Read more!

English | Telugu

డిసైడ్ చేసుకో.. నిన్ను ఎవరు పరిపాలించాలో...

Publish Date:Apr 19, 2024

నారా రోహిత్ ప్రధాన పాత్రలో మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ప్రతినిధి 2'(Prathinidhi 2). వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 'ప్రతినిధి 2' ట్రైలర్ (Prathinidhi 2 Trailer) ఆకట్టుకుంటోంది. "మన స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎంతమంది గుండెపోటుతో చచ్చారు?" అంటూ నారా రోహిత్ చెప్పే డైలాగ్ తో ఆలోచన రేకెత్తించేలా ట్రైలర్ ప్రారంభమైంది. ఎవరైనా రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు.. ఆ బాధ భరించలేక కొందరు సామాన్యులు సూసైడ్ చేసుకున్నారని, మరికొందరు గుండెపోటుతో మరణించారని వార్తలు చూస్తుంటాం. మహాత్ముడు చనిపోయినప్పుడే ప్రజల గుండెలు ఆగలేదు. అలాంటిది ఓ రాజకీయ నాయకుడి కోసం ఆగుతాయా? అనే ప్రశ్నను రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లలు కంటే, నాలుగు పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా?" అని నారా రోహిత్ ప్రశ్నించడం కళ్ళు తెరిపించేలా ఉంది. అవినీతి, అరాచకాలు చేసే రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఓ జర్నలిస్ట్ చేసే పోరాటమే ఈ సినిమా కథ అని ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. "ఒక్కసారి ఎక్కి కుర్చున్నాడంటే.. ఐదేళ్లు వాడు చెప్పింది చేయాల్సిందే. డిసైడ్ చేసుకో.. నిన్ను ఎవరు పరిపాలించాలో. డిసైడ్ చేసుకో.. నీకు ఎవరు కావాలో. వాడా? వీడా? ఇంకెవడైనానా?" అనే డైలాగ్ తో ట్రైలర్ ను ముగించిన తీరు బాగుంది.

దేశవ్యాప్తంగా ఆ సినిమాపై నిరసనలు, దాడులు.. అయినా కాసుల వర్షం కురిసింది.. అవార్డుల పంట పండింది.!

