ఉండ‌వ‌ల్లీ... జ‌రిగేవి చెప్ప‌రాదా!

ఎవ‌రు ఎంత ప్ర‌య‌త్నించినా  కాని ప‌ని ఒక్కోసారి వూహించ‌ని దారి క‌నిపించి ల‌క్ష్యాన్ని సాధించే వీలు క‌ల్పిస్తుంది. రాష్ట్ర హోదా సాధించుకోవాల‌ని  ఎంతగా ప్ర‌య‌త్నస్తున్నా కేంద్ర‌ప్ర‌భుత్వం  అందుకు వీలు ప‌డద‌నే సంకేతాలే ఇస్తోంది. అది త‌ప్ప వేరేది ఏద‌యినా మాట్లాడుకుందామ‌నే కేంద్రంలోనివారు అంటున్నా రు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను  దృష్టిలో పెట్టుకుని అనేకం అడ‌గాల‌ని వెళ్లిన  ప్ర‌తీసారి అక్కడేమి జ‌రిగిందీ ఎవ‌రికీ తెలియ‌కుండానే పోతోంది. మొన్న‌టికి మొన్న కూడా సేమ్ సీన్ రిపీట్‌. అయితే ఇప్పుడు హ‌ఠాత్తుగా ఒక చిన్న అవ‌కాశం వుంద‌ని మాజీఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సూచించ‌డం గ‌మనార్హం. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బిజెపీ అభ్య‌ర్ధి విష‌యంలో మ‌ద్ద‌తునీయ‌కుండా వెన‌క‌డుగు వేయాలిట‌.  అస‌లే రాష్ట్ర ప‌రిస్థితులు బాగా లేవు. పార్టీ వ‌ర్గాల్లోనూ కుమ్ములాట‌లు, అసంతృప్తులూ ఒక‌టొక‌టీ బ‌య‌ట ప‌డుతున్నాయి. ప్ర‌త్యేక హోదా మాత్ర‌మే కాదు రాష్ట్రానికి రావ‌ల‌సిన నిధులు విష‌యంలోనూ కేంద్రాన్ని అడ‌గ‌ద‌ల‌చుకున్న విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి త‌ట‌ప‌టాయిస్తున్నాడు. ఇక్క‌డ గ‌ట్టిగా మాట్లాడు తున్న‌వాడు వూరు దాట‌గానే కేసుల భ‌యం త‌ల‌కు చుట్టుకుంటుండ‌టంతో అడ‌గ‌లేక‌పోతున్నాడ‌నేది సుస్ప‌ష్టం. ఈ ప‌రిస్థితుల్లో అస‌లు బిజెపిని ఎదిరించి నిల‌వ‌గ‌లిగే  స‌త్తా జ‌గ‌న్‌కి ఎక్క డ‌?  అందువ‌ల్ల ఉండవ‌ల్లిగారి మ‌న‌సులో మాటో, పోనీ జ‌గ‌న్‌కి ఇస్తున్న చిన్న‌పాటి సూచ‌నో అంత‌గా పార‌క పోవ‌చ్చు.   ఏది ఎలా వున్నా ఒక‌రే ల‌బ్ధి పొందుతార‌ట‌! ఆ  ఒక్క‌రి ప్ర‌భావం అలా వుందిట‌! ఎవ‌రా ఒక్క‌రూ ఏమిటా లాభం? అనేదానికి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌వివ‌ర‌ణ ఇచ్చేరు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎవరు గెలిచినా ల‌బ్ధిపొందేది మాత్రం బిజెపీయేన‌ని విలేక‌రుల‌తో అన్నారు. దేశంలో మోదీ విప‌క్షాలు లేకుండా చేసుకోవ‌డానికి  శ‌త విధాలుగా  కృషిచేస్తున్నారు. ఎవ‌రు గెలిచినా బిజెపీతో స‌ఖ్య‌త‌గానే వుండాల్సి వ‌స్తుం ది.  బిజెపి అంత‌గా అన్ని పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌రిచింది.  గ‌తంలో టిడీపీ కేంద్ర వ‌ద్ద సాగిల‌ప‌డింద‌ని కామెంట్ చేసేరు. ఇపు డు కేసుల భ‌యంతో జ‌గ‌న్ చేస్తున్న‌దీ అదే.  తెలంగాణా మాట ఎలా వున్నా ఆం ధ్రాలో బిజెపి బ‌లం పుంజుకుంద‌నే భ్ర‌మ‌లో బిజెపీ వ‌ర్గాలు తెగ ప్ర‌చారం చేస్తున్నాయి. ఎవ‌ర‌యినా త‌మ ను దాటిపోవ‌డం దుర్ల‌భం అని ప్ర‌చారం చేసుకుంటున్నారు బిజెపి నాయ‌కులు. ఎవ‌ర‌యినా త‌మ‌తో క‌ల‌వ‌వ‌ల‌సిందే అంటున్నారేగాని ఎవ‌రూ క‌ల‌వ‌క‌పోయినా తాము తెలుగు రాష్ట్రాల్లో దున్నేస్తామ‌ని అధికా ర ప‌గ్గాలు ప‌డ‌తామ‌ని బిజెపీ కూడా చెప్ప‌లేక‌పోతోంది. కేవ‌లం చ‌ర్చ‌ల్లో గ‌ట్టిగా అరిచి చెప్ప‌డం, విపక్షాల మీద అర‌వ‌డం త‌ప్ప వాస్త‌వానికి అది జ‌రిగే ప‌నికాదు.

అంతులేని వ్య‌ర్ధం!

వ్య‌ర్ధం ఏద‌యినా భార‌మే. ఇంట్లో సామాన‌యినా, ఉప‌యోగించ‌కుండా  దాచిన మందుల‌యినా!  కోవిడ్ భూతం ప‌ట్టుకుని పీడించినంత కాలం అతి జాగ్ర‌త్త‌లు తీసుకున్న ప్ర‌భుత్వాల‌కు, మందుల త‌యారీ కంపె నీల‌కు ఇప్పుడు అతిగా మిగిలిపోయిన వాక్సిన్ మందులతో ఏమీ చేయాలో తోచ‌డం లేదు. మొద‌టి వేవ్ సంద‌ర్భంలో అంద‌రం కంగారు ప‌డ్డాం. రెండ‌వ వేవ్ స‌మ‌యానికి వాక్సిన్ వేయించుకోవ‌డం లో ప్ర‌జలు ఎంతో ఆస‌క్తి చూపారు. మందుల కంపెనీలు అందుకు అవ‌స‌ర‌మ‌యిన వాక్సిన్ డోసులు భారీ ఎత్తున ఉత్ప త్తి చేసి అందుబాటులో వుంచాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌క‌చ‌కా వాక్సినేష‌న్  ఎంత  అవ‌ర‌మ‌న్నది ప్ర‌చారం చేసి అంద‌రికీ అందుబాటులోకి తెచ్చాయి. ఆరోగ్య‌శాఖ‌, ఆస్ప‌త్రులూ, డాక్ట‌ర్లూ ఎంతో అద్బుతంగా  సేవ‌లు అందించి అంద‌రినీ ఆదుకున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే వుంది.  ఆ త‌ర్వాత అంద‌రికీ  కోవిడ్ భ‌యం పోయి ప్ర‌శాంతంగా బ‌తక‌వ‌చ్చు అనే  ధైర్యం వ‌చ్చేసింది. కానీ డాక్ట‌ర్లు మాత్రం ఇంకొన్నాళ్లు జాగ్ర‌త్త గానే వుండాల‌న్న హెచ్చ‌రిక‌ల‌ను ఎవ్వ‌రూ అంత‌గా ప‌ట్టించుకోలేదు. మాస్క్ కూడా తీసి ప‌డేసి జ‌నాలు తిరిగేస్తున్నారు. నాలుగో వేవ్‌ మాట‌లు జ‌నా ల‌కు ప‌ట్టే స్థితి లేదు.  ఇప్ప‌టికే  చాలా కాలం వుద్యోగాల‌కు, ప‌నుల‌కు దూర‌మ‌యి ఆర్ధికంగా కుదేల‌వుతున్న కుటుంబాలు, సంస్థ‌లూ అన్నీ అంద‌రూ కూడా  మొన్న‌టి దాకా తీసుకున్న రెండు డోసుల బ‌లం వుండ‌నే వుంది ఇక ఏదీ త‌మ‌కు ప్రాణ‌హాని క‌లిగిం చద‌నే  ధైర్యంతో బ‌య‌ట‌కి రావ‌డం, ప‌నులు చేసుకోవ డం జ‌రుగుతోంది.  కానీ ముంద‌స్తు జాగ్ర‌త్త‌గానో,  మూడో విడ‌త‌కు అందుబాటులో వుండాల‌న్న జాగ్ర‌త్త‌తోనో కోవీషీల్డ్‌, కోవాక్సి న్లు  కంపెనీలు పెద్ద సంఖ్య‌లోనే ఉత్ప‌త్తులు చేసి జాగ్ర‌త్త‌ప‌రిచాయి. కానీ వాటి  లైఫ్ టైమ్  ముగిసిపోయిం ది. వాటిని అర్జంట్‌గా  ఉప‌యోగించే అవ‌స‌రం ఇపుడు అంత‌గా లేదు. అయినా ప్ర‌జ‌లు ప్రికాషనరీ డోస్ వేసుకోవ‌డ‌దానికి ఇక ఆస‌క్తీ చూప‌డం లేదు.  అయితే  గ‌తేడాది చివ‌ర్లో ఉత్ప‌త్తి చేసి భ‌ద్ర‌ప‌రిచిన‌వి భారం గానే మారాయి. ఎందుకంటే, వాటి ఎక్స్‌పైరీ డేట్ అయిపో యింది. దాన్ని మ‌రికొంత‌కాలం పొడ‌గించే వీలుందే మో చూడ‌మ‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి. అది ఎంత‌వ‌ర‌కూ సాధ్య‌మ‌న్న‌ది ఆయా కంపెనీ లు, సంస్థలు  ప్ర‌భుత్వానికి స‌మాధానం చెప్పాలి. ఇలా వ్యర్థంగా పారబోసే బదులు అందరికీ బూస్టర్ డోస్ ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయవచ్చు కదా అని పరిశీలకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బూస్టర్ డోస్ ను సీనియర్ సిటిజన్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మిగిలిన వారంతా ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి ఉంది. 

ఏపీలో బీజేపీ బలం ఉండవల్లికే కనిపించిందా?

