రధాన పాత్రధారులు మానస్, దీపికా రంగరాజు తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్లోనూ కొత్త ట్విస్టులు ఇస్తూ దర్శకుడు కథను వేగంగా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఇందు పాత్రలో కనిపిస్తున్న పరిణితి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'బ్రహ్మముడి' పై భారీ చర్చ నడుస్తోంది. రేఖ చేతిలో ఉన్న ఆస్తులను ఇందు పేరు మీదకు మార్చాలని అపర్ణ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకవేళ ఆస్తులు చేతులు మారితే రేఖ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంటర్వ్యూకి వెళ్తున్న ఇందు సర్టిఫికెట్లను భ్రమరాంబ చూస్తుండగా రేఖ రావడంతో తదుపరి ఏం జరుగుతుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రానున్న ఎపిసోడ్లలో ఆస్తుల బదిలీ ప్రక్రియ సజావుగా సాగుతుందా? లేక రేఖ కొత్త కుట్రలకు తెరలేపుతుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Mar 18, 2026
Podharillu: విడాకుల దిశగా మహా-చక్రి ప్రయాణం.. కేశవకు తెలిసిన అసలు నిజం!
స్టార్ మా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'పొదరిల్లు' సీరియల్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. ఈ సీరియల్ మంగళవారం నాటి తాజా ఎపిసోడ్-72లో.. తన వదిన ఇచ్చిన సలహాతో విడాకుల కోసం లాయర్ దగ్గరికి చక్రిని తీసుకొని వెళ్తుంది మహా. లాయర్ కి తన విడాకుల గురించి మహా చెప్తుంది. కేవలం రెండు నెలలకే మీకు విడాకులు ఎందుకంటూ లాయర్ అడుగుతాడు. ఇక మహా, చక్రిల పెళ్ళి పోలీస్ స్టేషన్లో జరిగిందని తెలుసుకుంటాడు లాయర్. ఆధార్ కార్డు లేనిదే ఆ పెళ్లి ఎలా జరిగిందని లాయర్ అడగడంతో మహాకు అనుమానం మొదలవుతుంది. ఆధార్ కార్డు తీసుకురావాలని లాయర్ సూచించడంతో మహా, చక్రి అక్కడి నుండి వెనుదిరగాల్సి వస్తుంది. విడాకుల విషయం సీరియస్ అవుతుండటంతో చక్రి ఒక ప్లాన్ చేస్తాడు. ఎలాగైనా మహా తనను వదిలి వెళ్లకుండా ఉండాలని, గతంలో తమకు పెళ్లి చేసిన కానిస్టేబుల్ను కలిసి సహాయం కోరతాడు. విడాకులు ఆగిపోయేలా చూడాలని చక్రి రిక్వెస్ట్ చేయడంతో, కానిస్టేబుల్ రంగంలోకి దిగి మహాకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీయడం కథను మరిన్ని మలుపుల వైపు తీసుకెళ్తోంది. ఇక ఈ గొడవలన్నీ ఒకవైపు అయితే చక్రి మరియు మహా మధ్య జరుగుతున్న ఈ విడాకుల డ్రామా కేశవ వింటాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వీరు విడిపోవాలనుకుంటున్నారనే నిజాన్ని కేశవ వినడంతో, ఇంట్లో పెద్ద దుమారమే రేగేలా కనిపిస్తోంది. నిజం తెలిసిన కేశవ ఎలా స్పందిస్తాడు.. మహా తన పంతం నెగ్గించుకుంటుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లలో చూడాల్సిందే. ప్రస్తుతం బుల్లితెరపై 'పొదరిల్లు' సీరియల్ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా అలరిస్తోంది. పెళ్లి తర్వాత వచ్చే ఇగో సమస్యలు, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరిగే ఈ కథనం సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా చక్రి పాత్రలో నటుడు చూపిస్తున్న వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వచ్చే ఎపిసోడ్లలో మహాకు ఆధార్ కార్డు విషయంలో ఉన్న సందేహాలు తీరుతాయా లేదా చక్రి వేసిన ప్లాన్ సక్సెస్ అయి విడాకులు ఆగిపోతాయా అన్నది వేచి చూడాల్సిందే. మహా నిర్ణయం సరైనదే అని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి!
