English | Telugu

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Publish Date:Feb 1, 2026

  తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి కన్నుమూశారు. 78 ఏళ్ళ రఘునాథ రెడ్డి.. శనివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కుమారుడు మరణించారు. ఆ బాధతోనే రఘునాథ రెడ్డి కన్నుమూసినట్లు సమాచారం. (Actor Raghunath Reddy)   రఘునాథ రెడ్డి స్వస్థలం విజయవాడ. శోభన్ బాబు హీరోగా నటించిన 'సర్పయాగం' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 370కి పైగా సినిమాలలో నటించారు. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించారు.   తెలుగుతో పాటు హిందీ, తమిళ, భోజ్ పురి భాషలలో కూడా నటించారు. పలు టీవీ సీరియళ్ళలోనూ నటించి మెప్పించారు.   ప్రేమించుకుందాం రా, మల్లీశ్వరి, శ్రీరామ రాజ్యం వంటి సినిమాలు నటుడిగా రఘునాథ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చివరిగా 2018లో వచ్చిన 'సుబ్రహ్మణ్యపురం'లో నటించారు. అనారోగ్య సమస్యలు, వయసురీత్యా కొన్నేళ్లుగా నటనను దూరంగా ఉంటున్నారు.  

సినిమా చూడాలంటే బ్రహ్మానందం ఇప్పటికీ వణికిపోతారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Jan 31, 2026

(ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..)   - తను చేసిన 1250 సినిమాల్లో బ్రహ్మానందం చూసినవి 20 మాత్రమే - చిరంజీవిని చూస్తే బ్రహ్మానందం భయపడతారు.. ఎందుకంటే? - చిన్నతనంలో బ్రహ్మానందంని తండ్రి ఎందుకు కొట్టేవారు?   నీ ఎంకమ్మా.. తీస్కో.. పండగ చేసుకో.. రకరకాలుగా ఉంది మాస్టారూ.. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్.. జఫ్ఫా.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా?.. నా పెర్‌ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్.ఎం.ఎస్. చేయండి.. నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి రావుగారు.. ఈ పాపులర్ డైలాగులు వింటే చాలు.. అవి చెప్పి మనల్ని నవ్వించిన కమెడియన్ ఎవరో గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని, తీరికలేని కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హాస్యనటులు వచ్చారు. తమ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. పాతతరంలో రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులు కొన్ని దశాబ్దాలు హాస్యనట చక్రవర్తులుగా ఇండస్ట్రీని ఏలారు.    ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం తనదైన మార్క్ కామెడీతో, డైలాగులతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేశారు. 1980వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన బ్రహానందం.. కొన్ని దశాబ్దాలపాటు తన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఒక దశలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీగా భావించేవారు. ఒకప్ప్పుడు రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి ఈ క్రేజ్ ఉండేది.    నలభై ఏళ్ళ తన సినీ కెరీర్‌లో 1250కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా కనిపించిన బ్రహ్మానందంకి సినిమాలంటే ఎంతో భయమట. అందుకే తను చేసిన వందల సినిమాల్లో కేవలం 20 మాత్రమే చూశారు. సినిమా నటుడై ఉండి, తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందంకి సినిమాలంటే ఎందుకు విరక్తి కలిగింది? సినిమాల విషయంలో అతన్ని భయపెట్టింది ఎవరు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.   1956 ఫిబ్రవరి 1న  గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఒకరుగా జన్మించారు కన్నెగంటి బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్ వరకు చదువుకున్నారు. పై చదువులకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రికి సన్నిహితుడైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇం{ర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్‌లో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాలపాటు అత్తిలిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు బ్రహ్మానందం.    చిన్నతనంలో సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. కానీ, తండ్రి సినిమాలకు పంపేవారు కాదు. సంవత్సరానికి ఒక సినిమా చూస్తే గగనం అన్నట్టుగా ఉండేది.  అయితే తండ్రికి తెలియకుండా సోదరులతో కలిసి సెకండ్ షోలకు వెళ్లేవారు. అలా వెళ్లినప్ప్పుడల్లా తండ్రి వారిని చితకబాదేవారు. తన్నులు తిన్నా సినిమాలు చూడడం మానేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో సినిమా చూడాలంటే తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొచ్చేవి.    ఇక సినిమాల్లోకి వచ్చి గ్రేట్ కమెడియన్ అనిపించుకున్న తర్వాత కూడా సినిమాలంటే భయం పోలేదు. సినిమాల విషయంలో తండ్రి అతన్ని శిక్షించిన తీరు అలా ఉండేది. తను చేసే సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని నవ్విస్తున్నప్పటికీ తను మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన చూసిన సినిమాలు చాలా తక్కువ. సినిమా అనగానే ఇప్పటికీ చిన్నతనంలో తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయని అంటారు. అలాగే చిరంజీవిని చూసినా బ్రహ్మానందం భయపడతారు. దానికి కారణం.. తను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి వంటి స్టార్ హీరోని కలిసినపుడు మాట్లాడేందుకు ఎంత భయపడ్డారో ఇప్ప్పుడు కూడా ఆయన కలిసినపుడు పైకి బాగానే మాట్లాడినా మనసులో మాత్రం వణుకు పుడుతుందంటారు బ్రహ్మానందం.

'యానిమల్ పార్క్' నుంచి బిగ్ అప్డేట్.. మరి 'స్పిరిట్' పరిస్థితి ఏంటి?

