English | Telugu

Guppedantha Manasu : శైలేంద్రని కలవనున్న సరోజ.. క్లైమాక్స్ ఎలా ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1161 లో..   మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు? అని వసుధార అంటే.. అవును వసుధార.. రిషి అనేవాడికి మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు.. కానీ రంగాకి అన్నయ్య నిజస్వరూపం మొత్తం తెలుసని అంటాడు. ఆ మాటతో వసుధార ఆశ్చర్యంగా చూస్తుంది. దాంతో రిషి.. ఏంటి వసుధారా.. కన్ఫ్యూజన్‌గా ఉందా?? చెప్పాను కదా.. నిన్ను కొన్నిరోజులు కన్ఫ్యూజన్‌లో ఉంచుతానని.. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా.. నేను రిషిలా చేయలేని పనులు రంగాగా చేయగలను కాబట్టే ఇంకా ఆ పాత్ర పోషిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆ పాత్రలో నేను చక్కబెట్టాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అవి రంగాగానే చేస్తానని అంటాడు.

Brahmamudi : కొత్తకోడలికి అవమానం.. అప్పుకి కళ్యాణ్ సపోర్ట్ గా ఉండగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ).ఈ సీరియల్  శుక్రవారం నాటి ఎపిసోడ్ -496 లో.. కళ్యాణ్ గది బయట నిల్చొని ఆలోచిస్తుంటే అప్పు తన దగ్గరికి వస్తుంది. అక్కడ మా అమ్మ, రుద్రాణి అత్తయ్య నిన్ను అవమానిస్తారని కళ్యాణ్ అంటాడు.  వాళ్లు ఏం అన్న నేను ఒక్క మాట ఎదురు చెప్పనని అప్పు అంటుంది. నీ గురించి నాకు తెలియదా.. నువ్వు ఎక్కడ ఊరుకుంటావ్. నువ్వు మా అమ్మను అన్న నాకే బాధ. అమ్మ నిన్ను అన్న నాకే బాధ అని కళ్యాణ్ అంటాడు. తాతయ్య వాళ్లు వచ్చి పిలిచాక కూడా వెళ్లకుంటే మర్యాదగా ఉండదు. వాళ్లు ఎన్ని మాట్లాడిన సరే నేను నోరు ఎత్తనని కల్యాణ్ చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తుంది. మరుసటి రోజు కావ్య పూజకు అంతా రెడీ చేస్తుంటుంది.

పెళ్ళైనా పర్లేదు నాకు ఓకే అంటున్న...నాని గారు

కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వీకెండ్ తో ఈ షోకి ఎండ్ కార్డు పడబోతోంది. ఇప్పుడు దీని ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వీకెండ్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా "సరిపోదా శనివారం" ప్రొమోషన్స్ కోసం నేచురల్ స్టార్ ఎంట్రీ ఇచ్చాడు. "దసరా" మూవీ స్టెప్స్ అలరించాడు. ఇక నాని రావడమే తమిళ 'బిగ్ బాస్' ఫేమ్, ఆయేషా ఖాన్ ఎగురుకుంటూ వచ్చి హగ్ చేసేసుకుంది. వెంటనే శ్రీముఖి “హలో ఆయనకు పెళ్లైంది” అని అయేషాకు చెప్పింది.. “ఇట్స్ ఓకే పర్లేదండి” అని ఆయేషా చెప్పేసరికి నాని కూడా “అయితే,  ఇట్స్ ఓకే..నాక్కూడా పర్లేదు” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అందరూ ఫుల్ ఖుషీ ఇపోయారు.

గంట వరకు ఇంద్రజతో లిఫ్ట్ లో గేమ్ ఆడిన నరేష్... పవిత్ర మిసింగ్!

​శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కృష్ణ జన్మాష్టమి స్పెషల్ గా తీర్చిదిద్దారు. ఇక ఈ షోకి నిజంగానే కృష్ణుడిని పట్టుకొచ్చారు అదేనండి సీనియర్ నటుడు, విజయ నిర్మల సుపుత్రుడు నరేష్. ఐతే ఏ షోకైనా నరేష్ తో కలిసి పవిత్ర ఎంట్రీ ఇస్తుంది కానీ ఈ షోలో సింగల్ గా వచ్చాడు నరేష్. వీరాంజనేయులు విహార యాత్ర మూవీ టీమ్ వచ్చింది. ఇక షోలో నరేష్ చేసిన అల్లరి పనులు మాములుగా లేవు సుమీ..షోకి రావడం రావడమే ఇంద్రజని కూడా పడగొట్టే పనిలో పడ్డాడు. నరేష్ తమ్ముడు మహేష్ బాబు నటించిన పోకిరి మూవీలో లిఫ్ట్ సీన్ ని నరేష్, ఇంద్రజ కలిసి రిక్రియేట్ చేశారు. ఇంద్రజ, నరేష్ లిఫ్ట్ లో ఎక్కేసరికి లిఫ్ట్ ఆగిపోతుంది.

