బిందూ.. స‌భ్య‌స‌మాజానికి సందేశ‌మేమిటి?

పెళ్లి అనేది గొప్ప వేడుక‌. బంధువులు, స్నేహితులు నానా హ‌డావుడి మ‌ధ్య బ్ర‌హ్మాండంగా జ‌రిగేది. ఇటీవ లి కాలంలో పెళ్లి అనేది త‌మ స్థాయిని ప్ర‌ద‌ర్శించేందుకు ఒక మార్గంగానూ భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నా రు. అస‌లు పెళ్లి అంటే వ‌రుడు, వ‌ధువు వారికి అన్ని హంగులు క‌ల్పించ‌డం అంతా ఆక‌ర్ష‌ణీయంగా, క‌నుల విందుగా వుంటుంది. కానీ అదేంటో క్ష‌మా బిందు అనే అమ్మాయి లోకం ఆశ్చ‌ర్య‌ప‌డేలా పెళ్లి చేసుకుంది.ఈమె పెళ్లి  క‌నీసం ఓ ఏడాదిపాటు దేశ‌మంతా ప్ర‌చార‌మ‌యినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. మ‌రి అలా అయింది ఆమె పెళ్లి. పెళ్లిళ్ల‌ల్లో సోలోగామీ  అనే ప‌ద్ధ‌తీ వుంద‌న్న‌ది  క్ష‌మా బిందు  పెళ్లితో అంద‌రికీ  బాగా తెలిసింది. త‌న‌ను  తాను ప్రేమించుకుని, త‌న‌ను తానే పెళ్లి చేసుకోవ‌డం విన్నారా? అదే విచిత్రం. అదే క్ష‌మా బిందు అనే గుజ రాతీ అమ్మాయి చేసిన ఘ‌న‌కార్యం. గుజ‌రాత్ వ‌డోద‌రాకు చెందిన  ఈ  24  ఏళ్ల క్ష‌మా బిందు త‌నను తాను మ‌ను వాడింది. ఈ పెళ్లికి పూజారి లేడు, అయిన త‌ర్వాత కొంగులు త‌డిసేలా ఏడిచేందుకు అప్ప గింతలూ లేవు. సోలోగామీ  సౌఖ్యంబిదే అమ్మాయిలూ!   ఇదేమి వివాహం అని చెవులు  కొరుక్కోన‌క్క‌ర్లేదు. చాలా కాలం స‌హ‌జీవ‌నం చేసి  బాగా  ఒక‌రినొక‌రు తెలు సుకున్న త‌ర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్న‌సంగ‌తి ఈరోజుల్లో చాలా మామూలయి పోయింది. అస‌లు ఒక రిని పెళ్లిచూపుల పేరుతో ఒక వ్య‌క్తికి చూపించి జాత‌కాలు క‌లిసేయ‌న్న గ‌ట్టి న‌మ్మ‌కంతో ఇరు కుటుంబాలు పెళ్లి చేస్తుండ‌టం అనాదిగా వున్న‌ది. కాల‌క్ర‌మంలో  అమ్మాయి, అబ్బాయి  ముఖ్యంగా ఒకే ప్రొఫెష‌న్‌లో వున్న‌వారు అండ‌ర్‌స్టాండింగ్ మీద క‌లిసి వుండి కొద్ది నెల‌ల‌కో, ఏడాది త‌ర్వాత‌నో ఇక పెళ్లి చేసుకుందా మ‌ని త‌ల్లిదండ్ర‌ల‌ను ఒప్పించి లేదా స్నేహితుల స‌హాయంతోనో పెళ్లి చేసేసుకుం టున్నారు. కానీ క్ష‌మా బిందు ఒక్కింత అడుగు ముందుకేసి అస‌లు పెళ్లికి వ‌రుడు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించింది. త‌న‌ను తానే పెళ్లిచేసుకోవ‌డం అనే ఒక కొత్త పోక‌డ‌కు నాంది ప‌లికింది.    వివాహ వ్య‌వ‌స్థ మీద‌నే న‌మ్మ‌కం లేని యువ‌తులు పెళ్లి చేసుకోకుండా వుండ‌డం వేరు. స్నేహం చేసి విడిపోవ‌డ‌మూ వేరు. కానీ త‌న‌కు పెళ్లి అంటే ఇష్టమే గాని అబ్బాయినే పెళ్లి చేసుకోన‌క్క‌ర్లేదు అన్ని విధాలా అండ‌ర్‌స్టాండింగ్ వున్న అమ్మాయినీ పెళ్లి చేసుకోవ‌చ్చు అనే విచిత్ర వివాహాలు జ‌రుగుతున్నా యి. ఇప్పుడు  ఈ వ‌డోద‌రా పిల్ల ఏకాఎకీ త‌న‌ని తాను పెళ్లి చేసుకుంది. పైగా గోవా ట్రిప్ కి వెళుతుందిట‌! పెళ్లికి, గోవా హ‌నీమూన్‌కీ క్ష‌మా త‌లిదండ్రులు ఓకే అనేయ‌డ‌మే ఇక్క‌డి ఊహించ‌ని ట్విస్ట్‌. ఇలాంటివి ప్రోత్స‌హించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అనే ప్ర‌శ్న ఇప్పుడు త‌లెత్తుతుంది. దీన్ని ప్రోత్స‌హించి గుజ రాతీ వారూ స‌భ్య‌స‌మాజానికి ఏ సందేశం ఇచ్చిన‌ట్టు??!

