
Dhurandhar 2: 'ధురంధర్ 2' ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్లకి థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
గతేడాది బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ ని షేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1400 కోట్ల గ్రాస్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా 'ధురంధర్ 2' (ధురంధర్: ది రివెంజ్) థియేటర్లలో అడుగు పెట్టింది. ఈరోజు(మార్చి 18) సాయంత్రం నుంచి షోలు మొదలయ్యాయి. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. (Dhurandhar The Revenge) ట్విట్టర్ లో వస్తున్న రివ్యూల ప్రకారం.. రణవీర్ సింగ్ తన కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆదిత్య ధర్ టేకింగ్, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా ఫస్టాఫ్ గురించి నెటిజన్ల మాటల్లో చెప్పాలంటే.. కథ చాలా వేగంగా సాగుతూ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని కొందరు ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ను ఎలివేట్ చేస్తూ నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లిందని అంటున్నారు. 'ధురంధర్ 2' ఒక పక్కా విజువల్ స్పెక్టాకిల్ అని, ఆదిత్య ధర్ తన అద్భుతమైన మేకింగ్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో హై-వోల్టేజ్ డ్రామా, ఎమోషన్స్ పక్కాగా వర్కవుట్ అయ్యాయని ట్వీట్లు దర్శనమిస్తున్నాయి. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచిందని, ప్రతి సీన్ లో రైటింగ్ అద్భుతంగా ఉందని రాసుకొస్తున్నారు. ఇక క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే మాట వినిపిస్తోంది. మొత్తానికి 'ధురంధర్ 2' కు వస్తున్న ఈ పాజిటివ్ టాక్ చూస్తుంటే.. మరోసారి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమనిపిస్తోంది.
Mar 18, 2026ఈ టెస్ట్ ప్రతి ఏడాది చేయించుకోండి.. పురుషులకు అక్షయ్కుమార్ విజ్ఞప్తి
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలతోనే కాకుండా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితులే. తాజాగా ఆయన పురుషుల ఆరోగ్యంపై ఒక కీలకమైన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ఎమోషనల్ అయ్యారు. అక్షయ్ కుమార్ తండ్రి హరి ఓం భాటియా 2000 సంవత్సరంలో ప్రోస్టేట్ క్యాన్సర్తో మరణించారు. ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ, అప్పట్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే తన తండ్రిని కోల్పోవాల్సి వచ్చిందని అక్షయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడున్న వారికి ఆ పరిస్థితి రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. ముఖ్యంగా 50 నుంచి 55 ఏళ్లు దాటిన పురుషులు ప్రతి ఏటా 'పీఎస్ఏ' (PSA - Prostate Specific Antigen) పరీక్ష చేయించుకోవాలని అక్షయ్ సూచించారు. ఈ పరీక్ష ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని, తద్వారా ప్రాణాపాయం నుంచి తప్పుకోవచ్చని ఆయన వివరించారు. ప్రస్తుత కాలంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా సాధారణమైపోయిందని అక్షయ్ పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం, ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ముందుస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష అని ఆయన తెలిపారు. రోగ నిర్ధారణ సకాలంలో జరిగితే చికిత్స సులభమవుతుందని ఆయన వెల్లడించారు. "నా తండ్రి నాకు జీవితాన్ని ఇచ్చారు, కానీ ఆ సమయంలో స్క్రీనింగ్ టెస్టుల గురించి నాకు తెలియదు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ విజ్ఞప్తి మీ ప్రాణాలను మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తాన్ని కాపాడుతుంది" అంటూ అక్షయ్ భావోద్వేగంగా మాట్లాడారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్షయ్ కుమార్ సూచించిన ఈ పీఎస్ఏ టెస్ట్ అనేది రక్తం ద్వారా చేసే చిన్న పరీక్ష. ఇది రక్తంలోని ప్రోటీన్ స్థాయిలను కొలిచి, ప్రోస్టేట్ ఆరోగ్యం ఎలా ఉందో చెబుతుంది. ముందస్తుగా క్యాన్సర్ లక్షణాలను గుర్తించి, ప్రాణాలను నిలబెట్టడంలో ఈ టెస్ట్ ఎంతో కీలకంగా మారుతుంది. కేవలం వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ బాధ్యతాయుతమైన పౌరుడిగా అక్షయ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ ఆరోగ్య సూచనను తక్కువ అంచనా వేయకుండా, పురుషులందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన కోరుతున్నారు.
Mar 16, 2026
Dhurandhar 2: 'ధురంధర్ 2' ట్రైలర్ రెస్పాన్స్.. నెట్ ఫ్లిక్స్ ఎందుకు తప్పుకుంది.. పవర్ స్టార్ షాకిస్తాడా?
