సౌత్ స్టార్స్ని తక్కువ చేసి చూస్తున్నారు.. బాలీవుడ్పై విరుచుకుపడ్డ సిమ్రాన్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో దశాబ్దాల కాలం పాటు వెలుగు వెలిగిన నటి సిమ్రాన్.. బాలీవుడ్ వ్యవహారశైలిపై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముంబై ఇండస్ట్రీలో దక్షిణాది నటులకు కనీస గౌరవం దక్కడం లేదని, అక్కడ ఒక రకమైన వివక్ష కనిపిస్తోందని ఆమె బాహాటంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాతలు సౌత్ నటుల సౌకర్యాల విషయంలో చూపిస్తున్న చిన్నచూపు గురించి సిమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ గదుల కేటాయింపులోనూ, ప్రయాణ టికెట్ల విషయంలోనూ నిర్మాతలు బేరాలు ఆడటం తనకు తీవ్ర మనస్తాపం కలిగించిందని ఆమె పేర్కొన్నారు. మన నటుల ఘనతను, ఇక్కడ వారు సంపాదించుకున్న లెగసీని గుర్తించకుండా.. కేవలం ఖర్చుల కోణంలోనే చూడటం ఏమాత్రం సమంజసం కాదని ఆమె కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు పరిస్థితి మారింది. 'బాహుబలి', 'పుష్ప', 'RRR' వంటి చిత్రాలతో దక్షిణాది సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అయినప్పటికీ ఇంకా పాత ధోరణినే అనుసరించడంపై సిమ్రాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుకే తాను చాలా బాలీవుడ్ ప్రాజెక్ట్లను సున్నితంగా తిరస్కరించానని ఆమె వివరించారు. సిమ్రాన్ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే.. తెలుగు, తమిళ భాషల్లో ఆమె టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. 'సమరసింహారెడ్డి', 'కలిసుందాం రా', 'నరసింహనాయుడు' వంటి ఇండస్ట్రీ హిట్లలో నటించి కుర్రకారు కలల రాణిగా మారారు. ఇటీవలి కాలంలోనూ 'రాకెట్రీ', 'గుల్మోహర్' వంటి చిత్రాలతో తన నటనలో పదును తగ్గలేదని నిరూపించుకున్నారు. సోషల్ మీడియాలో సిమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు వస్తున్నాయి. నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. దక్షిణాది టాలెంట్ను గుర్తించని వారు నష్టపోతారని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఇలాంటి వివక్ష ఇంకా కొనసాగడం దురదృష్టకరమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సిమ్రాన్ తన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా సెలెక్టివ్గా సినిమాలను ఎంచుకుంటున్నారు. బాలీవుడ్లో సన్నీ డియోల్ సరసన 'గబ్రూ' వంటి చిత్రాలతో పాటు మరికొన్ని వెబ్ సిరీస్లలోనూ ఆమె నటిస్తున్నారు. మరి ఈ తాజా వివాదం తర్వాత బాలీవుడ్ మేకర్స్ తీరులో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలి.
May 08, 2026మహిళా కమిషన్కు క్షమాపణ.. అనాథ బాలికల బాధ్యత తీసుకున్న నోరా ఫతేహి!
బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన స్టెప్పులతో కాకుండా, ఒక వివాదం విషయంలో ఆమె స్పందించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 'KD ది డెవిల్' సినిమాలోని వివాదాస్పద 'సర్కే చునార్' పాటపై తలెత్తిన వివాదానికి నోరా ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టారు. జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరైన ఆమె, ఈ అంశంపై తన విచారం వ్యక్తం చేశారు. ఈ పాటలోని సాహిత్యం మహిళలను కించపరిచేలా ఉందంటూ గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో మహిళా కమిషన్ సభ్యులను కలిసిన నోరా, రాతపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని, ఒక కళాకారిణిగా జరిగిన పొరపాటుకు బాధ్యత వహిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. కేవలం క్షమాపణలతోనే ఆగకుండా, కొంతమంది అనాథ బాలికల చదువు బాధ్యతలను స్పాన్సర్ చేస్తానని నోరా ప్రకటించడం విశేషం. నిజానికి ఈ వివాదంపై నోరా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. తాను ఈ పాట కన్నడ వెర్షన్లో మాత్రమే నటించానని, హిందీ వెర్షన్ సాహిత్యం గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని ఆమె పేర్కొన్నారు. తన అనుమతి లేకుండానే ఆ వెర్షన్ను విడుదల చేశారని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నెట్టింట విమర్శలు పెరగడంతో మూవీ మేకర్స్ ఇప్పటికే ఆ వివాదాస్పద హిందీ సాంగ్ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇదే పాట వివాదంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఇదివరకే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన కూడా సుమారు 50 మంది గిరిజన బాలికల విద్యకు సాయం చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు నోరా కూడా అదే బాటలో నడిచి సామాజిక బాధ్యతను చాటుకోవడం పట్ల ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
May 08, 2026ఫేక్ న్యూస్ క్రియేటర్లకు శక్తికపూర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది?