Mar 18, 2026
Jayam serial: ఆఫీస్ బాధ్యతల్లోకి సూర్య, రాఘవ.. ఇంటి ఆడపడుచు గుట్టు విప్పుతుందా?
జీ తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న 'జయం' సీరియల్ రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్-219 లో ఇందుమతి తన పంతాన్ని నెగ్గించుకోవడమే కాకుండా, ఇషికను ఇంటికే పరిమితం చేసేలా మాస్టర్ ప్లాన్ వేసింది. తన భర్త, కొడుకులను ఆఫీస్ బాధ్యతల్లోకి దింపి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుమతి హాల్లో టెన్షన్ పడుతుండటం చూసిన రంగా, గంగలు ఆమె వేసే తదుపరి అడుగు కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. సరిగ్గా అదే సమయంలో ఇషిక ఆఫీస్కు వెళ్లేందుకు సిద్ధమవ్వగా ఇందుమతి అడ్డుకుంటుంది. "నీ అవసరం ఆఫీస్లో లేదు, నా భర్త రాఘవ, నీ భర్త సూర్య ఆ బాధ్యతలు చూసుకుంటారు" అని తెగేసి చెప్పడంతో ఇషిక షాకవుతుంది. ఇక ఈ సీరియల్లో హైలైట్ సీన్ ఏమిటంటే.. రాఘవ, సూర్య ఇద్దరూ స్టైలిష్గా సూట్లు ధరించి పైనుంచి కిందకు రావడం. ఎప్పుడూ సాధారణంగా ఉండే వీళ్ళిద్దరు చైర్మన్ లుక్లో కనిపించడంతో ఇంట్లోని వాళ్ళంతా చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఇందుమతి చేసిన ఈ పనికి వీరు అభ్యంతరం చెప్పాలని చూసినా రుద్ర గట్టిగా వారించడంతో సైలెంట్ అయిపోతాడు. మరోవైపు ఇషిక కోపంతో రగిలిపోతుండగా, ఆమెను కూల్ చేయడానికి ఒక కొత్త పని చెప్తాడు వీరు. ఈ ఇంటికి ఒక ఆడపడుచు ఉందని, ఆమె ఎందుకు దూరమైందో కనుక్కోవాలని చెప్తాడు. ఇందుమతి మనసు గెలుచుకుని ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని ఇషికకు సలహా ఇస్తాడు వీరు. అటు రుద్ర కూడా పెద్దాయన ద్వారా ఈ నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినా ఫలితం దక్కదు. ఆ ఇంటి ఆడపడుచు ఎవరు? ఆమెను ఎందుకు దూరం పెట్టారు? అనే మిస్టరీ త్వరలో వీడనుందని నెటిజన్లు భావిస్తున్నారు. రంగా ఇచ్చే ఐడియాలతో ఇందుమతి ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. వచ్చే ఎపిసోడ్లో ఇషిక తన అత్తగారి నుంచి రహస్యాన్ని రాబట్టగలుగుతుందా? లేదా ఇందుమతి చేతిలో మరోసారి భంగపడుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Mar 18, 2026
Karthika Deepam 2: జ్యోత్స్న ప్లాన్స్కు చెక్ పెట్టిన దాస్.. దీప నిర్ణయం వెనుక మర్మమేంటి?