Publish Date:Apr 19, 2024

మన భారతీయ సినిమాలకు ఒక ఫార్మాట్‌ ఉంది. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఓవరాల్‌గా ఇండియన్‌ ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇష్టపడతారు. కొన్నిసార్లు కొత్తదనంతో కూడిన కథలను, సామాజిక స్పృహ ఉన్న సినిమాలను సైతం ఆదరిస్తారు. భారతదేశంలో సినిమా పుట్టినప్పటి నుంచి దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అప్పుడప్పుడు వాటిని బ్రేక్‌ చేసేందుకు కొందరు దర్శకులు ప్రయత్నించారు. అయితే వారిలో కొందరు సక్సెస్‌ అయితే మరికొందరు మరుగున పడిపోయారు. రెండున్నర గంటల నిడివి ఉండే సినిమాలో ప్రేక్షకులు ఏం కోరుకుంటారు, వారికి కేవలం ఎంటర్‌టైన్‌మెంటే కావాలా లేక ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించినా చూస్తారా? అనే విషయంలో కొందరు దర్శకులకు కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. కేవలం సమాజాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కథను రెడీ చేసి సినిమాగా తీస్తే ఆదరణ ఉండదని, అంతర్లీనంగా ఒక మంచి కల్పిత కథను కూడా జోడిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కొందరు దర్శకులు ప్రూవ్‌ చేశారు. అలాంటి వారిలో మణిరత్నం ప్రథముడు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా తను చేసే సినిమా ఒక విజువల్‌ వండర్‌గా ఉండాలని కోరుకునే దర్శకుడు మణిరత్నం. తను చేసిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అయినా ఆడియన్స్‌ మాత్రం మణిరత్నంకి ఫస్ట్‌ క్లాస్‌ మార్కులే వేస్తారు. తను చేసిన ప్రతి సినిమాకీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో దేశంలో అనిశ్చితి నెలకొన్నప్పుడు కూడా కొన్ని సున్నితమైన అంశాలను తీసుకొని ఎంతో ధైర్యంగా సినిమాలు తీశారు మణిరత్నం. అలాంటి వాటిలో రోజా, బొంబాయి వంటి సినిమాల గురించి మొదట చెప్పుకోవాలి.  డిసెంబర్‌ 6, 1992. దేశాన్ని మతపరంగా, సామాజికంగా, రాజకీయంగా కుదిపేసిన రోజు. ఎన్నాళ్ళుగానో రెండు మతాల మధ్య నలుగుతున్న సమస్య ఒక్కసారిగా ఉధృత రూపం దాల్చింది. వివాదాస్పద బాబ్రీ మసీదును హిందూ విశ్వపరిషత్‌ పిలుపు మేరకు అయోధ్య చేరుకున్న కరసేవకులు కూల్చివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో 3 వేలకు పైగా సామాన్యులు తమ ప్రాణాలను కోల్పోయారు. ముఖ్యంగా ముంబాయిలో ఈ అల్లర్లు ఎక్కువగా జరిగాయి. అప్పుడు మహారాష్ట్రలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులే దానికి కారణం. ఇలాంటి సామాజిక అంశాలపై ఎంతో అవగాహన ఉన్న మణిరత్నం దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై ఆందోళన చెందారు. ఆ సమయంలో తన డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘దొంగ దొంగ’ సినిమాకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఒకపక్క వర్క్‌ జరుగుతున్నా అతని ఆలోచనలు మాత్రం బాబ్రీ మసీదు గొడవల చుట్టూనే తిరుగుతున్నాయి. ముంబాయిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఓ సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నారు మణిరత్నం. ప్రముఖ మలయాళ రచయిత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ను కథ, స్క్రీన్‌ప్లే సిద్ధం చేయవలసిందిగా కోరారు. అయితే అది కార్యరూపం దాల్చేందుకు ఎంతో సమయం పట్టేలా ఉండడంతో మణిరత్నమే దానికి పూనుకున్నారు. ఎంతో వేగంగా స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా కోసం విక్రమ్‌, మనీషా కోయిరాలాకు ఫోటోషూట్‌ చేయించారు. అప్పటికే మరో సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచిన విక్రమ్‌ ఈ సినిమా కోసం వాటిని తొలగించేందుకు అంగీకరించలేదు. చివరికి తన ‘రోజా’ చిత్రంలో నటించిన అరవింద్‌ స్వామిని ఎంపిక చేశారు. సినిమా మొదలైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రాన్ని షూట్‌ చేశారు. ఈ సినిమాలో బాబ్రీ మసీదు కూల్చి వేస్తున్న వీడియోను సినిమాలో చూపించేందుకు ప్రయత్నించారు మణిరత్నం. కానీ, సెన్సార్‌ బోర్ట్‌ ఒప్పుకోలేదు. అలా ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి షూటింగ్‌ పూర్తి చేశారు. 1995 మార్చి 10న ఈ సినిమాను తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ చేశారు. బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌కు చెందిన ఎబిసిఎల్‌ సంస్థ ఈ చిత్రం హిందీ విడుదల హక్కులను రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది.  ఈ సినిమా విడుదలైన తర్వాత ఒక వర్గం వారు నిరసన వ్యక్తం చేశారు. ‘బొంబాయి’ ప్రదర్శితమవుతున్న థియేటర్లపై దేశవ్యాప్తంగా దాడులు చేశారు. ఎవరు ఎన్నిరకాలుగా ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆదరించారు. అప్పట్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా గొప్ప సంచలనాన్నే సృష్టించింది. మణిరత్నం సినిమా అంటేనే ఒక దృశ్యకావ్యంలా ఉంటుంది. అది మిస్‌ అవ్వకుండా బొంబాయిలో జరిగిన అల్లర్లను కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో మణిరత్నం హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమాకి కథ, కథనాలు ప్రాణం అయితే.. దానికి కొత్త ఊపిరి పోసింది ఎ.ఆర్‌.రెహమాన్‌ చేసిన పాటలు. ‘ఉరికే చిలకా..’, ‘కన్నానులే..’, ‘హమ్మ హమ్మ’ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాకి బాగా ప్లస్‌ అయిన మరో అంశం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. సినిమాలోని ఎమోషన్‌ని, కొన్ని భయానక పరిస్థితుల్ని బాగా ఎలివేట్‌ చేసింది మ్యూజిక్‌. కాశ్మీర్‌ టెర్రరిస్టుల నేపథ్యంలో మణిరత్నం చేసిన ‘రోజా’ 1992లో ఒక సంచలనం అయితే, 1995లో వచ్చిన ‘బొంబాయి’ మరో సంచలనాన్ని సృష్టించింది. అందరూ ఈ సినిమాను చూసి మణిరత్నంను ప్రశంసల్లో ముంచెత్తారు. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ‘బొంబాయి’ చిత్రం నేషనల్‌ అవార్డును గెలుచుకుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, సినిమా ఎక్స్‌ప్రెస్‌ అవార్డులతోపాటు విదేశాల్లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించి అవార్డులు అందించారు. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాకి, ఇందులోని పాటలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మణిరత్నం కెరీర్‌లో ‘బొంబాయి’ సినిమా ఓ దృశ్యకావ్యంలా నిలిచిపోయింది.