రాష్ట్రపతి ఎన్నిక విపక్షాల అనైక్యతే ఎన్డీఏ అసలు బలం

కేంద్ర ఎన్నికల సంఘం గంట కొట్టింది. రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్ధి విజయం కూడా ఇంచుమించుగా ఖరారైంది. షెడ్యూల్ విడుదలకు చాలా ముందుగానే,ఎన్డీఏ విజయానికి అవసరమైన సంఖ్యాబలాన్ని, సొంత ఖాతాలో చేర్చుకుంది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 50 శాతం గీత దాటేందుకు, ఎన్డీఎ సొంత బలానికి, కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే అవసరమవుతాయని లెక్కలు చెపుతున్నాయి. ఆ కాస్త వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు, ఆంధ్ర ప్రదేశ్’లో అధికారంలో ఉన్న, వైసీపీ, ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజేడీతో పాటుగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే సిద్ధంగా ఉన్నాయి. ఆ మూడు పార్టీల మద్దతు పొందేందుకు, ఎన్డీఏ నాయకత్వం అంతగా శ్రమించవలసిన అవసరం కూడా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అన్నా డిఎంకే ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ. ఇక వైసీపీ సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, జస్ట్ వంగమంటే, వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాష్టాంగపడి, అవసరం అనుకుంటే పొర్లు దండాలు పెట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారనేది,అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా, ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ముందుగానే  ఢిల్లీ పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఇక బిజూ జనతాదళ్’ మొదటి నుంచి కూడా రాజ్యాంగ పదవుల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ/ కూటమితో కలిసినడిచే విదానాన్నే పాటిస్తోంది. ఈ మూడు పార్టీలు కాకుండా బీజేపీని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలలో రహస్య మిత్రులు కూడా ఉన్నారని ఆయా పార్టీల ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. సో.. బీజేపీ / ఎన్డీఏ అభ్యర్ధి ఎవరైనా, వారే రేపటి రాష్ట్రపతి, అందులో సందేహం లేదని బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు.    అదలా ఉంటే విపక్షాల పరిస్థితి విచిత్రంగా (కొందరు గిట్టని వాళ్ళు ‘విషాదం’గా ఉందని అని కుడా అంటారు అనుకోండి, అది వేరే విషయం).నిజానికి, విపక్షాలు అన్నీ కలిసినా, బీజేపీ అభ్యర్ధిని ఓడించలేక పోవచ్చును కానీ, అదే జరిగితే బీజేపీకి గెలుపుపై ఇంత ధీమా ఉండేది కాదు. ఒక విధంగా చూస్తే  మోడీ, అమిత్ షాలకు ముచ్చెమటలు పట్టించే అవాకాశం విపక్షాలకు వుంది. అయితే,  విపక్షాలను  ఏకంచేసే ప్రయత్నాలు ఏవీ పెద్దగా జరగలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కొంత ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పనే అక్కరలేదు. అంతర్గత సమస్యలకు తోడు, ఇప్పుడు మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు, నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసు,పార్టీ అగ్ర నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే విధంగా జాతీయ రాజకీయాలు, 2024 ఎన్నికల వ్యూహ రచన, ప్రత్యాన్మాయ కూటమి, జాతీయ పార్టీ ... అంటూ అనేక రాస్త్రాలలో రాజకీయ యాత్రలు చేసిన కేసీఆర్ ఎందుకనో మౌనవ్రతం నుంచి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి అనుమానమే అంటున్నారు. ఏమైనా, 2024 ఎన్నికలకు ట్రయిల్ రన్’ అనుకున్న రాష్ట్ర పతి ఎన్నికలో విపక్ష వ్యూహం బెడిసి కొట్టినట్లే కనిపిస్తోంది.  