English | Telugu

వర్జిన్ బాయ్స్ టీజర్.. యూత్‌ను థియేటర్స్‌కు రప్పించే ఫుల్ ఎంటర్‌టైనర్‌!

వర్జిన్ బాయ్స్ టీజర్.. యూత్‌ను థియేటర్స్‌కు రప్పించే ఫుల్ ఎంటర్‌టైనర్‌!

Publish Date:May 15, 2025

  'వర్జిన్ బాయ్స్' మూవీ టీజర్ రిలీజై, యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా, శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లతో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ, దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది.    తాజాగా విడుదలైన టీజర్‌లో యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. టీజర్‌లో గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ, ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను తమదైన స్టైల్‌లో చూపించనుందని తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ క్యారెక్టర్ & కామెడీ టైమింగ్ కి రెస్పాన్స్ బాగా వస్తుంది. చిత్రంలో శ్రీహన్ నుండి మరింత కామెడీని ఆశించవచ్చు అనిపిస్తుంది. టీజర్‌లోని డైలాగ్స్, సీన్స్ ఫన్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తున్నాయి. ఈ సమ్మర్‌లో ‘వర్జిన్ బాయ్స్’ యూత్‌ను థియేటర్స్‌కు రప్పించే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.   నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ.. "ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాం. గతంలో ఎన్నో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లు వచ్చాయి. కానీ వాటిని మైమరిపించేలా ఈ సినిమా ఉంటుంది. రొటీన్ కి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది.  కచ్చితంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను" అన్నారు.  
తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న తర్వాతే అనసూయ, భరద్వాజ్‌ పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న తర్వాతే అనసూయ, భరద్వాజ్‌ పెళ్లి చేసుకున్నారు.. ఎందుకో తెలుసా?