సల్మాన్ ఇంటి బయట కాల్పులుకి డబ్బు ఎంతో తెలుసా.. జైలు నుంచే స్కెచ్ 

Publish Date:Apr 18, 2024

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సల్మాన్ ఖాన్ కి ఉన్న చరిష్మా గురించి అందరి తెలిసిందే.మూడు దశాబ్దాల నుంచి  పవర్ ఫుల్ యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులని అలరిస్తు వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన ఇంటి వద్ద  కాల్పులు జరిపిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సంఘటనలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సాగర్ పాల్,విక్కీ గుప్తా..బీహార్ కి చెందిన వీళ్ళిద్దరే సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపారు.కొన్ని రోజుల క్రితం పోలీసులు బీహార్ వెళ్లి అరెస్ట్ చేసి ముంబై కి  తీసుకొచ్చారు. విచారణలో  పలు విషయాలలు బయటకి వచ్చాయి.  కాల్పులు జరపడానికి 4 లక్షలకి బేరం కుదుర్చుకొని  లక్షరూపాయలు అడ్వాన్స్ గా   తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు  సల్మాన్ ఇంటి బయట రెక్కీ నిర్వహించారు. రంజాన్ రోజు కూడా రెక్కీ నిర్వహించారు.కేవలం డబ్బు కోసమే కాల్పులు జరిపారు ఈ విషయాలన్నీ నింధుతులే చెప్పారు .    ఇక ఆ సంఘటన జరిగినప్పుడు  సల్మాన్ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. దాంతో వాళ్లంతా ఒక్కసారిగా  భయబ్రాంతులకి లోనయ్యారు.నింధితులు మొత్తం 5 రౌండ్లు కాల్పులు జరిపారు. బీహార్ మనుషుల చేత ఆ పని చేయించింది జైలు లో ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్ పని అని తెలుస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సల్మాన్ ని  కలిసి ధైర్యాన్ని చెప్పారు.  

ఆసియా, నూకరాజు విడిపోయారా.. అసలేం జరిగిందంటే!

