.webp)
తొక్కేసారండి ... ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేశారు
రీతూ - డీమన్ పవన్ కలిసి నటించిన బంగారం సాంగ్ లాంచ్ కి అఖిల్ సార్థక్ వచ్చాడు. ఇక అఖిల్ అక్కడ జరిగిన ఒక చిన్న చిట్ చాట్ లో చాలా ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. " ప్రస్తుతానికి రెండు సిరీస్ చేస్తున్నాను. నేను నా వర్క్ తో బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి బంగారం అంటూ నా లైఫ్ లో ఎవరూ లేరు . ఈ బంగారం సాంగ్ చూసాక ఒక మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. అది యు ట్యూబ్ కి తీసినట్టు అనిపించలేదు. డెమోన్ రీతూ ర్యాపొ కానీ ఇద్దరి పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. రీతూ దీని కోసం ఎంత వర్క్ చేసిందో నాకు పర్సనల్ గా తెలుసు. ఆమె టీవిలో చేస్తోంది ట్రావెలింగ్ చేస్తోంది పవన్ కోసం. నేనే ఒకసారి అడిగా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నావ్ అని . అప్పుడామె నేను చేయాలి అని చెప్పింది. ఆమె చాలా సపోర్టివ్ గా ఉంటుంది. నిజానికి బిగ్ బాస్ నుంచి వచ్చాక ఏ అమ్మాయి ఆ ట్రాక్ కి సపోర్ట్ చేయదు. ప్రాబ్లమ్ అవుతుందని. రీతూ సపోర్ట్ చేస్తూ పవన్ కి బ్రాండ్స్ తెస్తూ పవన్ తో కలిసి బ్రాండ్స్ చేస్తూ నువ్వు ఎదుగు నేను ఎదుగుతా అనే టైపు రీతూ మెంటాలిటీ. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. బిగ్ బాస్ తర్వాత అవకాశాలు రాలేదు. తొక్కేసారండి తొక్కేసారండి. ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేశారు. అలా తొక్కినా కానీ నేను కం బ్యాక్ ఇస్తున్నాను. అలా అని కాదు కానీ మళ్ళీ గట్టిగానే రాబోతున్న. ఈ ఇయర్ నా నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ని రోజులు ఆగినందుకు ఒకటి చేస్తాను. నాకు ఇంతకుముందు గ్రూమింగ్ అనేది తెలీదు. ఇప్పుడు తెలిసింది. ఇక అందం సీక్రెట్ అంటే రెగ్యులర్ గా ఫుడ్ ఎలా తింటానో జిమ్ కి కూడా అలాగే వెళ్తాను. " అని చెప్పాడు అఖిల్ సార్థక్. బావ మరదలు అనే షార్ట్ ఫిలిం ద్వారా అఖిల్ మూవీ ఛాన్సెస్ కొట్టేసాడు. అలాగే కళ్యాణి అనే సీరియల్ లో నటించాడు. ఆ తరువాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అఖిల్ సార్థక్ అంటే చాలు బిగ్ బాస్ సీజన్ 4 గుర్తు రాక మానదు. అందులో మోనాల్ - అఖిల్ స్నేహం కూడా ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఐతే వీరి ఫ్రెండ్ షిప్ బిగ్ బాస్ వరకే ఆగిపోయింది. వీళ్ళ మధ్య ఏదో ఉంది అనుకున్నారంతా అప్పట్లో. కానీ అలాంటిది ఏమీ లేదని కూడా వీళ్ళు తర్వాత చెప్పేసారు. ఐతే బిగ్ బాస్ 4 రన్నరప్ గా నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళాడు.
Aug 10, 2026 3:16PM.webp)
బిగ్ బాస్ తర్వాత నాకు ఆఫర్స్ ఏమీ రాలేదు
ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన దీక్ష పంత్ కి అనుకున్న స్థాయిలో పేరు రాలేదు. సైడ్ రోల్స్ చేస్తూ ఉండిపోయింది. కెరీర్ లో బ్రేక్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఐతే బిగ్ బాస్ సీజన్ 1 లో వైల్డ్ కార్డు ఎంట్రీతో వెళ్లి అదరగొట్టింది. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. టాస్కులు ఆడింది. ఐతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అనుకున్నంత ఆఫర్స్ కూడా ఏమీ రాలేదు. అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రచ్చ, ఒక లైలా కోసం, గోపాల, గోపాల, శంకరాభరణం వంటి మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసింది. బిగ్ బాస్ తో దీక్షకు మంచి పాపులారిటీ వచ్చింది కానీ మూవీ ఆఫర్స్ మాత్రం రాలేదు. ఐతే రీసెంట్ గా ఒక చిట్ చాట్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. " బిగ్ బాస్ తర్వాత నాకు ఆఫర్స్ ఏమీ రాలేదు. బిగ్ బాస్ తర్వాత గ్యాప్ కావాలని ఇవ్వలేదు గ్యాప్ అలా వచ్చేసింది. నాకు కరెక్ట్ ప్రాజెక్ట్స్ అనేవి రాలేదు. నాకు తెలుసు ఇది లాంగ్ బ్రేక్ అని. త్వరలో రైట్ ప్రాజెక్ట్ వస్తే చేస్తాను. బిగ్ బాస్ తర్వాత అందరి కెరీర్ ఎలా ఉందో నాది కూడా అలాగే ఉంది. బిగ్ బాస్ ముందు నేను చాలా బిజీగా ఉండేదాన్ని. నాకు అర్ధం కావట్లేదు బిగ్ బాస్ చూసాక క్యారెక్టర్, బిహేవియర్ , వాయిస్ అన్నీ అలా గుర్తుండిపోతాయని ఎవరూ అప్రోచ్ అవ్వరు. ఏదైనా క్యారక్టర్ కోసం అప్రోచ్ ఐనా ఇది ఆల్రెడీ చూసేసిన ఫేస్ కదా ఆల్రెడీ వినేసిన వాయిస్ కదా అన్న విషయం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పెద్ద ప్రోబ్లం అవుతోంది. అందరి విషయం నాకు తెలీదు. కానీ నేను పర్సనల్ గా ఇది ఫేస్ చేసాను. కుకు విత్ జాతిరత్నాలు షోలో సతాయించి వంటలు చెడగొట్టడానికి వెళ్ళేది. ప్రతీ సీజన్ లో మేము రిపీట్ గా వెళ్ళాలి అంటే వంటలు నేర్చుకోకుండా ఉండాలి " అని చెప్పింది దీక్షా పంత్.
Aug 10, 2026 3:08PM.webp)
డీమన్ పవన్ మీద సీరియస్ ఐన ఇమ్మానుయేల్...ఎందుకంటే..!