బాలీవుడ్ వెండితెరపై విలనిజంతో పాటు కామెడీతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శక్తి కపూర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. గడిచిన కొద్ది గంటలుగా ఆయన ఆరోగ్యం గురించి, మరణం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. అయితే ఈ వార్తలపై స్వయంగా శక్తి కపూర్ స్పందిస్తూ, తన గురించి వస్తున్నవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. గత కొద్ది రోజులుగా సెలబ్రిటీల గురించి అసత్య ప్రచారాలు చేయడం సోషల్ మీడియాలో పరిపాటిగా మారింది. తాజాగా ఈ జాబితాలోకి శక్తి కపూర్ చేరారు. ఆయన కన్నుమూశారంటూ కొందరు నెటిజన్లు ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే తాను పూర్తి ఆరోగ్యంతో, ఎంతో సంతోషంగా ఉన్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించే వారిపై శక్తి కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వ్యూస్ కోసం లేదా సరదా కోసం ఒక వ్యక్తి ప్రాణాల గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై ఊరుకునే ప్రసక్తే లేదని, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శక్తి కపూర్ బాలీవుడ్ గ్లామర్ క్వీన్ శ్రద్ధా కపూర్ తండ్రి అన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో ఆయన 700లకు పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. 'క్రైమ్ మాస్టర్ గోగో' వంటి ఐకానిక్ పాత్రలతో నేటికీ కుర్రకారును అలరిస్తూనే ఉన్నారు. 73 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో చురుగ్గా ఉంటూ సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ వార్త వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. నెటిజన్లు ఇలాంటి పోస్టులను నమ్మవద్దని, బాధ్యతారహితంగా వ్యవహరించే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు కొన్ని కీలక ప్రాజెక్టులలో అతిథి పాత్రలు పోషిస్తున్నారు. తన ఆరోగ్యం పట్ల వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిన శక్తి కపూర్, ఇకపై తన తదుపరి సినిమాలపై దృష్టి సారించనున్నారు. త్వరలోనే ఆయన మరిన్ని ఆసక్తికర పాత్రలతో వెండితెరపై కనువిందు చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
May 08, 2026
Dhurandhar: ఇంకా అయిపోలేదు.. 'ధురంధర్' నిర్మాత సంచలన ప్రకటన.. త్వరలోనే బిగ్ సర్ప్రైజ్!
రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ఫ్రాంచైజీ గురించి తాజాగా ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాత, జియో స్టూడియోస్ అధినేత్రి జ్యోతి దేశ్పాండే (Jyoti Deshpande) అభిమానులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. గతేడాది డిసెంబర్లో వచ్చిన 'ధురంధర్' మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'ధురంధర్ 2: ది రివెంజ్' అంతకు మించిన విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండియన్ సినిమా స్థాయిని పెంచాయి. ఈ నేపథ్యంలో నిర్మాత జ్యోతి దేశ్పాండే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ధురంధర్ ప్రయాణం ఇంకా ముగియలేదు. ఈ ఏడాది చివరలో ప్రేక్షకులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం" అని పేర్కొన్నారు. జ్యోతి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ధురంధర్ మూడో భాగం (Dhurandhar 3) రాబోతుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. లేదా ఈ యూనివర్స్లో ఉన్న ఇతర పాత్రలతో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ధురంధర్ సినిమాను చిత్రీకరించిన విధానంపై ఒక భారీ 'బిహైండ్ ద సీన్స్' (BTS) డాక్యుమెంటరీని రూపొందించే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. అసలు ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఈ ఏడాది చివరిలో రివీల్ కానుంది.
