English | Telugu

ఉదయ్ కిరణ్ గురించి సంచలన విషయాలు చెప్పిన కౌశల్!

ఉదయ్ కిరణ్ గురించి సంచలన విషయాలు చెప్పిన కౌశల్!

Publish Date:Jul 4, 2025

  అప్పట్లో ఉదయ్ కిరణ్ ఓ సంచలనం. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి హ్యాట్రిక్ హిట్స్ తో కెరీర్ ప్రారంభించి.. యూత్ లో తిరుగులేని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలను చూడనప్పటికీ.. పలు సినిమాల్లో నటించి.. హీరోగా తనదైన ముద్ర వేశాడు. అలాంటి ఉదయ్ కిరణ్.. 2014 లో ఆత్మహత్య చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్ మరణించి పదేళ్లు దాటిపోయినప్పటికీ.. అభిమానులు, సినీ పరిశ్రమలో ఆయన స్నేహితులు ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కౌశల్.. ఉదయ్ కిరణ్ తో తనకున్న అనుబంధం గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.   మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన 'కన్నప్ప'లో కౌశల్ కూడా నటించాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కౌశల్. "చిత్రం సినిమా రాకముందు నుంచే నాకు ఉదయ్ కిరణ్ తో పరిచయముంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఆ స్థాయికి వెళ్ళడం మామూలు విషయం కాదు. అందుకోసం ఉదయ్ ఎంతో కష్టపడ్డాడు. ఉదయ్ హీరోగా చేసిన చాలా సినిమాల్లో నేను నటించాను. చాలా మంచి వ్యక్తి. ఈ మాట అనకూడదు.. కానీ, అలాంటి మంచి వ్యక్తి.. ఇలాంటి సమాజంలో లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఒక మనిషి జీవితంలో పైకి వెళ్తున్నా, ఏదైనా సాధిస్తున్నా కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. ఒక మనిషి ఎదుగుతుంటే హింసించి, డౌన్ చేయడానికి చూస్తారు." అంటూ కౌశల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.    
దశాబ్దకాలం హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమను ఏలిన చలాకీ కన్నుల మంజుల!

దశాబ్దకాలం హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమను ఏలిన చలాకీ కన్నుల మంజుల!