రీసెంట్ గా రిలీజయిన బంగారం కవర్ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ సాంగ్ 1.5 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఐతే ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కూడా రీతూ - డెమోన్ కి విషెస్ చెప్పారు. అలాగే డెమోన్ పవన్ గురించి కూడా కొన్ని విషయాలను చెప్పాడు. "రీతూ నా ఫ్రెండ్ ఐనప్పటికీ మనస్ఫూర్తిగా డెమోన్ పవన్ కోసం ఇక్కడికి వచ్చాను. నేను డెమోన్ గురించి 2 విషయాలు చెప్పాలి. మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం కొంత టైం తర్వాత వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరకు షిఫ్ట్ అవుతాం. వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరకు షిఫ్ట్ అవుతాం. కానీ డెమోన్ అలా కాదు వాడు ఒక్కసారి కలిస్తే మళ్ళీ షిఫ్ట్ అవడం అంటూ ఉండదు. వాడి దగ్గరే అతుక్కుపోయి ఉంటాం. అంత మంచోడు వాడు. అలాంటి మంచోడికి మంచి సక్సెస్ లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. ఈ సాంగ్ ని ప్రొడ్యూస్ చేసాడు అని తెలియగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది. ఏరా ఎందుకు చేసావ్ ఇప్పుడిప్పుడే కదా సంపాదించుకుంటున్నావ్. అమ్మను బాగా చూసుకోవాలి కదా ఎందుకురా ఇప్పుడు అని అడిగా. అప్పుడు ఒక్కటే చెప్పాడు మా నాన్న గుర్తుగా నేను ఏదో ఒకటి చేయాలి. అలా నాలా కొత్తగా వచ్చే టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి డి. పి . క్రియేషన్స్ అని స్టార్ట్ చేశాను. మా నాన్న కోసం ఇది చేస్తున్నాను అన్నా అన్నాడు. అది నాకు చాల హ్యాపీగా అనిపించింది. మా అమ్మ కడుపున పుట్టకపోయిన నా సొంత తమ్ముడిలాగే . డెమోన్ మంచిగా సక్సెస్ అవ్వాలి. పెద్ద హీరో అవ్వాలి. ఇదే స్క్రీన్ లో నీ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. " అని చెప్పాడు ఇమ్మానుయేల్.
Aug 10, 2026 2:59PM
వచ్చే ఏడాదిలో శ్రీముఖి పెళ్లి...మిస్ నుంచి మిస్సెస్ గా... జోగిని శ్యామల చేతుల మీద సారె..!
మా బోనాల జాతర ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ స్టార్ మా ఆదివారం నాడు ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో అమూల్య - నిరంజన్ లవ్ ఎపిసోడ్ మ్యారేజ్ ప్రొపోజల్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇక ఫైనల్ గా జోగిని శ్యామల సారె తీసుకుని వచ్చారు. ఇక ఆవిడ వస్తూనే నాట్యం చేస్తూ వచ్చారు. "అందరూ బాగున్నారా. తెలుగు ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా మా టీవీకి రావడం ఆనందంగా ఉంది. ఒక ఆడబిడ్డను ఇంటికి పిలిచినట్టు ప్రతీ సంవత్సరం మా టీవీ వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు. ఒక ఆనవాయితీగా ఇది రెండో సంవత్సరం. చాల బాగా అనిపిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలాగా ఒక థీమ్ ల కాకుండా ఒక కల్చరల్ రిప్రెజెంటేటివ్ లా మా టీవీ ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తోంది. " అని చెప్పారు. తర్వాత శ్రీముఖి కూడా చెప్పింది. "అమ్మ వారి సారె కోసం ఇక్కడికి వచ్చిన మూడు టీమ్స్ ప్రాణం పెట్టి గేమ్స్ ఆడాయి. ఐతే అన్ని పోటీల్లో గెలిచింది సికింద్రాబాద్ షేర్స్ ఐతే ఈ ఇది ఒక టీమ్ కి పరిమితం చేయకుండా అందరికీ సరిసమానంగా ఈ సారె ఎవరికీ ఇవ్వాలి అనే విషయం మీద లక్కీ డ్రా తీసి వారికి ఇస్తాం అందులో నా పేరు కూడా ఉంటుంది . మీరు ఆ డ్రా తియ్యాలి ఎవరి పేరు వస్తుందో వారికి ఆ సారె ఇవ్వాలి " అని చెప్పింది. ఇంతలో జ్యోతక్క తన కోరిక బయటపెట్టింది. లాస్ట్ ఇయర్ ఇదే టైములో నాకు సారె ఇచ్చారు . ఈరోజు నేను ఆరు నెలల వెన్నెలమ్మతో ఒక బిడ్డకు తల్లినయ్యాను నాకు చాలా సంతోషంగా ఉంది. ఐతే ఇప్పుడు నేను అడిగే ఈ కోరిక తప్పు బట్టుకోరు అనుకుంటున్నా. స్టార్ మాలో అన్ని షోస్ ని సింగల్ హ్యాండ్ తో నడిపిస్తూ అలాగే అందరి పెళ్లిళ్లు, ప్రొపోజల్స్ చేస్తూ సీమంతాలు, బారసాలలు చేస్తూ మూడేళ్ళ నుంచి అలరిస్తోంది. అక్కడ ఒక వస్తువు ఉన్న దాంతో కూడా ఎంటర్టైన్మెంట్ చేయించగల సత్తా ఉన్న శ్రీముఖికి పెళ్లి అనేది ఒక్కటే ఉండిపోయింది. ఇంకెప్పుడు పెళ్లి అని . ఇంకెప్పుడు అనే మాట లేదు. మొన్న వాళ్ళ అమ్మ కూడా చెప్పింది పెళ్లి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాం అని. వాళ్ళ అమ్మ గట్టిగా ప్రయత్నిస్తే ఈ అమ్మ గట్టిగా దీవెనలిస్తే మళ్లొచ్చే సంవత్సరానికల్లా శ్రీముఖి పెళ్లి కావాలని కోరుకుంటున్న. అందుకే ఈ సారె ఎలాంటి లక్కీ డ్రా లేకుండా శ్రీముఖికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ అంతా కలిసి ఆ సారెను శ్రీముఖికి అందించారు. "నేను ఒక ఇంటి దాన్ని కావాలని ఇక్కడున్న వారంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు నేనెప్పుడూ చెప్పలేదు. నెక్స్ట్ బోనాన్ని కల్లా నేను శ్రీముఖిగా కాకుండా మిస్సెస్ శ్రీముఖిగా రావాలని కోరుకుంటున్నా ..ఆ అమ్మ వారి ఆశీర్వాదం నా చేతుల్లో ఉండగా ఇంకేం కావాలి " అని సారెను అందుకుంది శ్రీముఖి.
