English | Telugu

Eto Vellipoyindhi Manasu :  రామలక్ష్మి అసలు నిజం తెలుసుకుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -169 లో....సీతాకాంత్ రాజీనామా చేస్తున్నట్లు సంతకం చేస్తుంటే రామలక్ష్మి వెళ్లి ఫైల్ లాక్కుంటుంది. మీరు ఇప్పుడు సంతకం చేస్తే చెయ్యని తప్పుని మీరే ఒప్పుకున్నట్టు అవుతుందని రామలక్ష్మి అంటుంది. మరి ఇప్పుడు వేరే దారి లేదని సీతాకాంత్ అనగానే.. నాకు ఒక్క రోజు టైమ్ ఇవ్వండి. కంపెనీని మిమ్మల్ని కాపాడుకుంటానని రామలక్ష్మి అనగానే.. నీపై నమ్మకం పోగొట్టుకున్నానని సీతాకాంత్ అంటాడు. సరే అంటూ రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి, పెద్దాయన, శ్రీలత ఇంటికి వస్తారు.

Guppedantha Manasu : శైలేంద్రకి  కొత్త ప్లాన్ చెప్పిన దేవయాని.. అతను ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1147 లో....మహేంద్ర వాళ్ళని అక్కడే ఉండమని దేవయాని అంటుంది. దానికి మహేంద్ర ఒప్పుకోడు.. ఏంటి మహేంద్ర అందరం కలిసి ఉంటే బాగుంటుంది ..ఎందుకు ఇలా చేస్తున్నావని దేవయాని అంటుంది. రిషి వచ్చాక మన జీవితాల్లో వెలుగులు వచ్చాయి.. అందరం కలిసి ఇక్కడే హ్యాపీగా ఉందామని మహేంద్రని ఫణీంద్ర రిక్వెస్ట్ చేస్తాడు. ధరణి కూడా ఇక్కడే ఉండండి మావయ్య అని అంటుంది. అప్పుడే వసుధార, రిషిలు కాలేజీకి రెడీ అయి వస్తారు. అమ్మ వసుధార ఇక్కడే ఉండమంటున్నారని వసుధారతో మహేంద్ర అంటాడు.

Brahmamudi : అప్పుని పెళ్ళి చేసుకున్న కళ్యాణ్.. షాక్ లో దుగ్గిరాల కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -482 లో.....రుద్రాణి , ధాన్యలక్ష్మి లు అప్పుపై నిందలు వెయ్యడం వళ్లే పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతో ఇందిరాదేవి వాళ్ళని తిడుతుంది. మరొకవైపు కంగ్రాట్స్ అప్పు సక్సెస్ ఫుల్ గా నీ పెళ్లి ఆగిపోయింది.. అక్కడ పెద్ద కురుక్షేత్రమే జరిగింది అంట అని అప్పుతో అనామిక చెప్తుంటుంది. గెలిచానని సంబరపడిపోకు నా నుండి నువ్వు తప్పించుకాలేవని అప్పు అనగానే.. ముందు ఇక్కడ నిన్ను ఎవరు కాపాడుతారంటూ అనామిక అంటుంది. అప్పుడే కళ్యాణ్ బంటి ని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ రౌడీ లని కొడతాడు‌. ఇప్పుడు అంటే కాపాడావ్.. అలా ఎప్పుడు చెయ్యలేవు కదా అని అనామిక అంటుంది.

ఆ కోరిక కోసం కాదు పెళ్లి అంటే... ఇలా నీచంగా ఎవరూ మాట్లాడరు

లేడీస్ లో ట్రెండింగ్, డేర్ అండ్ డ్యాషింగ్ గా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే  అనసూయ, రష్మీ, మాధవీలత, చిన్మయి శ్రీపాద. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో చేసేస్తారు అని భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. అలాంటిది ఇప్పుడు మాధవీలత సీనియర్ సిటిజన్స్ పెళ్లి గురించి మాట్లాడింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. ఐతే ఈ మధ్య కాలంలో బాగా వయసైపోయిన వాళ్ళు, పిల్లలు వదిలేసినా వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఇలా చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ చాలామంది ఈ విషయాన్ని బూతద్దంలో చూస్తూ ఇప్పుడు పెళ్లేంటి, ఇప్పుడు సెక్స్ ఏంటి, ఇప్పుడు పిల్లల్ని కంటారా అని వాళ్ళను బాధపెడుతున్నారు.