Karthika Deepam2 : వీడియో చూసిన కార్తీక్...ఇంట్లోవాళ్ళంతా దీపపై ఫైర్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -130 లో...  స్వప్న ప్రియుడు కాశీకి యాక్సిడెంట్ అయితే.. జోత్స్న పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. అదే దారిన వస్తున్న దీప.. కాశీ ప్రాణాలను కాపాడుతుంది. హాస్పిటల్‌లో చేర్పిస్తుంది. అదే హాస్పిటల్ కి శౌర్యని తీసుకొస్తాడు కార్తీక్‌. కాశీ దగ్గర ఉన్న ఫోన్‌తో దాసుకి ఫోన్ చేస్తాడు కార్తీక్. అయితే తన కొడుక్కి యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే కంగారుగా హాస్పిటల్‌కి వస్తాడు. దీపే తన కొడుకుని కాపాడిందని తెలియడంతో.. జన్మజన్మలకు నీకు రుణపడి ఉంటానంటూ దాస్ ఎమోషనల్ అవుతాడు.

Guppedantha Manasu : తండ్రిని చంపటానికి ఆవేశంతో వెళ్తున్న మను

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1160 లో..  రిషి సర్‌కి మను తండ్రి ఎవరో తెలిసినా కూడా ఎందుకు రియాక్ట్ కావడం లేదు? ఇంత సీరియస్ విషయాన్ని అంత కూల్‌గా ఎలా తీసుకుంటున్నారు? రిషి సర్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. ఆయన నా దగ్గర ఏదో దాస్తున్నారు? అసలు అదేంటో కనిపెట్టాలని వసుధార అనుకుంటుంది. మరోవైపు మనుకి మెసేజ్‌లు పెడుతూనే ఉంటాడు మహేంద్ర. ఎందుకు మను ఫోన్ తీయడం లేదు.. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నానంటూ మహేంద్ర మెసేజ్ పెట్టగానే.. అది చూసిన మను ఫోన్‌ని విసిరికొట్టబోతుంటాడు.

యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం...

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని  లేదు. బుల్లితెర మీద శ్రీముఖి, రష్మీ హవానే కొనసాగుతోంది.  అలాంటి యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రష్మీ తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతో ఇష్టమైన తాతయ్య మరణన్ని తట్టుకోలేకపోతున్నానని  రష్మి  ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.. ‘మా తాత అచ్చమైన స్త్రీవాది. ఫైనల్ గా  ఆయన స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఆగస్టు 17 న మా తాతయ్య ఆనారోగ్యంతో మరణించారు. ఆయనకు తుది వీడ్కోలు పలికాం.

Karthika Deepam2 : పెళ్ళికి ఒప్పుకున్న కార్తీక్.. కాశీకి సాయం చేసిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -129 లో... సుమిత్ర వాళ్ళ ఇంట్లోకి కార్తీక్ వెళ్లి అందరిని పిలుస్తాడు. అందరు రాగానే.. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఒకరికి జీవితం ఇవ్వడానికి సంబంధించినదని అనగానే దీపకి జీవితం ఇస్తానని చెప్తూడేమోనని పారిజాతం, జ్యోత్స్నలు టెన్షన్ పడతారు. ఒకసారి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయింది.. ఎంగేజ్ మెంట్ మనకి అచ్చి రాలేదని కార్తీక్ అంటాడు. ఇంకొకసారి చేసుకోవచ్చని పారిజాతం అంటుంది. అవసరం లేదు ఇక ఎంగేజ్ మెంట్ లేదు డైరెక్ట్ పెళ్లికి ముహూర్తం పెట్టండి అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.

Guppedantha Manasu : శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పించిన రిషి...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1159 లో.....అసలు ఆ మనుగాడు ఏం చేసినా భయపడట్లేదు.. వాడు అర్థం అవ్వడం లేదు.. ఏదోదో వాగేసాడు.. ఆగస్ట్ లో ఏదో ఒకటి చేస్తానని వార్నింగ్ ఇచ్చాడని శైలేంద్ర అనగానే.. అంటే వాడు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అనుకుంటున్నావా.. తన తండ్రి ఎవరో తెలిసిన మరుక్షణం చంపేస్తాను అన్నవాడు ఏం చేయకుండా సైలెంట్ గా ఉంటున్నాడని ఆలోచిస్తున్నావా అని దేవయాని అంటుంది. ఎవరికైనా తండ్రి మీద ప్రేమ తప్ప కోపం ఉండదు.. అందరూ తండ్రి ఎవరు అనడం వల్ల వాడికి తండ్రి పై కోపం పెరిగింది కానీ మహేంద్ర అంటే ఇష్టం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాడని దేవయాని అంటుంది. నువ్వే వాడిని టైమ్ దొరికినప్పుడల్లా ఇర్రిటేట్ చేయమని దేవయాని చెప్తుంది. దాంతో వాడు పెద్ద ముదరు అని శైలేంద్ర అంటాడు.