May 08, 2026
Shah Rukh khan: నెట్టింట్లో షారుక్ ఖాన్ రొమాంటిక్ వీడియో వైరల్
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh khan)'డంకీ'తో కొంచం స్లో అయ్యాడు. కానీ ఇప్పుడు ‘కింగ్’(King)తో ఆ స్లో కి పెద్దగా వాల్యూ లేదని చెప్పడానికి సిద్దమవుతున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియోలు లీక్ అవ్వడం మేకర్స్, ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి. కింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ని కేప్ టౌన్ తీరంలో షూటింగ్ చేస్తుంది. షారుఖ్, హీరోయిన్ దీపికా పదుకునే(Deepika Padukone)మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని షాట్స్ లీక్ అయ్యాయి. కేవలం ఈ సాంగ్ నే కాకుండా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షాట్స్ కూడా లీక్ అయ్యాయి. దీంతో చిత్ర బృందం షాక్ కి గురయ్యింది. సదరు షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉన్నారని అభిమానులు మండిపడుతున్నారు. Also read: jyothika: న్యాయం దేవుడి లాంటిది, వెతికి పట్టుకోవడం కష్టం.. అంతా అధికారం గురించే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో షారుఖ్ ఖాన్ డాన్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఆయన శిష్యురాలిగా లేదా కుమార్తెగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. షారుఖ్, దీపికా పదుకొణె 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్ప్రెస్', 'పఠాన్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండబోతోంది. సుజోయ్ ఘోష్ దర్శకుడు కాగా ఈ సంవత్సరం డిసెంబర్ 24 న థియేటర్స్ లోకి రానుంది.
May 07, 2026
System: నేరుగా ఓటీటీలోకి 'సిస్టమ్' మూవీ.. సోనాక్షి, జ్యోతికల పవర్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరో ఆసక్తికరమైన ఒరిజినల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అధికారం, న్యాయం మధ్య జరిగే పోరాట నేపథ్యంలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ 'సిస్టమ్' (System) విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించారు. 'సిస్టమ్' సినిమా మే 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బవేజా స్టూడియోస్ బ్యానర్పై హర్మన్ బవేజా, పమ్మీ బవేజా, స్మిత బలిగా నిర్మించారు. ప్రత్యేక హక్కులు, సత్యం, న్యాయం యొక్క అసలు అర్థాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. 'సిస్టం' చిత్రంలో సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), జ్యోతిక (Jyothika), అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రీతి అగర్వాల్, ఆదినాథ్ కొఠారే, ఆశ్రియా మిశ్రా, గౌరవ్ పాండే, సయన్దీప్ గుప్తా తదితరులు ఇతర పాత్రలను పోషించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేహా రాజవంశీ, సాధారణ స్టెనోగ్రాఫర్ సారికా రావత్ కలిసి వ్యవస్థలో దాగి ఉన్న అన్యాయాలను ఎలా వెలికితీశారు అనేదే ఈ సినిమా కథ. హర్మన్ బవేజా, అరుణ్ సుకుమార్, అశ్విని అయ్యర్ తివారీ, తస్నీమ్ లోఖండ్వాలా, అక్షత్ గిల్డియాల్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. కేవలం లీగల్ డ్రామాగానే కాకుండా, భావోద్వేగాల లోతును కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆశయం, నైతికత, సత్యం వంటి అంశాల చుట్టూ తిరిగే 'సిస్టమ్' సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మే 22న ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
May 06, 2026
Palash Muchhal: ప్రముఖ సంగీత దర్శకుడిపై ఎస్ సి, ఎస్ టి కేసు.. ఫిర్యాదు చేరిన ప్రముఖ నటుడు