Publish Date:Jul 4, 2025

(జూలై 4 నటి మంజుల జయంతి సందర్భంగా..) తమ అందం, అభినయంతో కథానాయికలుగా మంచి పేరు తెచ్చుకున్నవారు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ప్రేక్షకుల మనసుకు దగ్గరైన వారు, వారి మనసుల్ని దోచుకున్న వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందం, అభినయంతోపాటు చలాకీతనం, చిలిపితనం, కళ్ళతోనే నవ్వులు చిందించగల ప్రతిభ ఆమె సొంతం. మంజుల వంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి అరుదుగా వస్తుంటారు. ఆమె అందానికి ఆరోజుల్లో ఎంతో మంది మనసు పాడుచేసుకున్నారు. కేవలం ఆమెను చూసేందుకే యూత్‌ మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి వెళ్లేవారు. 40 సంవత్సరాల తన కెరీర్‌లో 100కి పైగా చిత్రాల్లో నటించారు మంజుల. దశాబ్దంపాటు తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ సినిమాల్లో తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకున్న మంజుల జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. 1954 జూలై 4న మద్రాస్‌లో జన్మించారు మంజుల. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. చదువుతోపాటు కళల పట్ల కూడా ఆమె శ్రద్ధ చూపించేవారు. స్కూల్‌లో జరిగే కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో కూడా ఆమె పాల్గొనేవారు. చిన్నతనం నుంచీ ఎంతో చలాకీ ఉంటూ అందర్నీ ఆకర్షించేవారు మంజుల. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే మంజులకు సినిమాలపై ఆసక్తి కలిగింది. సినిమాల్లో నటించాలన్న ఆమె ఆలోచనను తల్లిదండ్రులు కూడా బలపరిచారు. 1970లో జెమిని గణేశన్‌ హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘శాంతి నిలయం’ చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు మంజుల. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు. ఆ సినిమాలో జెమినీ గణేశన్‌కు మేనకోడలి పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎం.జి.రామచంద్రన్‌ హీరోగా వచ్చిన ‘రిక్షాకారన్‌’ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు.  జైజవాన్‌ చిత్రం ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయమయ్యారు మంజుల. మరపురాని మనిషి, నీతినిజాయితి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించిన తర్వాత కృష్ణ హీరోగా రూపొందిన మాయదారి మల్లిగాడు చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్‌ హీరోయిన్‌గా మంజులకు ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తెలుగులో అందరు టాప్‌ హీరోల సరసన నటించారు. ఎన్టీఆర్‌తో వాడే వీడు, మనుషులంతా ఒక్కటే, దేవుడు చేసిన మనుషులు, నేరం నాది కాదు ఆకలిది, మా ఇద్దరి కథ, చాణక్య చంద్రగుప్త చిత్రాల్లో నటించారు. ఎఎన్నార్‌తో మహాకవి క్షేత్రయ్య, దొరబాబు, బంగారు బొమ్మలు సినిమాలు చేశారు. మాయదారి మల్లిగాడు తర్వాత కృష్ణతో భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో నటించారు మంజుల. అయితే తెలుగులో శోభన్‌బాబు కాంబినేషన్‌లో ఎక్కువ సూపర్‌హిట్‌ సినిమాలు చేశారు మంజుల. మంచి మనుషులు, పిచ్చిమారాజు, జేబుదొంగ, ఇద్దరూ ఇద్దరే, గుణవంతుడు, మొనగాడు సినిమాలు చేశారు. శోభన్‌బాబు, మంజుల హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలా పదేళ్ళపాటు గ్లామర్‌ హీరోయిన్‌గా తన హవాను కొనసాగించారు మంజుల.  1980వ దశకం వచ్చేసరికి మంజులకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాయి. 1983 వరకు నటిగా కొనసాగిన ఆమె కొంత గ్యాప్‌ తీసుకొని 1988లో రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన చిక్కడు దొరకడు చిత్రంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. టూ టౌన్‌ రౌడీ, ప్రేమ, చంటి, సరదాబుల్లోడు, వాసు వంటి సినిమాల్లో నటించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వెంకటేష్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటించడం విశేషం. 2011లో వచ్చిన వాసు తెలుగులో మంజుల నటించిన చివరి సినిమా.  ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1976లో నటుడు విజయకుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి. వీరు కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. విజయకుమార్‌కు అంతకుముందే వివాహం అయింది. వారికి కలిగిన సంతానంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా, విలన్‌గా రాణిస్తున్నారు. 2011 తర్వాత సినిమాలకు దూరమైన మంజుల.. కొన్ని తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటించారు. అలాగే కొన్ని గేమ్‌ షోలలో కూడా కనిపించారు. 2013లో జూలై 23న మంజుల ప్రమాదవశాత్తూ మంచం మీద నుంచి కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ గాయంతోపాటు కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా అదేరోజు 59 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు మంజుల. కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా మంజుల పేరుతో ఒక హీరోయిన్‌ ఉండేవారు. 1986లో వంటగదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 31 ఏళ్ళ అతి చిన్న వయసులో మంజుల ప్రాణాలు విడిచారు. ఒకే పేరు ఉన్న ఈ ఇద్దరు నటీమణులు ప్రమాదవశాత్తూ మరణించడం గమనార్హం.

వార్ 2 ప్రమోషన్స్.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి రావట్లేదు.. ఏం జరుగుతోంది?

Publish Date:Jul 2, 2025

  YRF స్పై యూనివర్స్ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంది. ఈ మేరకు YRF ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తుంటుంది. 'వార్ 2'లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతోన్నారు. ఈ క్రమంలో YRF ప్రమోషన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటోంది. ఇద్దరితో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది.   హృతిక్, ఎన్టీఆర్ కలిసి 'వార్ 2'ని ప్రమోట్ చేయరు. ఏ ఈవెంట్‌లో కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. అసలు 'వార్ 2' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఆ ఇద్దరు. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. ఆ ఇద్దరినీ డైరెక్ట్ గా బిగ్ స్క్రీన్ పైన చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుందని యష్ రాజ్ ఫిల్మ్స్ టీం ఈ నిర్ణయం తీసుకుందట.   YRF స్పై యూనివర్స్ ఎప్పుడూ కూడా తమ సినిమాలను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటుంది. 'వార్' విషయంలోనూ ఇలాంటి ఓ స్ట్రాటజీనే ఫాలో అయింది. సినిమా రిలీజ్‌కు ముందు ఎక్కడా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. హీరోలిద్దరూ కలిసి కనిపించలేదు. ‘వార్’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లోనే హీరోలిద్దరూ కనిపించారు. 'పఠాన్' విషయంలో షారుఖ్ ఖాన్ కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండానే సినిమాపై బజ్‌ను పెంచారు. చివరకు 'పఠాన్' ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇలా స్పై యూనివర్స్‌ నుంచి వచ్చే ప్రతి సినిమాకి కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు.   ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 'వార్ 2' అని చెప్పవచ్చు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'వార్ 2' ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంతో కియారా అద్వానీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది.  

