English | Telugu

అనసూయను టార్గెట్ చేసిన రష్మీ...

రష్మీతో చిట్ చాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆడియన్స్ కానీ ఫాన్స్ కానీ రష్మీ-సుధీర్ జోడిని బాగా ఇష్టపడతారు. కానీ ఈ చిట్ చాట్ లో మాత్రం రష్మీ సుధీర్ ప్రస్తావన తేకుండా కాన్వెర్జేషన్ అంతా ప్రదీప్, అనసూయ గురించే మాట్లాడింది. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ చేయడం కోసమే అనసూయను టార్గెట్ చేసి పంపేశారని అంటున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని అడిగేసరికి "అలా చేయలేదు. ఆమె తన ఫిలిమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పారు కూడా. ఎవరి ఎవరినో టార్గెట్ చేసి పంపేయడానికి ఇదేమన్నా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దమా" అని కామెడీ ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఇంకొన్ని ప్రశ్నలకు ఇలా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది "సినిమాల్లో నాకు మంచి రోల్స్ రాకపోవడానికి కారణం లక్ లేకపోవడం.

అనసూయ చేతులు నొక్కుతూ.. కోరిక బయటపెట్టిన శేఖర్ మాస్టర్

​కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో మాములుగా మాట్లాడినా చాలు అవి బూతులైపోతున్నాయి. ఈ వారం సెమి ఫినాలేకి దగ్గరయింది ఈ షో. ఐతే ఇందులో శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. అది శేఖర్ మాస్టర్ చాలా కరెక్ట్ గా పూర్తి చేసి విన్ అయ్యాడు. అనసూయ ఓడిపోయింది. ఐతే శేఖర్ మాష్టర్ బాధపడుతూ నిన్నే గెలిపిద్దామనుకున్నా అనసూయ అనేసరికి పర్లేదు మాష్టర్ బాగా ఆడారు అని షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు ఎలా ఉన్నాయి మాష్టర్ అని రొమాంటిక్ గా అడిగింది అనసూయ. దానికి శేఖర్ మాష్టర్ వదలబుద్ది కావడం లేదు అని చెప్పేసరికి అందరూ అరిచారు. తర్వాత మళ్ళీ అనసూయ "నా కోసమో ఎవరి కోసమో కాదు ప్రేరణ అటొస్తే టఫ్ కాంపిటీషన్ బాగుంటుందేమో అని అనుకుంటున్నా అని చెప్పింది. సరే మరి నేను ఏది అడిగితె అది ఇస్తావా నువ్వు ..అది కూడా బయటకు చెప్పను చెవిలో చెప్తాను" అని శేఖర్ మాష్టర్ అన్నాడు .

Karthika Deepam2 : నా కూతురు కోసం వచ్చాను.. పారిజాతానికి షాకిచ్చిన కొడుకు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో.... జ్యోత్స్న దీప రూమ్ కి తాళం వేస్తుంది. అలా ఎందుకు వేస్తున్నావని సుమిత్ర అడుగుతుంది. దీపని తీసుకొని‌ బావ రెస్టారెంట్ కి వెళ్ళాడని జ్యోత్స్న అనగానే.. నేనే శౌర్యకి ఆకలిగా ఉందంటే తీసుకొని వెళ్ళమన్నానని సుమిత్ర అంటుంది. అంటావ్ ఎటైనా సరదాగా కూడా తిరిగి రమ్మని బావని పంపిస్తావ్ అని జ్యోత్స్న అనగానే..  తనని కొట్టడానికి చెయ్ ఎత్తుతుంది సుమిత్ర. అప్పుడే దీప రావడం చూసి ఆగిపోతుంది. ఇదిలా తయారవ్వడానికి కారణం మీరే అంటు పారిజాతాన్ని సుమిత్ర తిడుతుంది.

Guppedantha Manasu : ఎండీగా రిషి.. మరోసారి శైలేంద్రని ఫూల్ చేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1155 లో ... ఫణీంద్రకి దేవయాని ఫోన్ చేసి.. మీటింగ్ లో ఏం జరుగుతుంది? ఎవరు ఎండీగా నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఫణీంద్ర అంటాడు. శైలేంద్ర ఏం చేస్తున్నాడని దేవయాని అడుగగా.. వాడు ఇక్కడ లేడు.. ఎక్కడ ఏ రాచకార్యాలు వెలగపెడుతున్నాడో వాడికే ఫోన్ చేసి కనుక్కోమని ఫణీంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. నేను అనుకున్నదే కరెక్ట్.. శైలేంద్ర ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాడని దేవయాని అనుకుంటుంది. వెంటనే తన రూమ్ లోకి వచ్చి మనుకి వసుధార రాసిన లెటర్ ని ఫోటో తీసి శైలేంద్రకి పంపిస్తుంది.

Brahmamudi : రాజభోగాలు అనుభవించాల్సింది నా కొడుకే.. ధాన్యలక్ష్మి చేసిన రభస!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -490 లో... కళ్యాణ్, అప్పులని తీసుకొని రాకుండా రాజ్ ఒక్కడే వస్తాడు. దాంతో ఏమైంది రానని చెప్పాడా? ఎందుకు రాను అన్నాడని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అప్పుని మా అమ్మ కోడలుగా ఒప్పుకుందా అని అడిగాడు. నాకు పిన్ని అ విషయం గురించి ఏం చెప్పలేదు.. నేను కళ్యాణ్ కి ఏం చెప్పలేదు.. అప్పుని కోడలుగా ఒప్పుకొని తనే స్వయంగా వచ్చి తీసుకొని వెళ్తే వస్తానని కళ్యాణ్ అన్నాడని రాజ్ చెప్పగానే.. అంటే ధాన్యలక్ష్మి వెళ్లి అప్పు కాళ్ళు పట్టుకొని రా మహాలక్ష్మి అంటూ పిలవాలా అని రుద్రాణి అంటుంది.