Aug 10, 2026 2:55PM
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ 13 నుంచి ప్రారంభం
చెఫ్ మంత్ర ఇప్పటి వరకు 5 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు కొత్త సీజన్ తో మొదలు కాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అది కూడా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ. ఎప్పటిలాగే ఈ కొత్త సీజన్ కి కూడా హోస్ట్ గా సుమ వ్యవహరిస్తున్నారు. " నమస్కారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" అంటూ పలకరించారు. మైళ్ళ దూరంలో ఉండే తెలుగు వాళ్లందరినీ కూడా కలిపేదేంటో తెలుసా మన తెలుగు వంటకాలు. దేశాలు మారితే టైం జోన్ మారుతుందేమో కానీ సుమ ఫన్ జోన్ మారదు. సో న్యూయార్క్ లో న్యూ స్పార్క్ ని క్రియేట్ చేయడానికి వచ్చేసింది చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ ఏ. " అని చెప్పింది. ఇక ఈ షోకి వరుణ్ - కార్తీక్ వచ్చేసారు. రాగానే సుమ భయపెట్టేసింది. "రక్షితకు - రవితేజ మధ్య రొమాన్స్ ఏది" అని అడిగేసరికి వరుణ్ వెర్రి చూపులు చూసాడు . తర్వాత ఒక పెద్ద కౌంటర్ ఇచ్చాడు. " యూఎస్ ఏ వీసా అండ్ మీరు ఒక్కటే తెలుసా మీకు " అన్నాడు. ఎందుకు అని సుమ అడిగేసరికి "ఎందుకంటే మీ క్రేజ్ ఎప్పుడూ తగ్గేదేలే" అన్నాడు వరుణ్. తర్వాత కార్తీక్ తన గిటార్ తో వచ్చాడు. సుమ అతనికి కౌంటర్ ఇచ్చింది. "కరోనా టైములో నేనేమో పేషెంట్ ఐతే నువ్వేమో సింగర్ అయ్యావు . వంటలవీ వచ్చు కదా బానే " అంది. "మ్యాగీ వచ్చండి" అన్నాడు. "నీకేమొచ్చు " అని వరుణ్ ని అడిగింది. "నాకేమీ రాదు " అన్నాడు. తర్వాత అర్జున్ కొత్తకొండ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. తర్వాత సోషల్ మీడియాలో చైత్ర, తార ట్విన్ స్టోరీస్ పేరుతో పాపులరైన చిన్నారి సిస్టర్స్ ఈ షోలో వాళ్ళ పేరెంట్స్ తో సహా వచ్చేసారు. ఇద్దరు ట్విన్స్ చూడడానికి ఒకేలా ఒకే టైపులో కాస్ట్యూమ్ వేసుకుని వచ్చేసరికి "వీళ్ళను ఎలా గుర్తు పట్టాలి" అని సుమ వాళ్ళ పేరెంట్స్ ని అడిగింది. "ఈ డ్రెస్ మీద ఫ్లవర్స్ ముందు ఉంటే తారా ఫ్లవర్స్ వెనక ఉంటే చైత్ర " అని వాళ్ళ మదర్ మౌనిక చెప్పారు. వెంటనే సుమ "పేరులోనే ఫ్లవర్స్ ఉంటే సుమ " అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత లైఫ్ స్టైల్, బ్యూటీ, ఫాషన్ డిజైనర్ రాధ ప్రియాంక వచ్చారు. తర్వాత అపర్ణ దాట్ల వచ్చేసారు. "ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావ్" అని సుమ అడిగేసరికి "నాకు వంట రాదు" అని చెప్పారు. "మరి ఇక్కడేం చేస్తావ్ " అని మళ్ళీ సుమ అడిగేసరికి "వంట " అని చెప్పారు అపర్ణ. అంతే సుమ షాకైపోయింది. అపర్ణ దాట్ల ఎంటర్టైనర్ గా ఉన్నారు. అలాగే గుండె జారీ గల్లంతయ్యిందే, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీస్ లో కూడా నటించారు. ఈవిడ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ . అలాగే అమ్మ అమ్మడు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసే యశోద కుందూరు కూడా ఈ షోలో కనిపించారు. ఇక వీళ్లకు టాస్కులు ఇచ్చే మెయిన్ పర్సన్ చెఫ్ వంశీ కృష్ణ ఆది ఉన్నారు. ఇలా అందరూ ఈ ప్రోమోలో కనిపించారు. ఫైనల్ గా చెఫ్ మంత్ర అంటే నేషనల్ అనుకుంటిరా చెఫ్ మంత్ర అంటే ఇంటర్నేషనల్ అని చెప్పింది సుమ. అంటే ఈ షోలో కనిపించేవాళ్లంతా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో రీల్స్ , వీడియోస్ రూపంలో కనిపిస్తూనే ఉంటారు. ఈ షో 13 నుంచి ప్రతీ గురువారం అమెరికాలో ఉదయం 10 గంటలకు ఇండియాలో రాత్రి 7 గంటలకు ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ మీద ప్రసారం కాబోతోంది.