భారతీయ సినీ సంగీతంలో పలాష్ ముచ్చల్(Palash Muchhal)కి ప్రత్యేకమైన పేరు ఉంది. 2014 లో సంగీత దర్శకుడిగా కెరీర్ ని స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలకి వర్క్ చేయడంతో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా అందించాడు. ఇప్పుడు పలాష్ ముచ్చల్ పై ఎస్ సి, ఎస్ టి కేసు నమోదవు కావడం సంచలనంగా మారింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. పలాష్ ముచ్చల్ ఒక సినిమా ప్రాజెక్ట్ కోసం విజ్ఞాన్ మానే వద్ద నుంచి సుమారు 25 లక్షల రూపాయల తీసుకున్నారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి చేయలేదు. దీంతో విజ్ఞాన్ మానే తన డబ్బులు ఇవ్వమని పలాష్ ని అడిగాడు. కాని డబ్బులు ఇవ్వకపోగా పలాష్ తనపై కుల వివక్షతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనను దూషించారని విజ్ఞాన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు పలాష్పై SC/ST బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు పలాష్ పై కేసు నమోదు చేసారు. Also read: KHxRK: రజినీ, కమల్ మల్టిస్టారర్ మూవీ బడ్జెట్ ఇంతే!. మరి ఆ మాత్రం హడావిడి ఉండాలిగా పలాష్ ముచ్చల్ ఎవరో కాదు స్మృతి మంధాన మాజీ ప్రేమికుడు.2025 నవంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉంది. పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే, అనూహ్యంగా పెళ్లికి కొన్ని రోజుల ముందే ఆ వేడుకలు ఆగిపోయాయి. పలాష్ మరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతో స్మృతి ఆ పెళ్లిని రద్దు చేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకుని, విడిపోతున్నట్లు ప్రకటించారు. పలాష్ పై కేసు నమోదు చేసిన విజ్ఞాన్ మానే కూడా ఎవరో కాదు స్మృతి ఫ్రెండ్. మరాఠి చిత్ర సీమలో ప్రముఖ నటుడు, నిర్మాత. ఈ నేపథ్యంలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది.
May 06, 2026ఓటీటీలో మర్దానీ 3 హవా.. స్ట్రీమింగ్లో టాప్ ట్రెండింగ్ క్రైమ్ థ్రిల్లర్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన పవర్ఫుల్ పోలీస్ డ్రామా 'మర్దానీ 3' ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్పై సత్తా చాటుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్లో నిలిచింది. పవర్ఫుల్ యాక్షన్ మరియు సామాజిక ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మర్దానీ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో భాగం ఇది. రాణీ ముఖర్జీ ఇందులో 'శివానీ శివాజీ రాయ్' అనే మొండి పట్టుదల గల పోలీస్ ఆఫీసర్గా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, క్రైమ్ నెట్వర్క్లను ఛేదించే క్రమంలో ఆమె చేసే పోరాటం ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని కలిగిస్తోంది. ప్రస్తుతానికి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అత్యధిక వ్యూస్ సాధిస్తున్న సినిమాల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గతంలో వచ్చిన 'మర్దానీ' (2014), 'మర్దానీ 2' (2019) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, రాణీ ముఖర్జీ కెరీర్లోనే మైలురాళ్లుగా నిలిచాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు సైకో కిల్లర్స్ నేపథ్యంలో సాగిన ఆ రెండు భాగాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అదే ఊపుతో వచ్చిన పార్ట్ 3 కూడా అంతకు మించి అనేలా యాక్షన్ సీక్వెన్స్లతో రూపొందింది. ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ నటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్లు సినిమాకు హైలైట్గా నిలిచాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్లో ఇది ఒక మంచి ఆప్షన్గా నిలిచింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో హిందీ వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, రానున్న రోజుల్లో ఇతర భాషల్లో కూడా డబ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాణీ ముఖర్జీ తన తదుపరి ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
May 03, 2026పోలీస్ ఆఫీసర్గా రాశీ ఖన్నా.. పవర్ ప్యాక్డ్ యాక్షన్తో వస్తున్న బ్యూటీ!