అదలా ఉంటే, ఇటు అధికార కూటమి, అతి ప్రతిపక్ష కూటమి (?) అభ్యర్ధుల విషయంలో అనేక పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అధికార కూటమి తరఫున ముఖ్యంగా కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, అసోం గవర్నర్‌ జగ్దీశ్‌ ముఖి, ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనసూయ యూకీ పేర్లు వినబడుతుండగా.. ప్రతిపక్ష శిబిరం నుంచి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌లను బరిలో దించుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే, విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను బరిలో దించుతున్నట్టుగా వస్తోన్న ఊహాగానాలను ఇప్పటికే శరద్‌ పవార్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఎన్డీయే కూటమికి విస్పష్ట మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆ కూటమికి పోటీగా దిగే అభ్యర్థికి ఎలాంటి ఫలితం వస్తుందన్నది ముందే ఊహించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించినట్టుగా గతంలో ఎన్సీపీ వర్గాలే తెలిపాయి.గత రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెట్టిన బీజేపే . ఈసారి రాష్ట్రపతిగా ఆదివాసీలు లేదా మహిళలకు ఛాన్స్‌ కల్పించే అవకాశం కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. దీంతో ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అలాగే, గత ఎన్నికల్లోనే ద్రౌపది ముర్ము పేరు వినిపించినప్పటికీ, అనూహ్యంగా చివరకు రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీయే తమ అభ్యర్థిగా బరిలో దించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనుకుంటే మాత్రం ద్రౌపది ముర్ముకే ఎక్కువ అవకాశాలు ఉండొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇంకోవైపు, దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ  ఈ ఎన్నికల్లో అటువైపు నుంచి ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలూ లేకపోలేదన్న వాదనలూ ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాది నుంచి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ తమిళి సైలకు ఛాన్స్‌ ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది. తమిళిసై తమిళనాడుకు చెందినవారు కావడంతో పాటు ఓబీసీ సామాజిక వర్గానికి చెందడం ఆమెకు కలిసి రావొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.అయితే, చివరకు ఎవరు తెరమీదకు వస్తారనే విషయంలో  ఉహాగానాలు నిజం అవుతాయా? గతంలో లాగా అనూహ్య చిత్రం అవిష్కృతం అవుతుందా? తెలియాలంటే .. ఇంకొన్ని రోజుల నిరీక్షణ  తప్పదు.

బండి భేష్.. తెలంగాణలో కమలం వికసిస్తే ఆయనే సీఎం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ అధిష్టానం మొప్పు పొందారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించడానికి ఆయన ఒక్కరే చాలన్నంతగా బండి అధిష్టానం విశ్వాసాన్ని చూరగొన్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఆయనే అని ఇప్పటికే బీజేపీ హై కమాండ్ సంకేతాలిచ్చేసింది. అందులో భాగంగానే ఆయనకు లైన్ క్లియర్ చేయడానికి చర్యలకూ ఉపక్రమించేసింది. మా కంటే బండి చాలా జూనియర్ అంటూ తమ సీనియారిటీని ప్రదర్శిస్తారన్న అనుమానం ఉన్న నాయకులందరినీ ఏదో నెపంతో సైడ్ ట్రాక్ చేస్తోంది.  అందులో భాగంగానే తెలంగాణలోని బిజెపి సీనియర్ నాయకులను ఒక్కొక్కరిని రాష్ట్రంతో సంబంధం లేకండా జాతీయ స్థాయి బాధ్యతలు కట్టబెడుతోంది.  బండారు దత్తాత్రేయను గవర్నర్ గా పంపించిన జాతీయ నాయకత్వం కిషనర్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది. తాజాగా  ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు  కె. లక్ష్మణ్ ను  రాజ్యసభకు పంపించింది. తెలంగాణలో ప్రధానంగా ఉన్న సీనియర్ నాయకులను ఒక్కొక్కరిని కేంద్రానికి తీసుకెళ్ళడంతో పాటు వారికి సముచిత పదవీ బాధ్యతలను అప్పగిస్తూ వస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ కు లైన్ క్లియర్ చేస్తున్నట్టు రాష్ట్ర బిజెపి వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.   ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోం మంత్రి, ప్రధాని తర్వాత అంతటిస్థాయి నాయకుడు అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ ఒక్కడు చాలు... అంటూ కితాబు ఇచ్చారు.   తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని అమిత్ షా ఆ ఒక్క మాటతో రాష్ట్ర కేడర్ కు విస్పష్టంగా అర్దమయ్యేలా చెప్పేశారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.  