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. తాజాగా మంగళవారం నాటి ఎపిసోడ్-620 లో భావోద్వేగభరితమైన సన్నివేశాలతో పాటు కథలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దీప, కార్తీక్ మధ్య సాగిన సంభాషణలు ప్రేక్షకులను కన్నీరు పెట్టించేలా ఉన్నాయి. తమ మధ్య ఉన్న నిజాన్ని అత్తయ్య కాంచన తప్పుగా అర్థం చేసుకుంటుందని దీప తీవ్ర ఆవేదనకు లోనవుతుంది. ఒకవేళ నిజం తెలిస్తే ఆమె తట్టుకోలేదని, గతంలో తన భర్త విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆమె, ఇప్పుడు తనను కూడా దూరం పెడుతుందేమోనని భయపడుతుంది. అయితే కార్తీక్ మాత్రం దీపకు అండగా నిలబడి, ఏ పరిస్థితిలోనైనా తోడుంటానని ధైర్యం చెప్తాడు. ఈ క్రమంలో కార్తీక్ను హగ్ చేసుకుని దీప ఎమోషనల్ అవుతుంది. మరోవైపు దశరథ్ గుడికి వెళ్తాడు. తన కుటుంబంలో సమస్యలు తీరాలని, ఎవరిని వదులుకోవడం ఇష్టం లేని దశరథ్ ఒక స్వామీజీని కలుస్తాడు. ఈ సమస్యకు పరిష్కారంగా హోమం జరిపించాలని ఆయన చెప్పగా ఈ విషయం ఎవరికీ తెలియకూడదని దశరథ్ రహస్యంగా ఉంచుతాడు. ఈ హోమం వల్ల కథలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీధర్ ఇంట్లో దీప నిర్ణయంపై చర్చలు మొదలయ్యాయి. దీప బిడ్డను వద్దనుకోవడం వెనుక అసలు కారణం ఏంటని కావేరి ఆరా తీస్తుండగా, కార్తీక్ చేసే ప్రతీ పనిలో ఒక అర్థం ఉంటుందని కాశీ, స్వప్న సమర్థిస్తారు. కానీ శ్రీధర్ మాత్రం ఈ విషయంలో కాంచన దగ్గరకు వెళ్లి క్లారిటీ తీసుకోవాలని అనుకుంటాడు. ఇదే సమయంలో జ్యోత్స్నకు దాస్ నుండి ఫోన్ వస్తుంది. తన తండ్రి గురించి తెలిసిన నిజాన్ని గుర్తుచేస్తూ, దీప జోలికి రావొద్దని జ్యోత్స్నని దాస్ హెచ్చరిస్తాడు. ఇది కథలో కొత్త ట్విస్ట్కు దారితీసింది. మరి దీప తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? దశరథ్ చేసే హోమం ఫలిస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి.
Mar 18, 2026
Illu Illalu Pillalu: శ్రీవల్లి కుట్రలు ఫలిస్తున్నాయా.. ప్రేమ జీవితంలో చీకటి రోజులు!
స్టార్ మాలో పాపులర్ అవుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్. ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపుకు చేరుకుంది. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-421 లో.. అమూల్య, విశ్వల పెళ్లి చుట్టూ తిరుగుతున్న ఈ డ్రామాలో ఊహించని నిజాలు బయటపడటంతో రామరాజు కుటుంబం ఒక్కసారిగా షాకైంది. అసలు అమూల్య మెడలో తాళి వెనుక ఉన్న రహస్యం ఏంటో రివీల్ అవ్వడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తాజా ఎపిసోడ్ ప్రకారం, అమూల్యకు విశ్వకు పెళ్లి జరగలేదన్న సత్యం అందరికి తెలిసిపోయింది. రామరాజు ఆమెను తిరిగి ఇంటికి తీసుకురాగా, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే మెడలో తాళి వేసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. దీని వెనుక ప్రేమ ఇచ్చిన సలహా ఉందని తెలియడంతో ప్రేమపై ధీరజ్ కోపంగా ఉంటాడు. అమూల్యను కిడ్నాప్ చేసిన తర్వాత విశ్వ వేసిన ప్లాన్ నుండి తప్పించుకోవడానికే తను అలా చేశానని ఆమె ఎంత చెప్పినా ధీరజ్ మాత్రం ప్రేమపై కోపంగా ఉంటాడు. మరోవైపు విశ్వ ఇంట్లో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేవతి తన కొడుకు ప్రవర్తనను తప్పుబడుతూ చేయి చేసుకోగా, సేనాపతి ఆమెను అడ్డుకుంటాడు. అయితే ఈ కథలో అసలు సూత్రధారి ప్రేమేనని విశ్వ చెప్తాడు. పెద్దావిడ మాత్రం అమూల్యకు, విశ్వకు పెళ్లి చేయాలని అంటుంది. ఇది భద్రవతికి ఏమాత్రం నచ్చకపోవడంతో తను పెద్దావిడపై సీరియస్ అవుతుంది. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. ధీరజ్, ప్రేమల మధ్య పెరుగుతున్న దూరం. ప్రేమను అసలు పెళ్లి చేసుకునే వాడినే కాదని, కళ్యాణ్ లాంటి వాడే ఆమెకు కరెక్ట్ అంటూ ధీరజ్ అన్న మాటలు ప్రేమ మనసుని గాయపరుస్తాయి. నర్మద ఎంత చెప్పినా వినకుండా ప్రేమపై కోపంగా ఉన్న ధీరజ్ ని చూస్తుంటే ప్రేమ, ధీరజ్ ల బంధం ప్రమాదంలో పడ్డట్టే కనిపిస్తోంది. ఈ గొడవలను చూసిన శ్రీవల్లి తన తల్లి భాగ్యం, తండ్రి ఆనందరావుకి చెప్తుంది. దాంతో భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి ప్రేమ జీవితం నాశనమవుతోందనే సంతోషంతో డ్యాన్స్ వేస్తారు. అమూల్య జీవితం ఏమవుతుంది? ధీరజ్ మనసు మారుతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కథనం ఇప్పుడు ఎమోషనల్ అండ్ రివెంజ్ డ్రామాగా మారుతుండటంతో టీఆర్పీ రేటింగ్స్ పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఎపిసోడ్లలో రామరాజు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన సీరియల్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ను చూస్తూనే ఉండండి. ధీరజ్ ప్రవర్తన కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని తెలపండి!
Mar 18, 2026
Podharillu: విడాకులు తీసుకోమని మహాలక్ష్మికి సలహా ఇచ్చిన హారిక!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-71 లో.. ఒక హోటల్ లో హారిక, మహాలక్ష్మి కలుసుకొని మాట్లాడుకుంటారు. నా సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ తెచ్చుకోమని అంటాడేమోనని అనుకున్నాను కానీ మళ్ళీ ఆ జుట్టుపోలీ గాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నాడని మహాలక్ష్మి అంటుంది. హారిక మౌనంగా ఉంటుంది. నేను నిజం చెప్పినా ఎవరు వినరని నాకు అర్థం అయింది. నా డ్రీమ్స్ ఫుల్ ఫిల్ అవ్వవని అర్థం అయింది. అందుకే బయటకొచ్చానని హారికతో మహాలక్ష్మి అంటుంది. ఇంతకు ఆ ఇంట్లో సేఫ్ గానే ఉన్నావ్ కదా అని హారిక అనగానే నిజానికి మన ఇంట్లో మనుషుల కంటే వాళ్ళ మధ్యనే సేఫ్ గా అనిపిస్తుందని మహాలక్ష్మి అంటుంది. నువ్వు చెప్పేది చూస్తుంటే ఆ ఇంట్లోనే చక్రితో భార్యగా సెటిల్ అయ్యేలా ఉన్నావని హారిక అంటుంది. చెప్పాను కదా మాది అసలు పెళ్ళే కాదని అని మహాలక్ష్మి అంటుంది. కానీ చట్టం దృష్టిలో మీరిద్దరు నిజమైన భార్యాభర్తలు అని హారిక అంటుంది. నాకు అసలు ఇష్టమే లేదు కానీ పెళ్ళి చేసి మాకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చి మమ్మల్ని విడిపోకుండా చేశారని మహాలక్ష్మి అంటుంది. వీలైనంత తొందరగా విడాకులు తీసుకోమని హారిక అంటుంది. సరేనని మహాలక్ష్మి అంటుంది. ఇక ఇంటికొచ్చిన మహా చక్రితో మాట్లాడుతుంది. మనం విడాకులు తీసుకుందామని అనగానే చక్రి షాక్ అవుతాడు. మీ వదిన నువ్వు కలిసి మాట్లాడుకుంది ఇదేనా అని చక్రి అనుకుంటాడు. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు.. మీ పెళ్ళి చెడగొట్టాలి.. మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి.. ఇప్పుడు విడాకుల కోసం కోర్ట్ చుట్టూ నాకంటు మనసు ఉండదా అని చక్రి అంటాడు. మీ ఇంట్లో అందరు మంచివాళ్ళే కదా.. నన్ను ఒక గాజుబొమ్మలా అపురూపంగా చూసుకున్నారు.. మీది నాచురల్ గా హెల్పింగ్ నేచర్.. మీకేం స్వార్థం ఉంటది చెప్పండి పదా వెళ్దామని చెప్పి మహా వెళ్ళిపోతుంది. ఇక పొద్దున్నే మహాలక్ష్మి, చక్రి కాసేపు గొడవపడతారు. మరోవైపు చక్రి వాళ్ళ నాన్న నారాయణ ఎవరితోనో గొడవ పడుతుంటాడు. లాయర్ ని వెతకమని చెప్పాను కదా అని మహాలక్ష్మి అంటుంది. ఇంకో రెండు మూడు వారాల్లో దొరుకుతాడని చక్రి అనగానే అన్ని వారాలు ఎందుకని మహాలక్ష్మి అంటుంది. నేనే ఆన్లైన్ లో చూస్తున్నానని మహా అంటుంది. తర్వాత మహ, చక్రి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయం చక్రి, మహా కలిసి లాయర్ ని కలవడానికి వెళ్తారు. అక్కడ ఇద్దరు లాయర్ కోసం ఎదురుచూస్తుంటారు. శ్రీకృష్ణ ప్రతీసారీ కాపాడతావ్.. ఈ సారి కూడా ఎలాగైనా చక్రం అడ్డం వేసి కాపాడమని చక్రి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 17, 2026
Brahmamudi: రాకీ నుండి తప్పించుకున్న ఇందు.. పోలిస్ స్టేషన్ లో లక్కీ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'Brahamamudi ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -981 లో.....ఇందుని తన ట్రాప్ లో పడేసుకోవడానికీ రాకీ తనకి జ్యూస్ లో ఏదో కలుపుకొని వస్తాడు. ఇందు జ్యూస్ తాగబోతుంటే అప్పుడే రాజు, లక్కీ మాట్లాడుకుంటూ వస్తారు. దాంతో ఇందు జ్యూస్ కింద పడిపోతుంది. ఇందుని రాజు చూసి .. ఓసి నువ్వా అని అంటాడు. నీకు ఇలాంటి పనులు మాత్రమే వచ్చా అని ఇందు కోప్పడుతుంది. రాకీని రాజు తిడతాడు. నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావ్ కదా.. నీకు ఉద్యోగం ఇవ్వనని చెప్పి రాకీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాడు పబ్ లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాడు అంటేనే అర్ధం చేసుకోవాలి.. వాడు ఎలాంటి వాడో అని రాజు అనగానే ఇందు తనపై కోప్పడి వెళ్తుంది. ఆ తర్వాత ఇందు వెళ్తుంటే రేఖ తన ఫ్రెండ్స్ ఫుల్ తాగి వెళ్లడం ఇందు చూసి ఎక్కడికి వెళ్ళినా ఇదేంటి నాతోనే వస్తుందని ఇందు అనుకుంటుంది. రేఖ కార్ దగ్గరికి వెళ్లి కార్ ఎక్కకుండా బయట ఉండి.. అదేంటి కార్ కి స్టీరింగ్ లేదని అనుకుంటుంది. అప్పుడే రాజు, లక్కీ వస్తారు. లక్కీ నువ్వు వెళ్లి తనని డ్రాప్ చేయమని రాజు చెప్పగానే లక్కీ, ఐశ్వర్యని తీసుకొని వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళాక పోలీసులు ఉంటారు. ఐశ్వర్య ఫుల్ గా తాగి ఉంటుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తామని ఊదమంటారు. దాంతో లక్కీ భయపడతాడు. దాంతో పోలీసులు స్టేషన్ కి తీసుకొని వెళ్తారు. అదంతా ఇందు చూస్తుంది. మరొకవైపు పబ్ కి ఇన్ఫార్మర్ గా వచ్చిన నందు రౌడీల కోసం చూస్తుంది. అందరికి డౌట్ రాకుండా వెంకీతో డ్యాన్స్ చేస్తుంది వెంకీకి మాత్రం ఏం అర్థం కాదు. రౌడీలు కనపడగానే నందు వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తుంది. నువ్వు ఇప్పుడే ఇదంతా చేస్తున్నావ్.. రేపు జాబ్ వచ్చాక మాములుగా ఉండదని కానిస్టేబుల్ అంటాడు. ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్ కి లక్కీ, ఐశ్వర్య వస్తారు. నువ్వు ఎన్ని రోజుల నుండి ఇలా అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నావు.. మీ గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు.. నువ్వే మెయిన్ ఆ అని లక్కీని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. నాకేం తెలియదని లక్కీ అంటాడు. నీ పేరేంటి అని ఐశ్చర్యని ఇన్స్పెక్టర్ అడుగగా తను మత్తులో ఉండి గుర్తుచేసుకుంటూ ఉండగా ఐశ్వర్య అని లక్కీ చెప్తాడు. దాంతో అతని చెంపచెల్లునిపిస్తాడు పోలీస్. మీ పేరెంట్స్ ఎవరమ్మ అమి పోలీస్ అడుగుతాడు. తరువాయి భాగంలో తాగి ఉన్న ఐశ్వర్యని తీసుకొని ఇందు, స్వాతి వస్తారు. అప్పుడే రేఖ వచ్చి ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 17, 2026
Jayam serial: పైడిరాజు, లక్ష్మీ గార్ల కూతురు గంగ కాదనే నిజం తెలుసుకున్న రంగా!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -218 లో... శకుంతల తన పనులు తనే చేసుకుంటుంటే వీరు వచ్చి.. ప్రమీల మీ మాట విన్నప్పుడు మీకు సాయంగా ఉండేది కానీ ఇప్పుడు బిజినెస్ అప్పగించారు. మీ చెయ్ దాటి పోయిందని మీ మాట లెక్కచెయ్యడం లేదని వీరు అనగానే శకుంతలకి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మరొకవైపు ప్రమీల గుడికి వెళ్తుంది. అక్కడ ప్రసాదం కోసం లైన్ లో ఉండగా ఒకతను వచ్చి ప్రమీలతో మాట్లాడి ప్రసాదం తీసుకుంటాడు. అందులో జీడీపప్పు వస్తుంది. అది చూసి మీరు నాకు చాలా లక్కీ అండి.. ప్రసాదంలో జీడిపప్పు వచ్చిందని అంటాడు. ప్రమీల వెళ్లేసరికి ప్రసాదం అయిపోతుంది. దాంతో మనం షేర్ చేసుకుందామని అతను అంటాడు. ప్రమీల వద్దని అంటుంది. ప్రసాదం అలా వద్దని అనుకూడదని అతను అంటాడు. దాంతో ప్రసాదం ప్రమీల తీసుకుంటుంది. మరొకవైపు పైడిరాజు, లక్ష్మీ ఇద్దరు గుడికి వచ్చి రంగాకి నిజం తెలియకూడదని మొక్కుంటారు. అప్పుడే రంగా వస్తాడు. నేను ఒకటి అడుగుతాను చెప్పండి అని రంగా అనగానే ఏంటి అది అని లక్ష్మీ అంటుంది. గంగ మీ కూతురు కాదు కదా అని రంగా అంటాడు. దాంతో గంగ మా కూతురే అని లక్ష్మీ అంటుంది. అయితే దేవుడి మీద ఒట్టు వెయ్యమని రంగా అనగానే లక్ష్మీ వెయ్యదు. గంగ మా కూతురు కాదని లక్ష్మీ అంటుంది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు. మాకు గంగ అంటే చాలా ఇష్టం ఎప్పుడు గంగ మాతోనే ఉండాలని లక్ష్మీ అంటుంది. అప్పుడే గంగ ఎంట్రీ ఇస్తూ.. ఎప్పుడు మీతోనే ఉంటానని గంగ అంటుంది. అదంతా విందేమోనని కంగారుపడుతారు కానీ అది ఏం వినదు. ఆ తర్వాత రంగా, గంగ ఇద్దరు లక్ష్మి, పైడిరాజుతో మాట్లాడి గుడి లోపలికి వెళ్తారు. అక్కడ ప్రమీల తనకి ప్రసాదం ఇచ్చిన అతనితో మాట్లాడుతుంటే గంగ, రుద్ర నవ్వుకుంటారు. మరొకవైపు బావ నువ్వు ఈ ఫ్యామిలీ కోసం బాగా కష్టపడుతున్నావ్.. ఏదో చెయ్యాలని ట్రై చేస్తున్నావ్ అంటాడు. అవును నా కుటుంబం జోలికి ఎవరు వచ్చిన ఊరుకోను కదా వీరు అని రుద్ర అంటాడు. తరువాయి భాగంలో ప్రమీల గుడికి వెళ్ళిందని పెద్దమ్మ లైట్ తీసుకోవచ్చు కానీ అలా తీసుకోలేదంటే తనకి ఎవరో నూరిపోశారని వీరుని ఉద్దేశ్యించి రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 17, 2026
