English | Telugu
జాను లైఫ్ స్టోరీ చూసి ...శేఖర్ మాస్టర్ ఎమోషనల్
Updated : Aug 12, 2024
బుల్లితెరపై సినిమాలు, సీరియల్స్తో పాటు కొన్ని షోలు కూడా అలరిస్తున్నాయి. వాటిల్లో క్యాష్, బిగ్ బాస్, లతో పాటు ఢీ డ్యాన్స్ షో ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు కొరియోగ్రాఫర్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే కంటెస్టెంట్లుగా వచ్చి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో టీవీ ప్రేక్షకులను పలకరిస్తోంది. సీజన్ మారినప్పుడల్లా కొత్త వారిని పరిచయం చేస్తూ కొత్తగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకొస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్-2 నడుస్తోంది. దీనికి నందు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇక కంటెస్టెంట్లులకు టీమ్ లీడర్లుగా ఆది, శ్రీసత్య వ్యవహరిస్తున్నారు. జడ్జులుగా నటి హన్సిక, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్ షోకు ఫిదా అయిపోయాడు శేఖర్ మాస్టర్. ఆమె జాను లైరి. తను ఆడితే అలానే చూడాలనిపచిందని శేఖర్ మాస్టర్ చెప్పగా తోటి డ్యాన్సర్స్ సైతం జాను లైరి డ్యాన్స్ కి ఫిధా అయ్యారు.
ఢీ సెలబ్రిటీ స్పెషల్-2లో ‘సెనిగ చేలా నిలబడి చేతులియ్యావే’ అంటూ సాగిపోయే ఫోక్ సాంగ్కు అదిరిపోయే స్టెప్స్ వేసింది జాను. స్వతహాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ ఫోక్ డ్యాన్సర్ అయిన జాను.. ఈ పాటకు ఇచ్చి పడేసింది. గతంలో కూడా యూట్యూబ్ వేదికగా ఈ పాటకు కాలు కదిపిన ఈ నెమలి.. ఇప్పుడు ఢీ షోలో కూడా తన పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది.
ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో తను డ్యాన్స్ చేస్తూ ఎమోషనల్ అయింది. తను నడుచుకుంటు వెళ్తుంటే కామెంట్లు చేసేవారని, అవకాశాల కోసం ఎన్నో దాటుకొని వచ్చినట్టు చెప్పింది. కొన్నిసార్లు అవమానాలు తట్టుకోలేక చనిపోవాలనుకుంటే తన కొడుకు గుర్తొచ్చాడంటు ఏడ్చేసింది. ఇక తనని చూసి జడ్జ్ హన్సిక కూడా ఏడ్చేసింది. ఢీ షోలని వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మీరు ఓ లుక్కేయండి.