బండి సంజయ్ నియోజకవర్గం కరీంనగర్ లో బిజెపిలో అసంతృప్తి నాయకులు సమావేశమైతే.. వారిని డిల్లీకి పిలిపించి మరీ జాతీయ నాయకత్వం క్లాస్ పీకింది.   ప్రజాసంగ్రామ యాత్రలో తనకు ప్రాధాన్యతనివ్వడం లేదని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించిన సందర్భంలోనూ  బీజేపీ అధిష్టానం ఆయనను సముదాయించింది.   తెలంగాణ బిజెపిలో అసంతృప్తి, అసమ్మతి మొలకెత్తిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అధినాయత్వం జోక్యం చేసుకుని బండికి మద్దతుగా నిలబడి అసమ్మతిని మొలకలోనే తుంచేస్తోంది.  బండి సంజయ్ అరెస్టు సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి స్పందించగా, ప్రధానమంత్రి నేరుగా ఫోన్ చేసి బండిసంజయ్ ను పరమార్శించారు. అనంతరం మరో మారు తెలంగాణకు బిజెపి అధ్యక్షుడిగా ఆయననే నియమించడం ద్వారా రాష్ట్ర పగ్గాలు బండి చేతిలోనే ఉన్నాయనీ, ఉంటాయనీ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో బండి సంజయ్ కి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం  దుబ్బాక ఉప ఎన్నికలోనూ, జిహెచ్ఎంసి ఎన్నికలలోనూ, హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయాలు సాధించడం కూడా బండికి కలసి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.    తెలంగాణలో బీజేపీ గతంలో ఎన్నడూ ఇంత బలోపేతంగా లేదని పార్టీ హైకమాండ్ భావిస్తోందనీ, బండికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాతనే ఈ పరిస్థితి ఏర్పడిందనీ బీజేపీ అగ్రనాయకత్వం నమ్ముతోంది.     తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపియేనని జనం కూడా భావిస్తున్నారంటే అందుకు బండి నాయకత్వమే కారణమని హై కమాండ్ నమ్ముతోందని పార్టీ కేడర్ కూడా అంటున్నారు. అయితే ముందు ముందు ఇదే పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బండితో సమానంగా వాగ్ధాటి ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లలో బండి పోకడలపై అసంతృప్తి వ్యక్తమౌతోంది. అయితే హైకమాండ్ బండికి మద్దతుగా ఇస్తున్న సంకేతాలు వారిని ప్రస్తుతానికి మౌనం దాల్చేలా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ గా బండి సంజయ్ అభివర్ణించిన ముగ్గురు ఎమ్మెల్యేలలోనూ కూడా పార్టీలో తమకు తగిన గుర్తింపు ప్రాధాన్యతా లేదన్న అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  ఈ పరిస్థితుల్లో పార్టీలో అసంతృప్తి మరింత పెచ్చరిల్ల కుండా హై కమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

యథా సర్కార్.. తథా పోలీస్..!

యథా రాజా తథా ప్రజా అన్నది పాత నానుడి.. యథా సర్కార్ తథా పోలీస్ అన్నది కొత్త ఒరవడి. జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ రేపు కేసులో పోలీసుల తీరు ఇందుకు మరో నిదర్శనం. పోలీసు వారు సర్కార్ పెద్దల మాటలు జవదాటకు.. సరే.. వేరే ఎవరైనా జవదాటినా ఒప్పరు. అంటే రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తారన్న మాట. జూబ్లీ హిల్స్ సామూహిక అత్యాచారం కేసులో  పోలీసు వారి తీరు సరిగ్గా అలాగే ఉంది.   ఇది బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావుపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పరిశీలకులు అంటున్నమాట. ఎందుకంటే ఈ నెల 7 పోలీసు కమిషనర్ ఆనంద్ ఏం చెప్పారో సరిగ్గా అదే మాట అంతకు నాలుగు రోజుల ముందే బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సెలవిచ్చారు. సామూహిక అత్యాచారం కేసులో బిగ్ షాట్స్ పిల్లలు ఉన్నారనీ, సామూహిక అత్యాచారం జరిగింది ఒక ఎమ్మెల్యేకు చెందిన అధికారిక వాహనంలోననీ. అయితే పోలీసులు మాత్రం ఠాఠ్ అదేం కాదు.. ఆ సామూహిక అత్యాచారం కేసులో ఉన్ననలుగురిలో ముగ్గురికి అరెస్టు కూడా చేసేశామని అప్పుడు పోలీసులు సెలవిచ్చారు. అంటే కేసు దర్యాప్తూ గట్రా ఏం లేకుండానే   అసమదీయుల సంబంధీకులను కేసు నుంచి తప్పించడానికి సర్కార్ మార్గదర్శకత్వంలో పోలీసులు స్క్రిప్ట్ రెడీ చేసేశారన్న మాట. సరిగ్గా అప్పుడే రఘునందనరావు ఆధారాలతో సహా బయటపెట్టడంతో పోలీసులకు ఊపిరాడలేదు. మీడియా సహా అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో  మంత్రి కేటీఆర్ అప్పుడు నోరు విప్పారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదని ఒక హెచ్చరిక చేశారు. అప్పుడు పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్యే పేరును చేర్చారు. అత్యాచారం జరిగిన కారునూ గుర్తించారు. అయినా వాస్తవాలను బయటపెట్టి తమ ఏలిన వారికి ఇబ్బంది కలిగించిన రఘునందనరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి రఘునందనరావు ఆ రోజు వాస్తవాలను మీడియా ముఖంగా బటయ పెట్టకపోయి ఉండుంటే..  