English | Telugu

అందుకే జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాను.. అలా చేయడం కరెక్ట్ కాదు!

జబర్దస్త్ షో రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. సరదా శుక్రవారం సరిపోదా శనివారం పేరుతో ఈ షో వస్తోంది. ఇప్పుడు ఈ రెండు ఎపిసోడ్స్ కి యాంకర్ గా రష్మీనే పని చేస్తోంది. ఇంతకుముందు అనసూయ యాంకర్ గా చేసేది. ఐతే ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. దీంతో ఈ షో నుండి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె ప్లేసులో కన్నడ సీరియల్ నటి, బుల్లితెర యాక్టర్ సౌమ్యరావ్ వచ్చింది. వచ్చి రానీ తెలుగుతో కొద్దీ రోజులు ఆకట్టుకుంది. అప్పుడప్పుడే ఆడియన్స్ తెలుస్తోంది అనుకుంటున్న టైములో ఆమె కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె స్థానంలోకి వచ్చింది సిరి హనుమంతు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ షో మొత్తం స్టైల్ మార్చేశాక రష్మీ గౌతమ్ మాత్రమే యాంకర్ గా ఉంటోంది. అయితే చాలా మందికి సౌమ్య రావ్ ఎందుకు వెళ్లిపోయిందో అన్న విషయం తెలీదు. ఐతే ఆ విషయాల గురించి సౌమ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. జబర్దస్త్ నుండి సడెన్‌గా వెళ్లిపోవడానికి కారణం అగ్రిమెంట్ ఐపోవడమే అని చెప్పింది. అందుకే ఈ షో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పింది.

"వన్ ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పారు. నెక్ట్స్ ఇయర్ కొత్త ఫేస్ ట్రైం చేస్తాం అన్నారు. ఇట్స్ ఓకే అని చెప్పా. అక్కడ ఉన్నప్పుడు మంచిగానే చూసుకున్నారు. బెంగళూరు నుండి ఇక్కడకు తీసుకొచ్చి, క్యాబ్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. పేమెంట్స్ ఇష్యూస్ కానీ, కంటెస్టెంట్ల నుండి కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. టీమ్ లీడర్స్, జడ్జెస్ , ప్రొడక్షన్ టీం, మేనేజ్ మెంట్ అందరూ నన్ను బాగా చూసుకున్నారు" అని సౌమ్య చెప్పింది.

ఆడియన్స్‌ తో ఎక్కువగా కనెక్ట్ కాకపోవడానికి కారణం కూడా చెప్పింది. "ఇలా వచ్చానో లేదో అలా సమయం అయిపోయింది. సీరియల్స్ లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ యాంకరింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్ చేయకూడదు. మళ్లీ మంచి ఆఫర్స్ వస్తే వెళతాను. ఐతే ఈ జర్నీ మొత్తంలో ఒకే కంపెనీపై కానీ, ఒకరిపై కానీ ఆధారపడకూడదు. ఒక ఆర్టిస్టుగా మన మార్గాలను మనమే వెతుక్కోవాలి. ఎక్కడ అవకాశాలు దొరికినా వెళ్ళాలి. ఎప్పుడూ ఒకే రూట్ లో వెళితే ఆ దారిని ఎప్పుడు, ఎవరు, ఎలా క్లోజ్ చేస్తారో మనకు తెలియదు" అంటూ చెప్పుకొచ్చింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.