టాలీవుడ్ అందాల భామ రాశీ ఖన్నా త్వరలోనే ఒక పవర్ఫుల్ రోల్తో డిజిటల్ స్క్రీన్పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఈసారి ఖాకీ దుస్తులు ధరించి మాస్ లుక్లో అలరించబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'లుఖ్కే' స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 8వ తేదీ నుంచి 'లుఖ్కే' స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. హిమాంక్ గౌర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్, తీవ్రమైన క్రైమ్ ఎలిమెంట్స్తో కూడిన ఇన్వెస్టిగేషన్ డ్రామాగా సాగనుంది. పంజాబ్ రాష్ట్రంలో వేళ్లూనుకున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ కథను మలిచారు. ఇందులో రాశీ ఖన్నా 'గుర్బానీ' అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించడానికి ఆమె చేసే పోరాటం, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు సిరీస్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రాశీతో పాటు టాలెంటెడ్ బ్యూటీ పాలక్ తివారీ కూడా ఈ సిరీస్లో ఒక కీలక పాత్రలో మెరవనుంది. తన పాత్ర గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "చాలా భాషల్లో సినిమాలు చేసినా, పంజాబీ మూలాలు ఉన్న పాత్రలో నటించడం నాకు సొంత ఇంటికి వెళ్ళిన అనుభూతిని ఇచ్చింది. గుర్బానీ పాత్ర చాలా ఎమోషనల్గా సాగుతుంది" అని ఆమె పేర్కొన్నారు. గతంలో 'ఫర్జీ' వంటి హిట్ సిరీస్లతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశీకి, ఈ ప్రాజెక్ట్ మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'లుఖ్కే'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాశీ ఖన్నాను కంప్లీట్ యాక్షన్ మోడ్లో చూడాలని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ నెట్టింట భారీ వ్యూస్ సాధించాయి.
May 03, 2026డాన్ 3 నుంచి రణవీర్ సింగ్ ఔట్.. హీరో డిమాండ్లకు నో చెప్పిన డైరెక్టర్!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ 'డాన్' సిరీస్ నుంచి వస్తున్న తాజా వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. కింగ్ ఖాన్ షారూఖ్ స్థానంలో 'డాన్ 3'లోకి ఎంట్రీ ఇచ్చిన రణవీర్ సింగ్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ అప్డేట్ విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. అయితే రణవీర్ ఈ సినిమా నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం దర్శకుడు ఫర్హాన్ అక్తర్తో వచ్చిన 'క్రియేటివ్ డిఫరెన్సెస్' అని తెలుస్తోంది. రణవీర్ సింగ్ ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్కు తగ్గట్టుగా, అత్యంత హింసాత్మకంగా (Raw and Gritty) రూపొందించాలని కోరారట. ముఖ్యంగా సినిమాలో బోల్డ్ డైలాగులు, బూతులు ఉండాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభావాన్ని చూసి, రణవీర్ కూడా 'డాన్' క్యారెక్టర్ను అదే తరహాలో డార్క్గా చూపించాలని ఆశపడ్డారట. కానీ, ఫర్హాన్ అక్తర్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నట్లు టాక్. 'డాన్' అంటే ఒక క్లాస్, ఒక డిగ్నిటీ ఉంటుందని.. దానికి అసభ్యతను జోడించడం తనకు ఇష్టం లేదని ఫర్హాన్ ఖరాకండిగా చెప్పేశారట. గతంలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు పోషించిన ఈ పాత్రకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. 2006లో వచ్చిన 'డాన్', ఆపై వచ్చిన 'డాన్ 2' చిత్రాలు స్టైలిష్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాయి. ఆ వారసత్వాన్ని కేవలం వసూళ్ల కోసం బూతులతో పాడుచేయడం ఇష్టం లేకనే ఫర్హాన్ తన పంతం నెగ్గించుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వర్గం ప్రేక్షకులు 'యానిమల్' తరహా ట్రీట్మెంట్ ఉంటే బాగుంటుందని అంటుంటే, మరికొందరు మాత్రం ఫర్హాన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. సినిమా అంటే కేవలం రక్తం, బూతులు మాత్రమే కాదు.. క్యారెక్టరైజేషన్లో ఉండే పవర్ ముఖ్యం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రణవీర్ తప్పుకోవడంతో ఇప్పుడు 'డాన్ 3' రేసులోకి మళ్ళీ ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫర్హాన్ అక్తర్ ప్రస్తుతం స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేస్తున్నారని, త్వరలోనే కొత్త హీరోను అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ ఐకానిక్ పాత్రను పోషించే లక్కీ స్టార్ ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!