హై ప్రొఫైల్ రేప్ కేసును మసిపూసి మారేడు  కాయ చేసేవారనడంలో సందేహం లేదు.    తమ తప్పులు బయటపడతాయని, తాము దాచిన నేరస్తుల వివరాలు వెలుగుచూశాయి అనే కారణంతో లేదా అక్కసుతో రఘునందన్ రావు పైపోలీసుల కేసు నమోదు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణను జనంఆమోదిస్తున్నారు.   బాధితురాలి వివరాలు తాను చెప్పలేదని.. చెప్పినట్లు ఆధారాలు చూపిస్తే ఎంతటి చర్యకైనా సిద్ధం   అని రఘునందన్ రావు చెబుతున్నా   పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి    గతంలో సంచలనం సృష్టించిన  దిశ  ఘటనలో స్వయంగా ఐపీఎస్ అధికారులే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరాలు తెలిపారు. అప్పుడు మైనర్లు, బాధితురాలి వివరాలు వంటివేవీ వారికి అడ్డు రాలేదు.  అదే విధంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అప్పుడు  228-A కింద వారెవరిపైనా ఎందుకు కేసు నమోదు చేయలేదు.     జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ రేప్ కేసులో  ఎటువంటి విచారణ లేకుండానే నాలుగో తేదీ సాయంత్రం డిసిపి జో యల్ డేవిడ్ నిందితుల పేర్లను వెల్లడించడం చూస్తుంటే దొంగలను కాపాడడానికి పోలీసులు ఎంతగా ప్రయత్నించారో తేటతెల్లమౌతుంది. అవన్నీ విఫలమైనాయన్న కక్షే రఘునందనరావుపై కేసు రూపంలో పోలీసులు బయటపెట్టుకున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

తమిళులను చూసి నేర్చుకోండి.. తెలుగూస్ కు జస్టిస్ ఎన్వీ రమణ సూచన

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీరమణ తెలుగువారు. తెలుగు భాష పట్ల అపారమైన అభిమానం ఉన్నవారు. ఆయన తెలుగు వారందరికీ ఒక సూచన చేశారు. అదేమిటంటే భాష పట్ల గౌరవం, అభిమానం, మమకారం ఎలా ఉండాలి అన్న విషయాన్ని తమిళులను చూసి నేర్చుకోండి అని. ఈ సూచన ఆయన తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించేలా చేసిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ వేడుక వేదికపై నుంచి చేశారు. తిరుపతిలో గురువారం జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ పట్ల తనకున్న అపార గౌరవాభిమానాలను ఏ మాత్రం దాచుకోకుండా వెల్లడించారు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారు మహా పురుషులౌతారు అన్నదానికి అతికినట్లు సరిపోయే ఉదాహరణ ఎన్టీఆర్ అని జస్టిస్ రమణ చెప్పారు. ఎన్టీఆర్ ను ఒక సంపూర్ణ మానవతా మూర్తిగా అభివర్ణించారు. రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, సినిమా హీరోగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహామనీషని కొనియాడారు.  పార్టీ పెట్టిన  తొమ్మిది నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఘనత ఎన్టీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. తనపై ఎన్టిఆర్ మనిషి అని ముద్ర వేశారని, అది తనకు గర్వకారణమని అన్నారు.  కాలేజీ  రోజుల్లోనే ఆయన తనను అభిమానించే వారని, 1983లో ఆయన కోసం పరోక్షంగా పని చేశానని కూడా చెప్పుకొచ్చారు. ఆగస్టు సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ తరుపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదని, అయితే  అశేష ప్రజాభిమానమే ఆయనకు అండగా నిలిచిందన్నారు.  ఎన్టీఆర్‌కు పద్మ, ఫాల్కే వంటి అవార్డులు దక్కకపోవడం తెలుగు వారి దురదృష్టమన్న జస్టిస్ ఎన్వీ రమణ తాను పదవీ విరమణ చేసిన తరువాత ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానని చెప్పారు.

వినరు..కనరు..నోరెత్తనివ్వరు!