Aug 10, 2026 2:46PM
93 మార్కులతో తనూజ.. కుక్ విత్ జాతిరత్నాలు–2 టైటిల్ కైవసం
కుకింగ్ రియాలిటీ షో ‘కుక్ విత్ జాతిరత్నాలు–2’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం వచ్చేసింది. తనూజ సీజన్–2 విజేతగా నిలిచింది. మొదటి సీజన్లోనూ తనూజ కుక్గా పోటీలో పార్టిసిపేట్ చేసింది . కుకింగ్ రియాలిటీ షో ‘కుక్ విత్ జాతిరత్నాలు–2’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం వచ్చేసింది. తనూజ సీజన్–2 విజేతగా నిలిచింది. మొదటి సీజన్లోనూ తనూజ కుక్గా పోటీలో పార్టిసిపేట్ చేసింది . అయితే ఫైనల్స్ లో సక్సెస్ కాలేకపోయిని. ఆ సీజన్ లో ‘వదినమ్మ’ ఫేమ్ సుజిత టైటిల్ ని గెలుచుకుంది . ఈసారి మాత్రం తనూజ అద్భుతమైన వంటకాలతో జడ్జెస్ ని మెప్పించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఇప్పటికే బిగ్బాస్లో రన్నర్గా నిలిచిన ఆమెకు, ఇప్పుడు కుక్ షో టైటిల్ ని గెలుచుకోవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఫినాలేలో కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ వాళ్ళ స్టైల్ వంటకాలతో ఘుమఘుమలాడించారు . ఫినాలేలో డెమాన్ పవన్ రాజుగారి కోడి పలావ్, అరిటాకు చికెన్ స్టేక్, రోజ్మేరీ లెమన్ సాస్, పాన్ఫ్రై తవ్వ ఫిష్, చీజ్కేక్ వంటి వంటకాలను తయారు చేశాడు. ఆషిక రాయల్ హైదరాబాదీ థాలీతో ఆకట్టుకుంది. రాకింగ్ రాకేష్ అన్ని స్టేట్స్ కి సంబందించిన స్పెషల్ డిషెస్ తో ఒక థాలి తయారు చేసాడు. చాలా తక్కువ టైములో ఎక్కువ వంటలు చేసి జడ్జెస్ మెప్పు పొందాడు. నిఖిల్ నల్లి బొక్కల మటన్ ధమ్ పలావ్ తయారు చేశాడు. ఇక ఫైనల్ గా తనూజ బాసా చేప విత్ చింతచిగురు, కర్గా మసాలా స్టఫ్డ్ స్కిన్ చికెన్, మటన్ బిర్యానీ, క్రిస్పీ అవకాడో, ఇరానీ చాయ్ డెజర్ట్ లను తయారు చేసింది. వీటిని రుచిని జడ్జెస్ ఆస్వాదించి మెచ్చుకున్నారు.‘ఛాలెంజ్గా తీసుకుని మళ్లీ రెండో సీజన్కు వచ్చావు.. ఈరోజు నీ వంటలు రాయల్గా ఉన్నాయి’ అంటూ సంజయ్ అభినందించారు. శ్రీదేవి కూడా వంటల్లో మంచి వెరైటీ, రుచి ఉన్నాయని ప్రశంసించారు. అలీ, అరుణ ప్రజెంటేషన్తో పాటు టేస్ట్ కూడా బాగుందని మెచ్చుకున్నారు. ఫైనల్ గా మార్క్స్ విషయానికి వస్తే 93 మార్కులతో విజేతగా తనూజ నిలబడింది. 5వ స్థానంలో రాకేష్ 88 మార్కులు, 4వ స్థానంలో ఆషిక 88 మార్కులు, 3వ స్థానంలో నిఖిల్ 90 మార్కులు, 2వ స్థానంలో పవన్ 92 మార్కులుతో నిలిచారు. తనూజ ‘కుక్ విత్ జాతిరత్నాలు–2’ విన్నర్ అయ్యింది. దీంతో ఆమెకు రూ.10 లక్షల కాష్ ప్రైజ్ అందించారు. ----------------
Aug 10, 2026 2:43PM
ప్రదీప్ కి రెడ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసిన బ్రహ్మముడి అప్పు
బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో హోస్ట్ ప్రదీప్ మాచిరాజు ఒకరు. ఎప్పటినుంచో ఇతన్ని పెళ్ళెప్పుడు అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రదీప్ కి రీసెంట్ గా ఒక అమ్మాయి రెడ్ రోజ్ ఇచ్చి మరీ ప్రోపోజే చేసింది. అది కూడా నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో టెలికాస్ట్ కాబోతోంది. రీసెంట్ ఆ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో నైనీషా రాయ్ అనే బుల్లితెర నటి ప్రదీప్ కి రెడ్ రోజ్ ఇచ్చేసింది. రావడమే ఈ నటి "పరేషానురా " అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ వచ్చింది. తర్వాత అసలు విషయం చెప్పింది. "ఎలా చెప్పాలో తెలీట్లేదు. కానీ నాకు 13 ఏళ్ళ క్రితమే నాకు ఒక అబ్బాయి మీద క్రష్ ఉంది. సో అబ్బాయికి ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా . అది చెప్పడానికి ముందు ఒకటి చూపించాలనుకుంటున్నా" అంటూ తన చేతి మీద దీప్ అనే ఇంగ్లీష్ లెటర్స్ తో పాటు బటర్ ఫ్లై , స్టార్స్ అండ్ హార్ట్ ఎమోజిస్ తో ఉన్న ఒక టాటూని తన చేతి మీద వేయించుకున్నది. అది చూపించింది. "అది ఎవరో కాదు ప్రదీప్ " అని నైనీషా చెప్పేసరికి ప్రదీప్ షాకింగ్ ఫేస్ పెట్టేసాడు. "హే ఎం చెప్తున్నావ్ " అని ప్రదీప్ అడిగేసరికి "నిజం " అంది నైనీషా . మరో పక్క దీపికా పడీపడీ ఎదో వింతను చూసినట్టు చూసింది. "ఇప్పటికి కూడా మీ ఎదురుగా నిలబడితే నా హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకుంటోంది " అని చెప్పింది నైనీషా . నైనీషా టీవీ సీరియల్స్ లో నటిస్తుంది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి వస్తూ ఉంటుంది. బ్రహ్మముడి అప్పుగా, వంటలక్క సీరియల్ లో ధారగా ఆడియన్స్ కి పరిచయమే. అలాంటి అప్పు లాస్ట్ ఇయర్ చామంతి సీరియల్ నటుడు ఆశిష్ చక్రవర్తితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.
Aug 10, 2026 2:39PM
కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ ప్రణవి..శేఖర్ జానీ మాష్టర్ల మధ్య ఏంటి .!
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో ఒక సెగ్మెంట్ గాయని జానకమ్మ గారికి నివాళి అర్పిస్తూ ఆమె పాడిన పాటల్లోని కొన్నిటిని ఆలపించారు. ఇక ఈ ఎపిసోడ్ కి కొరియోగ్రాఫర్ రఘు మాష్టర్ అతని వైఫ్ సింగర్ ప్రణవి వచ్చారు. ఆమె పాటలు వింటున్నంత సేపు ప్రణవి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. "అందరూ ఎంతో అభిమానంతో అమ్మ అని పిలుస్తారు ఆమెను అన్నాడు ప్రదీప్. ఇంతలో ప్రణవి లేచి "చాల ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అన్నం కలిపి పెట్టి లేదు పాడాలి అనేవారు . బాలు గారిని తీసుకెళ్లిపోయాడు , ఇప్పుడు అమ్మను తీసుకెళ్లిపోయారు. ఎం చేయాలో తెలీదు " అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ప్రోమో స్టార్టింగ్ లో రఘు మాష్టర్ , ప్రణవి ఇద్దరూ డ్రెస్సింగ్ విషయంలో గొడవ పడ్డారు. జెన్ జిల రెడీ అవ్వమంటే 90 స్ లా ఉంటానంటావేంటి అని రఘు అనేటప్పుడు ఆది, నరేష్ వచ్చారు. వాళ్ళ గొడవ విని ఇది నాకెందుకు ఇంతకు "శేఖర్ మాష్టర్ కి జానీ మాష్టర్ కి ఏంటి " అని ఆది అడిగేసరికి " ఓరి బాబు " అంటూ దణ్ణం పెట్టాడు రఘు మాష్టర్. ఎంతైనా జెన్ జిల రెడీ అవ్వడానికి ట్రై చెయ్యి. హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటే జెన్ జిల అవుతావని చెప్పా కదా అంటూ ప్రణవి మీద రఘు మాష్టర్ ప్రెజర్ పెట్టేసరికి "నీకంటే బానే ఉన్నానులే " అంటూ ప్రణవి రివర్స్ డైలాగ్ వేసేసరికి రఘు మాష్టర్ షాకైపోయాడు. ఇంతలో ప్రదీప్ వచ్చి "అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తోంది. కొండల మీద నుంచి తోసేస్తున్నారు. డ్రమ్ములు, కుక్కర్లు అబ్బో చాలా రేంజ్ అనేసరికి సరే మీ రేంజ్ ఏంటో ట్రై చేయండి ఇంకా అన్నాడు ప్రదీప్. దాంతో రఘు మాష్టర్ షాకై అలా ఉండిపోయాడు. ఇక ఆది "సరే వెళ్ళరా చూసుకుందాం 90 స్ లేదా జెన్ జి " నా అని అన్నాడు. "మా 90 స్ లో భర్తలకు సేవలు చేసేవాళ్ళు. వాళ్ళు భర్తల్ని శవాలను చేస్తున్నారు. ఏమంటివి ఏమంటివి మా 90 స్ జాతి నీచమా. ఎంత మాట ఎంత మాట. ఒక చేతిలో టైర్ పట్టుకుని ఒక చేతిలో కర్ర పట్టుకుని వీధిలో ఆడుకుంటూ పడిపోతే మళ్ళీ ఉమ్ము రాసుకుని మళ్ళీ పరిగెత్తే జాతి మా 90 స్ జాతి. అరేయ్ అప్పట్లో పిజ్జాలు బర్గర్లు లేకపోయినా చెట్టుకున్న కాయను రాయితో కొట్టి దానికే ఉప్పు కారం అద్దుకుని తిన్న జాతిరా మా 90 స్ జాతి. " అంటూ పెద్ద డైలాగ్ చెప్పాడు ఆది.