Karthika Deepam2: సుమిత్రకి నిజం చెప్పిన జ్యోత్స్న.. దీపకి పొంచి ఉన్న గండం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (కార్తీక దీపం-2 ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-619 లో.. సుమిత్ర ఒక్కతే తన గదిలో ఉండగా దాహానికి నీళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అప్పుడే దీప వచ్చి గ్లాస్ లో నీళ్ళు ఇస్తుంది. అవి తాగి సుమిత్ర మాములు అవుతుంది. ఏంటమ్మా నువ్వు హాస్పిటల్ లో ఉండాలి కదా ఇలా వచ్చావని అడుగగా..మీ కోసమే అని దీప అంటుంది. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఎంట్రీ ఇస్తారు. నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉందా అని సుమిత్ర అడుగగా తనకి బిడ్డే భారంగా ఉందంట.. అందుకే వద్దనుకుంటుంసని జ్యోత్స్న అనగానే ఎందుకమ్మ అలాగా.. వినడానికి నాకే కష్టంగా ఉందని సుమిత్ర అంటుంది. అత్త నేను తర్వాత చెప్తానని కార్తీక్ అనగానే అత్తని కూడా ఇలాగే నోరు మూయించాడు మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. అవన్నీ నీకు అవసరం లేదు జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. ఇక కార్తీక్, జ్యోత్స్నల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం, దీప, కార్తీక్ అందరు వెళ్తారు. సుమిత్రకి ఏదో చెప్పి కవర్ చేస్తాడు దశరథ్. మరోవైపు శ్రీధర్, కాంచన మాట్లాడుకుంటారు. ఇంటికి వెళ్ళిపోదామా అని శ్రీధర్ అడుగుతాడు. మీరు వెళ్ళిపోండి అని కాంచన అంటుందిమ మరి నువ్వు అనగానే ఆ ఇంటికి వెళ్ళలేను.. ఈ ఇంట్లో ఉండలేను.. ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదని కాంచన అంటుంది. దీప చెప్పిన మాటలు తల్చుకొని కాంచన ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. అమ్మా అని కార్తీక్ అనగానే వాడిని నాతో మాట్లాడొద్దని చెప్పండి అని శ్రీధర్ తో కాంచన అంటుంది. నువ్వేం మాట్లాడకు నేను మాట్లడతాను చెప్పురా అని శ్రీధర్ అంటాడు. నేను ఇప్పుడు ఏం చెప్పలేనని కార్తీక్ అంటాడు. వాడు చెప్పడు అండి అని కాంచన ఎమోషనల్ అవుతుంటే.. బిడ్డని వద్దు అనుకున్నారంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది.. అదేంటో తెలుసుకుంటానని శ్రీధర్ అంటాడు. మరోవైపు గుడి దగ్గరికి దశరథ్ వెళ్ళి పంతులు గారికి దీప జాతకం ఇస్తాడు. ఇది చూసి తన గురించి చెప్పండి అని దశరథ్ అడుగుతాడు. కొన్ని దైవ లిఖితాలు మనం చూడడానికే గానీ మార్చడానికి మనం సరిపోం అని పంతులు చెప్తాడు. దాంతో దశరథ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఈ జాతకం ఉన్న వ్యక్తి చావు ముంగిట్లో ఉందని అంటాడు. ఈ గండాన్ని దాటే ఉపాయం లేదా గురువు గారు అని దశరథ్ అంటాడు. అనుభవించాల్సిందేనని పంతులు అంటాడు. తను ఏం పాపం చేసిందని దశరథ్ అంటాడు. పాప పుణ్యాల గురించి మనం చర్చించుకోలేం.. ఈ మనిషి రాబోయే ప్రమాదం నుండి తప్పించుకోలేదని పంతులు అనగానే దశరథ్ షాక్ అవుతాడు. సముద్రంలో చెలరేగిన తుఫాన్ లో చిక్కుకున్న నావ లాంటిదే ఈమె జాతకం. తుఫాన్ ని దాటుకొని తీరం చేరుతుందా.. గండాల సుడిగుండంలోనే మునిగిపోతుందా అని కాలమే నిర్ణయిస్తుంది..