హరి నువ్వు రాసుకుంటేనే నీకు పంచులు వస్తాయి

Publish Date:Jul 4, 2025

  కూకు విత్ జాతిరత్నాలు షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే అది ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఈ షోకి హరి, ఇమ్మానుయేల్, బాబా భాస్కర్, సుహాసిని, రీతూ వచ్చారు. హరి మెడలో ఉన్న విజిల్ చూసిన ప్రదీప్ "ఏంటి నువ్వు మెడలో విజిల్ వేసుకొచ్చావ్" అని అడిగాడు. దానికి ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. "పొద్దున్నే మనోడు ఇదే పనికి వెళ్తూ ఉంటాడు. విజిల్ వేయగానే తడి చెత్త, పొడి చెత్త తీసుకొస్తారు" అని కౌంటర్ వేసాడు ఇమ్ము. ఇక ఈ షోకి తమ్ముడు మూవీ నుంచి ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ లయ కూడా ఈ షోకి వచ్చింది. అలాగే దిల్ రాజు కూడా వచ్చారు. "దిల్ రాజు గారు మీరు ఏ ఫుడ్ ఇష్టం" అంటూ రాధ అడిగారు. "ఫేవరేట్ ఫుడ్ అంటే నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం" అని చెప్పారు. దానికి ఇమ్ము రియాక్ట్ అయ్యాడు. "రాజు గారికి స్వీట్ ఇష్టం కాబట్టి కాకరకాయతో కూర కాకుండా స్వీట్ చేస్తాం" అని చెప్పాడు. దాంతో దిల్ రాజు షాకై కాకరకాయతో స్వీట్ ఏంట్రా అంటూ కౌంటర్ వేశారు. తర్వాత మళ్ళీ "చిన్నప్పుడు ఆయా నా మీద అరుస్తూ ఉంటే ఆయా ఆయా అని పిలిచేవాడిని కాదు లయా లయా అని పిలిచేవాడిని" అని చెప్పేసరికి లయ, దిల్ రాజు నవ్వేశారు. ఇక హరి ఏదో డైలాగ్ చెప్పబోయాడు కానీ పాపం చెప్పలేకపోయాడు. దాంతో రాధ హరి పరువు తీసేసారు. "నీకు స్పాంటేనియస్ గా రావు పంచులు నువ్వు రాసుకుంటేనే వస్తాయి" అనేసరికి హరి షాక్ అయ్యాడు.

'విశ్వంభర' ఐటెం సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ!

Publish Date:Jul 1, 2025

  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.   'విశ్వంభర' షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఐటెం సాంగ్ ని కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ 'నాగిని' ఫేమ్ మౌని రాయ్ చిందేయనుందని టాక్. ఈ ఐటెం సాంగ్ మాస్ కి ఫీస్ట్ లా ఉంటుందని అంటున్నారు.    ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర'లో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. ఇప్పటికే మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. ఇక ఐటెం సాంగ్ కూడా ఒక ఊపు ఊపేలా ఉంటుందని చెబుతున్నారు.   సోషియో ఫాంటసీ ఫిల్మ్ అయినప్పటికీ మెగా అభిమానులు, మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు 'విశ్వంభర'లో పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా అదిరిపోయే సాంగ్స్, మెగాస్టార్ మార్క్ స్టెప్పులతో.. మెగా ట్రీట్ ఉంటుందని చెప్తున్నారు.   'విశ్వంభర'లో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్స్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు.  

తమ్ముడు

Publish Date:Jul 4, 2025

కన్నప్ప

Publish Date:Jun 27, 2025

కుబేర

Publish Date:Jun 20, 2025