'ధురంధర్ 2' ట్రైలర్ సంచలన రికార్డు 48 గంటల్లో 312 మిలియన్ల వ్యూస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎందుకు మారింది? తెలుగునాట 'ధురంధర్ 2' ప్రభావం ఉంటుందా? పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'ధురంధర్ 2'. గతేడాది డిసెంబర్ 5న ఒక్క హిందీ భాషలోనే విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1400 కోట్ల గ్రాస్ రాబట్టి సర్ ప్రైజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'ధురంధర్ ది రివెంజ్' వస్తోంది. (Dhurandhar: The Revenge) 'ధురంధర్ 2' ఈ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. మొదటి భాగం కేవలం హిందీ భాషలో విడుదలైతేనే రూ.1400 కోట్లు వసూలు చేసిందంటే.. ఇక ఇప్పుడు రెండో భాగం పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతుండటంతో పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయి అనేది ఊహకు కూడా అందదు. ప్రస్తుతం 'ధురంధర్ 2'పై హైప్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ ని ఉదాహరణగా చెప్పవచ్చు. మార్చి 7న ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా, కేవలం 48 గంటల్లోనే 312 మిలియన్ల వ్యూస్ తో రికార్డు సృష్టించింది. అంతేకాదు 45 కి పైగా దేశాలలో యూట్యూబ్ చార్ట్స్ లో ట్రెండింగ్లో ఉంది. 'ధురంధర్ 2' ఓటీటీ డీల్ కూడా హాట్ టాపిక్ గా మారింది. మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా, రెండో భాగం ఓటీటీ రైట్స్ మాత్రం జియో హాట్ స్టార్ చేతికి వెళ్లాయి. ట్రైలర్ లో ఈ విషయాన్ని రివీల్ చేశారు. చిత్ర నిర్మాణంలో జియో స్టూడియోస్ భాగస్వామిగా ఉంది. పైగా ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ని మించి భారీ మొత్తం చెల్లించడానికి జియో హాట్ స్టార్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఓటీటీ ప్లాట్ ఫామ్ మారినట్లు సమాచారం. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి అనే రెండు విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నాడు. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకుడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది. కాగా, మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) కూడా విడుదలవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగునాట ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. దాంతో పవర్ స్టార్ మూవీకి పోటీగా అదే రోజు విడుదలవుతున్న 'ధురంధర్ 2' తెలుగునాట ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. Also Read: లంచగొండిని లైవ్ లో హత్య చేసిన భారతీయుడు!
Mar 10, 2026
నటుడు మయాంక్ పవార్ ఆకస్మిక మరణం.. అబద్దమని చెప్పమంటున్న ఫ్యాన్స్
-మయాంక్ పవార్ చనిపోవడానికి కారణం ఏంటి -ఎందుకు ఆ వివరాలు బయటకి రావడం లేదు -షాక్ లో ఫ్యాన్స్ తో పాటు ఫిట్ నెస్ ప్రేమికులు ప్రముఖ నటుడు మయాంక్ పవార్(Mayank pawar)విషయంలో ఉదయాన్నే ఇలాంటి దురవార్తని వినవలసి వస్తుందని అభిమానులు అసలు అనుకోలేదు. ఈ వార్త అబద్దం అయితే బాగుండని కోరుకొని క్షణం కూడా లేదు. అంతలా మయాంక్ తన అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మయాంక్ పవార్.. MTV నిర్వహించిన స్ప్లిట్స్విల్లా సీజన్ 7లో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్స్ లో ఒకరు. ఫిట్నెస్ ప్రపంచంలో అయితే మిస్టర్ ఇండియా టైటిల్ ని ఏడుసార్లు గెలుచుకుని విశేష ప్రాచుర్యాన్ని పొందాడు. మిస్టర్ ఆసియా టైటిల్ కూడా మయాంక్ సొంతమయ్యింది.బాడీబిల్డింగ్, ఫిట్నెస్ రంగాల్లో మయాంక్ ని ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. కారణాలు ఇంకా బయటకి రాలేదు కాని మయాంక్ చనిపోవడం జరిగింది. ఈ విషయం నిన్న వెలుగులోకి రావడంతో పాటు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా మరణం విషయాన్ని ధ్రువీకరించారు. సోదరుడు, ఛాంపియన్, గురువు, చాలా మందికి స్ఫూర్తిదాయకమైన మయాంక్ పవార్ ఎల్లప్పుడూ మన హృదయాల్లో నిలిచి ఉంటాడు. ఈ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రాణా ప్రతాప్ బాగ్లోని సంగం పార్క్లోని వాల్మీకి ఆలయంలో సంతాప సమావేశం జరుగుతుందని కూడా తెలియచేయడం జరిగింది. also read: ప్రముఖ యూ ట్యూబర్ కోమలి ఆత్మహత్య.. కారణం ఇదేనా! మయాంక్ హఠాన్మరణం పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మయాంక్ ఇటీవలే తన 37 వ పుట్టిన రోజుని జరుపుకొన్నాడు. అంతలోనే ఈ తీవ్ర విషాదం జరిగింది. జనవరి 1, 1989 డేట్ ఆఫ్ బర్త్.
Feb 25, 2026పెళ్లి చేసుకోబోతూ ఇలాంటి క్యారెక్టర్ చెయ్యడం అవసరమా.. రష్మిక ఫ్యాన్స్ నిరసన!
నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలోనే విజయ్ దేవరకొండ(Rashmika Mandanna)ను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. వీరి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. అయితే విజయ్, రష్మిక తమ పెళ్లి విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా రష్మికపై ఆమె ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి కారణం ఆమె నటించిన ‘కాక్టెయిల్2’ చిత్రమే. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కతి సనన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రష్మిక, కతి లెస్బియన్స్గా నటించారనే వార్త ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎప్ప్పుడూ ఆసక్తి చూపించే రష్మిక.. ఈ తరహా పాత్రలో నటించింది అనే వార్త ఇప్ప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప సిరీస్, యానిమల్, ఛావా, కుబేర వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇప్ప్పుడు ‘కాక్టెయిల్2’ చిత్రంలో ఆమె లెస్బియన్గా నటించిందనే వార్త అభిమానుల్ని కలవరపెడుతోంది. ఈ విషయంలో ఆమెపై నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతూ ఇలాంటి పాత్రలు చేయడం ఇప్ప్పుడు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, కతి పాత్రలు ఎంతో కీలకమని తెలుస్తోంది. ఇప్పటివరకు రష్మిక ఈ తరహా క్యారెక్టర్లు చేయలేదు. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న విషయమే నిజమైతే రష్మిక కెరీర్లో ఇది ఓ ప్రత్యేకమైన పాత్ర అవుతుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ డిఫరెంట్ షేడ్లో కనిపిస్తారని డైరెక్టర్ చెబుతున్నారు. 2012లో విడుదలైన ‘కాక్టెయిల్’ చిత్రానికి సీక్వెల్గా ‘కాక్టెయిల్2’ రిలీజ్ అవనుంది. రష్మిక లెస్బియన్గా నటించిందని వచ్చిన వార్త, దానికి అభిమానుల నుంచి ఎదురైన నిరసన గురించి రష్మిక ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
Feb 20, 2026
ధురంధర్ 2 కి షాక్ ఇచ్చిన AICWA.. శాశ్వతంగా బ్యాన్ తప్పదా!
-ధురంధర్ 2 కోసం ఇండియా మొత్తం వెయిటింగ్ -రంగంలోకి దిగిన AICWA -సినిమాని నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలు ముఖ్యమని వెల్లడి -శాశ్వతంగా బ్యాన్ తప్పదా! మార్చి 19 కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అందరు టక్కున చెప్పే సమాధానం 'ధురంధర్ పార్ట్ 2'(Dhurandhar 2)రిలీజ్ అని. అంతలా ఇండియన్ మూవీ లవర్స్ ధురంధర్ 2 అప్ డేట్స్ తో సినీ సహజీవనం చేస్తు ఉన్నారు. ఈ క్రమంలోనే పార్ట్ 2 కి సంబంధించిన న్యూస్ ఒకటి రీసెంట్ గా బయటకి వచ్చింది. దీంతో సదరు న్యూస్ ప్రమోషన్స్ లేకుండానే వైరల్ గా మారింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. మేకర్స్ ధురంధర్ 2(Dhurandhar 2)షూటింగ్ ని శర వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబై లోని బృహన్ముంబై(Bruhan Mumbai)ఏరియాలో జరపాలనే యోచనలో ఉండగా సదరు మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇవ్వలేదు.ఈ విషయంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ స్పందిస్తు ధురంధర్ 2 కి బృహన్ముంబై లో షూటింగ్ కి అనుమతి నిరాకరించే విషయానికి మా మద్దతు ఉంటుంది. పరిశ్రమలో కొన్ని వేల మంది పని చేస్తున్నారు. టెక్నీషియన్స్, వర్కర్స్ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడకూడదు. మేకర్స్ ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా చట్టానికి అతీతులు కాదని తన లేఖలో పేర్కొంది. Also read: 45 ఏళ్ళ ప్రేమాభిషేకం.. వీడియో బయటకి వచ్చింది నిజానికి ధురంధర్ పార్ట్ 2 షూటింగ్ బృహన్ముంబై లోని ఒక భవనం టెర్రస్పై జరిగింది. ఆ విషయంపై కార్పొరేషన్ అధికారులు స్పందిస్తు సదరు షూటింగ్ కి ముందస్తు అనుమతి తీసుకోలేదు. భద్రత నియమాలు పాటించకపోవడమే కాకుండా షూటింగ్ కోసం ఉపయోగించే జనరేటర్ వ్యాన్లకి ఉండాల్సిన అధికారిక క్లియరెన్స్ పత్రాలు లేవనేది కార్పొరేషన్ ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ధురంధర్ ని నిర్మిస్తున్న బి 62 స్టూడియోకి లక్ష జరిమానా విధించడంతో పాటు సదరు నిర్మాణ సంస్థ బృహన్ముంబై లో శాశ్వతంగా షూటింగ్ జరపకుండా చేయాలనే యోచనలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది.
Feb 18, 2026
ఇంత దారుణమా.. కంటతడి పెట్టిస్తున్న 'ది కేరళ స్టోరీ 2' ట్రైలర్!