Aug 10, 2026 2:37PMజబర్దస్త్ స్టార్కు బిగ్ బాస్ ఆఫర్.. కొత్త సీజన్లో కామెడీ డోస్ పెరగనుందా.?
తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త సీజన్కు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో హౌస్లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీల జాబితా గురించి సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్లో పాపులర్ బుల్లితెర కమెడియన్, ‘ఆటో’ రామ్ ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా తనదైన పంచ్ డైలాగ్స్, ఆటో ప్రాసలతో లక్షలాది మంది ప్రేక్షకులను అలరించిన రామ్ ప్రసాద్ను ఈసారి బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. షోలో వినోద శాతాన్ని పెంచేందుకు గానూ ప్రముఖ హాస్య నటులను తీసుకురావాలనే ప్లాన్లో భాగంగానే ఆయనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలో కూడా పలువురు కామెడీ స్టార్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి తమ ఇమేజ్ను మరింత పెంచుకోవడమే కాకుండా ప్రేక్షకులను విశేషంగా అలరించారు. అదే కోవలో రామ్ ప్రసాద్ కూడా హౌస్లో అడుగుపెడితే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే దీనిపై రామ్ ప్రసాద్ గానీ, నిర్వాహకులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బుల్లితెరపై సుదీర్ఘకాలంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి 'గెటప్ స్పెషల్స్' పేరుతో నవ్వుల పువ్వులు పూయించిన రామ్ ప్రసాద్, ఇటీవల పలు సినిమాల్లో కూడా నటుడిగా, రచయితగా ఆకట్టుకుంటున్నారు. తనదైన టైమింగ్తో ఏ వేదికపైనైనా మంచి క్రేజ్ సంపాదించుకోగల సామర్థ్యం ఆయన సొంతం. ఈ వార్త బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో బిగ్ బాస్ ప్రియులు, రామ్ ప్రసాద్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆయన నిజంగానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే టైటిల్ రేసులో గట్టి పోటీ ఇస్తారని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కంటెస్టెంట్ల షార్ట్ లిస్ట్ తుది దశకు చేరుకుందని, ప్రసార తేదీ దగ్గరపడే కొద్దీ అధికారికంగా ప్రోమోల ద్వారా మేకర్స్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి ఆటో రామ్ ప్రసాద్ నిజంగానే బిగ్ బాస్ రెడ్ కార్పెట్ తొక్కబోతున్నాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Aug 9, 2026 5:51PMJayam serial : రామనాథం మృతి వెనుక షాకింగ్ నిజాలు.. శకుంతలకు దడ పుట్టిస్తున్న ట్విస్ట్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -342 లో.....శకుంతల ఇంటికి కంగారుగా వస్తుంది. ఏమైందని పెద్దసారు అడుగుతాడు. శకుంతల టెన్షన్ పడుతూ ఎవరో రామనాథం గారట ఆయనకి ఆక్సిడెంట్ అయి నా ముందే చనిపోయాడని శకుంతల చెప్పగానే వీరు టెన్షన్ పడుతాడు. అప్పుడే రంగ, గంగ రుద్ర వస్తారు. పెద్దమ్మ రంగనాథం గారు ఏదో చెప్పారంట.. ఏం చెప్పారని రుద్ర అడుగుతాడు. శకుంతల అతను చెప్పింది చెప్పబోయి ఆగిపోతుంది. నాకు చెప్పలేదు చెప్పే ప్రయత్నంలోనే అతను చనిపోయాడని శకుంతల చెప్తుంది. దాంతో వీరు రిలాక్స్ అవుతాడు. రుద్ర మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి కాసేపు వదిలెయ్యండి అని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత నువ్వు సేఫ్ బ్రో అని వీరుతో ఇషిక అంటుంది. అవును ఇషిక వాడిని చంపి మంచి పని చేసానని వీరు అంటాడు. మరొకవైపు బావ నువ్వు గంగని పరాయి దానిలాగా చూస్తున్నావ్.. తను ఎంత బాధపడుతుందో ఆలోచించావా అని రుద్రతో రంగ అంటాడు. నేను అలా అని ఆపకుంటే గంగ ఇంకా మాట్లాడేది. దాంతో గంగ, పెద్దమ్మకి మధ్య గొడవ జరిగేది. గంగకి నేను ఇంటికి వచ్చాక అర్థమయ్యేలా చెప్పగలనని రుద్ర అంటాడు. నాకు అన్ని నిజాలు తెలిసి కూడా నేను సైలెంట్ ఎందుకున్నాను అంటే దాని తర్వాత జరిగే ప్రమాదం నాకు తెలుసు అని రుద్ర అంటాడు. సారీ బావ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని రంగ అంటాడు. అదంతా గంగ విని రుద్రని వచ్చి హగ్ చేసుకొని సారీ సర్ తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్తుంది. నీకు కాన్సంట్రేషన్ మొత్తం ఒక్క దానిపై మాత్రమే ఉండాలని రుద్ర అనగానే సరే అని గంగ అంటుంది. ఆ తర్వాత రంగ, గంగ, రుద్ర మాట్లాడుకుంటారు. ఎలాగైనా సరే ఈ మిస్టరీని కనిపెట్టాలని రుద్ర చెప్తాడు. విశ్వ సర్ కూతురు గంగే అని బావకి చెప్పాలి.. ఎప్పుడు చెప్పే పరిస్థితి వస్తుందో చూడాలని రంగ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 9, 2026 11:21AMYe Devi Varamo Neevu :పెళ్లి