Publish Date:Apr 19, 2024

  అవును వాళ్ళిద్దరు విడిపోయారు.. ఇది నిజమే. వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు. ఇన్నిరోజులు ఇద్దరు బాగానే ఉన్నారు కదా మరి. అవును కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు.. ఎహె ఎంతసేపు ఇంకా వాళ్ళిద్దరు.. వాళ్ళిద్దరు. ఎవరు ఆ ఇద్దరు? అంటే.. లవ్ బర్డ్స్.. గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు నూకరాజు-ఆసియా. తాజాగా వారిద్దరికి బ్రేకప్ అయిందంటు నూకరాజు ఆసియా ఓ వ్లాగ్ లో చెప్పాడు. అసలేం జరిగిందంటే... లవ్ లో గొడవలు కామన్‌. ఇంతకముందు మా మధ్య కొన్ని గొడవలు వచ్చాయి. కానీ తర్వాత కలిసి ఉన్నాం. అలా అని వాడుకొని వదిలేసే టైప్ నేను కాదని నూకరాజు అన్నాడు.  అసలేం జరిగిందంటే మొన్న పదో తారీఖున ఒక ఈవెంట్ కోసం దుబాయ్ కి వెళ్ళాను. అక్కడ షూటగ్ అయిదు రోజులు జరిగింది. పద్నాలుగున తన బర్త్ డే కాబట్టి తను ఫోన్ చేసినట్టుంది. కానీ ఫోన్ ఇక్కడ కలవలేదు. దాంతో తను అలిగింది. నాకు కాల్స్ గానీ మెసెజ్ లు గానీ చేయడం లేదని , తనకే అంత ఉంటే నాకెంత ఉండాలని నూకరాజు చెప్పుకొచ్చాడు. మరి వీళ్ళ మధ్య ప్రస్తుతం చిన్నగొడవ ఉంది. దానిని ఆసియా ఎలా అర్థం చేసుకుంటుంది. వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.  జబర్దస్త్ లో ఫేమస్ అవుదామని కలలు కని ఉద్యోగం కూడా మానుకుని కామెడీ చెయ్యడానికి వచ్చిన నూకరాజు ప్రస్తుతం జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా అతనొక ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. జబర్దస్త్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, టీమ్ లీడర్లుగా ఉన్న వాళ్ళు, సీనియర్స్ కొందరు కుళ్ళు రాజకీయాలు ప్రదర్శిస్తారని.. తనని తాను నిరూపించుకుని ఎదుగుతున్న టైంలో ఆ కుళ్ళు రాజకీయాలని భరించలేకపోయానని నూకరాజు చెప్పాడు. అసలు జబర్దస్త్ షోలో ట్యాలెంట్ గురించి పట్టించుకునేది చాలా తక్కువ. వాళ్ళకి కావలసిన వాళ్ళని మాత్రమే హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారంటూ ఓ ఇంటర్వూలో తాజాగా చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు ఆసియాతో బ్రేకప్ అయ్యుందటూ చేసిన ఈ వ్లాగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి మీరు ఈ వ్లాగ్ ని చూసారా.. లేదంటే ఓసారి చూసేయ్యండి.

ప్రముఖ హీరోయిన్ తో మెగా హీరో పెళ్ళి!

Publish Date:Apr 16, 2024

త్వరలో మెగా ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయా అంటే.. ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే మాటే వినిపిస్తోంది. మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఆయన ఓ ప్రముఖ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ రెజీనా కసాండ్రా(Regina Cassandra)తో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'నక్షత్రం' వంటి సినిమాల్లో కలిసి నటించారు. 'పిల్లా నువ్వు లేని జీవితం' షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించి, అది ప్రేమగా మారిందని ప్రచారం జరిగింది. అయితే కొంతకాలంగా సాయి తేజ్-రెజీనా ప్రేమకి సంబంధించి ఎటువంటి వార్తల్లేవు. ఇలాంటి సమయంలో సడెన్ గా వీరు పెళ్ళి చేసుకోబోతున్నారనే న్యూస్ రావడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని త్వరలోనే సాయి తేజ్-రెజీనా అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. కాగా, ఇటీవల మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపించాయి. ఆ వార్తలపై పెద్దగా స్పందించని వరుణ్-లావణ్య.. సడెన్ గా పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం.

ఆడు జీవితం

Publish Date:Mar 28, 2024