May 03, 2026సాయి పల్లవి పెర్ఫార్మెన్స్కి ఫిదా అయిన ఆమిర్ ఖాన్.. ఏం చేశాడో తెలుసా?
దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. హిందీలో తొలి సినిమా విడుదల కాకముందే అక్కడ అగ్ర హీరోల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యి ఆమెకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన 'ఏక్ దిన్' అనే చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె ప్రతిభను చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయిందట. ఇక రీసెంట్గా ఈ సినిమా ప్రివ్యూ చూసిన ఆమిర్ ఖాన్, సాయి పల్లవి నటనకు ముగ్ధుడయ్యారు. ఆమెను భారతీయ సినీ పరిశ్రమలోని ఉత్తమ నటీమణులలో ఒకరిగా ఆయన కొనియాడడమే కాకుండా, ఆమె అభినయానికి భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. సాయి పల్లవి టాలెంట్పై నమ్మకంతో ఆమిర్ ఖాన్ తన తదుపరి భారీ ప్రాజెక్టులో ఆమెకు ఒక కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆమిర్ ఖాన్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఆయనే స్వయంగా ఒక నటిని ఎంచుకున్నారంటే, ఆ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సాయి పల్లవి కూడా సానుకూలంగా స్పందించినట్లు బి-టౌన్ వర్గాల సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక 'రామాయణ్' చిత్రంలో ఆమె సీత పాత్రను పోషిస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు 'రామాయణం', మరోవైపు అమీర్ ఖాన్ వంటి లెజెండ్స్ నుంచి వస్తున్న అవకాశాలతో సాయి పల్లవి పేరు ఇప్పుడు బాలీవుడ్లో మారుమ్రోగిపోతోంది. ఉత్తరాది మార్కెట్లో కూడా తన జెండా పాతేందుకు ఈ "హైబ్రిడ్ పిల్ల" సిద్ధమవుతోంది.
May 01, 2026బాలీవుడ్లో మరో వేడుక.. జూలైలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్, డైరెక్టర్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. వరుసగా స్టార్ సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ యువ నటి ఆకాంక్ష రంజన్ కపూర్, డైరెక్టర్ శరణ్ శర్మ చేరబోతున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు బాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట ఈ ఏడాది జూలైలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆకాంక్ష రంజన్ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్కు ఆకాంక్ష అత్యంత ఆప్తమిత్రురాలు అన్న సంగతి తెలిసిందే. 'గిల్టీ' వంటి వెబ్ ఫిలిమ్స్ మరియు 'మోనికా ఓ మై డార్లింగ్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, గత కొంతకాలంగా దర్శకుడు శరణ్ శర్మతో డేటింగ్లో ఉంది. శరణ్ శర్మ గతంలో జాన్వీ కపూర్ నటించిన 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' కూడా చర్చనీయాంశమైంది. వీరిద్దరూ తమ రిలేషన్షిప్ను ఎప్పుడూ అధికారికంగా ప్రకటించనప్పటికీ, పలు పార్టీలు మరియు వెకేషన్లలో జంటగా కనిపిస్తూ కెమెరాలకు చిక్కారు. ఆలియా భట్ పెళ్లిలో కూడా శరణ్ శర్మ సందడి చేయడం గమనార్హం. అప్పటి నుండే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా నివేదికల ప్రకారం, వీరి వివాహం జూలై నెలలో జరగనుంది. పెళ్లి వేడుకను చాలా సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకకు ఆలియా భట్, రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు హాజరుకానున్నారు. అయితే, పెళ్లి వేదిక ఎక్కడ? అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ముంబైలోనే జరుగుతుందా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా అనేది త్వరలోనే తెలియనుంది. సినిమా రంగంలో నటీనటులు మరియు దర్శకుల మధ్య ప్రేమ చిగురించడం కొత్తేమీ కాదు. అయితే ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లడం విశేషం. ఆకాంక్ష రంజన్ - శరణ్ శర్మల జోడీ చూడముచ్చటగా ఉంటుందని వారి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జూలైలో జరగబోయే ఈ వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఏది ఏమైనా, ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