రాజమహేంద్రవరం  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఏపీలో బీజేపీ అత్యంత బలమైన పార్టీగా కనిపిస్తోంది. తమకంత బలం ఉందని బీజేపీ వాళ్లే అనుకోవడం లేదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ కాగానే ఒక్కసారిగా ఏపీలో బీజేపీ విశ్వరూప సందర్శనం జరిగిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడినా కవర్ చేసే మీడియా ఉండటం, ఆయన ఒక మేధావి అనే భ్రమను ప్రజలలో కల్పించే కొందరు పొలిటీషియన్లు ఉండటం కూడా ఉండవల్లికి కలిసొచ్చి ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందనుకుంటున్నారు. ఏపీలో బీజేపీ బలం ఏమిటో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు గమనిస్తే చాలు ఆ పార్టీ బలం ఎంతన్నది తెలుసుకోవడానికి. ప్రత్యేకించి ఆ పార్టీని భుజాన వేసుకుని.. కేసీఆర్ కు భుజకీర్తులు అద్దడానికి ఉండవల్లి ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది అర్ధం చేసుకోలేనంత అమాయకులు కాదు జనం. కేసీఆర్ ఒక్కరు మాత్రమే దేశంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనగలిగే నాయకుడని ఏపీ ప్రజలకు చెప్పడానికి ఉండవల్లి తెగ తాపత్రేయపడుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో మిత్రపక్షంగా ఉండి కూడా ఆ పార్టీని గట్టిగా ఎదుర్కొన్న విషయం.. రాజకీయ పండితుడైన ఉండవల్లి ఎలా, ఎందుకు మరచిపోయారో ఆయనే చెప్పాలి. అంతకంటే ముందు గుజరాత్ లో అల్లర్ల సమయంలో మోడీని సీఎంగా తొలగించాలన్న డిమాండ్ తో ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన సంగతి ఉండవల్లికి తెలియదా.  విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరాతి కి అంకురార్పణ జరిగిన సమయంలో ఉండవల్లి కుల విద్వేషాలను రెచ్చెగొట్టే పుస్తకాల ఆవిష్కరణలో యమా బిజీగా ఉన్న సంగతి ఏపీ జనం మరచిపోతారా? మరచిపోగలరా? తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడికి అనకూలంగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ గొంతెత్తే ఉండవల్లి ఇప్పుడు కేసీఆర్ తో భేటీ అనంతరం ఏపీలో బీజేపీ బలాన్ని ఆకాసానికెత్తేస్తూ మాట్లాడిన మాటలు కూడా జగన్ కు ఏదో మేర మేలు చేకూర్చేందుకేనన్నది పరిశీలకుల విశ్లేషణ.   వాస్తవానికి ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉంది. అంతే కాదు 2019తో పోలిస్తే ఇప్పుడు మరింత బలోపేతమై టీఆర్ఎస్ కే సవాలు విసురుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఉండవల్లి ఏపీలో బీజేపీ బలం కనిపించింది. బీజేపీని ఎదుర్కొనగల ధీరత్వం  కేసీఆర్ కు మాత్రమే ఉందని పించింది. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏపీలో సానుకూలత తెచ్చి పెట్టేందుకు ఉండవల్లికి ఇంత తాపత్రయం ఎందుకు. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని చెబుతున్న వ్యక్తి  కేసీఆర్ ను భుజాన వేసుకుని మోయడమెందుకు? ఏపీలో జగన్ కు ఎన్ని కల వ్యూహాలు రచించి పెట్టే పీకే సమక్షంలో కేసీఆర్ తో భేటీ అయిన ఉండవల్లి వైఎస్ కుమారుడికి రాష్ట్రంలో రాజకీయ లబ్ధిచేకూర్చేందుకే కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  

జగన్ పాలనలో సాగు వెతలు.. కానరాని ఏరువాక సంబరాలు

‘విసిరిన బంతినల్లా ఓకే చేస్తే.. వెర్రోడే విన్నర్’ చందంగా ఉంది ఏపీలోని వైసీపీ సర్కార్ తీరు. ఒక్క ఛాన్స్ అంటూ పవర్ లోకి వచ్చిన సీఎం జగన్ తమ నెత్తినే భస్మాసుర హస్తం పెడుతున్నారనే విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ఖజానాలో కాసులు లేవు. విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు లేవు, సౌకర్యాలు లేవు. అభివృద్ధి లేదు..పాలన పట్ల, ప్రజా సమస్యల పట్ల వైసీపీ సర్కార్ కు అనుభవం లేదు. ఆపై మొండితనం.. అధికార పార్టీ నేతల తీరుతో జనం లబోదిబో. కరెంట్ లేదు.. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ మాట అంటుంచితే.. అసలు విద్యుత్తే లేని దుస్థితిలో ఏపీ కొట్టుమిట్టాడుతోంది. తద్వారా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో పంటలు సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ హయాంలో అన్నదాతలు కుదేలైపోయారు. సాగు వెతలతో ఏపీలో ఏరువాక సంబరాలే కానరావడం లేదు. గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పచ్చటి కోనసీమలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంటలకు నీరు లేక రైతులు, రోడ్లు లేక ప్రయాణికులు, విద్యుత్ లేక ప్రజలు, ఉపాధి లేక నిరుద్యోగులు, పని ఉన్నా జీతాలు వచ్చే పరిస్థితి లేక కార్మికులు, సరైన చదువుల్లేక విద్యార్థులు, వైద్యం అందక సామాన్యులు, అమ్మకాలు లేక వ్యాపారులు, ఉత్పత్తి లేక సంస్థలు.. ఇలా ఒకటేమిటి? ఏపీలో ఏ ఒక్క రంగాన్ని కదిలించినా కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితి నెలకొందంటున్నారు. పనుల నిర్వహణలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం, నిష్క్రియాపరత్వం కారణంగా ఏపీలోని పలు వర్గాల ప్రజలు నిరంతరం నలిగిపోతున్నారు. పూర్తయిన పాత ప్రాజెక్టు పనులకు బిల్లులు చెల్లించని దుస్థితి.. పైగా పనులకు టెండర్లు పిలుస్తాం.. పనిపూర్తి చేసేయండి.. కానీ బిల్లులు అడగొద్దని ఏపీ సర్కార్ చెబుతుంటే.. ఏ కాంట్రాక్టరైనా ఎందుకు ముందుకు వస్తారనే ప్రశ్న వస్తోంది. వాటర్ షెడ్ పనులకు నిధులు వెచ్చించడంలో ఏపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. దాంతో గడువులోగా ఏపీలో ప్రాజెక్టులేవీ పూర్తి కాని దుస్థితి నెలకొందంటున్నారు. ఇప్పటికే పూర్తి చేసిన పాత ప్రాజెక్టులకు వైసీపీ సర్కార్ 80 కోట్ల మేరకు బిల్లులు చెల్లించలేదట. దాంతో కొత్త ప్రాజెక్టులు  చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదట. దీంతో ఏపీలో వాటర్ షెడ్ పనులు ముసుగుతన్ని పడుకుంటున్నాయి. వర్షపునీటిని వడిసి పట్టి, భూగర్భజలాల్ని పెంచేందుకు 2009-10 నుంచి 2013-14 సంవత్సరాల మధ్య 373 వాటర్ షెడ్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసింది. వాటిలో కొన్నింటి పనులు బాగా ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు 2022 మార్చి నాటికి పూర్తయ్యాయి. అయితే.. అనేక గ్రామాల్లో పనులు పూర్తిచేసిన వాటర్ షెడ్ కమిటీలు వైసీపీ సర్కార్ తీరుతో బిల్లుల కోసం బిక్కమొహంతో చూడాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులతో వేసిన కమిటీలు చెక్ డ్యామ్ లు, ఊట చెరువుల, ఇతర పనులు చేయిస్తుంటారు. వీటికి పెట్టుబడి పెట్టి పనులు పూర్తిచేసిన వారంతా బిల్లులు రాక అవస్థల్లు పడుతున్నారు. దీంతో వాటర్ షెడ్ పనులు నీరుగారిపోతున్నాయి. సీఎం సొంత జిల్లాకు నీరు తీసుకెళ్లే సొరంగం పనులు నత్త నడకన సాగుతున్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం, కాంట్రాక్టర్ల అలసత్వం వల్లే క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదంటున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ను వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు 43.5 టీఎంసీలు తరలించి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని గత ఎన్నికలప్పుడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరడం లేదు. కాల్వల మరమ్మతుల టెండర్ లో బిల్లుల కోసం ఒత్తిడి తేవద్దని వైసీపీ సర్కార్ పెట్టిన నిబంధనలు రాష్ట్రం పరువు తీశాయన్న టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ ఈ సందర్భంలో ప్రస్తావించదగ్గ అంశం. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఏపీలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉంటోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ లెక్కలు చెబుతున్నారు. గత ఏప్రిల్ లో ఏపీలో 382 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు వచ్చిందట. విద్యుత్ డిమాండ్ కు తగినట్లు సప్లై లేకపోవడం.. విపరీతమైన పవర్ కట్ లతో రైతులు, సామాన్యుల్లో తీవ్ర అసహనం పెల్లుబుకుతోంది. ఏపీలోని చిన్న చెరువుల్లో ఏళ్ల తరబడి పూడికలు తీయలేదు. దీంతో ఆయా చెరువుల నీటి సామర్ధ్యం తగ్గిపోతోంది. తద్వారా ఆయకట్టు కూడా తగ్గిపోతోంది. వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన కోనసీమలోని 12 మండలాల రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలోనే క్రాప్ హాలిడే అంటున్నామని కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆవేదనగా చెబుతోంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. దాంతో పెట్టుబడి పెట్టిన సొమ్ములు చేతికి అందక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అన్నదాతలు సతమతం అయిపోతున్నారు. దీంతో సాగు చేసేందుకు పలువురు రైతులు విముఖత చూపుతున్నారు. అన్నపూర్ణగా పేరు పొందిన ఏపీలో సాగుబడి ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.

ఏపీలో ఆరోగ్య శ్రీకి తిలోదకాలు

జగన్ ప్రభుత్వం మరో పథకానికి తిలోదకాలిచ్చేసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేదవాడికి కార్పొరేట్ వైద్యం అంటూ ఘనంగా చాటుకుని ఆరంభించిన ఈ పథకానికి మూడేళ్ల కూడా పూర్తి కాకుండానే మూత పెట్టేస్తోంది జగన్ సర్కార్. ఫీజు రీయింబర్స్ మెంట్,  రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాల దారిలోనే ఆరోగ్య శ్రీ కూడా లబ్ధిదారులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా కొనసాగే పథకంగా మిగిలిపోనుంది. అదేలా గంటే.. ఇక నుంచి ఆరోగ్య శ్రీ సేవలకు సర్కార్ నేరుగా సొమ్ము చెల్లించదు. ఆ సొమ్మును రోగుల ఖాతాలకు జమ చేస్తుంది. ఆ తరువాత ఆ సొమ్ము ఆటో డెబిట్ ద్వారా ఆసుపత్రులకు చేరుతుంది అని ప్రభుత్వం చెబుతున్నది. అయితే పరిశీలకులు మాత్రం ఇది ఆరోగ్య శ్రీ పథకానికి చెల్లు చీటీ రాసేయడమేనని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద సొమ్మును కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారు. అయితే ఆ సొమ్మును నాలుగు విడతలుగా జమ చేస్తామన్న ప్రభుత్వం రెండు విడుతల తరువాత ఆపేయడంతో ఆ సొమ్మును విద్యార్థుల తల్లిదండ్రులే కాలేజీలకు చెల్లించాల్సి వస్తున్నది. అదే విధంగా రైతులకు ఉచిత కరెంటు పథకం కూడా. కనెక్షన్లకు మీటర్లు బిగించి..వచ్చిన బిల్లు సొమ్మును రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అలా చేయకపోవడంతో రైతులే విద్యుత్ బిల్లులు చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కూడా వాటి జాబితాలోకి చేరిపోనుంది. ఇలా చేయడం వల్ల పేదలకు వైద్యం దూరమయ్యే పరిస్థితి ఎదురుకావడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. పథకం కొనసాగుతున్నదని ప్రచారం చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదనీ, కానీ ఆ పథకం ప్రయోజనాలను లబ్ధిదారులకు దూరం చేసే విధానాలన ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం విషయంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ సొమ్ము ఖాతాలో వేయదు. ఫీజు చెల్లిస్తే తప్ప కాలేజీలలో మార్కులు, హాల్ టికెట్లు, టీసీలు ఇవ్వరు. దీంతో అప్పో సొప్పో చేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టాల్సి వస్తోంది. పేరుకే ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ అంటోంది కానీ వాస్తవంలో ఆ పథకానికి దాదాపు చెల్లు చీటీ ఇచ్చేసిన పరిస్థితి. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం పరిస్థితి కూడా అలాగే తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించిన సర్కార్..ఆ బిల్లుల సొమ్ము రైతుల ఖాతాలలో వేయడం లేదని పలు జిల్లాల రైతులు ఆరోపిస్తున్నారు. దాంతో చచ్చినట్లు తామే బిల్లులు చెల్లించాల్సి వస్తోందనీ, అలా చెల్లించకుంటే విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ పథకానికి కూడా ఆసుపత్రులకు కాకుండా నేరుగా రోగి ఖాతాకే సొమ్ము విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకువస్తోందనీ, దీని వల్ల ఈ పథకాన్ని నమ్ముకుని వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన రోగికి ప్రభుత్వం సొమ్ము చెల్లించకుంటే పరిస్థితి ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. ప్రస్తత విధానంలో ఆరోగ్యశ్రీ పథకంలో   ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించకుండా చికిత్స తీసుకోవచ్చు. బిల్లులు ప్రభుత్వం నేరుగా ఆస్పత్రులకు చెల్లిస్తుంది. అయితే ఆస్పత్రులు ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు చెల్లిస్తే అప్పుడే తీసుకోవాలి. దీంతో ప్రభుత్వం వందల కోట్ల బిల్లులు ఆస్పత్రులకు బకాయి పడింది.   బిల్లులు చెల్లించకపోతే వైద్యం ఆపేస్తామని ఆస్పత్రులు విస్పష్టంగా చెబుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి నేరుగా పేషంట్లకే సొమ్ము ఇస్తామని చెబుతున్నది. దీంతో  ఆస్పత్రి బిల్లుతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. ఆస్పత్రికి ప్రభుత్వం బకాయి పడదు. అయితే ఫీజు రీయింబర్స్ మెంట్ లా, ఉచిత విద్యుత్ బిల్లులకు చేసినట్లుగా ఆరోగ్య శ్రీ బిల్లులు సకాలంలో పేషెంట్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయకపోతే.. ఇతర నగదు బదిలీ సబ్సిడీల్లాగే చేస్తే పేదల పరిస్థితి ఏమిటి? ఆస్పత్రులకు కాకుండా ఆరోగ్య శ్రీ బిల్లులు రోగుల ఖాతాకే నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం ఈ పథకానికి తిలోదకాలిచ్చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఒక్కటొక్కటిగా సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నదనీ, ఇప్పుడు ఆరోగ్య శ్రీని కూడా నిలిపివేత పథకాల జాబితాలోకి చేర్చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