చెప్పింది వినరు, చేసేది చెప్పరు.. సమస్యలు పట్టించుకోరు.. విమర్శలను సహించరు. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు.. కానీ రాజే మొండివాడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలంటే.. ఛఛ చెప్పడం ఎందుకు ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలను చూపిస్తే సరిపోతుంది. నోరెత్తడానికి లేదు.. చెవులకు పని చెప్పడం తప్ప. నియోజకవర్గాలలో చేయడానికి ఏమీ ఉండదు వాలంటీర్లు, వార్డు సెక్రటరీలూ చేసేది చూడటం తప్ప. నియోజకవర్గంలో సమస్యలపై జనం నిలదీస్తుంటే ఏం చేయాలో తెలియక జగన్ వద్దకు వెడితే.. ఆయన ప్రభుత్వ పథకాలూ, గత ప్రభుత్వ తప్పిదాలు అంటూ ఆవు కథ చెబుతారు. అది విని తీరాలి. అదే వినాలి. అయన ఎదుట చెవులకే పని చెప్పాలి. నోరెత్తి  మాట్లాడకూడదు. ఫైరైపోతారు. ఫైర్ చేసేస్తారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు నోరు కుట్టేసుకోవడం తప్ప మట్లాడే అవకాశమే లేదు. ఇంతా చేసి అన్నీ సహించి ఊరుకుంటే చివరాఖరికి ప్రజా వ్యతిరేకతకు ఎమ్మెల్యేల అసమర్థతే కారణమంటూ వారి ఫర్ఫార్మెన్స్ కు మార్కులేసి క్లాసులు పీకుతారు. దీంతో ఎమ్మెల్యేలు బలికి సిద్ధమైన గొర్రెల్లా మారారు. తమను బలిచ్చైనా సరే మరో సారి తాను ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యాన్ని చేరుకోవడమే జగన్ ధ్యేయంగా కనిపిస్తోందని ఎమ్మెల్యేలు లబో దిబో మంటున్నారు. ప్రజలు అయితే హాయిగా జగన్ ప్రసంగాలు వినకుండా సభనుంచి వెళ్లిపోయి నిరసన తెలపగలరు. వాళ్లకా హక్కు ఉంది. దానికి కూడా ఎమ్మెల్యేలే బాధ్యులంటే ఎలా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఏ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కలిసినా బాధలు పంచుకుని భోరు మనే పరిస్థితి ఉంది. ఇక మంగళవారం నాటి వర్క్ షాప్ అయితే మరీ దారుణమని వైసీపీ ఎమ్మెల్యేలే ఆఫ్ ది రికార్డ్ చేబుతున్నారు. ఇంతకీ అసలు వర్క్ షాపులో ఏమైందంటే.. జగన్ ప్రభుత్వ గొప్పలను సుదీర్ఘ ప్రసంగంలో వివరించేశారు. ఎమ్మెల్యేలు ప్రజలలో మమేకం కావాలని ఉద్భోదించారు. గడప గడపకూ  మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోలేదంటూ క్లాస్ పీకారు. అసలీ కార్యక్రమం ఇంకా ప్రారంభించని ఎమ్మెల్యేలకు జీరో పర్ఫార్మెన్స్ అంటూ ‘వీరతాడులు’ తగిలించారు. ఇక అప్పుడు మీ కేమైనా సమస్యలున్నాయా చెప్పండంటూ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. ఇక్కడే జగన్ డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకునేలా తొలుత మాట్లాడిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో సమస్యలే కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలనూ ఎత్తి చూపేశారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న లక్ష్యం చేరుకోవాలంటే.. పనులు చేయక తప్పదనీ, బిల్లులు చెల్లించి తీరాలనీ సూచనలూ సలహాలూ ఇచ్చేశారు.అయితే జగన్ వాటిని వేటినీ అంగీకరించలేదు. ఎమ్మెల్యేలై ఉండి మీడియాలో వచ్చిన వార్తలు ఇక్కడ వల్లె వేస్తారేమిటంటూ చిరాకు పడ్డారు. అయినా సరే అవన్నీ చేయడం సాధ్యం కాదు అని కుండబద్దలు కొట్టేశారు.దీంతో మిగిలిన ఎమ్మెల్యేలెవరూ మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కాదు కాదు సాహసం చేయలేదు. మొత్తం మీద  ఈ వర్క్ షాపు ద్వారా అర్ధమైందేమిటంటే.. జగన్ ప్రభుత్వం పనులు చేయదు, వైఫల్యాలను సరిదిద్దు కోదు..  జగన్ మరోసారి సీఎం అవ్వడానికి వైసీపీ ఎమ్మెల్యేలు బలి పశువులుగా మారి సోపానాలవ్వాలి. అంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదు, ఎమ్మెల్యేల వైఫల్యంగా చూపించి..వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వరు. మరో కొత్త ముఖాన్ని తీసుకువచ్చి.. మీ పాత ఎమ్మెల్యే చాతకాని తనం వల్లే సమస్యలు పేరుకుపోయాయి.. అందుకే టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటారు. ఒక్క చాన్స్ సరిపోలేదు, మరోక్క చాన్స్ అంటూ మళ్లీ నవరత్నాలనో, ఏవో వజ్రాలంటూనో జనం ముందుకు వస్తారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలకు దూరమై, పార్టీలోనూ పలుచనై వైసీపీ ఎమ్మెల్యేలు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యరని పరిశీలకులు అంటున్నారు.