కానీ ప్రమాదం అయితే తప్పదు అని పంతులు చెప్తాడు. దాంతో దశరథ్ షాక్ అవుతాడు.అక్కడ నుండి వచ్చేస్తాడు. దీప, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 17, 2026
Ilu illalu pillalu: విశ్వ మీద తాళి విసిరేసి వచ్చిన అమూల్య.. శ్రీవల్లి గురింవి నిజం చెప్తుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-420 లో.. విశ్వని, చందు, ధీరజ్, సాగర్ కలిసి కొడుతుంటారు. అయినా సరే నేను ఇలాగే వేరే అమ్మాయితో తిరుగుతానని విశ్వ అంటాడు. దాంతో ధీరజ్ అక్కడ దగ్గర్లో ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకొని విశ్వ మీదకి వెళ్తాడు. ఎవరేం చెప్పినా వినిపించుకోడు. వాడు అసలు నా మెడలో తాళి కట్టలేదని అమూల్య అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అసలు ఏంటమ్మ వాడు నీ మెడలో తాళి కట్టకపోతే అది నీ మెడలోకి ఎలా వచ్చిందని అడుగగా అమూల్య సైలైంట్ గా ఉంటుంది. అసలు ఏం జరిగిందని అడిగినా తను ఏం చెప్పకపోయేసరికి రెండు కుటుంబాల మధ్య తీవ్రంగా గొడవ జరుగుతుంది. అమూల్యని మెడలో తాళి వేసుకోమని చెప్పింది నేనే అని ప్రేమ చెప్పగానే అందరు షాక్ అవుతారు. వాడు నీ మెడలో తాళి కట్టలేదు కదా అని అమూల్య దగ్గరికి రామరాజు వెళ్ళి అడుగుతాడు. లేదని తను అంటుంది. అయితే అది తీసి వాడి ముఖం మీద కొట్డు అని వేదవతి, రామారాజు అనగానే అనూల్య తాళి తీసి వాడి ముఖం మీద పడేస్తుంది. ఆ తర్వాత విశ్వ ఫ్యామిలీ, అమూల్య ఫ్యామిలీ ఎవరి ఇంట్లోకి వాళ్ళు వస్తారు. ఇక తాళి మెడలో వేసుకోమని చెప్పిన ప్రేమని ధీరజ్ అసహ్యంగా చూస్తాడు. ఇక అమూల్యని అందరు నిలదీస్తారు. అసలు వాడు తాళి కట్టకుండా నువ్వు మెడలో ఎందుకు వేసుకున్నావ్.. పెళ్ళి ముందు రోజు రాత్రి వాడిని నమ్మి వాడితో నువ్వు వెళ్ళకుంటే ఇదంతా జరిగేది కాదని చందు అంటాడు. అసలు ఆ రోజు రాత్రి ఎందుకు వెళ్ళావ్.. ఎవరైనా వెళ్ళమన్నారా అని సాగర్ అంటాడు. వాళ్ళు అడుగుతున్నారు కదా చెప్పు అమూల్య అని ధీరజ్ అంటాడు. దాంతో అమూల్య జరిగింది గుర్తుచేసుకుంటుంది. వాడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి నా క్యారెక్టర్ మీద మచ్చ వేస్తానని బెదిరించాడు., మీ మీద పగతో ఇలా నన్ను ప్రేమించినట్టు యాక్ట్ చేశాడని అమూల్య అందరికి చెప్తుంది. నిన్ను బయటకు రప్పించేలా చేసి విశ్వ తీసుకెళ్ళాలా చేసి, నీ మెడలో తాళి వేసుకోమని చెప్పింది ప్రేమనే కదా అని ధీరజ్ అమగానే లేదు అన్నయ్య నువ్వు ప్రేమ వదినని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని అమూల్య అంటుంది. అలా చేసింది ఎవరంటే అని శ్రీవల్లి వైపు చూస్తుంది అమూల్య. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 17, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