ఏపీలో 2019 నాటి సీన్ రిపీట్.. కేసీఆర్,ఉండవల్లి భేటీ రహస్యం ఇదేనా?

ఉండవల్లి అరుణ్ కుమార్.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర విభజన తరువాత నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. ఉండుండి ఒక్కసారి తన విలక్షణ, సంచలన విశ్లేషణలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీలో ఒక్క సారిగా తెరమీదకు వచ్చారు. కేసీఆర్ ఎందుకు పిలిచారు? ఉండవల్లి ఎందుకు వెళ్లారు? అన్న చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్ లో జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో మొదటి వరుసలో ఉన్న ఉండవల్లి.. రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తరువాత నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ తో భేటీ కావడమే ఒక సంచలనం అయితే.. విభజనను పూర్తిగా వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ పిలిపించుకుని మరీ చర్చించడం అంతకు మించిన సంచలనం. సరే ఇరువురి భేటీ అయిపోయింది. ఆ భేటీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా ఉన్నారు. అనూహ్య నిర్ణయాలు, వ్యూహాలకు పెట్టింది పేరైనా పీకే సమక్షంలో భిన్న ధృవాలు వంటి కేసీఆర్, ఉండవల్లిల భేటీ జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ప్రస్తుతం ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీపై పలు విశ్లేషణలు వస్తున్నాయి.  ప్రస్తతుం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు రెండూ కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయన్న అంచనాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ, ఏపీలో అధికారం చేపట్టాలని భావిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్రుల ఓట్లు కీలకం అని భావిస్తున్నారు. అలాగే ఏపీలో అధికారం కోసం అర్రులు చాస్తున్న పవన్ కల్యాణ్ కు గత ఎన్నికలలో పొరుగు రాష్ట్రం నుంచి వైసీపీ అధినేత జగన్ కు ఎలాంటి ‘సహకారం’ అందిందో అటువంటి సహకారం కోరుకుంటున్నారు. సో రోగీ వైద్యుడు సామెతలా ఇరువురి ఉద్దేశాలూ ఒకటే అయినా ఇరువురికీ సమన్వయం కుదిర్చే ఒక మీడియేటర్ అవసరం. సరిగ్గా ఆ మీడియేటర్ పాత్ర పోషించేందుకు ఉండవల్లి అయితే సరిగ్గా సరిపోతారని కేసీఆర్ భావించారు. అందుకే ప్రత్యేకంగా ఆయనను హైదరాబాద్ పిలిపించుకుని చర్చించారు. ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ కు కూడా ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ (పీకే) సమక్షంలో ఈ భేటీ జరిగింది. అంటే ఉండవల్లిని పరోక్షంగనో, ప్రత్యక్షంగానో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులను తెరాస వైపు ఆకర్షితులను చేయడానికి అదే సమయంలో ఏపీలో జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి.. తన రాజకీయ గురువు వైఎస్ కుమారుడు జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగపడేలా మౌల్డ్ చేయడానికే ఈ భేటీ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అయితే అప్పట్లో ఉండవల్లి ప్రత్యక్షంగా ఇలా బయట పడలేదు కానీ, పవన్ కల్యాణ్ తో భేటీల్లో కానీ, ఆయన  అప్పట్లో ఏర్పాటు చేసిన పలు మీడియా సమావేశాలలో కానీ తెలుగుదేశం, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు అనర్ధమన్న రీతిలోనే సాగాయి. సరే కారణాలేమైతేనేం నాడు తెలుగుదేశం, జనసేన పార్టీలు విడివిడిగా రంగంలోకి దిగాయి. ఫలితం తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనల మధ్య అవగాహన ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్న వేళ మరో సారి ఉండవల్లిని రంగంలోకి దింపడం ద్వారా ‘కాగల’ కార్యాన్ని సాధించాలని కేసీఆర్, పీకేల వ్యూహంలో భాగమే ఉండవల్లితో   భేటీ అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో కేవలం 7 శాతం ఓటు షేర్ ఉన్న పవన్ కల్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు తెలుగుదేశం  అంగీకరించే పరిస్థితి ఎటూ లేదు. ఇక ఏపీలో జనం మూడ్ వైసీసీకి వ్యతిరేకంగా ఉందన్నదీ ఇటీవలి పలు సర్వేలు తేటతెల్లం చేశాయి. ఈ పరిస్థితుల్లో ఓట్ల చీలిక ఒక్కటే రాష్ట్రంలో వైసీపీని గట్టెక్కిస్తుందన్నది కేసీఆర్, పీకేల వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. ఏపీలో తెలుగుదేశం ను అధికారానికి దూరం చేయడం ద్వారా కేసీఆర్ కు వచ్చే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమౌతుంది. అయితే తెలంగాణ అభివృద్ధిని ఘనంగా చాటుకోవాలంటే ఏపీలో వెనుకబాటు కొనసాగాలి. గత మూడేళ్లుగా ఏపీ విధానాల కారణంగా తెలంగాణ పాలన ఘనంగా, గొప్పగా ఉందని తెరాస సర్కార్ ప్రచారం చేసుకోగలిగింది. అంతకు ముందు అంటే 2014 నుంచి 2018 వరకూ తెలంగాణకు ఆ అవకాశం లేకపోయింది. మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ కంటే జీరోతో మొదలైన ఏపీ ప్రగతి గురించే నాడు దేశం మొత్తం మాట్లాడుకుంది. అందుకే ఏపీలో తెలుగుదేశం ను అధికారానికి దూరం చేయాలంటే పవన్ కల్యాణ్ ను ఎన్నికలలో ఒంటరిగా పోటీలో దిగేలా ప్రోత్సహించాలి.  అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ని కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ గంటల తరబడి చర్చించారు. సొంత కేబినెట్ మంత్రులకే తెరుచుకోని ప్రగతి భవన్ తలుపులు.. సమైక్యాంధ్ర వాది ఉండవల్లికి బార్లా తెరుచుకోవడం వెనుక కారణం ఇదే. ఏపీలో 2019 నాటి సీన్ రిపీట్ కావాలన్నదే కేసీఆర్, పీకే వ్యూహంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

బిజెపి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు ప‌రాకాష్ట‌! కేంద్రం త‌వ్విపోసిన హెరాల్డ్ కేసు!

కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఇ.డి) విచార‌ణ‌కు పిల‌వ‌డంతో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌ల‌కు దిగింది. బిజెపి ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని  కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది.  అనారోగ్య కార‌ణంగా సోనియాగాంధీ ఇ.డి. విచార‌ణ‌కు హాజ‌రుకాలేక‌పోయారు. ఆమె ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా రాహుల్ గాంధీ సోమ‌వారం ఇ.డి. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.  ఇంత‌కీ ఈ నెష‌న‌ల్ హెరాల్డ్ కేసు ఏమిటో తెలుసు కుందాం..   1937లో  నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను జవహార్‌లాల్‌ నెహ్రూ  ప్రారంభించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు గాంధీ, పటేల్‌, నెహ్రూ మూలస్తంభాలుగా నిలిచారు. నేషనల్‌ హెరాల్డ్‌ ఆర్థికంగా నిలదొక్కుకోడానికి  5 వేల మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వీరందరికి నేషనల్‌ హెరాల్డ్‌లో షేర్లు ఉన్నాయి. పాలకుల ప్రజా కంటక నిర్ణయాలను నేషనల్‌ హెరాల్డ్‌ ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో బ్రిటీష్‌ వారికి ఇబ్బందికరంగా మా రింది. దీంతో 1942 నుంచి 1945 వరకు నేషనల్‌ హెరాల్డ్‌పై బ్రిటీష్‌ పాలకులు నిషేధం విధించారు. త‌ర్వాత వరుస ఉద్యమాలతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక నష్టాల పాలయింది. ఈ నష్టాలను పూడ్చుకునేం దుకు నేషనల్‌ హెరాల్డ్‌కు నాటి జాతీయ పార్టీ కాంగ్రెస్‌ రూ.90కోట్ల మేర విడతల వారీగా సాయం అందిం చింది. చాలాకాలం వీటిని పట్టించుకోని కాంగ్రెస్‌ పెద్దలు.. యూపీఏ 2 హయాంలో నేషనల్‌ హెరాల్డ్‌పై దృష్టి సారించారు. 2009 నాటికి నేషనల్‌ హెరాల్డ్‌లో మిగిలిన వాటాదారుల సంఖ్య కేవలం 1057 మంది మాత్రమే. అయితే నేషనల్‌ హెరాల్డ్‌కు ఢిల్లీతో పాటు పలు నగరాల్లో నడిబొడ్డున అత్యంత విలువైన ఆస్తు లున్నాయి. న్యూఢిల్లీలోని బహుదూర్‌ షా జఫర్‌ మార్గ్‌లో అత్యంత కీలకమైన ప్రాంతంలో హెరాల్డ్‌ హౌజ్‌ ఉంది. కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తుల గురించి వివరాలు 2009లో బయటికొచ్చాయి. 2010లో రూ.50లక్షల మూలధనంతో యంగ్‌ ఇండియన్‌ అనే కంపెనీని కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేశారు. సోనియా, రాహుల్‌కు 76 శాతం వాటా, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లకు 24 శాతం వాటాతో యంగ్‌ ఇండియన్‌ ఏర్పాటయింది. దీనికి కావాల్సిన రూ.50లక్షల మూలధనం కూడా సిద్ధంగా  లేకపోవ డంతో కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ దగ్గర రూ.కోటి లోన్‌ తీసుకుని మరీ సంస్థను ఏర్పాటు చేశారు. నేష నల్‌ హెరాల్డ్‌కు ఇచ్చిన అప్పును తీర్చలేని రుణంగా ప్రకటించిన ఏఐసీసీ.. దాన్ని యంగ్‌ ఇండియాకు రూ.50లక్షలకు ఇచ్చేసింది. అంటే నేషనల్‌ హెరాల్డ్‌ రూ.90 కోట్ల బకాయిలను యంగ్‌ ఇండియన్‌కు రూ.50 లక్షలకు అప్పగించింది. దీనికి సంబంధించి అటు ఏఐసీసీ తరపున, ఇటు యంగ్‌ ఇండియన్ తర పున,  నేషనల్‌ హెరాల్డ్‌ తరపున  కూడా  మోతీలాల్‌  వోరా ఒక్క‌రే  సంతకం చేయడం గమనార్హం.  ఈ ఒప్పందంతో నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులన్నీ యంగ్‌ ఇండియన్‌ స్వాధీనం చేసుకుంది. నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల ప్రస్తుత విలువ సుమారు రూ.5వేల కోట్లు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల వాటాలకు చెందిన కంపెనీలో భారీగా అవకతవకలు జరిగాయంటూ  2012లో ఢిల్లీ  కోర్టులో సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. అప్పట్లో ఈ  కుంభకోణాన్ని సుమారు రూ.1600 కోట్లుగా  లెక్కగట్టారు సుబ్రహ్మణ్యస్వామి. యంగ్‌ ఇండియ న్‌ కంపెనీ ఏర్పాటు ద్వారా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులన్నింటినీ సోనియా, రాహుల్‌ చేజిక్కించుకున్నారని ఆరోపించారు.  ఈ కేసుకు సంబంధించి 2014లో సోనియా, రాహుల్‌, శ్యాంపిట్రోడాలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. 2016లో పటియాలా హౌజ్‌ కోర్టు నుంచి కాంగ్రెస్‌ నేతలు బెయిల్‌ తెచ్చుకున్నారు. 2019లో రూ.64కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. ఇప్పటికే సోనియా, రాహుల్‌లకు ఆదాయంపన్ను శాఖ నోటీసులిచ్చింది. ఐటీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును సోనియా గాంధీ ఆశ్రయిం చింది. 2019లో సోనియా, రాహుల్‌లకు సుప్రీంకోర్టులో ఐటీ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. ట్రైబ్యునల్‌లో సోనియా, రాహుల్‌లకు వ్యతిరేకంగా పరిణామాలు చోటుకున్నాయి. సోనియా, రాహుల్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. 