2023 లో వివాదాల నడుమ విడుదలైన 'ది కేరళ స్టోరీ' చిత్రం, వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఎవరూ ఊహించని విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'ది కేరళ స్టోరీ 2' వస్తోంది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. (The Kerala Story 2 Trailer) 'ది కేరళ స్టోరీ'లో యువతులకు ట్రాప్ చేసి మతం మార్చడమే కాకుండా, వారిని టెర్రరిస్ట్ గ్రూప్స్ లోకి ఎలా తీసుకెళ్లారు అనేది చూపించారు. ఇప్పుడు 'ది కేరళ స్టోరీ 2'లో అంతకుమించిన చీకటి కథ చూడబోతున్నామని అర్థమవుతోంది. 'వాస్తవ సంఘటనల ఆధారంగా' అంటూ దాదాపు మూడు నిమిషాల నిడివితో 'ది కేరళ స్టోరీ 2' ట్రైలర్ ను రూపొందించారు. లవ్ జిహాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ముగ్గురు యువతులు ప్రేమ మాయలో పడి, తమ జీవితాలను ఎలా చీకటి చేసుకున్నారు అనేది కంటతడి పెట్టించేలా చూపించారు. డార్క్ కంటెంట్, బోల్డ్ సీన్స్ తో ఒక ఎమోషనల్ రైడ్ ని చూడబోతున్నామని ట్రైలర్ తో స్పష్టమైంది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో సన్ షైన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Feb 17, 2026బాలీవుడ్ కమెడియన్.. మధ్యంతర బెయిల్కి ఎంత డిపాజిట్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
ఇటీవలికాలంలో బాలీవుడ్లో కలకలం రేపిన ఓ కేసులో కమెడియన్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. చెక్బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ను తీహార్ జైలుకి తరలించిన విషయం తెలిసిందే. 11 రోజులపాటు ఆయన జైలులో ఉన్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు రాజ్పాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి కఠినమైన షరతులు విధించింది. 9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న రాజ్పాల్ గత వారం బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అయితే కోర్టు దీన్ని తిరస్కరించింది. తాజాగా ఫిబ్రవరి 16న కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అవేమిటంటే.. కోటిన్నర రూపాయల డిపాజిట్ను డి.డి.రూపంలో కోర్టుకు అందజేయాలి. రాజ్పాల్ పాస్పోర్టును కూడా కోర్టుకు సమర్పించాలి. అంతేకాదు, తదుపరి వాయిదా తప్పనిసరిగా హాజరు కావాలి. వీ{న్నింటికీ ఒప్ప్పుకున్న తర్వాత ఆయనకు మార్చి 18 వరకు బెయిల్ను మంజూరు చేశారు. కోర్టు ఆదేశించిన మేరకు కోటిన్నర డిపాజిట్తోపాటు పాస్ట్పోర్ట్ను సమర్పించారు రాజ్పాల్. 1999లో బాలీవుడ్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజ్పాల్ యాదవ్ 2010లో ‘అటపటా లపాటా’ అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. 2012లో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా నిర్మాణం నిమిత్తం 5 కోట్ల రూపాయలు ఫైనాన్స్ తీసుకున్నారు రాజ్పాల్. ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఆయన ఫైనాన్షియర్స్కి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కింద కేసు నమోదైంది. వడ్డీలతో సహా ఆ రుణం 9 కోట్లకు పెరిగింది.
Feb 16, 2026
Ghooskhor Pandat: ఘూస్ఖోర్ పండత్ vs బ్రాహ్మణులు.. మైండ్ బ్లోయింగ్ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్ట్
-ఘూస్ఖోర్ పండత్ పై బ్రాహ్మణుల నిరసన ఆగుతుందా! -సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది -ఎవరి పక్షం -వాట్ నెక్స్ట్ వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్ పేయి(Manoj bajpayee)అప్ కమింగ్ మూవీ 'ఘూస్ఖోర్ పండత్'(Ghooskhor Pandat)పై దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాలు తమ నిరసనని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పండత్ లేదా పండిత్ అనే వర్డ్ బ్రాహ్మణ కమ్యూనిటీకి గుర్తింపు. ఘూస్ఖోర్ అంటే లంచగొండి. మూవీలో మనోజ్ బాజ్ పేయి పేరు అజయ్ దీక్షిత్. అంటే ఒక బ్రాహ్మణ పోలీస్ ఆఫీసర్ ని అవినీతి ఆఫీసర్ గా మేకర్స్ చూపిస్తున్నారు. టీజర్ లో కూడా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.దీంతో బ్రాహ్మణ సమాజం మొత్తం ఏక తాటిపైకి వచ్చి టైటిల్, హీరో పేరు మార్చాలని ఉద్యమాలు చెయ్యడంతో పాటు మొదట ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేశారు. రీసెంట్ గా ఈ విషయంపై సుప్రీంకోర్టు ఏమని స్పందించిందో చూద్దాం. సమాజంలో ఒక వర్గాన్ని కించపర్చడానికి అలాంటి టైటిళ్లని ఉపయోగించడం తప్పు. అలాంటి శీర్షిలకతో సమాజంలోని ఒక వర్గాన్ని ఎందుకు కించపరచాలి. ఇది నైతికతకి విరుద్ధం. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది ఎవరినీ కించపరచడానికి అనుమతించదు. టైటిల్ ని మార్చేసి మాకు చెప్పకపోతే సినిమాని విడుదల చేయడానికి అనుమతించం. మూవీలో సమాజంలోని ఏ వర్గాన్ని కించపర్చేలా లేదని తెలుపుతూ అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని మేకర్స్ ని ఆదేశిస్తూ తదుపరి విచారణని ఈనెల 19కి వాయిదా వేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కి కూడా సినిమా రిలీజ్ ఆపాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. Also read: udit narayan: ఉదిత్ నారాయణ్ నా గర్భాశయాన్ని తీయించాడు.. కేసు నమోదు ఈ వివాదంపై ఇప్పటికే దర్శకుడు నీరజ్ తోపాటు మనోజ్ బాజ్ పేయి స్పందిస్తు సమాజంలో ఎవరి మనోభావాలని దెబ్బతీయాలనేది తమ ఉద్దేశం కాదని, టైటిల్ వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్లందరి భావాలను గౌరవిస్తామని అజయ్ దీక్షిత్ క్యారక్టర్ ఊహాజనిత క్యారక్టర్ మాత్రమేనని, ఎవరిని ఉద్దేశించింది కాదని తెలిపారు. ఘూస్ఖోర్ పండత్ కి సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్లు, వీడియోలు,టీజర్ యూట్యూబ్ నుంచి ఇప్పటికే తొలగించడం జరిగింది.