Publish Date:May 15, 2025

(మే 15 అనసూయ భరద్వాజ్‌ పుట్టినరోజు సందర్భంగా..) అందం, అభినయం ఉంటే చాలు సినిమా తారలుగా గుర్తింపు సంపాదించుకోవచ్చు, అదృష్టం బాగుంటే స్టార్‌ హీరోయిన్లుగా ఛలామణి అవ్వొచ్చు. హీరోయిన్లను ఆరాధించేవారు చాలా మంది ఉంటారు. ఒక అడుగు ముందుకు వేసి హీరోయిన్లకు గుడి కట్టించినవారు కూడా ఉన్నారు. అయితే స్టార్‌ ఇమేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకోవాలంటే సినిమాల్లోనే నటించక్కర్లేదు, బుల్లితెరపై కూడా అద్భుతాలు చెయ్యొచ్చు అని ఎంతో మంది నటీమణులు నిరూపించారు. అయితే అందరిలా కాకుండా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకొని టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ద్వారా అభిమాన గణాన్ని పెంచుకున్న నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. నటిగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్న అనసూయ.. టీవీ, సినీ కెరీర్‌ ఎలా సాగింది? ఆమె నేపథ్యం ఏమిటి? ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 1985 మే 15న సుదర్శనరావు, అనూరాధ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు అనసూయ. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు వైష్ణవి, అంబిక. వీరిది బ్రాహ్మణ కుటుంబం. 10వ తరగతి పూర్తి చేసేసరికి మూడు స్కూల్స్‌ మారింది అనసూయ. ఆ తర్వాత భద్రుకా కాలేజీలో ఇంటర్‌ చదివింది. ఒకరోజు ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లింది. అప్పుడు అనుకోకుండా ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నాగ’ చిత్రంలో ఒకే ఒక్క సీన్‌లో నటించింది. ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత అనసూయను ఎన్‌సిసిలో చేర్పించారు వాళ్ళ నాన్న. అయితే ఆమెకు ఎన్‌సిసిలో చేరడం ఇష్టం లేదు. ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలన్నది ఆమె కల. కానీ, ఆ విషయం తండ్రితో చెప్పలేక అయిష్టంగానే ఎన్‌సిసిలో చేరింది. ఆ సమయంలోనే బీహార్‌కు చెందిన శశాంక్‌ భరద్వాజ్‌ పరిచయమయ్యాడు. అనసూయను ప్రపోజ్‌ చేశాడు. ఏడాదిన్నర ఏ విషయమూ చెప్పకుండా అతన్ని తనచుట్టూ తిప్పుకొని ఆ తర్వాత ఒప్పుకుంది. ఈ విషయం తండ్రితో చెబితే ఆయన ఒప్పుకోలేదు. శశాంక్‌తో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంది అనసూయ. కానీ, అది కరెక్ట్‌ కాదని, పెద్దవారు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని ఆమెకు సర్ది చెప్పాడు శశాంక్‌.  ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఎంబిఎ పూర్తి చేసింది అనసూయ. కొన్నాళ్లు ఐడిబిఐ బ్యాంక్‌లో పనిచేసింది. ఆ తర్వాత పిక్స్‌లాయిడ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా వర్క్‌ చేసింది. అదే సమయంలో సాక్షి టీవీలో కొత్త న్యూస్‌ రీడర్లు కావాలంటూ వచ్చిన ప్రకటన చూసి దానికి అప్లయ్‌ చేసింది. అందులో సెలెక్ట్‌ అయింది. అయితే ఆమె చదివే న్యూస్‌ తెలుగు, ఇంగ్లీష్‌ మిక్స్‌ అయి ఉండడం అందరికీ ఫన్నీగా అనిపించేది. కొందరు విమర్శించేవారు కూడా. సాక్షి టీవీలోనే రామ్‌గోపాల్‌వర్మతో ఒక షో చేసింది. ఆ తర్వాత మా మ్యూజిక్‌లో వర్క్‌ చేసింది. అలాగే ఆరోజుల్లో సినిమా ఫంక్షన్లు ఎక్కువగా జరిగేవి. ఆ ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహించేవారు. అనసూయ, శశాంక్‌ తొమ్మిదేళ్ళపాటు ప్రేమలోనే ఉన్నారు. పెద్దల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు 2010లో అనసూయ, శశాంక్‌ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.  కొన్ని టీవీ షోలు, సినిమా కార్యక్రమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న అనసూయ జీవితాన్ని 2013 సంవత్సరం మార్చేసింది. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈటీవీలో ప్రారంభించిన కామెడీ షో ‘జబర్దస్త్‌’కి అనసూయను ప్రజెంటర్‌గా ఎంపిక చేశారు. ఈ షోతో ఎంతో పాపులర్‌ అయింది అనసూయ. కొన్ని సంవత్సరాల పాటు ఈ షోలో కొనసాగారు. అదే సమయంలో ఎన్నో ఈవెంట్లు, అవార్డు ఫంక్షన్లు, మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌లకు ప్రజెంటర్‌గా చేశారు. 2003లో మొదటి సారి తెరపై కనిపించిన అనసూయ దాదాపు 13 సంవత్సరాల తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జునతో కలిసి నటించింది. ఈ సినిమా అందాల నటిగా ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. అదే సంవత్సరం అనసూయ చేసిన ‘క్షణం’ చిత్రంలోని నటన అందర్నీ ఆకట్టుకుంది. నటిగా ఆమెను తారాస్థాయిలో నిలిపిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లోని అనసూయ నటనకు ఫిలింఫేర్‌, సైమా, జీ సినీ అవార్డులు లభించాయి. ప్రస్తుతం టీవీ షోలతోపాటు కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అనసూయ భరద్వాజ్‌.

సైనికుల తల్లుల బాధ మీకు అర్ధమవుతుందా!