గుప్పెడంత మనసు..పార్ట్ 2 త్వరలో..

బుల్లితెర మీద కార్తీక దీపం ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత గుప్పెడంత మనసు కూడా అదే రేంజ్ మంచి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ అలా తన వైపు తిప్పేసుకుంది. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ సీరియల్ ని ముగించేస్తున్నారు సీరియల్ మేకర్స్. దీంతో ఆడియన్స్ మాత్రం బాగా ఫీలవుతున్నారు. ఈ టీమ్ మొత్తం వీడియోస్ ని ఫొటోస్ ని షేర్ చేయడం అలాగే కట్ చేసి తినిపించుకోవడం చూసాక ఈ సీరియల్ ఎండ్ ఐపోతోంది అని నమ్మారు ఆడియన్స్. ఇక ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు. కార్తీక దీపం ఎలా ఐతే పార్ట్ 2 తో వచ్చిందో అలాగే గుప్పెడంత మనసు కూడా పార్ట్ 2 తో రావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సీరియల్ ఫాన్స్.. "ప్లీజ్ డైరెక్టర్ గుప్పెడంత మనసు పార్ట్  2 రావాలి. హీరొ గోల్ , హీరోయిన్ గోల్  చూపించకుండానే ఆపేస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మీద మాకు సీరియల్ కావాలి. కేక్ కటింగ్ టైములో మీరు అన్నారు కదా పార్ట్  2 చేద్దాం అని. ఆ మాట నిలబెట్టుకోండి.  

Eto Vellipoyindhi Manasu : కొడుకు బర్త్ డే వేడుకల్లో సవతి తల్లి శ్రీలత ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -176 లో..... సీతాకాంత్ కంపెనీ షేర్ డైరెక్టర్స్ వేరొక కంపెనీకి షేర్ అమ్ముకుంటుంటే.. వద్దని సీతాకాంత్ చెప్పి.. సందీప్ ని చైర్మన్ ని చేస్తానని సంతకం చేయబోతుంటాడు. అప్పుడే నందిని పిఏ వచ్చి సంతకం పెట్టకండి.. మా కంపెనీ మీ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉందని చెప్పగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత పెద్ద కంపెనీ ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతుంటే మేమ్ వేరే దగ్గరికి ఎందుకు వెళ్తాము.. ఇక్కడే ఉంటామని బోర్డు మెంబర్స్ అంటారు.

Guppedantha Manasu: నీ తండ్రి ఎవరో కాదు, మా బాబాయ్ మహేంద్రే.. షాక్ లో‌ మను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-1154లో..  తనని కిడ్నాప్ చేసింది మనునే అని శైలేంద్ర షాక్ అవుతాడు.  ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావని శైలేంద్ర అడుగగా.. మను మౌనంగా ఉంటాడు. సరే.. గతంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టాను.. నిన్ను బాధపెట్టాను.. దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవడం కరెక్టే కానీ.. దానికి ఇది సరైన సమయం కాదని శైలేంద్ర అంటాడు. నాకు ఇదే సరైన సమయమని మను అంటాడు. కరెక్ట్ టైమ్ చూసి దెబ్బ కొట్టాడు వెధవ అని శైలేంద్ర మనసులో తిట్టుకుంటూ.. పైకి మాత్రం మన వదిలేయమని మనుని బ్రతిమిలాడతాడు. 

Brahmamudi: బంటీతో కావ్య చెప్పిన ప్లాన్ అదేనా.. అప్పు, కళ్యాణ్ లు ఇంటికి వస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -488 లో.....కళ్యాణ్ , అప్పులు గుడిలో ప్రసాదం తింటూ ఉంటారు. నన్ను నమ్ముకొని వస్తే నిన్ను ఇక్కడ కూర్చోపెట్టానని కళ్యాణ్ బాధపడతాడు. కోట్ల ఆస్తులు నాకోసం వదులుకొని వచ్చావ్.. నన్ను ప్రేమించినదుకు నీ బతుకు ఇలా అయిందని నేను కూడా బాధపడాలి కదా అని అప్పు అంటుంది. నిన్ను వదులుకోవడం కన్నా, ఆస్తులు వదులుకోవడం కష్టమేమీ కాదని కళ్యాణ్ అంటాడు. నీ కోసం నేనే ఏదో ఒకటి చెయ్యాలని అప్పు అనగానే.. ఇప్పుడు నేను నీ భర్తని.. నేనే ఆ మాట అనాలని కళ్యాణ్ అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు....

Karthika Deepam2 : కథలోకి దాస్.. కీలకంగా మారిన కార్తీక దీపం ఎపిసోడ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -123 లో.... కోర్టులో అమ్మతోనే ఉంటానని శౌర్య చెప్పగానే.. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. శౌర్యని దీప హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఈ రోజు ఇచ్చిన తీర్పు మనసుకి నచ్చిందని జడ్జ్ అంటాడు. ఆ తర్వాత అనసూయ వెళ్లిపోతుంటే దీప వెళ్లి.. తన కాళ్ళపై పడి థాంక్స్ అని చెప్తుంది. నాకు తల్లి ఉంటే కూడా ఇలా సాయం చేసేది కాదేమోనని దీప అంటుంది. మీ కొడుకు కోడలు ఇంట్లోకి రానివ్వరు.. నా దగ్గరకి రండి ఊర్లో ఉన్నట్టే ఇక్కడే ఉందామని దీప అనగానే.. లేదు గాని కూతురుని తీసుకొని వెళ్ళమని చెప్పి అనసూయ వెళ్ళిపోతుంది...