Karthika Deepam2 : అది చూసి తట్టుకోలేక కార్తిక్.. అవి నిందలు కాదు ఆధారాలు!

  ​స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -116 లో.. లాయర్ VV నరసింహాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. దీప వివాహాతేర సంబంధం పెట్టుకుందని అంటాడు. అందుకు సాక్ష్యమంటూ నా కూతురు స్కూల్ అడ్మిషన్ ఫామ్ లో తండ్రి దగ్గర అతను సంతకం చేసాడు. ఇంకా రెండు సార్లు నా కూతురు హాస్పిటల్ బిల్ కట్టాడు.. అంతేకాకుండా మా అప్పులన్నీ తనే కట్టాడు.. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ నరసింహా అంటాడు. అదంతా అప్పుగా తీసుకున్నానని దీప చెప్తుందిమ మరి దానికి సంబంధించిన సాక్ష్యం ఏదైనా ఉందా అని లాయర్ అడుగగా.. ఏవి లేవని దీప అంటుంది.

Eto Vellipoyindhi Manasu : ఆఫీస్ భాద్యతల నుండి తప్పుకుంటూ సీతాకాంత్ సంతకం.. అడ్డుకున్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -168 లో..... సీతాకాంత్ కి భోజనం తినిపించి రామలక్ష్మి వెళ్లిపోతుంటే.. శ్రీలత బయటకి వస్తుంది. పాపం నీ పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుందంటూ శ్రీలత మాట్లాడుతుంది. నేనొక నిర్ణయం తీసుకున్న రేపే సీతాకాంత్ స్థానంలో నా కొడుకుని చైర్మన్ ని చేయబోతున్నాని అనగానే అంటే ఇదంతా చేసింది మీరేనే? నీ కొడుకుని చైర్మన్ ని చెయ్యడం కోసం సీతా సర్ ని ఈ కేసు లో ఇరికించారా అని రామలక్ష్మి అంటుంది. అని చెప్పానా? ఆధారాలు ఉన్నాయా అని శ్రీలత అంటుంది. చెప్పకపోయిన అసలు నిజమేంటో ఏం జరిగిందో కనుక్కుంటానని రామలక్ష్మి అంటుంది.​    

Guppedantha Manasu : మోస్ట్ రొమాంటిక్ సీన్.. హీటెక్కించిన గుప్పెడంత మనసు ఎపిసోడ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1146 లో..... శైలేంద్ర వాళ్ల ఇంటికి సరోజ వచ్చి.. నా బావ రంగా అంటూ చెప్తుంది. అతను నా బావకి డబ్బులిచ్చి ఇక్కడికి తీసుకోని వచ్చాడంటూ శైలేంద్రని చూపిస్తుంది సరోజ. రా బావ అంటూ రిషి చెయ్ పట్టుకుంటుంది. నేను రాను ఎందుకు అంటే నేను రంగాని కాదు రిషిని అని చెప్తాడు. దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఎందుకు ఇదంతా చేసావ్.. ఎందుకు ఆ అమ్మాయి అలా మాట్లాడుతుందంటు శైలేంద్రని ఫణీంద్ర కొడతాడు. ఇక ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమని ఫణింద్ర అన్నట్లు వద్దు వద్దు అంటూ ఒక్కసారిగా శైలేంద్ర కల కంటూ నిద్ర నుండి ఉలిక్కిపడి లేస్తాడు.  ఏంటి రంగా గాడు రిషి అంటున్నాడు.. ఇదంతా కలనా అని టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే ధరణి వస్తుంది. ఎందుకు అలా కంగారు పడుతున్నారని అడుగుతుంది.