రోజు వేడుకలో ఊహించని పరిణామాలు.. అసలు నిజం బయటపడుతుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -30 లో..... మనీష్ ని తీసుకొని అంజలి మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ గీతాంజలి ఎంప్లాయి అంజలిని చూస్తాడు. మరొకవైపు గీతాంజలి బానుకి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ ల మీద ఫోన్ లు వస్తాయి. అప్పుడే ఆ ఎంప్లాయి వచ్చి ఇద్దరిని విష్ చేస్తాడు. మార్కెట్ లో అంజలి కన్పించిన విషయం చెప్తాడు. నేను దగ్గరికి వెళ్లి చూసేలోపు వెళ్లిపోయిందని అతను చెప్తాడు. ఈ విషయం వెంటనే మనీష్ కి చెప్పాలని గీతాంజలి ఫోన్ చేయబోతుంటే అప్పుడే భాను అపుతాడు. ఈ రోజు మన పెళ్లి రోజు ఆ విషయం మర్చిపోకు.. అవన్నీ పక్కన పెట్టు అని రిక్వెస్ట్ చేస్తాడు. మరొకవైపు కొన్నసరుకులు అన్నీ మనిష్ తో మోయిస్తుంది అంజలి. ఒక ట్రాలీ ఆటోలో సరుకులు వేసి వెనకాల మనీష్ నీ కూర్చోమని చెప్తుంది. ఆ తర్వాత పెళ్లి రోజుకి ఏర్పాట్లు అన్ని గ్రాండ్ గా చెస్తారు. అప్పుడే మనీష్ వస్తాడు. కాసేపటికీ రాజారావు వస్తాడు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. అవును నాన్న మీరు ఎప్పుడు ఈ రోజు సంతోషం గా ఉంటారని శంకర్ అంటాడు. కానీ ఈసారి ఎందుకో ఎక్కువ హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుందని శంకర్ అంటాడు. ఆ తర్వాత గీతాంజలి ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుంది. అందరు వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు. ముందే రావాల్సింది కదా అని రత్నం అంటుంది. బావ వద్దని చెప్పాడని భవి అంటుంది. తాతయ్య చెప్పమన్నాడు.. ముందే వస్తే అన్ని పనులు మీరు చేయాల్సి వస్తుందని టైమ్ కి రమ్మన్నారని మనీష్ అంటాడు. అంతేనా లేకపోతే మీ తాత, మనవడు ఏదైనా కుట్ర చేస్తున్నారా అని భాను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 9, 2026 11:13AMGodhavari : కళ్యాణ్ కుట్రను బయటపెట్టిన గౌతమి.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -78 లో..... గౌతమిని తీసుకొని జాను వాళ్ళు ఇంటికి వస్తారు. అమ్మ గౌతమిని లోపలికి తీసుకొని వెళ్ళు అని జానూ చెప్తుంది. చాలా థాంక్స్ సూర్య అని జాను చెప్తుంది. తను వెళ్ళిపోతాడు. అక్కడున్న ఇంటిపక్కన వాళ్ళు .. ఏంటి గౌతమికి ఏమైంది ఎవరితోనో లేచిపోతుంటే కొట్టి తీసుకొని వచ్చారా అంటూ మాట్లాడుతుంటే వాళ్ళపై జాను కోప్పడుతుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాక అసలు ఏమైందో గౌతమిని కూర్చొపెట్టి అడుగుతారు. తోట పేపర్స్ ఇస్తానంటే వెళ్ళాను కానీ ఇలా చేస్తాడనుకోలేదని గౌతమి అంటుంది మన కుటుంబం మీద పగతో నా పరువు తియ్యాలనుకున్నాడట కళ్యాణ్ చెప్పాడని గౌతమి చెప్తుంది. ఇప్పుడే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని జాను అనగానే వద్దని శారద చెప్తుంది. మరొకవైపు సింహాద్రి వాళ్ళు కళ్యాణ్ గురించి టెన్షన్ పడుతుంటే.. అప్పుడే కళ్యాణ్ ని తన ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు. అక్కడే భువన కూడా ఉంటుంది. ఏంటి ఈ దెబ్బలు అని అడుగుతారు. ఆ గౌతమి పార్టీ ఇవ్వమని వెంటపడితే పార్టీ ఇచ్చాను.. వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి నా చెల్లిని కిడ్నాప్ చేసావని కొట్టారు.. వాళ్ళతో సూర్య బావ కూడా ఉన్నాడని కళ్యాణ్ చెప్పగానే సింహాద్రికి కోపం వస్తుంది. వాళ్ళని అసలు వదిలి పెట్టొద్దు అన్నయ్య అని భువన చెప్తుంది. మరొకవైపు గౌతమి బాధపడుతుంటే తనని నవ్వించడానికి అందరు ట్రై చేస్తారు. ఆ తర్వాత ఈ రోజు వంట నేను చేస్తానని మురళి అంటాడు. అందరి ముందు బిల్డప్ ఇచ్చాను కానీ నాకు వంట రాదే అని బాబిన్ కి ఫోన్ చేసి బయట నుంచి తెప్పిస్తాడు. ఆ తర్వాత మురళి కి హెల్ప్ చెయ్యమని పెద్దావిడ నందుని కిచెన్ లోకి పంపిస్తుంది. నందు వెళ్తుంటే జారీ పడిపోబోతుంటే మురళి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 9, 2026 11:08AMIllu illalu pillalu : ప్రేమను దక్కించుకునేందుకు ధీరజ్ మాస్టర్ ప్లాన్.. గుడిలో ఏం జరగనుంది?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -545 లో.....