దక్షిణాదిన కమల వికాసం తెలంగాణలో కాషాయ జెండా?

భారతీయ జనతాపార్టీ, ఆ పార్టీ నాయకులు పదేపదే  చెప్పుకునే విధంగా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యదిక సభ్యత్వం ఉన్న,అతి పెద్ద రాజకీయ పార్టీ, అయితే కావచ్చును. కానీ, వింధ్యకు అవలే కానీ, గీత దాటి దక్షిణాదిలోకి వస్తే, కమల దళానికి ఒక్క కర్ణాటక మినహా మరో రాష్ట్రంలో అంతగా రొమ్ము విరుచుకునే స్థాయిలో బలం లేదు. బలగం లేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణలోనూ బీజేపీ కొంత పుంజుకుంటోంది. 2019 లోక్ సభ ఎన్నికలలో  అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఆక్కడ నుంచి బీజీపీ దూకుడు పెంచింది.  అధికార తెరాస, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలకు సమ ఉజ్జీగా గట్టి పోటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులోనూ దూకుడు పెంచింది. ఏపీ, కేరళలో ప్రయత్నం జరిగిన అడుగులుపడడం లేదు.   అయినా మొత్తంగా చూస్తే, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే, దక్షిణాదిన బీజేపీ ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి వుంది. అందులో సందేహం లేదు. ఈనిజాన్ని, ఆ పార్టీ  నాయకులే  అంగీకరిస్తారు. మొత్తం ఐదు దక్షిణాది రాష్ట్రాలలో 129 లోక్ సభ స్థానాలుంటే, 2019 ఎన్నికలో బీజేపీ ఖాతాలో చేరింది ఆ పై 29 సీట్లు మాత్రమే (కర్ణాటక 25, తెలంగాణ 04) ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కమలదళం ఖాతానే తెరవలేదు.  అయితే, ఇప్పుడు కమలనాధులు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరించారు. 2024 లోక్ సభ ఎన్నికలలో, ఇప్పుడున్న స్థానాలకు రెట్టింపు స్థానాలు గెలుచుకునేలా, వ్యూహ రచన చేసిన బీజేపీ ఆచి తూచి, అతి జాగ్రత్తగా  అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో,లోక్ సభ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికలపైనా కాషాయ దళం దృష్టిని కేద్రేకరించింది. అందితే అధికారం, కాదంటే కనీసం ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేరుకునేదుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇలా ఒకరి వెంట ఒకరు రాష్ట్రంలో పర్యటించి పట్టు పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ క్యాడర్’లో జోష్ పెంచే ప్రయ్తాన్ చేస్తున్నారు. మరోవంక తెరాస వ్యతిరేకతే ప్రధాన అజెండాగా రాజకీయం చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి వివిధ పార్టీల నాయకులు కమల వైపు చూస్తున్నారు. ఇప్పటికైతే ఇటు నేతల దృష్టిలో, అటు ప్రజల దృష్టిలోనూ కూడా, తెరాసకు బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  అదే విధంగా దక్షిణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకోవడం లక్ష్యంగా, తెలంగాణ నుంచి దండయాత్రను ప్రారంభించేందుకు, కమల దళం, సుమారు రెండుదశాబ్దాల తర్వాత జులై 2,3 తేదీలలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‘లో నిర్వహించాలని నిర్ణయించింది, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ, ఆపనిలో  నిమగ్నమైంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రెండు రోజులు భాగ్యనగరం కాషాయమయం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ కీలక నేతలందరూ హైదరాబాద్‌లో కొలువు దీరనున్నారు. పదహారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుమారు 40 మందికి పైగా కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి పథాదికారులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్టీ కీలక నేతలందరూ హాజరు కానున్నారు. సమావేశాలు జరిగే 2 రోజుల పాటు ప్రధాని మోడీ రాజ్‌ భవన్‌లో బస చేయనున్నట్లు తెలుస్తోంది.  సరే, ఏర్పాట్ల విషయం ఎలా ఉన్నా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కాకుండా, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్’ లో నిర్వహించాలనే నిర్ణయం వెనక భారీ స్కెచ్ ఉందని రాజకీయ, మీడియా వర్గాలో చర్చ జరుగుతోంది. మనం ఇంతకు ముందే అనుకున్నట్లుగా, దక్షినాది రాష్ట్రాలలో పార్టీ నిర్మాణం ప్రధాన లక్ష్యం అయితే, తెలంగాణలో తెరాసను గద్దెదించి, కాషాయ జెండా ఎగరేయడమే జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్’లో నిర్వహించడం వెంక ఉన్న మరో ప్రధాన లక్ష్యమని వేరే చెప్పనక్కర లేదు.  