May 01, 2026
Salman Khan: సమంత భర్తతో సల్మాన్ ఖాన్ భారీ సూపర్ హీరో మూవీ!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) అభిమానులకు ఒక అదిరిపోయే వార్త వినిపిస్తోంది. ప్రముఖ వెబ్ సిరీస్ మేకర్స్ రాజ్ & డికె (Raj & DK) దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక భారీ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్ & డికె ద్వయంలో రాజ్ ఎవరో కాదు.. సమంత భర్త రాజ్ నిడిమోరు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ & డికె కలయికలో సరికొత్త ప్రయోగం: ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి వెబ్ సిరీస్లతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన రాజ్ & డికె, ఇప్పటివరకు టచ్ చేయని ఒక వైవిధ్యమైన కథను సల్మాన్ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇది కేవలం సాధారణ యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా, అత్యాధునిక హంగులతో కూడిన ‘సూపర్ హీరో’ తరహా చిత్రమని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ను ఇప్పటివరకు ఎన్నడూ చూడని రీతిలో ఈ సినిమాలో ప్రజెంట్ చేయబోతున్నారట. షూటింగ్ అప్డేట్: తాజా నివేదికల ప్రకారం, ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్ అక్టోబర్ 2026 నుంచి ప్రారంభం కానుంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయ్యాక 2026 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ లోపు రాజ్ & డికె తమ స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడమే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ముందస్తు పనులను కూడా పూర్తి చేయనున్నారు. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్, రాజ్ & డికెల క్రియేటివ్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇండియన్ సినిమాలోనే ఇది ఒక బిగ్గెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
May 01, 2026
Aamir Khan: చనిపోతాననే భయంతోనే ఆ పని చేస్తున్నా.. అమీర్ ఖాన్ సీక్రెట్ నోట్ బయటపడింది
భారతీయ సినిమా అమీర్ ఖాన్ ని చూసి ఎంతగా మురిసిపోతుందో అమీర్ ఖాన్(Aamir Khan)కూడా భారతీయ సినిమా ఎదుగుదలకి చూసి ఎంతో మురిసిపోతూ ఉంటాడు. సినిమా అంటే అంత ప్రాణం. చిరు వయసు నుంచే భారతీయ సినిమా ఎదుగుదలకి కూడా ఎంతో సాయం చేసిన అమీర్ ఖాన్ రీసెంట్ గా తన మాటలతో సినిమాతో పాటు అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు. మరి ఆ మాటలేంటో చూద్దాం. రీసెంట్ గా అమీర్ మాట్లాడుతు విమాన ప్రయాణం ఎప్పుడు చేసినా నాకు ప్రాణ భయం. దీంతో ఆ సమయంలో నా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంటే నా కజిన్, దర్శకుడు మన్సూర్ ఖాన్ కి ప్రమాదంలో నేను చనిపోయినా సరే సినిమా రిలీజ్ ఆగకూడదు. ఆ పనులన్నీ చూసుకొని నువ్వు కంప్లీట్ చేసి రిలీజ్ చేయమని నోట్ సెండ్ చేస్తాను. దర్శకులతో కూడా మన్సూర్ కి చెప్పి మూవీని కంప్లీట్ చేయమని చెప్తానని అమీర్ ఖాన్ తన సీక్రెట్ ని బయటపెట్టాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తు అమీర్ భయ్యా అలాంటి మాటలు మాట్లాడకు నువ్వు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నపుడు మమ్మల్ని గుర్తు చేసుకో అనే కామెంట్స్ చేస్తున్నారు. Also read: Kara: కర ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ధనుష్ హిట్ కొట్టినట్లేనా! అమీర్ ఖాన్ కి మన్సూర్ ఖాన్ దూరపు బంధువు అవుతాడు. ఇద్దరి కాంబోలో 'ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహి సికందర్' వంటి చిత్రాలు వచ్చాయి. అమీర్ ప్రస్తుతం నిర్మాతగా ఏక్ దిన్ తో థియేటర్స్ లో ఉన్నాడు. అమీర్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా చేసారు.
May 01, 2026
Dhurandhar 2: 'ధురంధర్ 2' క్లైమాక్స్లో రియల్ బ్లాస్ట్.. 500 లీటర్ల పెట్రోల్తో రిస్క్ చేసిన రణవీర్ సింగ్!