Feb 12, 2026దేశం కోసం అమరుడైన తెలంగాణ వీరుడిగా సల్మాన్.. సినిమా రిలీజ్ అవుతుందా?
కొందరు హీరోలు, దర్శకనిర్మాతలు రొటీన్ సినిమాలకు భిన్నంగా తమ సినిమాలు ఉండాలని భావిస్తారు. దాని కోసం విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు వారు ఎంపిక చేసుకున్న కథాంశం వల్ల సినిమా రిలీజ్కి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇప్పటివరకు అలా సెన్సార్లో చిక్కుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించి కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని సినిమాలు ఇప్పటికీ రిలీజ్కి నోచుకోలేదు. తాజాగా అలాంటి సమస్య సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ సినిమాకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 జూన్ 15న లడాక్లో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సంతోష్బాబు నాయకత్వంలో జరిగిన ఈ పోరాటంలో ఆయన అమరవీరుడయ్యారు. మరణం తర్వాత సంతోష్కు పరమవీర చక్ర పురస్కారం లభించింది. ఈ యుద్ధంలో చైనాకు చెందిన సైనికులు కూడా చనిపోయారు. ఈ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన సినిమాయే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’. కల్నల్ సంతోష్బాబు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ నటించారు. అపూర్వ లాఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రం రిలీజ్ అవ్వడం అంత సులభం కాదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. థియేటర్లలో సినిమాను విడుదల చేసుకోవచ్చు. కానీ, ఆ సినిమా వల్ల సమాజానికి, దేశ భద్రతకు నష్టం వాటిల్లుతుందని సెన్సార్ భావిస్తే క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చెయ్యదు. అలాంటి సమయంలో ఆ చిత్ర నిర్మాతలు కోర్టు పరిధికి వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకుంటారు. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ విషయానికి వస్తే.. ఇందులో రక్షణ శాఖ కూడా ఇన్వాల్వ్ అవనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రంపై చైనాలోని సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తోంది. వాస్తవాలను తారుమారు చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారని తమ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇండియాలోని సోషల్ మీడియాలో కూడా సినిమాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ అవ్వడం అంత ఈజీ కాదు అనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్తోపాటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది. గతంలో యుద్ధ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా వచ్చాయి. మరి ఈ సినిమా ఎందుకంత ప్రత్యేకం అంటే.. గాల్వానా లోయలో జరిగన ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత సైన్యంపై చైనా జవాన్లు మెరుపు దాడికి దిగడంతో భారత సైనికులు ప్రతి దాడికి దిగి వారిపై వీరోచితంగా పోరాడారు. అందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్బాబుతోపాటు 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఈ పోరాటంలో చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో భారత్, చైనా మధ్య సత్సంబంధాలు లేకపోయినా.. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది. అయినప్పటికీ రక్షణ శాఖ క్లియరెన్స్ ఇస్తేనే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రం రిలీజ్కి మార్గం సుగమం అవుతుంది.
Feb 09, 2026
డబ్బు అవసరం కాబట్టే చేశాను.. నిజం ఒప్పుకున్న సీనియర్ నటీమణి
-వైరల్ గా మారిన నీనా గుప్తా వ్యాఖ్యలు -ఎందుకు అలా చెప్పింది. -ఆమె వ్యాఖ్యల్లోని మర్మం ఏంటి! భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి 'నీనా గుప్తా'(Neena Gupta)కి సగర్వం గా చెప్పుకునే సినీ లైనప్ ఉంది. 