పాత స్నేహితుల కలయిక ఎవరికి ఊరట

రాజకీయాల్లో శాశ్వత శతృవులు అంటూ వుండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సంఘటన ప్రభావంతో శతృవులు మళ్లీ మంచి మిత్రులూ కాగల్గుతారు. అంతకుముందు వరకూ పెద్దగా స్నేహం లేకున్నా మంచి స్నేహితులుగానూ మారవచ్చు. పార్టీలు వేరయినా తమ స్నేహబంధాన్ని కొనసాగించేవారు ఒక్కోసారి తమ తమ పార్టీలకు అనుకూలించనూ వచ్చు. శనివారం వంగవీటి రాధా, వల్లభనేని వంశీల కలవడం ఈ తరహా రాజకీయ వంతెనను కట్టుదిట్టం చేయడానికి వంశీ వుపయోగిస్తాడేవెూ అనుకోవచ్చునేవెూ! ఎందుకంటే గన్నవరంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పార్టీ అధినేతకు తలభారంగానే మారింది. ఈ సమయంలో పాత స్నేహితుల కలయిక కొంత వూరటనివ్వచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ పరువు కాస్తంత దెబ్బతిన్న ఈ తరుణంలో జగన్‌కి ఇలాంటి స్నేహితుల కలయిక ఊరట నిస్తుందేవెూ మరి. కృష్ణాజిల్లా గన్నవరంలో రాజకీయ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాధా, వంశీలు అంతకుముందు నుంచీ స్నేహితులే. అయితే రాజకీయాల కారణంగా ఒకరు వైసీపీ లోంచి టీడీపీకి వెళితే, మరొకరు టిడీపీ నుంచి వైసీపీలోకి మారారు. ఇటీవలే రంగా 33వ వర్ధంతి సందర్భంగా రాధా, వంశీలు విజయవాడలోని రాధా కార్యాలయంలో కలిసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 2019లో టిడిపీ నుంచి గెలిచిన వంశీ ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌పట్ల ఆకర్షితుడయ్యారు, జగన్‌ పార్టీలో వున్న వంగవీటి రాధా జగన్‌తో విభేదించి టీడీపీలోకి వెళ్లేరు. ఇప్పుడు అసలే వైసీపీలో లుకలుకలు బయటపడుతున్న నేపథ్యంలో వీరి కలయిక కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా పాతస్నేహాలకు మళ్లీ ప్రాణం పోస్తుండటం పాత మిత్రులు కలుస్తుండటం ఆ మధ్య కూడా జరిగింది. గుడివాడ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అడపా వెంకటరమణ(బాబ్జీ) మరణించినపుడు అంతిమయాత్రలో కొడాలి నాని, వంగవీటి రాధా పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఇద్దరూ కలిసి టీ తాగుతూ చాలాసేపు ముచ్చటించుకోవడం అందరూ గమనించారు. అసలు కొంతకాలంగా వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకురావలన్న తాపత్రయంతోనే నాని తమ స్నేహాన్ని మరింత కొన సాగించి జగన్‌కి నమ్మకం కలిగిస్తున్నారు. ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి కొడాలి నానితో వున్నంత స్నేహంగా టిడీపీ నేతలతో వంగవీటి రాధా వుండరన్న మాట బాగా ప్రచారంలో వుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరి ఈ స్నేహబంధాలు జగన్‌కు ఎన్నికల సమయానికి ఎంత వరకూ ఉపయోగ పడతాయో చూడాలి. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య చాలాచోట్ల విభేదాలు, ఆగ్ర హావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలతో జగన్‌ నానా ఇబ్బందీ పడుతున్నారు. ఎవరిని బుజ్జగించాలి, ఎవరితో జాగ్రత్తగా వ్యవహరించాలన్నదీ ఇదమిద్ధం తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.  .......

ఆస్పత్రిలో తల్లి.. ఈడీ విచారణలో రాహుల్.. నిరసనలతో హోరెత్తించిన కాంగ్రెస్

అన్నా చెల్లీ అనుబంధం జ‌న్మ‌జ‌న్మ‌లా బంధం.. అంటూ సినిమా పాట వింటూ భావోద్వేగానికి గుర‌య్యే వారు చాలామందే  వుంటారు. ఆర్ధిక స‌మస్య‌ల్లోనో, కోర్టు కేసుల్లోనో  పీక‌ల్లోతు వున్న అన్న కోసం ప‌రుగున వెళ్లి చేదోడు వాదోడుగా నిలిచే చెల్లి వుంటుందా? అంటే వుంటుంది. అదీ ప్రియాంకా గాంధీ వాద్రా రూపం లో!  నేషన‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత  సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విచార‌ణ‌కు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ. డి) పిలిచింది. బీజేపే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రె స్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ‘నేరం చేసిన వారు ఎవరైనా నేరం చేశామని అంగీకరిస్తారా? అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తల్లీ  కొడుకులు నేరం చేయ‌లేద‌నేది నిజం అయితే ఆ ఇద్దరూ  విచారణకు హాజరై, తమ నిజాయతీని నిరూపించుకోవాలని నడ్డా కాంగ్రెస్ నేత లకు సవాలు విసిరారు. పోతే, కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆమె కోవిడ్ అనంత‌ర అనారోగ్య కార‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరారు.  సోమ‌వారం రాహు ల్ గాంధీని విచార‌ణ‌కు ఇ.డి. పిలిచింది.  ఇది చాలా దారుణ‌మ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం త‌మ పార్టీ అధినేత పై క‌క్ష్య‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే ఈ విధంగా స‌మ‌న్లు జారీచేయిస్తున్నార‌ని కాంగ్రెస్  పార్టీ ఆగ్ర‌హించి దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు నిర్ణ‌యించింది. ఢిల్లీలో ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం స‌త్యా గ్ర‌హ్ పేరుతో ఆం దోళ‌న చేప‌ట్టారు. భారీ ర్యాలీకి నిర్ణ‌యించారు.  పార్టీవారికి వుండే అభిమానం, ప్రేమ పోలీసుల‌కు వుండాల‌ని రూలేం లేదు. పార్టీ కార్యాల‌యం వ‌ద్ద అను చరులు, వీరాభిమానులు, కార్య‌క‌ర్త‌లు రాహుల్ జిందాబాద్ అంటూ భారీ నినాదాలు చేసేరు. అంద‌రూ పెద్ద ఎత్తున ర్యాలీ తీయ‌బోయారు. కానీ  అస‌లు ర్యాలీ తీయ‌డానికి, ఇలా భారీ ఎత్తున జ‌నం వెంట‌బ‌డి రావడానికి అస్స‌లు  అనుమ‌తే లేదు, వెన‌క్కి వెళ్ల‌మ‌న్నారు. కానీ  పార్టీ  వీరాభిమానులు వూరుకుంటారా?  మా నాయ కుడు ఎక్క‌డికి వెళ్లాల‌న్నా ఈ స్థాయి పాలోయింగ్ వుండాల‌న్నా .. అంటూ గొడ‌వ‌కి  దిగ‌డంతో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. పార్టీ కార్యాల‌యం ద‌గ్గ‌ర‌, ఇ.డి. కార్యాల‌యం ద‌గ్గ‌రా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ కాం గ్రెస్ కార్య‌క‌ర్త‌లు ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాలు చేసేరు. అయినా స‌రే రాహుల్ గాంధీ వెంట ఎవ‌రికీ అను మ‌తించేది లేద‌ని ఖ‌రాఖండీగా చెప్పారు.   కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు నిర్వ‌హించిన‌  నిరస‌న  కార్య్ర‌క్రమంలో జైరామ్ ర‌మేష్‌, అధిర్ రంజ‌న్ చౌద‌రీ, దీపేంద‌ర్ హుడా వంటి నాయ‌కులు కూడా పాల్గొన్నారు. వీరంద‌రినీ పోలీసులు  అదుపులోకి తీసు కున్నారు. దీంతో ప్రియాంక తెగ బాద‌ప‌డిపోయింది. సోదరుడి వెంట వెళ్లాల‌నుకుంది.  కానీ  అదే మ‌న్నా బ‌డిలో చేర్చ‌డానికి వెళ్ల‌డ‌మా?!  దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల కొన‌డంతో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్య క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు.  తుగ్ల‌క్ రోడ్డు  పోలీస్ స్టేష న్‌కి చాలామందిని త‌ర‌లించారు.  పార్టీ కార్య క‌ర్త‌ల‌ను అన‌వ‌స‌రంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని ఆగ్ర‌హించారు ప్రియాంకా గాంధీ. కార్య‌క‌ర్త లకు ఎలాంటి భ‌యాందోళ‌న‌కు గురికావ‌ద్ద‌ని  ఆమె భ‌రోసా ఇచ్చి వెనుదిరిగారు.  అప్ప‌టిదాకా ర్యాలీలో పాద‌యాత్ర‌లో వున్న రాహుల్ ని ఇ.డి. అధికారులు త‌మ వాహ‌నంలో త‌మ కార్యాల యానికి తీసికెళ్లారు.  ఆఫీసు చేర‌గానే  అధికారులు విచార‌ణ ఆరంభించేరు. ఈ  విచార‌ణ మ‌ధ్యాన్నం భోజ‌న స‌మ‌యానికి  వూహించ‌ని సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యం ఏమంటే, సాధార‌ణంగా విచార‌ణ స‌మ‌యంలో అధికారులే  లంచ్ ఏర్పాటు చేస్తారు.  కానీ చిత్ర‌మేమంటే రాహుల్ ను మాత్రం స్కూల్ లంచ్ అవ‌ర్‌లో బ‌య‌టికి అనుమించారు.  అంతకంటే చిత్ర‌మేమంటే, లంచ్ త‌ర్వాత త‌న త‌ల్లి సోనియాగాంధీ ఆరోగ్య విష‌యం తెలుసుకోవ‌డానికి  ఆస్ప త్రికీ వెళ్లిరావ‌డం! ఇది ఇ.డి విచార‌ణ‌ల చ‌రిత్ర‌లో క‌నీవినీ జ‌ర‌గ‌నిది.  సాధార‌ణంగా ఇ.డి విచార‌ణ గంట‌ల పాటు కొన‌సాగుతుందే గాని మ‌ధ్య‌లో ఇలా విశ్రాంతి ఇవ్వ‌డం అనేది జ‌రుగ‌దు. మ‌రి రాహుల్ గాంధీ విష‌యంలో  ఇంత విరామాన్ని, స్వేచ్ఛ‌నీ ఇ.డి క‌ల్పించ‌డం వెనుక ఆయ‌న్ను అరెస్టు చేయడానికి జ‌రుగుతున్న స‌న్నాహాలేన‌ని అనుకోవాలా?  చూడాలి.