నేటి కాలంలో భారీ యాక్షన్ సినిమాలంటే విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్ (CGI) మాయాజాలమే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రమాదకరమైన సీన్లను గ్రీన్ మ్యాట్ స్టూడియోల్లోనే కానిచ్చేస్తున్నారు. అయితే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) మాత్రం అలా కాదు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఇంత సహజంగా ఎలా వచ్చాయా అని చర్చించుకుంటున్న తరుణంలో, చిత్ర స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ విశాల్ త్యాగి ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. సీజీఐ లేకుండా లైవ్ యాక్షన్: సాధారణంగా భారీ పేలుళ్ల సీన్ల కోసం చిన్న స్థాయిలో బాంబులను పేల్చి, వాటిని గ్రాఫిక్స్ ద్వారా పెద్దవిగా చూపిస్తారు. కానీ 'ధురంధర్ 2' విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ అస్సలు సీజీఐ వాడకూడదని నిర్ణయించుకున్నారు. సినిమా క్లైమాక్స్లో వచ్చే భారీ ట్యాంకర్ పేలుడు సన్నివేశం కోసం ఏకంగా 500 లీటర్ల పెట్రోల్ను, దాదాపు 25 కిలోల పేలుడు పదార్థాలను వాడినట్లు విశాల్ త్యాగి తెలిపారు. 20 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్లో కనిపించే ప్రతి నిప్పుకణిక, ప్రతి పేలుడు వంద శాతం సహజమైనవేనని ఆయన స్పష్టం చేశారు. రణవీర్ సింగ్ అంకితభావం: ఈ హై-రిస్క్ సీన్ చిత్రీకరణ సమయంలో హీరో రణవీర్ సింగ్ ప్రాణాలకు తెగించి నటించారు. భారీ మంటలు ఎగసిపడుతున్నా, వాటికి అత్యంత సమీపంలో రణవీర్ నడుస్తూ తన షాట్ను పూర్తి చేశారు. "మేము రణవీర్ భద్రత గురించి చాలా ఆందోళన చెందాము, కానీ ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉండి మాపై నమ్మకం ఉంచారు" అని విశాల్ వివరించారు. కృత్రిమమైన గ్రాఫిక్స్ కంటే సహజత్వానికే ప్రాధాన్యత ఇస్తూ తీసిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి అనుభూతిని ఇస్తోంది. రణవీర్ సింగ్ సాహసం, సాంకేతిక నిపుణుల కష్టం వెండితెరపై స్పష్టంగా కనిపిస్తోంది.
Apr 29, 2026రణవీర్ సింగ్ - ఆదిత్య ధర్ సెన్సేషనల్ కాంబో.. ధురంధర్ మ్యాజిక్ రిపీట్ కాబోతుందా?
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ అనగానే సినీ ప్రియుల్లో ఒక తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ కాంబో గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. తమ గత చిత్రంతో రికార్డులను తిరగరాసిన ఈ ద్వయం, మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారట. ఈ స్క్రిప్ట్ రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్కు సరిగ్గా సరిపోతుందని భావించిన డైరెక్టర్, ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 'ధురంధర్' ఫ్రాంచైజీతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన ఈ హీరో-డైరెక్టర్ జోడీ, ఈసారి అంతకు మించిన ఒక 'హై కాన్సెప్ట్' మూవీని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ విషయానికి వస్తే, 2027 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం రణవీర్ సింగ్ తన పాత కమిట్మెంట్స్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే ఆదిత్య ధర్ కూడా తన తదుపరి చిత్రం కోసం కావాల్సిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్లో స్క్రిప్ట్ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దాలని ఆదిత్య ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'యూరి: ద సర్జికల్ స్ట్రైక్' ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలుసు. ఆ తర్వాత రణవీర్తో చేసిన 'ధురంధర్' వసూళ్ల పరంగా బాహుబలి వంటి చిత్రాల సరసన నిలిచింది. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ టేకింగ్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను మనం చూడబోతున్నామన్నమాట. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవ్వడంతో రణవీర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. "మరోసారి బాక్సాఫీస్ బద్దలు కాబోతోంది", "ఆదిత్య ధర్ మేకింగ్ కోసం వెయిటింగ్" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు రణవీర్ సింగ్ ఇతర ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మరి ఈసారి ఈ కాంబినేషన్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!
Apr 29, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