మంచితనం ముసుగులో మా ఇంటికి వచ్చి గొడవచేసి నా కోడలిని మీ ఇంటికి తీసుకొని వెళ్ళారు.. కానీ చుడండి తప్పకుండా నా కోడలు నా ఇంటికి వస్తుందని భద్రవతితో వేదవతి చెప్తుంది. ఆ తర్వాత రేపు గుడికి వెళ్లి అమ్మవారికి చీర సమర్పించాలని భద్రవతి అంటుంది. వద్దు అక్క అక్కడికి ఆ రామరాజు కుటుంబం వస్తుంది. ఆ ధీరజ్ గాడు నాపై చెయ్ చేసుకున్నాడు.. అవమానిస్తాడని సేనాపతి అంటాడు. పాపం ప్రేమ ఆ ధీరజ్ చేసిన మోసం ఇంకా మర్చిపోలేకపోతుంది తనని డైవర్ట్ చెయ్యడానికి వెళ్ళాలని భద్రవతి అంటుంది. నేను రాను అత్తయ్య నాకు స్పెషల్ క్లాస్ ఉందని ప్రేమ అంటుంది. ఆ తర్వాత రామరాజు వచ్చి అమూల్యని పిలిచి రేపు అమ్మవారికి చీర పెట్టాలి కదా తీసుకొని వచ్చానని ఇస్తాడు. అమూల్యకి చైన్ ఇస్తాడు. ఇది మీ అమ్మ కి ఇవ్వు అంటాడు. మీరు ఇస్తేనే తీసుకుంటా అని వేదవతి అంటుంది. అది జరగదని రామరాజు అంటాడు. వల్లికి ఒక చైన్ ఇస్తాడు.. నర్మదకి కూడా ఒక చైన్ ఇస్తాడు.. ఏంటి వాళ్ళ వస్తువులు మనకి ఎందుకు అని సాగర్ అంటాడు. ముందు తాకట్టు పెట్టిన బంగారం తీసుకొని రమ్మని చెప్పమని రామరాజు అంటాడు. ప్రేమ కోసం తెచ్చిన చైన్ ధీరజ్ కి ఇచ్చి రేపు గుడికి వస్తారు అక్కడ ఇవ్వమని చెప్తాడు. ఆ తర్వాత వేదవతి బాధపడుతుంటే ధీరజ్, నర్మద వెళ్లి రేపు ప్రేమకి అర్థం అయ్యేటట్టు చెప్దాం వాళ్ళు కావాలనే గొడవ పెట్టుకున్నారని చెప్తే ప్రేమ అర్థం చేసుకొని మన ఇంటికి వస్తుందని నర్మద అంటుంది. ఆ మాటలు వల్లి విని రేపు వీళ్ళు ప్రేమతో మాట్లాడకుండా చెయ్యాలని అనుకుంటుంది. ఆ తర్వాత అమూల్యకి విశ్వ ఫోన్ చేసి మనం ప్రేమ ధీరజ్ ని ఒకటి చెయ్యాలి అనుకున్నాం కదా.. రేపు మా చెల్లి గుడికి రావట్లేదని విశ్వ చెప్తాడు. నువ్వు ఏం చేస్తావో తెలియదు.. మా వదిన రేపు గుడికి రావాలని అమూల్య చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరుసటిరోజు భద్రవతి, సేనాపతి గుడికి రెడీ అవుతారు. ప్రేమ ఇని స్టిట్యూట్ కి రెడీ అవుతుంది. విశ్వ గుమ్మం ముందు అటు ఇటు తిరుగుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 9, 2026 10:14AMKarthika Deepam2 :జ్యోత్స్నకు షాకిచ్చిన సూరజ్.. అసలు నిజం బయటపెట్టిన హీరో!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -744 లో.... జ్యోత్స్న అంటే నాకు ఇష్టం కానీ జ్యోత్స్న మనసులో నేను.. నా మనసులో జ్యోత్స్న.... జ్యోత్స్న మనసు లో కార్తీక్ ఉంటే మేం ఎలా కలిసి ఉండగలం.. అందుకే నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోమని అడిగిన మీ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తున్నానని సూరజ్ చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్నకి తన మనసులో కార్తీక్ లేడని నాకు అనిపించినప్పడు నేనే తన మెడలో తాళి కడతానని సూరజ్ చెప్తాడు. సూరజ్ వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడే అవుట్ హౌస్ లో ఉండమని సుమిత్ర అంటుంది. నేను ఉండనని సూరజ్ అనగానే నువ్వు తప్పు చేసావ్ అనుకుంటే వెళ్ళిపో లేదంటే అవుట్ హౌస్ లో ఉండమని సుమిత్ర చెప్పగానే సరే అంటాడు. దీప, కార్తీక్ బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. సూరజ్ పై ఉన్న డౌట్ క్లియర్ అయిందా బావ ఈ ఆఫర్ కి వేరే వాళ్ళు అయితే ఎగిరి గేంతేసే వాళ్ళు అలా చెయ్యలేదంటే సూరజ్ మంచోడు అని అర్థమని కార్తీక్ తో దీప అంటుంది. మరొకవైపు ఎందుకు సూరజ్ ని అవుట్ హౌస్ లో ఉండమన్నావ్ జ్యోత్స్నకి వేరే సంబంధం చూసేవాళ్ళం కదా అని సుమిత్రని శివన్నారాయణ అడుగుతాడు. ఎవరిని చూసినా కార్తీక్ గురించి తెలిస్తే ఇలాగే ఉంటుంది కదా జ్యోత్స్న గురించి సూరజ్ కరెక్ట్ గా చెప్పానని సుమిత్ర చెప్తుంది. మరొకవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్తుంది. వాడు నిన్ను రిజెక్ట్ చేస్తాడా.. ఎంత ధైర్యం అని పారిజాతం అంటుంది. వాడు చెప్పింది అన్ని నిజమే గ్రానీ బంగారం అన్నాడు.. ప్రేమించమని వెంటపడ్డాడు.. తీరా పెళ్లి అనేసరికి నా మనసుని అందరి ముందు పెట్టాడు.. వాడు నన్ను పెళ్లి చేసుకోవాలంటే వాడిపై నాకు ప్రేమ ఉందని నమ్మించాలట గ్రానీ అని జ్యోత్స్న ఏడుస్తుంది. ఏంటే జ్యోత్స్న నువ్వు ఏడుస్తున్నావని పారిజాతం అంటుంది. వాడు నన్ను రిజెక్ట్ చేసాడు గ్రాని అని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంటే ఏంటే కొత్తగా కన్పిస్తున్నావ్.. వాడిని కావాలనే నువ్వు నీ వెంట తిప్పించుకొని.. ఇప్పుడు వాడు రిజెక్ట్ చేస్తే బాధపడినట్లు ఉంది.. కొంపదీసి సూరజ్ తో ప్రేమలో ఉన్నావా అని పారిజాతం అంటుంది. గ్రానీ నన్ను వదిలేయ్ కాసేపు అని జ్యోత్స్న ఏడుస్తుంది. మరొకవైపు ఆ జ్యోత్స్న అసలు సూరజ్ తో పెళ్లికి అంటే ఒప్పుకోదు పైగా సూరజ్ చెప్పినట్లు అసలు చెయ్యదని కార్తీక్ వాళ్ళతో కాంచన అంటుంది. నాకు ఇప్పటికి సూరజ్ పైన డౌట్ ఉంది.. ఎక్కడ ఒక దగ్గర పని చేయనివాడు ఇక్కడే ఉంటున్నాడంటే వాడిని ఏదో శక్తి ఆపుతుంది.. అది జ్యోత్స్న అని అర్ధం అయిందని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 9, 2026 9:54AMBrahmamudi : ఐశ్వర్యకు లక్కీ షాక్.. పెళ్లిచూపుల పేరుతో హైడ్రామా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1106 లో.. ఐశ్వర్య గదిలోకి లక్కీ వెళ్లి మాట్లాడుతాడు. నాకు తెలుసు ఐషు.. నేను అంటే నీకు ఇష్టమని సర్ ప్రైజ్ ప్లాన్ చేసావ్ కదా అని లక్కీ అంటుంటే వీడికి ఏమైంది ఇలా మెలికలు తిరుగుతున్నాడని ఐశ్వర్య అనుకుంటుంది.