వైసీపీబలుపు… బీజేపీ డూపు!

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ- బీజేపీల నేతలు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఉప ఎన్నిక కోసం సీఎం జగన్ పలువురు రాష్ట్ర మంత్రులను గుంపులు గుంపులుగా ఆత్మకూరుకు దించేశారు. బీజేపీ కూడా తానేమీ తక్కువ కాదని వారానికి మూడుసార్లు సోము వీర్రాజును ప్రచారానికి పంపుతోంది. ఈ రెండు పార్టీల హడావుడి చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. మేకపాటి కుటుంబం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో దిగారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా.. అధికార వైసీపీ తన బలాన్ని ప్రదర్శించుకునేందుకు మండలానికి ఇద్దరు మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించింది. అంతేకాదు నెల్లూరు జిల్లాలోని ఒకరిద్దరు నేతలు తప్పిస్తే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆత్మకూరులోనే మకాం వేసి, గుంపులు, గుంపులుగా తిరుగుతున్నారు. మంత్రుల హడావుడి చూసి ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం ‘ఇదేందబ్బా సరైన పోటీ లేకపోయినా.. ఇంత హడావుడి చేస్తున్నారు?’ అంటూ నొసలు చిట్లిస్తున్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుస్తుందంటూ ఆత్మకూరు వచ్చిన మంత్రులు పొలికేకలు పెడుతుండడం గమనార్హం. అసలు పోటీలోనే లేని టీడీపీపై వారు సవాళ్లు విసురుతుండడం విచిత్రంగా ఉందంటున్నారు జనం. అయినా ఉప ఎన్నికల్లో ఎలాగూ మరణించిన సిటింగ్ ఎమ్మెల్యే కుటుంబంపై సింపతి ఉంటుంది. పైగా అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ మంత్రులు ఇలా పొలికేకలు పెట్టడం ఏంటనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే.. అధికార పార్టీది బలుపు కాదు వాపు అని స్థానిక జనం వ్యాఖ్యానిస్తున్నారు. ఒక పక్కన వైసీపీ బ్యాచ్ చేస్తున్న వింతలతోనే విసిగెత్తిపోతున్న జనం భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న హడావుడిని చూసి మరింతగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసే దిక్కు లేదు. ఎక్కడి నుంచో అభ్యర్దిని తీసుకొచ్చి నామ్ కె వాస్తే పోటీ పెట్టింది. అయినా సరే.. బీజేపీ సత్తా చాటుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆత్మకూరు వీధుల్లో కోతలు కోస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా పగలబడి నవ్వుకుంటున్నారు జనం. ‘మింగ మెతుకు లేకపోయినా.. మీసాలకు సంపంగి నూనె’ అన్నట్టు.. వీర్రాజు వీరంగం భలే గమ్మత్తుగా ఉందంటున్నారు ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలు. బీజేపీ చేస్తున్న డూపు ప్రచారంపై తెగ సెటైర్లు కూడా వేస్తున్నారు మెట్ట ప్రాంత ప్రజలు. ఎవరిపై ఎవరు లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారు? ఎవరిపై ఎవరు సత్తా చాటుతారో.. అర్ధం కాక తల పట్టుకొని మరీ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటుండడం కొసమెరుపు.

ఉండవల్లితో కేసీఆర్ భేటీ ఆంతర్యమిదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యూహాలు ప్రత్యర్థులకు ఒక పట్టాన అంతుపట్టవు. ఉండి ఉండి ఒక్కసారిగా ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలతో ముందుకు వస్తుంటారాయన. ఆ వ్యూహాలలో నైతికత ఉందా, పద్ధతి ప్రకారం రాజకీయాలను నడిపే తీరదేనా లాంటి ప్రశ్నలను ఆయన పట్టించుకోరు. ప్రత్యర్థి పార్టీలనైనా, రాజకీయ ప్రత్యర్థులనైనా బినీత్ ది బెల్ట్ కొట్టడమంటే ఆయనకు మహా సరదా. ఇప్పుడు రాష్ట్రంలో యాంటి ఇంకంబెన్సీ తీవ్రంగా ఉందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన జాతీయ పార్టీ అంటూ ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. అయితే అది ఒక్కటే చాలదని ఆయనే అనుకున్నారు. ఎందుకంటే ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం, తెలంగాణ సెంటిమెంట్ పై ప్రజలను ఇక కదిలించలేమన్న నిర్ధారణక రావడం ఒక కారణమైతే.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలోపేతం కావడం మరో కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆయన అనూహ్యంగా ఏపీలో రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు ఉన్న రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లిని తెరమీదకు తెచ్చారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కేసీఆర్ భేటీ అయిన రోజునే ఉండవల్లి కూడా కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఇరువురి మధ్యా ఏ అంశంపై చర్చలు జరిగాయన్న స్పష్టత లేక పోయినా విశ్లేషకులు మాత్రం తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ను రంగంలోనికి దింపేందుకేనని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా మాత్రమే ముచ్చటగా మూడో సారి రాష్ట్రంలో జయకేతనం ఎగురవేసి అధికార పగ్గాలు అందుకోవడం సాధ్యమౌతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే అనివార్యంగా రాష్ట్రంలో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కు సవాల్ విసరడానికి శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను తమ ఓట్లుగా మార్చుకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమౌతున్నాయి. త్రిముఖ పోరులో సునాయాసంగా గెలవచ్చు అని ఇంత కాలం భావిస్తూవచ్చిన కేసీఆర్ కు క్షేత్రస్థాయి పరిస్థితులపై అందిన నివేదికలు గట్టి ఝలక్ ఇచ్చాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో త్రిముఖ పోరు హోరాహోరిగా ఉంటుందని భావించడం సరికాదన్నదే ఆ నివేదికల సారాంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతున్నదని క్షేత్ర స్థాయి నుంచి అందిన నివేదికలు  తేటతెల్లం చేయడందతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ కు మరలే అవకాశం ఉందన్న నివేదికలతో ఆ పరిస్థితి రాకుండా ఏం చేయాలన్నదానిపై కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టిన ఫలితమే తెరపైకి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా ఇప్పటి వరకూ తెలంగాణలో నామమాత్రంగా ఉన్న జనసేన పార్టీని ప్రోత్సహించి ఎన్నికల బరిలో ఎక్కువ స్థానాలలో పోటీ చేసేలా ప్రేరేపించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో భారీ చీలిక తీసుకురావాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. పీకే సలహా మేరకే ఉండవల్లిని పిలిపించుకుని మరీ కేసీఆర్ భేటీ అవ్వడం వెనుక కారణం ఇదే నంటున్నారు. జనసేన తెలంగాణలో యాక్టివ్ అయితే.. ఆ పార్టీకి రాష్ట్రంలో భారీగా ఉన్న అభిమానుల ఓట్లు కాంగ్రెస్ కు మళ్లకుండా ఉంటాయన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అని కేసీఆర్ కు నివేదికలు అందిన నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే జనసేన పార్టీని రాష్ట్రంలో యాక్టివ్ చేయడమొక్కటే మార్గమన్న ఎత్తుగడతోనే కేసీఆర్ ఉండవల్లితో ‘ప్రత్యేక’ భేటీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉండవల్లి ఇటీవలి కాలంలో జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా, జనసేన కు అనుకూలంగా మాట్లాడిన సంగతిని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ కు మళ్లకుండా చీలిక తీసుకు రావడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారనీ అందుకే  ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా జనసేనను రీచ్ కావడానికి యత్నిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు.   

బిజెపీవారికి బుల్‌డోజ‌ర్ల పిచ్చేమిటో?

వైరం, విరోధం వుండ‌వ‌చ్చునేమోగాని, మ‌త‌ప‌ర‌మైన వైరం విరోధం ర‌క్తంలోకి ఎక్కంచుకోకూడ‌దు. ఇది మ‌హా ప్ర‌మాదం. బిజెపి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి వైరం ఏదో విధంగా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌ని స్తూనే వున్నాం. ఇటీవ‌ల మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ మీద బిజెపి అధికార ప్ర‌తినిధి నుపూర్ చేసిన అనుచిత వ్యాఖ్య ల‌తో ఆమెను ప‌ద‌వి నుంచి తొల‌గించేరు, పార్టీకి దూరం చేసేరు. అంత‌టితో ప్ర‌భుత్వం, బిజెపీ ప్ర‌ముఖులు చేతులు దులిపేసుకున్నారు. కానీ  దాని ప‌ర్యావ‌సానం అంతు లేకుండా కొన‌సాగుతోంది. దేశంలో ప‌లు ప్రాం తాల్లో ఇంకా   ఆందోళ‌న‌లు జరుగుతూనే ఉన్నాయి. ఫ‌లితంగా అల్ల‌ర్లు, కొట్లాట‌లు కొనసాగుతూనే వున్నాయి. వాటిలో పాల్గొన్న‌వారిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోమ‌ని పోలీసుల‌ను ఉసి గొల్ప‌డం కూడా జ‌రు గుతోంది.  మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఈ త‌ర‌హా ప‌రిస్థితులు  అధికంగా ఉన్నాయి.  అస‌లు బీజేపీ కార్యకలాపాలే  మోదీ ప్ర‌భుత్వ వ్య‌తిరేకుల మీద దాడులు జ‌ర‌గ‌లా ఉన్నాయి. ప్ర‌భుత్వ విధానాల‌ను వ్య‌తిరేకించ‌డం త‌ప్పు ఎలా అవుతుంది. తాము చేప‌ట్టిన ప‌థ‌కాలు, కార్య క్ర‌మాల‌ను విమ‌ర్శించ‌వ‌ద్ద‌ని ఎలా అంటారు. పైగా బుల్‌డోజ‌ర్ల‌ను వినూత్నంగా ఉప‌యోగించ‌డం బిజెపి ప్ర‌భుత్వం లోనే చూస్తున్నాం.  బుల్‌డోజ‌ర్ల‌ను ఇళ్ల‌ను కూల్చివేయ‌డానికి చాలా ఈజీగా న‌డిపిం చేయ‌డం బిజెపీ వ‌ర్గీ యుల‌కు, వీరాభిమానుల‌కు చాలా స‌ర‌దాగా, గొప్ప ఎంట‌ర్‌టైన్మంట్ గా మారింది. నూపుర్ వ్యాఖ్య‌ల అనం త‌రం జ‌రుగుతున్న అల్ల‌ర్లు, కొట్లాట‌ల్లో  చురుగ్గా పాల్గొన్న‌వారి ఇళ్ల మీద‌కి బుల్ డోజ‌ర్లు న‌డిపించేయడం జ‌రిగింది. తాజాగా ప్ర‌యాగ్‌రాజ్‌లో జావెద్ అనే వ్య‌క్తి  ఇల్లు కూల్చివేయ‌డం జ‌రిగింది. అలాంటి వారికి  ఈ గ‌తే ప‌డుతుందని బెంగుళూరు బిజెపీ నాయ‌కుడు ర‌వి   చెప్పా రు. బుల్‌డోజ‌ర్ల‌తో, బుల్లెట్ల‌తోనే వారికి బుద్ధి వ‌స్తుంద‌ని ర‌వి ఆరోపించ‌డం బిజెపి పాల‌న తీరు, మ‌త‌పిచ్చిని స్ప‌ష్టం చేస్తుంది. నూపుర్ వ్యాఖ్య‌ల‌కు కేవ‌లం ఆమెను ప‌ద‌వి నుంచి తొల‌గించి, పార్టీకి దూరం చేయ డంతోనే స‌మ‌స్య స‌ద్దుమ‌ణుగుతుంద‌ని ఎలా అనుకుంటారన్న‌ది దేశంలో ముస్లింల ప్ర‌శ్న‌. దీనికి  త‌గిన స‌మాధానం ఇచ్చి వారి మ‌నోభావాలు  దెబ్బ‌తిన‌కుండా భ‌విష్య‌త్తులో జాగ్ర‌త్త‌ప‌డ‌తామ‌న్న దోర‌ణి కూడా కేంద్రం వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డ‌మే చిత్రం. పైగా బిజెపీ పార్టీ నాయ‌కులు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అల్ల‌ర్ల‌కు దిగిన‌వారిని వూరికే వ‌దిలిపెట్ట‌బోమ‌ని, కేసులు బ‌నాయించ‌డం, బుల్‌డోజ‌ర్ల‌తో వారి ఇళ్ల‌ను ధ్వం సం చేసి వారికి బ‌తుకు క‌ష్టం చేకూరుస్తామ‌న్న ధోర‌ణిలోనే వుండ‌డం, హెచ్చ‌రించ‌డం  మంచి పాల‌న అనిపించుకుంటుందా అన్న‌ది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌. 