1982 లో 'సాత్ సాత్' అనే చిత్రంతో మొదలైన తన సినీ ప్రస్థానంలో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా గత ఏడాది వచ్చిన మెట్రో ఇన్ దినో, తు మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తు మేరీ వంటి చిత్రాల వరకు కొనసాగుతూనే ఉంది. దీన్ని బట్టి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై నీనా గుప్తా చరిష్మా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో తనకు ఇన్నాళ్లు సినీ కెరీర్ ని కొనసాగించడానికి గల రహస్యాన్ని చెప్పి షాక్ కి గురించి చేసింది. మరి ఆ విషయాలేంటో చూద్దాం. నేను చేసిన కొన్ని సినిమాల్లోని క్యారెక్టర్స్ విషయంలో తప్పులు చేశాను. షూటింగ్ జరుగుతున్న రోజులు మొత్తం వాటిని ఎందుకు అంగీకరించానా అని బాధపడటంతో పాటు అవి రిలీజ్ కాకుండా ఉండాలని కోరుకున్నాను. ఆ క్యారెక్టర్స్ చేసేటప్పుడు సెట్ లో ఎన్నో సార్లు అవమానాలు ఎదుర్కొన్నాను. కొంత మంది దర్శకురాలు అయితే కారణం లేకుండానే సెట్ లో నన్ను తిట్టేవారు. కేవలం డబ్బు అవసరం కాబట్టే ఆ చిత్రాలన్నీ చెయ్యడంతో పాటు ఎన్నో మాటలు అన్నా కూడా భరించాను. ఒక వేళ ఆ టైంలో వేరే చిత్రాల్లో ఆఫర్స్ వచ్చి ఉంటే ఆ చిత్రాలు చేసే దానిని అని నీనా గుప్తా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా నిలిచాయి. Also read: ఆది సీక్వెల్ కి ఆ హీరో, ఆ దర్శకుడు ఓకేనా! కెరీర్ మొదట్లో మంచి చిత్రాల్లోనే చేసిన నీనా గుప్తా ఆ తర్వాత రొమాన్స్ తరహా చిత్రాల్లోను తన సత్తా చాటింది. ఆ జోరు లేటు వయసులోను సిల్వర్ స్క్రీన్ పై కనపరిచింది. అందుకే ఆమె ఆ తరహా వ్యాఖ్యలు చేసింది. పలు టెలివిజన్ షోస్ లోను సత్తా చాటి లెక్కలేనంత అభిమానులని సంపాదించిన నీనా గుప్తా 1977 లో అమలన్ అనే ఆయన్ని పెళ్లి చేసుకోగా, వన్ ఇయర్ కే ఆ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ విప్ రిచర్డ్స్ తో రిలేషన్ లో ఉంది. ఆ ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే మసభ గుప్తా అనే అమ్మాయికి జన్మని ఇచ్చారు. మసభ గుప్తా ఇప్పుడు నటితో పాటు ఫ్యాషన్ డిజైనర్. 2008 లో వివేక్ మెహ్రా ని నీనా గుప్తా రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం నీనా గుప్తా ప్రధాన క్యారక్టర్ లో తెరకెక్కిన వద్ పార్ట్ 2 ఈ నెల 6 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
Feb 09, 2026
Rajpal yadav: లొంగిపోయిన అగ్ర కమెడియన్.. తీహార్ జైలుకి తరలింపు
-రాజ్ పాల్ యాదవ్ చేసిన నేరం ఏంటి! -ఎందుకు తీహార్ జైలులో లొంగిపోయాడు -అసలు కేసు ఏంటి! -ఎప్పటినుచి నడుస్తుంది అభిమానులు, మూవీ లవర్స్ తరచు తమ నోటి నుంచి హీరోలు చెప్పిన డైలాగ్స్ నే కాదు. కమెడియన్ చెప్పిన డైలాగ్స్ ని హమ్ చేస్తుంటారు. కాకపోతే ఏ కొంత మంది కమెడియన్స్ కో ఆ అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టాన్ని దక్కించుకున్న స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్. తన నోటి నుంచి వచ్చిన ఎన్నో డైలాగులు ఇండియన్ సినిమా మూవీ లవర్స్ ని ఉర్రుతలూగించాయి. అలాంటి రాజ్ పాల్ యాదవ్ ఇప్పుడు తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు దారి తీసిన కారణాలని చూద్దాం. మురళి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దగ్గర రాజ్ పాల్ యాదవ్, అయన సతీమణి కొంత డబ్బు అప్పు తీసుకున్నారు. తీసుకున్న డబ్బులకి చెక్కులు ఇచ్చారు. కానీ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో మురళి ప్రాజెక్ట్స్ ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్ట్ ని ఆశ్రయించగా సదరు కోర్ట్ రాజ్ పాల్ దంపతులని దోషులుగా తేల్చి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు ని సవాలు చేస్తూ రాజ్ పాల్ ఢిల్లీ హైకోర్టు ని సంప్రదిస్తే రాజ్ పాల్ డబ్బు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో ఇరువురు రాజీపడాలని సూచించింది. కానీ రాజ్ పాల్ మాత్రం డబ్బు చెల్లించలేదు. ఈ కేసులోనే రీసెంట్ గా ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం రాజ్ పాల్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయాడు.2018 వ సంవత్సరం నుంచి సదరు కేసు నడుస్తూ ఉండటం గమనార్హం. Also read: sri chidambaram garu: శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ 1999 లో సినీ రంగ ప్రవేశం చేసిన రాజ్ పాల్ ఇప్పటి వరకు సుమారు 120 సినిమాల వరకు చేసాడు. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో భూత్ బంగ్లా, వెల్ కమ్ టూ ది జంగిల్ వంటి చిత్రాలు ఉన్నాయి. రచయితగా, దర్శకుడు గా కూడా తన సత్తా చాటాడు. రవితేజ, సురేందర్ రెడ్డి, కళ్యాణ్ రామ్ ల కిక్ పార్ట్ 2 లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో కిక్ ని ఇచ్చాడు.
Feb 06, 2026
Epstein Files: ఎప్ స్టీన్ కుంభకోణంలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు!