వీడికి ఏమైంది శశిని ఇష్టపడుతున్నానని తెలిసి వీడి మైండ్ పోయినట్లుందని ఐశ్వర్య అనుకుంటుంది. మరొకవైపు నందు ఏడుస్తుంటే ఇందు వస్తుంది. ఏమైందని అడుగుతుంది. నాతో వెంకీ మాట్లాడడం లేదు అక్క.. దూరం పెడుతున్నాడు.. వాడు అంటే నాకు చాలా ఇష్టం అక్క.. వాడు లేకుండా ఉండలేనని నందు అంటుంటే నువ్వేనా ఇలా మాట్లాడేది ఎంత ధైర్యంగా ఉండేదానివి ఇలా అవుతున్నావ్ ఏంటి.. తను ఆలా మాట్లాడడానికి కారణం ఉండొచ్చు.. నువ్వు ఏం టెన్షన్ పడకు అని ఇందు ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత లక్కీ రెడీ అయి ఐషు దగ్గరికి వస్తాడు. ఏంటి ఐషు ఇంకా రెడీ అవ్వలేదా పెళ్లి చూపులకి లేట్ అవుతుందని లక్కీ అనగానే పెళ్లిచూపులు ఎవరికి అని ఐషు అడుగుతుంది. నీకు నాకు అని లక్కీ అనగానే తన చెంపచెల్లుమనిపిస్తుంది . నీకు నాకు పెళ్లిచూపులు ఏంట్రా అని కోప్పడుతుంది. అదంతా రాజు, ఇందు చూస్తారు. ఏంటి మావ పెళ్లిచూపులు ఏంటని కొడుతుందని లక్కీ అనగానే పెళ్లిచూపులు తనతో అని నీకు చెప్పానా అని రాజు అంటాడు. అంటే ఏంటి మావ ఐషు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా అని లక్కీ అంటాడు. తెలుసు కానీ నేను చెప్పినట్లు చెయ్ అని రాజు అంటాడు. సరే అని లక్కీ అంటాడు.లక్కీని చూసుకోవడానికి రాజు డ్రామా కంపెనీ నుంచి ఆర్టిస్ట్ లని యాక్టింగ్ చెయ్యడానికి పిలుస్తాడు. యాక్టింగ్ బాగా చెయ్యండి అని వాళ్లకి చెప్తాడు. వాళ్ళు లోపలికి రాగానే రాజు అందరిని హాల్లోకి పిలుస్తాడు. లక్కీ గాడికి పెళ్లిచూపులు అని చెప్తాడు. పెళ్లిలో కాళ్ళు కడిగి కన్యదానం చేస్తారు కదా అప్పుడు తల్లిదండ్రల స్థానంలో ఎవరు కూర్చుంటారని అమ్మాయి తల్లి అడుగుతుంది. అదేం సమస్య కాదు.. మా రేఖ పిన్ని కూర్చుంటుంది. తనే కదా తల్లి అని రాజు అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Aug 9, 2026 9:06AM
అమ్మో కృత్తికా, అమూల్య ...మామూలోళ్లు కాదు
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. అందులో శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో గుండె నిండా గుడి గంటలు వెర్సెస్ పొదరిల్లు సీరియల్స్ మధ్య పోటీ నడుస్తోంది. ఐతే ఈ సీరియల్స్ హీరో హీరోయిన్స్ కి ఒక టెస్ట్ పెట్టింది. ముందుగా గుండె నిండా గుడి గంటలు టీమ్ లో బాలు - అమూల్య మధ్య ఈ పోటీ పెట్టింది. ఒక బోర్డు మీద హీరో హీరోయిన్స్ కి సంబంధించిన కొన్ని క్వాలిటీస్ రాసి వాటికి మార్క్స్ వేయించింది. "అమూల్య పిసినారితనం " అని శ్రీముఖి అడిగింది. జీరో అని రాసాడు బాలు. "ఎందుకంటే నెలలో ఎప్పుడైనా సరే టెక్నిషియన్స్ కి ఆర్టిస్టులకు స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తెప్పిస్తుంది. అలగడం అన్న క్వాలిటీకి 3 మార్కులు వేసాడు శ్రీముఖి దానికి ఇంకో 7 మార్కులు యాడ్ చేసింది. "న్యాయం కోసం అలుగుతా " అంటూ చెప్పింది అమూల్య. ఇక అసూయ అనే క్వాలిటీకి జీరో బద్ధకం అనే క్వాలిటీకి 1 మార్కు వేసాడు. తర్వాత బాలు క్వాలిటీస్ కి అమూల్యతో మార్కులు వేయించింది శ్రీముఖి. పొగరెంతుంది మా బాలులో అని అడిగింది. పిసినారితనానికి 3 , పొగరు జీరో, బద్ధకం జీరో . మా ఆయనకు పొగరు లేదు. ఆయన మంచాయన అని చెప్పింది అమూల్య . "ఎప్పుడైనా సెట్ లోకి లేట్ గా వచ్చిన తర్వాత ఎందుకింత లేట్ నేను వెయిట్ చేస్తున్నా " అన్నావా అని శ్రీముఖి అడిగింది. "నిజానికి మా ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉంది. ఆయన వచ్చినప్పుడు నేను లేట్ చేయకూడదని నేను వచ్చేస్తా నేను వచ్చినప్పుడు ఆయన వచ్చేస్తారు" అని చెప్పింది. "యా ఆ అండర్ స్టాండింగ్ అవసరం లేదు కానీ ఉంది " అంటూ శ్రీముఖి కూలిపోయింది. తర్వాత పొదరిల్లు సీరియల్ కృతికకు పొగరు అనే క్వాలిటీకి 3 మార్కులు వేసాడు దీపక్. దానికి రీజన్ చెప్పండి అంటూ నిలదీసింది కృతిక. లేకపోతే ఈ సెట్ లో నిజంగా చూపిస్తా. ఇంతలో శ్రీముఖి ఏయ్ ఏంటి నువ్వెంటి ఆయనని బెదిరిస్తున్నావ్ అంది. తర్వాత ఈ రెండు సీరియల్స్ కి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అన్న విషయాన్నీ కొన్ని రీల్స్ ప్లే చేసి చూపించింది శ్రీముఖి. -------------
Aug 8, 2026 6:08PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com