ఆత్మ‌కూరు పోరులో మేకపాటి ‘వర్గ’ పోరు

నాయ‌కునికి విధేయంగా వుంటామ‌ని, పాల‌నాప‌ర‌మ‌యిన అన్ని నిర్ణ‌యాలకు, పార్టీ విధి విధానాల‌కు క‌ట్టు బ‌డి వుంటామ‌ని దీప ప్ర‌మాణం చేసి మ‌రీ రంగంలోకి దిగిన‌వారు క్ర‌మేసీ దూర‌మ‌య్యే ప‌రిస్థితులు వ‌చ్చా యి. ఎన్నిక‌లు మ‌రో రెండేళ్లలో జ‌రుగ‌నుండ‌గా వైసీపీలో విభేదాలు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. జ‌గ‌న్ వెంటే వుండి అద్భుతంగా విజ‌యాలు అందిస్తామ‌న్న‌వారే ఒక‌రితో ఒక‌రు విభేదించుకుని నాయ‌కుని, పార్టీ ప్ర‌తిష్ట ను బ‌జారున ప‌డేస్తున్నారు. అందుకు తాజా వుదాహ‌ర‌ణ మేక‌పాటి వ‌ర్గీయుల ర‌భ‌స‌. నాయ‌కునికి విధేయంగా వుంటామ‌ని, పాల‌నాప‌ర‌మ‌యిన అన్ని నిర్ణ‌యాలకు, పార్టీ విధి విధానాల‌కు క‌ట్టు బ‌డి వుంటామ‌ని దీప ప్ర‌మాణం చేసి మ‌రీ రంగంలోకి దిగిన‌వారు క్ర‌మేసీ దూర‌మ‌య్యే ప‌రిస్థితులు వ‌చ్చా యి. ఎన్నిక‌లు మ‌రో రెండేళ్లలో జ‌రుగ‌నుండ‌గా వైసీపీలో విభేదాలు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. జ‌గ‌న్ వెంటే వుండి అద్భుతంగా విజ‌యాలు అందిస్తామ‌న్న‌వారే ఒక‌రితో ఒక‌రు విభేదించుకుని నాయ‌కుని, పార్టీ ప్ర‌తిష్ట ను బ‌జారున ప‌డేస్తున్నారు. అందుకు తాజా వుదాహ‌ర‌ణ మేక‌పాటి వ‌ర్గీయుల ర‌భ‌స‌. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో ల‌క్ష మెజారిటీ వ‌చ్చేలా  కృషి చేయాల‌ని  ముఖ్యమంత్రి పెట్టిన టార్గెట్‌కి  అక్క‌డి పార్టీ నాయ‌కులు ఎమ్మెల్యేలు త‌మ స్థాయిలో కృషిచేస్తున్నార‌ని, వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని అంతా అంటుకుంటారు. కానీ జ‌రుగుతున్న‌ది వేరు. ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి  రాజ‌శేఖ‌ర్ రెడ్డి అస‌లు  ఆత్మ‌కూరు మొహం చూడ్డంలేదు. అక్క‌డి  వైసీపీ వ‌ర్గీయులంతా ఇప్ప‌టికే కంగారుప‌డుతున్నారు. జ‌గ‌న్ ఆశించిన మేర‌కు ప్ర‌చారం జ‌రిగే అవ‌కాశం లేదు. ఆయ‌న‌ పెట్టిన టార్గెట్‌లో స‌గం సాధించినా గొప్ప విష‌య‌మే అను కుంటున్నారు.  పార్టీ నేత‌ల స‌మావేశంలో జ‌డ్పీటీసి  సుధాక‌ర్‌రెడ్డి పై  వైసీపీ నేత రేవూరి వేణుగోపాల్ రెడ్డి విరుచుకుప‌డ‌టం విభేదాల‌ను  బహిర్గతం చేసింది. ప్ర‌తీ మండ‌లాన్ని వైసీపీకి అనుకూలం చేయ‌డా నికి మంత్రులు ఇన్‌ఛార్జులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ  మేక‌పాటి వ‌ర్గీయులు మూడు గ్రూప్‌లుగా విడిపో యారు. ఎవ‌రికి  వారుగా వ్య‌వ‌హ రిస్తూ ఏకంగా తిట్టుకోవడానికి, కొట్టుకోవ‌డానికీ కూడా వెనుకాడ‌టం లేదు. వారిని శాంత‌ప‌ర‌చ‌డా నికి ఎమ్మెల్యేలు, మంత్రులు నానా అవ‌స్థా ప‌డుతున్నారు. ఎవ‌రూ ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో త‌గ్గేలా క‌న‌ప‌డటం లేదని విశ్లేష‌కుల మాట‌.  ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉప ఎన్నిక‌లకు నామినేష‌న్ ప్ర‌క్రియ సోమ‌వారంతో ముగుస్తుంది. ఇక్క‌డ ఇంత‌వ‌ర‌కూ చాలామంది హేమాహేమీలే విజ‌యం సాధించేరు. ఆత్మ‌కూరును వైసీపీ ఎంతో ప్ర‌తి ష్టాత్మ‌కంగా తీసుకుంది. అందువ‌ల్ల భారీ మెజారిటీతో గెలిచితీరాల‌న్న ఆదేశం జ‌గ‌న్ ఇచ్చిన‌ప్ప‌టికీ  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీ వ‌ర్గీయుల్లో అంత‌టా వ్య‌క్త‌మ‌వుతున్న విభేదాలతో  మ‌రి ఏ మేర‌కు పార్టీ ప్ర‌తిష్ట‌ను నిల‌బెడుతుందో చూడాలి.   రోజుకో విధంగా రోజుకో ప్రాంతంలో వైసీపీ సోద‌రుల మ‌ధ్య విభేదాలు రోడ్డు మీద‌కు వ‌స్తున్నాయి. పార్టీ అధినేత‌కు వూహించ‌ని విధంగా షాక్ మీద షాక్ ఇస్తున్నారు. తామంతా  ఐక్యంగా వున్నామ‌ని, మా పాల‌న‌కు ఎలాంటి ఢోకా లేద‌ని చేసుకున్న‌, చేసుకుంటున్న ప్ర‌చార‌మంతా ఒట్టిదే న‌ని పార్టీ వ‌ర్గీయుల మ‌ధ్య  విభేదాలే స్ప‌ష్టం చేయ‌డం ఎవ‌రూ వూహించ‌ని ప‌రిణామం. ఆత్మ‌కూరు ఉప ఎన్నిక  వైసీపీ ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ‌తీస్తుందేమోన‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి.

రఘురామ, విజయసాయి ట్వీట్ వార్

ఇద్దరూ వైసీపీ ఎంపీలే.. అయినా వారిద్దరి మధ్య ట్విట్ల వార్ ఓ రేంజ్ లో జరిగింది. ఒకరు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. మరొకరు అదే పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. వైసీపీ సర్కార్ తప్పిదాలను, దాష్టీకాలను, దౌర్జన్యాలను, దుర్మార్గాలను ఎత్తి చూపుతూ తనదైన స్టైల్ లో రఘురామకృష్ణరాజు   మీడియా ముఖంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం ఆయన ‘మద్యం పూర్తిగా నిషేధిస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8 వేల కోట్ల రూపాయల రుణం సమీకరించడం, తన అనర్హత పిటీషన్ పై లోక్ సభ స్పీకర్  కార్యాలయ స్పందన, ఇతర ముఖ్య అంశాలపై   రచ్చబండ’ అని రఘురామ ట్వీట్ చేశారు.  దీంతో రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి రఘురామరాజుపై వ్యక్తిగత విమర్శలతో ట్వీట్ చేయడంతో వారిద్దరి మధ్య ట్వీట్ వార్ ఓ రేంజ్ లో సాగింది. ‘ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాల’ని రఘురామను రెచ్చగొట్టేలా విజయసాయి ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా నాలుగు పచ్చ కుల ఛానెల్స్ మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు.. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజుకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తందం’టూ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశారు. ‘అడగకుండా నియోజకవర్గం వదలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు.. విగ్గురాజు.. పెగ్గురాజు’ అంటూ రెచ్చగొట్టారు. దీంతో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. విజయసాయి చేసిన  వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు,  ‘హలో రసిక వానరా! అవును నాకు ఉన్నది విగ్గు.. ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నావు? నువ్వు, నీ గ్యాంగ్ లీడర్ అనర్హత/ సస్పెన్షన్ పై చేతులు ఎత్తేశారా? నేను ఏపీకి వస్తే ముఖ్యమంత్రికి దిమ్మతిరిగి మైండ్  బ్లాక్ అవ్వుద్ది అనేగా నాపై కేసులు పెట్టిస్తున్నారు’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. ‘అజ్ఞాతవాసం తర్వాత పాండవులకి, అరణ్య వాసం తరువాత శ్రీరాముడికి జరిగింది పట్టాభిషేకం. చచ్చింది కౌరవులు, దానవులు. తెలుసుకోరా కండోమ్ రెడ్డి!!’ అంటూ ఓ స్థాయిలో రఘురామ కృష్ణం రాజు రిటార్డ్ ఇచ్చారు.  అప్పటికైనా విజయసాయికి సిగ్గొచ్చిందా అంటే.. ‘ఒరేయ్ డూప్లికేట్ గాజు.. నీ మీసాలైనా ఒరిజిలేనా? లేక పీకి అంటించుకున్నావా? వాటిని మెలి తిప్పడం ఎందుకురా?’ అంటూ మరింత వ్యక్తిగతంగా వెళ్లి మరీ అసందర్భ వ్యాఖ్యలతో ట్వీట్ పెట్టి. రెచ్చగొట్టారు. దానికి బదులుగా రఘురామ ‘’ఎవడు ఒరిజినల్ రాజో.. ఎవడు డూప్లికేట్ రెడ్డో ప్రజలకి ‘ఎరుక’లే రా! మనం కలిసినప్పుడు నా వెంట్రుకలన్నీ చూపిస్తా.. నువ్వే పీకి చూస్కో!’అంటూ ట్వీట్ చేశారు రఘురామ రాజు. వీరి ట్వీట్లపై నెటిజన్లు కూడా ఓ స్థాయిలో స్పందిస్తున్నారు. నెటిజన్ల స్పందన రఘురామ రాజుకు అనుకూలంగా ఉండటం విశేషం. నెటిజన్లు సెటైర్లతో విజయసాయికి దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చేస్తున్నారు.    విజయసాయి ఒక రాక్షస జంతువని,   పైశాచికానందం ఎక్కువ అంటూ కొందరు ఫైరవుతున్నారు. ‘తెల్ల తాతకి దూల తీరిపో యిందం’టూ మరి కొందరు సైటైర్లు దంచారు. ముసలోడికి ముందుంది జైళ్ల పండుగ అని ఇంకొకరు,   కండోమ్ తాతకు అడిగి మరీ తన్నించుకోవడం బాగా అలవాటంటూ మరొకరు, వెంట్రుకలు పండాయి,రేపో మాపో కాటికి పోయే వయసులో… డిక్కీ బలిసి కొట్టుకుంటున్నాడని ఇంకో నెటిజన్, రాజుగారూ ఈడీ చానల్ ని కూడా పిలవండి. పాపం నక్కబొక్కల రెడ్డి తెగ మధనపడిపోతున్నాడంటూ మరొకరు.. ముసలి నక్కకు రాజుగారు డైరెక్ట్ గా గునపమే దింపారంటూ ఇంకో నెటిజన్ పంచ్ వేశారు. మొత్తానికి రాజు వర్సెస్ రెడ్డి ట్వీట్ వార్ లో నెటిజన్లు కూడా రఘురామకు మద్దతుగా నిలుస్తుండడం విశేషం.