Publish Date:May 13, 2025

ఇటీవల పహల్ గామ్(PahalGaam)లో  పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు మన వాళ్ళని అన్యాయంగా చంపడంతో మన వాళ్ళు ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ని నిర్వహించి కొంత మంది ఉగ్రవాదులని తుది ముట్టించడం జరిగింది. కానీ ఆ తర్వాత పాకిస్థాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకి పాల్పడంతో దేశంలో యుద్ధవాతావరణం నెలకొంది. దీంతో సెలవుపై ఉన్న సైనికులకి ఆర్మీ నుంచి పిలుపు రావడంతో సైన్యంతో జాయిన్ అయ్యారు.  ఈ విషయంపై ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు దేశంలో కొన్ని రోజుల నుంచి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రతి మాట, వార్త వెనుక టెన్షన్. ఆదివారం మదర్స్ డే ని చాలా ఘనంగా జరుపుకున్నాం. కానీ దేశ రక్షణ కోసం హీరోలని పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనక నిద్ర లేని ఎన్నో రాత్రుల్ని గడిపే అతని తల్లి ఉంటుంది. తన బిడ్డకి ఏ రాత్రి కూడా జోలపాటల ఉండదని ఆమెకి తెలుసు. ఒత్తిడి తో కూడిన ఆ నిశ్శబ్డం ఏ నిమిషమైన బద్దలు కావచ్చు. కానీ ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతని కోరుకుంటున్నాం. ఆ తల్లితండుల దైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తుంది. పంటి బిగువున బాధని నొక్కిపెట్టిన వారికి అండగా ఉంటు  మా రక్షకుల కోసం, ఈ దేశం కోసం కలిసి నిలబడతామంటు ట్వీట్ చేసింది. అగ్ర దర్శకుడుగా ఎన్నో హిట్ చిత్రాలని తెరకెక్కించిన మహేష్ భట్ కూతురు అయినటువంటి అలియాభట్ 2012 లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే మూవీతో తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత 'హైవే, టూస్టేట్స్, షాందార్, కపూర్ అండ్ సన్స్, డియర్ జిందగీ, కల్నక్, సడక్ 2 , బ్రహ్మాస్త్ర, డార్లింగ్, జీగ్రా, గంగు భాయ్ కథైవాడీ ఇలా ఇప్పటి వరకు  సుమారు  పాతిక సినిమాలకి పైనే చేసింది. 2022 లో ప్రముఖ హీరో రణబీర్ కపూర్ తో వివాహం జరిగింది.  

వెనుక నుంచి వచ్చి ఆ అబ్బాయి హగ్ చేసుకున్నాడు...గుండె పగిలిపోయింది

Publish Date:May 15, 2025

  బుల్లితెర మీద అమరదీప్ -తేజస్విని ఒక మంచి జోడిగా అందరికీ తెలుసు. రీసెంట్ గా అమరదీప్ కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి లవ్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. అందులో అమరదీప్ తన హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ చెప్పాడు. "దగ్గరుండి అప్లికేషన్ ఫిల్లప్ చేయించి బస్ ఎక్కించి పంపించిన అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది. అది మన కళ్ళతో చూస్తే మనకు ఎలా ఉంటుంది. ఎప్పుడూ వచ్చే అమ్మాయి ఆ బస్సులోంచి దిగుతుంది కదా అని ఎదురు చూసే టైములో వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి హగ్ చేసుకున్నాడు. నా కళ్ళ ముందు నేను అది చూసాను." అని తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పాడు. "జానకి కలగనలేదు" అనే సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యాడు అమరదీప్.  రామ పేరుతో మంచి పేరు సంపాదించుకున్నాడు అమర్ దీప్ చౌదరి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7  లో అమరదీప్ బాగా గేమ్స్ ఆడాడు అలాగే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. అలాగే అరియానా, సొహైల్, అషు రెడ్డి, అవినాష్ వీళ్లంతా అమర్ దీప్‌కి మంచి ఫ్రెండ్స్ కూడా. రీసెంట్ గా అమరదీప్ - తేజస్విని గౌడ ఇద్దరూ కూడా ఇష్మార్ట్ జోడికి కూడా వెళ్లారు. అలాంటి అమరదీప్ ఐరావతం, రాజు గారి కిడ్నాప్ అనే మూవీస్ లో నటించాడు. ఇక ఇప్పుడు "సుమతి శతకం" అనే మూవీలో నటిస్తున్నాడు. అమర్ దీప్ చౌదరి సరసన సాయిలీ చౌదరి హీరోయిన్ గా చేస్తోంది.  

ఊహించని కాంబో.. తమిళ దర్శకుడితో బాలయ్య!

Publish Date:May 13, 2025

  నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' చేస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి దర్శకులతో వర్క్ చేసే అవకాశముందని పలువురు తెలుగు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ పేరు తెరపైకి వచ్చింది.   డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఇటీవల 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో విజయాన్ని అందుకున్నాడు. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్.. అజిత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇందులో అజిత్ ని చూపించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో అధిక్ డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ హీరో ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే అధిక్ కన్ను బాలకృష్ణపై పడినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలయ్యను అధిక్ కలిశాడట. అధిక్ చెప్పిన స్టోరీ లైన్ బాలయ్యకు నచ్చినట్లు వినికిడి. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశముంది.  

శుభం

Publish Date:May 9, 2025

సింగిల్

Publish Date:May 9, 2025

హిట్ 3

Publish Date:May 1, 2025

రెట్రో

Publish Date:May 1, 2025