Publish Date:Jan 27, 2026

  రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ ఫిల్మ్ 'యానిమల్'(Animal). రూ.200 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. 2023 డిసెంబర్ లో విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం సాధించింది. దీంతో 'యానిమల్'కి సీక్వెల్ గా రానున్న 'యానిమల్ పార్క్' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు రణ్‌బీర్‌ కపూర్‌. (Animal Park)   'యానిమల్' వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు 'యానిమల్ పార్క్' పట్టాలెక్కలేదు. దానికి కారణం రణ్‌బీర్‌, సందీప్ రెడ్డి ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటమే. రణ్‌బీర్‌ 'లవ్ అండ్ వార్', 'రామాయణ' సినిమాలు చేస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్(Prabhas)తో 'స్పిరిట్'(Spirit) చేస్తున్నాడు.    'స్పిరిట్' పూర్తయ్యాక, ఆరు నెలల విరామం తర్వాత 'యానిమల్ పార్క్' షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని తాజాగా రణ్‌బీర్‌ స్పష్టం చేశాడు. "ప్రస్తుతం సందీప్ మరో సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక 2027లో మా సినిమా మొదలవుతుంది. యానిమల్ ను మూడు భాగాలుగా తెరకెక్కించాలి అనేది దర్శకుడి ఆలోచన. రెండో భాగంగా 'యానిమల్ పార్క్' రానుంది. హీరోగా, విలన్ గా రెండు పాత్రలూ నేనే పోషిస్తుండటంతో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిగా ఉన్నాను." అని రణ్‌బీర్‌ చెప్పుకొచ్చాడు.  

Jayam serial: రుద్రకి సన్మానం.. వీరు, పారుల ప్లాన్ ఏంటంటే?

Publish Date:Feb 1, 2026

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -182 లో... గంగపై ఇంట్లో అందరు కోప్పడతారు. రుద్ర కోపంగా ఉంటాడు. తన దగ్గరికి గంగ వచ్చి, సారీ చెప్తుంది. నువ్వు ఎందుకు ప్రతీసారీ వీరుని టార్గెట్ చేస్తున్నావని రుద్ర అడుగుతాడు. మీకు అంతా వివరంగా చెప్పగలను కానీ సాక్ష్యాలు చూపించలేనని మళ్ళీ వీరు గురించి అంటుంటే రుద్రకి ఇంకా కోపం వస్తుంది.    ఆ తర్వాత థాంక్స్ ఇషిక.. టైమ్ కి రింగ్ ఇచ్చి సేవ్ చేసావని ఇషికతో వీరు అంటాడు. ఆ గ్యాంగ్ లో గంగ ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక దాని టెన్షన్ ఉండొద్దు లేపెయ్యాలని ఇషికతో వీరు అంటాడు. ఆ తర్వాత ప్రీతీకి గంగ సారీ చెప్పగానే ప్రీతీ కూల్ అవుతుంది.    ఆ తర్వాత సీఎం పీఏ పెద్దసారు దగ్గరికి వస్తాడు. మీ అబ్బాయి నిన్న ఒక మాఫియా నుండి కొంతమంది అమ్మాయిలని సేవ్ చేసాడని సన్మానం చెయ్యాలని డిసైడ్ అయ్యారని చెప్పగానే ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట సన్మానం.. ఇంట్లో అవమానం అని శకుంతల అంటుంది. నువ్వు రావా రేపు అని పెద్దసారు అనగానే రానని శకుంతల చెప్తుంది. పెద్దమ్మ రాకుంటే వద్దని రుద్ర అంటాడు. మీ పెద్దమ్మని నేను ఒప్పిస్తానని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత పెద్దసారు శకుంతల దగ్గరికి వెళ్లి రేపు ప్రశంసలు మొత్తం నేనే తీసుకోవాలా.. నీకు వద్దా అని మాట్లాడుతుంటే శకుంతల ఒప్పుకుంటుంది.   ఆ తర్వాత ప్రీతీ దగ్గరికి రుద్ర వచ్చి సారీ చెప్తాడు. నేను ఎప్పుడో మార్చిపోయాను అన్నయ్య.. గంగ ఏది అనుకుంటే అదే మాట్లాడుతుంది. మనసులో ఏం దాచుకోదని ప్రీతీ అంటుంది. గంగ దగ్గరికి రుద్ర వెళ్లి సన్మానానికి ఈ చీర కట్టుకోమని చెప్తాడు. కానీ కట్టుకోనని గంగ అంటుంటే నిన్ను ఇలా కాదు అని తన చేయి మెలి పెడతాడు రుద్ర. దాంతో రుద్రని గంగ హగ్ చేసుకొని.. మీరు నాకు దూరం అయితే నేను తట్టుకోలేనని ఏడుస్తుంది.    మరొకవైపు సన్మానం గురించి ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. అప్పుడే పారు ఫోన్ చేస్తుంది. తనకి జరిగిందంతా చెప్తారు. దాంతో పారు ఒక ప్లాన్ వాళ్లకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మార్కో డైరెక్టర్ తో బాలయ్య.. మాస్ సంభవం!

Publish Date:Feb 1, 2026

  ఒక్కోసారి ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. ఆ కాంబినేషన్ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి కాంబోనే సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదెని(Haneef Adeni) చేతులు కలుపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.   బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. వాటిలో దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి సహా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా హనీఫ్ పేరు తెరపైకి వచ్చింది.   రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మలయాళ సినిమాలలో 'మార్కో' ఒకటి. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయలెంట్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒకటిగా పేరు పొందింది. అలాంటి వయలెంట్ డైరెక్టర్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ గతేడాది ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసింది. కానీ హీరోను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ లో నటించనున్న హీరో బాలకృష్ణనే అని ప్రచారం జరుగుతోంది.   బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన మాస్ ఇమేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి బాలకృష్ణను వయలెంట్ డైరెక్టర్ హనీఫ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక నిజంగానే ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు షేక్ అవుతాయి అనడంలో డౌట్ లేదు.