రాజకీయం మారుతోంది..నల్లపురెడ్డి స్వరం మారుతోంది..!

వైసీపీ నాయకులలో ఒక్కరొక్కరుగా తెలుగుదేవంపై విమర్శల దాడిని తగ్గించేస్తున్నారు. తగ్గించడమే కాదు.. తెలుగుదేవం అధినేత చంద్రబాబునాయుడిపై ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు. ఇది రాష్ట్రంలో మారుతున్న రాజకీయానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోట తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రమాబుపై ప్రశంసల జల్లు కురవడాన్ని చూపుతున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీపై,  ఆ పార్టీ అధినేత చంద్రబాబువై విమర్శలతో చెలరేగిపోవడంలో ముందుండే నేత. నెల్లూరు జిల్లాలో ఆయనకు ఉన్న గుర్తింపే అది. అటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నోట చంద్రబాబుపై ప్రశంస వినిపించింది. అదీ ప్రైవేటు సంభాషణలోనో, పిచ్చాపాటి ఇష్టాగోష్టిలోనో కాదు.. ఒక బహిరంగ సభలో. అదీ ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార సభలో. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా నల్లపురెడ్డి పక్కనే ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోట చంద్రబాబుపై ప్రశంసలు రావడంతో నివ్వెరపోయి, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా నారాయణస్వామితో కలిసి మేకపాటి విక్రమ్‌రెడ్డి విజయం కోసం   సంగం మండలంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో.  జంగాలకండ్రికలో జరిగిన బహిరంగసభలో చైతన్యరథంపై నుంచి ప్రసన్న ప్రసంగిస్తూ  ఆత్మకూరులో పోటీ పెట్టరాదని నిర్ణయించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగుదేశం అధినేతను మనం అభినందించాలి,  ఎవరైనా ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే.. ఆ కుటుంబంలోని వ్యక్తి ఆ స్థానంలో పోటీకి దిగితే ఆ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉంటామని చెప్పి, ఆ నిర్ణయానికి కట్టుబడిన చంద్రబాబును అభినందిస్తున్నాను అని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రచార సభలో చెప్పారు.  అదే సమయంలో బీజేపీపై విమర్శలతో చెలరేగిపోయారు.  బీజేపీకి కనీస జ్ణానం లేకుండా పోయిందని,  గౌతమ్‌రెడ్డి చనిపోయిన తరువాత విలేకరుల సమావేశాలు పెట్టి  చాలా మంచి వాడు, మనసున్న  మహారాజు, అందరినీ దగ్గరకు తీసుకుంటారని పొగిడిన బీజేపీ వారు..  ఆత్మకూరులో తగుదునమ్మా అంటూ గౌతమ్ రెడ్డి సోదరుడిపై పోటీకి దిగడం దారుణం, దురద్రుష్టకరం అంటూ విమర్శించారు.  నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. పక్క చూపులు చూస్తున్న వైసీపీ నేతల జాబితాలో ఆయన కూడా చేరిపోయారా అన్న చర్చ పార్టీలో జోరందుకుంది. ఏది ఏమైనా వైసీపీ నేతలెవరూ తెలుగుదేశంపై, తెలుగుదేశం అధినేతపై గతంలోలా విమర్శలు చేయడానికి జంకుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయానికి ఇది నిదర్శనమని పరిశీలకులు విశ్లేషణలకు పదును పెడుతున్నారు. 

బెడిసిన శ్రీ‌రెడ్డి, జగన్ బంధం.. బట్టబయలు చేసిన వీడియో

ఒక పార్టీకో, ఒక నాయ‌కునికో వీరాభిమానులు వుంటారు. జీవితాంతం అలాగే వుండేవారూ వుంటారు, వున్నారు. కానీ వీరాభిమానం కూడా ఒక్కోసారి వీర విరోధంగా మారిపోతుంది. ఏదో ఒక సంద‌ర్భంలో, ఏదో ఒక సంఘ‌ట‌న‌తో  వీరాభిమానం కాస్తా  నీరుగారి పోతుందా?  అంటే ఔననే చెప్పాలి. అందుకు  మ‌రో సాక్ష్యం సినీ న‌టి శ్రీ‌రెడ్డి!  తాను ఆశించిన‌ది, తాను భ‌క్తితో ఆరాధిస్తున్న‌వారు అందించేందుకు ముందుకు రాకపోతే.. తన డిమాండ్ ను అస్సలు ప‌ట్టించుకోకుంటే మ‌రి వీరాభిమానం కాస్తా దెబ్బ‌తిన‌క‌ మానదు. త‌న‌కు చాలా అన్యాయం జ‌రిగింద‌ని గొగ్గోలు పెట్ట‌డం ఆరంభ మ‌వుతుంది. ఏద‌యినా త‌న‌దాకా వ‌స్తేగాని తెలియ‌ద‌న్న‌ది శ్రీ‌రెడ్డి కీ తెలిసొచ్చింది.  విష‌య‌మేమంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి శ్రీ రెడ్డి జగన్ కు ఆయన పార్టీకీ వీరాభిమానిగా మారారు.   గ‌తంలో ఎన్న‌డూ ఎవ్వ‌రూ చేయ‌నంత గొప్ప‌గా పాల‌న సాగిస్తున్నారం టూ జగన్ ను పొగడ్తలతో ముంచెత్తేయడం , జగన్ సర్కార్ పై విమర్శించే విప‌క్షాల‌ వారిని దుమ్మెత్తి పోయ‌డంలో  ఆమె త‌ర్వాత‌నే ఎవ‌ర‌యినా అనే స్థాయికి ఎదిగారు శ్రీ‌రెడ్డి.  న‌టిగా ఆమె కు జ‌రిగిన అన్యాయాల‌ను లోకానికి తెలియ‌జేయ‌డంలో గ‌తంలో ఆమె చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలన్నీ సంచలనమే, వివాదాస్పదమే. రాజకీయాలలో కూడా విపక్షంపై ఆమె విమర్శలు కూడా వివాదాలకు నెలవుగానే ఉండేవి.   అనేకానేక సంద‌ర్భాల్లో విప‌క్షాల‌వారిపైనా భారీ ఎత్తున వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసేరు. మ‌న‌సులో మాట చెప్ప‌డం వేరు, ఆక్రోశం వ్య‌క్తం చేయ‌డం వేరు. కానీ శ్రీ‌రెడ్డి ఏ విషయమమైనా కూడా త‌న‌దయిన ప్ర‌త్యేక స్ట‌యిల్‌లోనే  చెబుతారనీ, ఆ విషయంలో అమెది అనితర సాధ్యమైన శైలి అని అంతా అంగీకరిస్తారు. కొంద‌రికి నిత్యం సామాజిక మాధ్య‌మాల్లో ఏదో ఒక విష‌యంలో సంచ‌నాలు వివాదాల‌తో రెచ్చిపోవ‌డం ఒక స‌ర‌దాగా మారింది. అదో చిత్ర‌మ‌యిన వ్యాప‌కం. ఇందుకు శ్రీ‌రెడ్డి మిన‌హాయింపు కాదు.  విడ‌ద‌ల ర‌జ‌నికి వైద్య ఆరోగ్య‌శాఖ అప్ప‌గించ‌డం మీద  త‌న ప‌ద్ధ‌తిలో అభిప్రాయం వ్య‌క్తం చేసింది.  తాజాగా ఆమె సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు రాజ‌కీయ‌   ర‌చ్చ‌కు తెర‌లేపింది.  నిత్యం వైసీపీ వారిని భ‌జ‌న‌ చేస్తుండే  శ్రీ‌రెడ్డి హఠాత్తుగా  అదంతా హుళ‌క్కి అన్న‌ట్టుగా  ఒక  వీడియో చేసిం ది.    శ్రీ‌రెడ్డి  త‌న స్నేహితుల‌తోనో, బంధువుల‌తోనో క‌లిసి ఒక వెంక‌టేశ్వ‌ర స్వామి గుడి నిర్మాణానికి పూనుకుంది. గుడి నిర్మాణం త‌న వ‌ల్ల కావ‌డం లేద‌ని ప్ర‌భుత్వ స‌హాయం అర్దిస్తే  ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి మాట స‌హాయం కూడా లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. వైసీపీ పార్టీని న‌మ్ముకున్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఎంతో ప్ర‌చారం జ‌రిగింది. కానీ అదంతా అవాస్త‌వం అన్న‌ది శ్రీ‌రెడ్డికి త‌న వంతువ‌చ్చే స‌రికి తేట‌తెల్ల‌మ‌యింది. త‌ను అనుకున్న గుడి నిర్మాణం ప‌నుల‌కు ఆర్ధిక సాయం కోసం అనేక‌ ప‌ర్యాయాలు అధికారుల చ‌ట్టూ ప్ర‌ద‌క్షి ణం చేసినా ఫ‌లితం శూన్యం. ఇదే కాదు అనేక సంద‌ర్భాల్లో కూడా తాను ఆశించిన సాయం  ప్రభుత్వం నుంచి అంద‌లేద‌ని తెగ బాధ‌ప‌డుతోందామె.  పొగ‌డ్త‌ల‌తో నొరు నొప్పి పుట్ట‌డమే త‌ప్ప త‌న‌కు ప్ర‌త్యేకించి ఒరిగిందేమీ లేదు. అస‌లే ప‌రిస్థితులు బాగాలేకుంటే శ్రీ‌రెడ్డి గోడు వైసీపీ ప‌ట్టించుకుంటుందా?  ఎంతో మందిని స‌హాయం అర్ధించినా తిర‌స్క‌ర‌ణ‌కే గుర‌యిందిట‌.  ఎవ‌రికీ చెప్పుకోలేని స్థితిలో ఆవేద‌న‌కు గురయింది న‌టి శ్రీ‌రెడ్డి. అయితే సీఎం   జగన్ తన పాలన మహాద్భుతంగా సాగుతోందని, గతంలో కంటే ప్రజలకు మేలు జరుగుతోందని, పథకాల అమలు సవ్యంగా జరుగుతోందని తెగ ప్రచారం చేసుకున్నారు.  ఎవరికి ఎలాంటి సహాయం అందించడం లో నయినా వెనుకాడమని ప్రజలకు మేలు చేయడంలో తనకు మించిన వారు లేరనీ చేసిన జగన్ ప్రసంగం తాలూకు వీడియోను,దాని కిందే కౌంటర్ ఇస్తూ  సామాజిక మాధ్యమంలో శ్రీరెడ్డి పెట్టిన పోస్టు  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.   రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ఇలా కాక మరెలా ఉంటుంది అంటూ ఆమె పోస్టుకు నెటిజన్లు స్పందిస్తున్నారు.

యోగి సీఎంయేనా లేక చీఫ్ జస్టిస్సా..?

మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ప‌నులు వారు చేయాలి. ముఖ్య‌మంత్రి మంత్రివ‌ర్గంతో క‌లిసి రాష్ట్ర అభి వృద్ధి ప‌నుల మీద దృష్టిపెట్టాలి. కానీ యోగీ ఆదిత్య‌నాథ్ ప‌ద్ధ‌తి అందుకు విరుద్ధంగా వుంద‌ని కోప‌గించు కున్నారు అస‌దుద్దీన్ ఒవైసీ.  ప్ర‌యాగ్‌రాజ్ అల్ల‌ర్ల సంద‌ర్భంగా అరెస్ట‌యిన  ప్ర‌ధాన నిందితుడు  జావెద్ మ‌హ‌మ్మ‌ద్ అలియాస్ పంప్ ఇంటిని కూల‌దోయ‌మ‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఆదేశించ‌డ‌మేమిటి? ఆయ‌న ముఖ్య‌మంత్రా రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయమ‌ర్తా? అని ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ మండి ప‌డ్డారు. జూన్ ప‌దో తేదీన అల్ల‌ర్ల‌కు కార‌కుడు అని పోలీసులు మ‌హ‌మ్మ‌ద్ ను అరెస్టు చేశారు. ఆదివారం ప్ర‌యాగ్ రాజ్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ (పిడిఏ) అత‌ని ఇంటిని కూల్చివేసింది. జావెద్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయ‌కుడు, యాక్టివిస్ట్ అఫ్రీన్ ఫాతిమా తండ్రి. గ‌త ఏడాది కేంద్ర వివాదాస్ప‌ద సిటిజ‌న్‌షిన్ చ‌ట్టాన్ని తీ వ్రంగా వ్య‌తిరేకించినవారితో ఫాతిమా వుంది. అస‌లు గ‌త వారం జ‌రిగిన అల్ల‌ర్ల‌లోనూ ఆమె పాత్ర‌గురించి  విచార‌ణా జ‌రుగుతోంది. జావెద్ ఇంట్లో 12 బోర్ పిస్ట‌ల్‌, 315 బోర్ పిస్ట‌ల్, కాట్రెడ్జ్‌లు ల‌భించాయ‌ని సీనియ ర్  పోలీస్ సూప‌రింటెండెంట్ అజ‌య్ కుమార్ వాద‌న‌.  జావెద్ మ‌హ‌మ్మ‌ద్ ఇంటి నిర్మాణానికి  అస‌లు అనుమ‌తే లేద‌ని కూల్చివేయాల్సి వ‌స్తుంద‌ని, జూన్ 12 ఉద‌యం 11 గంట‌ల‌క‌ల్లా ఇల్లు ఖాళీ చేయాల‌ని  నోటీసు పంపారు. కానీ చిత్ర‌మేమంటే అస‌లు ఆ ఇంటి య‌జ‌మాని జావెద్ భార్య‌. ఆమె పేరుతో వున్న‌ ఇంటిని  కూల్చివేయాల‌ంటే నోటీసు ఆమె పేరుమీద పంపాలి. అందుకు భిన్నంగా మహ్మద్ పేరుతో నోటీసు పంపడమేమిటని  అస‌దుద్దీన్ విమర్శించారు.బిజెపి మాజీ అధికార ప్ర‌తినిధి మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ శుక్ర‌వారం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ప్రార్ధ‌న‌ల అనంత‌రం పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగేయి. శ‌నివారం ఉద‌యం మునిసిప‌ల్ సిబ్బంది పోలీసుల ప‌హారాలో షాహారాన్‌పూర్‌లో ఇద్ద‌రు నిందితుల ఇళ్ల‌ను కూల్చివేసేరు. అలాగే కాన్పూర్‌లోనూ ఇళ్ల కూల్చివేత జ‌రిగింది.  గుజ‌రాత్ క‌చ్‌లో జ‌రిగిన స‌భ‌లో అస‌దుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ విధంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిలా ఆదేశాలు జారీ చేయ‌డం, వెంట‌నే పోలీసులు, మున్సిప‌ల్ సిబ్బంది ఇళ్ల కూల్చివేత‌ను చేప‌ట్ట‌డ‌మేమిట‌ని మండిప‌డ్డారు.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అనేక ప్రాంతాల్లో  ఇప్ప‌టికే ఈ మ‌ధ్య అల్ల‌ర్ల సంద‌ర్భంగా 300 మందికి పైగా అరెస్ట‌య్యారు. శాంతి భద్రతల పరిరక్షణ పేర యోగి రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య.. మోకాలడ్డుతున్న వైసీపీ?

భారత 16వ రాష్ట్రపతిని ఎన్నిక కో సమయం  దగ్గర పడింది. దీంతో   రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కసరత్తు ముమ్మరం చేసింది. మరో వైపు బీజేపీయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చొరవ తీసుకుని పలు పార్టీల అధినేతలకు లేఖలు రాశారు.   రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి అవసరమైన బలానికి 1.2 శాతం ఓట్ల   దూరంలో నిలవడంతో  ఎన్డీయే అనివార్యంగా ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధారపడుతోంది. తక్కువ అయన ఓట్ల శాతాన్ని వైసీపీ లేదా బీజేడీ ద్వారా   సమకూర్చుకోగలమనే ఆత్మవిశ్వాసం మోడీ సర్కార్ లో కనిపిస్తోంది. ఎన్డీయే కూటమి తరఫున బీజేపీ పరిశీలిస్తున్న రాష్ట్రపతి వారిలో పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో  ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి పేరు కూడా ఉంది. వినిపిస్తోంది. వెంకయ్య నాయుడి  అభ్యర్థిత్వాన్ని  ఎన్డీయే పరిశీలించడానికి  పలు కారణాలు తెరమీదకు వస్తున్నాయి. వాటిలో దక్షిణాదికి ఈ సారి దేశ ప్రథమ పౌరుడి గౌరవం కల్పించాలని తద్వారా దక్షిణాదిలో కూడా పాగా వేయాలన్న లక్ష్యం నెరవేర్చుకోవడానిక మార్గం సుగమమౌతుందన్న భావన ఒకటి.  అయితే ఆయన అభ్యర్థిత్వానికి వైసీపీ  మోకాలడ్డుతున్నట్లు రాజకీయ వర్గాలలో ఓ చర్చజరుగా నడుస్తోంది.  రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడైతే మద్దతు ఇచ్చేది లేదని ఏపీలో అధికార పార్టీ వైసీపీ మెలిక పెడుతోందని బీజేపీ వర్గాుల చెబుతున్నాయి. ఒక పక్కన రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే ఇటీవలే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన ఏపీ సీఎం జగన్ వారి నిర్ణయానికి మద్దతు ఇస్తామని బేషరతుగా ఒప్పుకుని వచ్చారనే మాటలు వినిపించాయి. కానీ వెంకయ్య నాయుడు అభ్యర్థి అయితే.. మద్దతు విషయంలో వైసీపీ ఇప్పుడు మెలిక పెడుతోందంటున్నారు. వాస్తవానికి ఏపీలో వైసీపీ సర్కార్ ఏర్పాటైన ఈ మూడేళ్ల నుంచీ లోక్ సభలో కానీ, రాజ్యసభలో కానీ బలం తగ్గినప్పుడల్లా కేంద్రాన్ని వైసీపీ ఆదుకుంటూ వచ్చింది. బీజేపీయేతర పార్టీల ఐక్యత కోసం తాజాగా ప్రయత్నాలు ప్రారంభించిన మమతా బెనర్జీ కూడా వైసీపీని కలుపుకోవడానికి సుముఖంగాలేదు. ఎందుకంటే వైసీపీని బీజేపీయేతర పార్టీలన్నీ బీజేపీ మిత్రపక్షంగానే పరిగణిస్తున్నాయి.  బీజేపీకి అన్ని విధాలుగా అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసీపీ వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు అంగీకరించడం లేదో అవగతంకావడం లేదని బీజేపీ వర్గాలే అంటున్నాయి.   అయితే పరిశీలకులు మాత్రం వెంకయ్య నాయుడి అభ్యర్థిత్వానికి వైసీపీ మోకాలడ్డడంలో ఆశ్చర్యమేమీ లేదని విశ్లేషిస్తున్నది. వెంకయ్యనాయుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని వైసీపీ బలంగా నమ్ముతోందని, అటువంటప్పుడు ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎలా అంగీకరిస్తుందని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య  శరీరం బీజేపీలో, మనసు తెలుగుదేశంలో ఉంటుందని గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. 

జాతీయ పార్టీగా టీఆర్ఎస్ అడుగులు.. మళ్లీ తెలంగాణ తెరపై పీకే..!

తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరినీ నమ్మరు.. అలాగే ఆయనను ఎవరూ నమ్మరు. రాజకీయాలలో కేసీఆర్ ది సొంత స్టైల్.. ఆయనకు అవసరమనుకుంటేనే ఎవరితోనైనా భేటీలు, సమావేశాలు.. లేదనుకుంటే ఎవరికీ అప్పాయింట్ మెంట్ కూడా ఉండదు. ప్రగతి భవన్ గేటు దాటి లోపలికి ప్రవేశించేందుకు అనుమతి కూడా ఉండదు. తెరాస నుంచి బయటకు వచ్చిన ఈటల ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టే చెప్పారు. గతంలో తానే కాదు, ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా ప్రగతి భవన్ గేటు వద్ద అధినేత అప్పాయింట్ మెంట్ కోసం పడిగాపులు పడి నిరాశ చెందిన సందర్భాలు బోలెడు ఉన్నాయని ఈటల పలు సందర్భాలలో చెప్పారు. అటువంటి కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చుందుకు అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం ఆయన పార్టీ నేతలతో, కేబినెట్ సహచరులతో చర్చించడం లేదు. వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. అందుకు అవసరమైన వ్యూహాలు, జాతీయ పార్టీగా అజెండా ఎలా ఉండాలి అన్న విషయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేతో చర్చలు జరిపారు. అదీ సుదీర్ఘంగా. అది కూడా వారం రోజుల్లో రెండు సార్లు. చివరిగా ఆదివారం గంటల పాటు పీకేతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ఈ భేటీలో రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఎవరికి? అలాగే జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో అనుసరించాల్సిన వ్యూహం, కలిసి వచ్చే పార్టీలు, జాతీయ పార్టీ జెండా, అజెండా తదితర అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్లు సమాచారం.  అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి, విపక్షాలు ఏ మేరకు బలోపేతం అయ్యాయి, రాష్ట్రంలో మూడో సారి అధికారం చేపట్టేందుకు టీఆర్ఎస్ కు ఎంత మేర అవకాశాలున్నాయి తదితర అంశాలపై కూడా కేసీఆర్, పీకే మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు ప్రగతి భవన్ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే.. ఇటీవల రాష్ట్రంలో తన ఐ ప్యాక్ బృందంతో తెలంగాణలో  పలు అంశాలపై విస్తృత సర్వేలు నిర్వహించింది. కేసీఆర్ తో భేటీలో పీకే ఆ సర్వేల వివరాలను కూడా ముఖ్యమంత్రికి కూలంకశంగా వివరించారని చెబుతున్నారు. బలమైన అభ్యర్థులు ఎవరు, విజయావకాశాలు ఉన్న అభ్యర్థులు ఎందరు, ఏ యే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది, ఎక్కడెక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది తదితర వివరాలతో ఫైనల్ నివేదికను పీకే కేసీఆర్ ముందుంచినట్లు చెబుతున్నారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో కేటీఆర్ పీకే సర్వేల ఆధారంగానే టికెట్లు ఉంటాయని పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతం ఇచ్చిన సంగతి విదితమే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ మరింత బలోపేతం కావాలంటే తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై పీకే కేటీఆర్ ల మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అదే విధంగా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ఏ వైఖరి అవలంబిస్తే కేసీఆర్ జాతీయ పార్టీకి దేశ వ్యాప్తంగా ఏదో ఒక మేరకు సానుకూలత లభిస్తుంది అన్న అంశంపై కూడా ఇరువురూ చర్చించినట్లు చెబుతున్నారు.