-వరల్డ్ వైడ్ గా హీట్ ని కలిగిస్తున్న ఎప్ స్టీన్ -ఎప్ స్టీన్ ఏం చేసేవాడు -ఫైల్స్ లో ఉన్న పేర్లు ఎవరివి - అసలు అవన్నీ నిజాలేనా! ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఉహించెదరో... ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు... ఎక్కడికి నీ పయనం.. అనే ఈ మూడు సాంగ్స్ వినాలంటే సోషల్ మీడియాని సంప్రదించాల్సిందే. కానీ ఇప్పుడు సోషల్ మీడియానే ఈ మూడు సాంగ్స్ ని పాడుకోవాల్సిన పరిస్థితి. ఆ అవకాశం ఎప్ స్టీన్ ఫైల్స్(Epstein Files)ద్వారా రావడమే కాకుండా ఆ సంస్థ మరిన్ని రోజుల్లో ఎవరెవరి పేర్లు బయటపెట్టి కాస్తో కూస్తో ఉన్న తన పరువుని బజారున వేస్తుందేమో అని సోషల్ మీడియా దిగులుతో ఉంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం..ప్రస్తుతం వరల్డ్ మొత్తాన్ని హీట్ ఎక్కిస్తున్న మ్యాటర్. ఇప్పటికే ఊహించడానికి కూడా అవకాశం లేని ప్రముఖుల పేర్లు బయటకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినీ సెలబ్రటీస్ పేర్లు ఉన్నాయనే న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఎప్ స్టీన్ ఏర్పాటు చేసిన విందుకి కొంత మంది బాలీవుడ్ సెలబ్రటీస్ హాజరయ్యారని, ఈ మేరకు ఎప్ స్టీన్ కి మెయిల్స్ కూడా చేసారనే కథనాలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఎవరెవరి పేర్లు బయటకి వస్తాయో, సదరు కుంభకోణం మ్యాటర్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ప్రముఖ భారతీయ, అమెరికన్ రచయిత దీపక్ చోప్రా(Deepak Chopra)పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటకి వచ్చింది. ఈ విషయంపై ఆయన స్పందిస్తు ఎప్స్టీన్ తో నా పరిచయం చాలా సన్నితమైంది. వివాదాస్పద లైంగిక నేరాల ఘటనతో నాకు సంబంధం లేదని చెప్పాడు. also read: madhavan:మాధవన్ ని ఇంటి నుంచి గెంటేసిన భార్య.. మొన్ననే పద్మశ్రీ కూడా ప్రకటించారు ఎప్స్టీన్ అనే వ్యక్తి అమెరికాకి చెందిన కుబేరుడు తో పాటు లైంగిక నేరస్తుడు. 2002 ,2005 సంవత్సరాల మధ్య మైనర్ బాలికలని లైంగికంగా వేధించి పలువురు అమెరికా అగ్రనేతలు, సంపన్నులకి వారిని సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న ఈ కేసులో కోర్టుకు సమర్పించిన దాదాపు 30 లక్షల పేజీల పత్రాలని అమెరికా న్యాయశాఖ ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగానే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.ఎప్స్టీన్ పూర్తి పేరు జెఫ్రీ ఎప్స్టీన్. 2019 లోనే జైలు శిక్ష అనుభవిస్తుండగా సూసైడ్ చేసుకొని చనిపోయాడు.
Feb 05, 2026సినిమా బ్లాక్బస్టర్.. కానీ, హీరో నథింగ్.. విలనే హీరో అయ్యాడు!
ఏ కమర్షియల్ సినిమాలోనైనా ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. వారిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ ప్రధానంగా సినిమా నడుస్తుంది. సినిమా మొదట్లో విలన్ ఎన్ని ఎత్తులు వేసినా, హీరోని ఎంత ఇబ్బంది పెట్టినా ఫైనల్గా హీరో చేతుల్లో తన్నులు తినడమో, ఓడిపోవడమో జరుగుతుంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఫార్ములా మన సినిమాల్లో కనిపిస్తోంది. ఒకప్ప్పుడు సినిమాలో హీరోకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. హీరో తర్వాతే ఎవరైనా అన్నట్టుగా సినిమాలు ఉండేవి. అయితే ట్రెండ్ మారుతున్న కొద్దీ కథల్లో, హీరోల క్యారెక్టరైజేషన్లో, విలన్ క్యారెక్టరైజేషన్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక విధంగా విలన్కి ప్రాధాన్యం పెరిగింది. అతని పాత్రను పవర్ఫుల్గా చూపిస్తేనే హీరో మరింత ఎలివేట్ అవుతాడనే భావం మన డైరెక్టర్లలో బలంగా కనిపిస్తోంది. అలా చేసిన కొన్ని సినిమాలు సూపర్హిట్ అయ్యాయి కూడా. గత డిసెంబర్ 5న విడుదలైన ‘దురంధర్’ చిత్రం... పైన చెప్పిన విషయాలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరో. ఒక రస్టిక్ లుక్లో సీక్రెట్ ఏజెంట్ పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించి అందర్నీ ఆకట్టుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అతని కంటే విలన్గా నటించిన అక్షయ్ ఖన్నాకే పెర్ఫార్మెన్స్ పరంగా ఎక్కువ మార్కులు గమనార్హం. ఇప్ప్పుడిది చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ స్క్రీన్ ప్రజెన్స్, విలనిజం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, సోషల్ మీడియాలో అక్షయ్ ఖన్నానే హైలైట్ చేస్తున్నారు. ‘దురంధర్’ చిత్రానికి వస్తున్న ఈ ఫీడ్ బ్యాక్ చూస్తుంటే ఒక సినిమా హిట్ అయినా, బ్లాక్బస్టర్ అయినా హీరో ఒక్కడినే హైలైట్ చెయ్యడం లేదని, సినిమాలో హీరోతోపాటు ఇతర పాత్రల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని అర్థమవుతోంది. అవసరమైతే ఆ పాత్రలు పోషించిన వారిని హైలైట్ చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఒకప్ప్పుడు హీరోలు ఆ పాత్రలకే పరిమితమయ్యేవారు. విలన్గా నటిస్తే తమ ఇమేజ్కి భంగం వాటిల్లుతుందనే భయం వారిలో ఉండేది. అందుకే విలన్గా చేసే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసేవారు. ఇప్ప్పుడు ట్రెండ్ మారింది. విలన్గా చేసినంత మాత్రాన ఒరిగే నష్టం ఏమీ లేదని గ్రహిస్తున్నారు హీరోలు. అందుకే ఇతర భాషల్లో విలన్గా నటించే అవకాశం వస్తే సంతోషంగా ఒప్ప్పుకుంటున్నారు. ఇటీవలి కాలంలో విలన్స్గా నటిస్తున్న హీరోల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కథ, అందులోని తమ క్యారెక్టర్ నచ్చితే అది విలన్ క్యారెక్టర్ అయినా, నెగెటివ్ షేడ్స్ ఉన్నా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఓటీటీలు, పాన్ ఇండియా మూవీస్ బాగా పెరిగిపోవడంతో ఇమేజ్ కంటే కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు హీరోలు. స్టార్ ఇమేజ్ వల్లే సినిమాలు సక్సెస్ అవుతాయనే మాటకు ఇప్ప్పుడు కాలం చెల్లింది. కంటెంట్, క్యారెక్టరైజేషన్, ఏ పాత్ర తీరు ఎలా ఉంది, ఆ పాత్రల్లో నటీనటులు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు అనేదే ప్రధానంగా ప్రేక్షకులు చూస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఇమేజ్ లేని హీరో చేసినా ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
Feb 02, 2026
'యానిమల్ పార్క్' నుంచి బిగ్ అప్డేట్.. మరి 'స్పిరిట్' పరిస్థితి ఏంటి?
రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ ఫిల్మ్ 'యానిమల్'(Animal). రూ.200 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. 2023 డిసెంబర్ లో విడుదలై వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం సాధించింది. దీంతో 'యానిమల్'కి సీక్వెల్ గా రానున్న 'యానిమల్ పార్క్' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు రణ్బీర్ కపూర్. (Animal Park) 'యానిమల్' వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు 'యానిమల్ పార్క్' పట్టాలెక్కలేదు. దానికి కారణం రణ్బీర్, సందీప్ రెడ్డి ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటమే. రణ్బీర్ 'లవ్ అండ్ వార్', 'రామాయణ' సినిమాలు చేస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్(Prabhas)తో 'స్పిరిట్'(Spirit) చేస్తున్నాడు. 'స్పిరిట్' పూర్తయ్యాక, ఆరు నెలల విరామం తర్వాత 'యానిమల్ పార్క్' షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని తాజాగా రణ్బీర్ స్పష్టం చేశాడు. "ప్రస్తుతం సందీప్ మరో సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక 2027లో మా సినిమా మొదలవుతుంది. యానిమల్ ను మూడు భాగాలుగా తెరకెక్కించాలి అనేది దర్శకుడి ఆలోచన. రెండో భాగంగా 'యానిమల్ పార్క్' రానుంది. హీరోగా, విలన్ గా రెండు పాత్రలూ నేనే పోషిస్తుండటంతో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిగా ఉన్నాను." అని రణ్బీర్ చెప్పుకొచ్చాడు.
Jan 27, 2026
Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే
-సెల్యులాయిడ్ పై బోర్డర్ 2 హవా -ఫస్ట్ డే రికార్డుల మోత -ధురంధర్ అవుట్ గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. బాలీవుడ్ సినీ ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం బోర్డర్ 2 నిన్న వరల్డ్ వైడ్ గా 41 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ధురంధర్ వరల్డ్ వైడ్ గా 41 . 5 కోట్ల గ్రాస్ ని సాధించింది. కానీ ఇండియా వైడ్ గా చూసుకుంటే దురంధర్ తొలి రోజు 28 .60 కోట్లు నెట్ రాబట్టగా, బోర్డర్ 2 30 కోట్ల నెట్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ధురంధర్ ని బీట్ చేసినట్లయింది. మరి ముందు ముందు ధురంధర్ రికార్డులని బోర్డర్ 2 ఒక మూలాన కుర్చోపెడుతుందేమో చూడాలి. నిన్న 23 వ తారీకుతో యాభై రోజుల్ని పూర్తి చేసుకున్న ధురంధర్ ఇప్పటి వరకు 1300 కోట్ల వరకు రాబట్టింది. Also read: ఛాంపియన్ ఓటిటి డేట్ ఇదే 1971 వ సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలోని లాంగేవాలాలో ఉన్న సరిహద్దు విషయం దగ్గర మన దేశానికి, పాకిస్థాన్ కి మధ్య యుద్ధం జరిగింది. కేవలం 120 మంది మన సైనికులు పాకిస్తాన్ భారీ ట్యాంకుల దళాన్ని రాత్రంతా ఎలా ఎదుర్కొన్నారనేదే బోర్డర్ కథ. 'తెల్లవారుజామున భారత వైమానిక దళం వచ్చి పాకిస్తాన్ ట్యాంకులని ధ్వంసం చేసే వరకు మన సైనికులు చేసిన పోరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది'. ఇప్పుడు బోర్డర్ 2 లో పాకిస్థాన్ కి మనకి మరో కీలకమైన సరిహద్దు పోరాటాన్ని చూపించారు. అనురాగ్ సింగ్(Anurag Singh)దర్శకుడు కాగా టి సిరీస్ నిర్మించింది. జాన్ స్టీవార్ట్ మ్యూజిక్
Jan 24, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