అయితే అది అయ్యే పనేనా, ఉత్తర బారత పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ దక్షిణాదిలో పాగా వేయడం సాధ్యమేనా? ముఖ్యంగా వంతుల వారీగా అధికార, ప్రతిపక్ష భూమికను పోషించే  ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్’ రాష్ట్రాలలో బీజేపీ, నిలబదగాలుగుతుందా? అంటే, బీజేపే నాయకులు ఈశాన్య రాష్ట్రాల వైపు చూడండి... లుక్ నార్త్ ఈస్ట్ .. అంటున్నారు. ఒకప్పుడు ఒకటి రెండు శాతం ఓటు కూడా లేని అస్సాం, త్రిపురలలోనే కాదు, ఎనిమిదికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ, మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయని అంటున్నారు.  అలాగే, పశ్చిమ బెంగాల్’లోనూ అధికారంలోకి రాలేక పోయినా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను ‘జీరో’ కు చేర్చి. బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందిందని, బీజేపీ నాయకులు  ధీమాగా ఉన్నారు. మరోవంక రాజకీయ విశ్లేషకులు కూడా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, 30 - 40 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకున్నా, తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అవుతుందని, రాష్ట్రం నుంచి  బీజేపీ ఆశిస్తున్న విధంగా సగానికి పైగా లోక్ సభ స్థానాలను సునాయాసంగా గెలుచు కుంటుందని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో దినదిన ప్రవర్తమానంగా దిగజారి పోవడం, జాతీయ నాయకత్వం అంతే వేగంతో బలహీనమవడం కూడా బీజేపీకి కలిసొచ్చె అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.  అయితే, జాతీయ కార్యవర్గ సమావేశాలు  హైదరాబాద్’లో నిర్వహించినంత మాత్రాన, ఆ  ఒక్క కారణంగా తెలంగాణలో, దక్షణాది రాష్ట్రాలలో బీజేపే బలాన్ని పుంజుకుంటుందని అనుకుంటే  పొరపాటే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంగా 2004 లోక్ సభ ఎన్నికలకు ముందు, దక్షణాది రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నరోజుల్లోనే, 2003 చివర్లో, హైదరాబాద్’లోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. అయినా .. ఆవెంటనే జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమిటో... వేరే చెప్పనక్కరలేదు. అటల్జీ పాలనలో దేశం వెలిగి పోతోందని ప్రచారం జరిగినా .. ఆ ఎన్నికలలో కమలం వాడి పోయింది. కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పడిన యూపీఎ ప్రభుత్వం పదేళ్ళు దేశాన్ని పాలించింది.రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ కూటమి అధికారం కోల్పోయింది. అంతకు ముందు పదేళ్ళు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన వరకు పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రాని హస్తం పార్టీ పాలించింది. సో .. హైదరాబాద్’లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం వల్ల మాత్రం చేతనే బీజేపీ దక్షిణాదిన /తెలంగాణలో  జెండా పాతేస్తుందని అనుకోవడం కుదరదని పరిశీలకులు అంటున్నారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం కమల వికాసానికి అనుకూలంగా ఉందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.

సిర్పూర్ కర్ కమిటీ నివేదిక ఏమైంది?.. సైడ్ ట్రాక్ చేయడానికేనా జూబ్లీ కేసు గోల

కొన్ని సంఘ‌ట‌న‌లు చాలా చిత్రంగా మ‌లుపు తిరుగుతుంటాయి.  ఒక కేసుకు సంబంధించిన విచార‌ణ మ‌రో కేసు విచార‌ణ‌ను జ‌నం కూడా మ‌ర్చిపోయేలా చేస్తుంటుంది.  అంతేకాదు అస‌లు ఆసంగ‌తి ఎవ‌రికీ గుర్తు రాకుండా మ‌రో కేసు తాలూకు విచార‌ణ‌లో పోలీసులు, జ‌నం త‌ల‌మున‌క‌ల‌య్యేట్టు చేయ‌డం చాలా తెలివిగా జ‌రుగుతుంది. స‌రిగ్గా ఇలాంటిదే  ఇపుడు హైద‌రాబాద్‌లో అంద‌రూ గ‌మ‌నిస్తున్న చిత్ర రాజం! దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ హ‌త్యాచారం కేసులో ఎన్‌కౌంట‌ర్ మీద మే 20న‌ సుప్రీంకోర్టు విచార‌ణ ముగిసింది. 2019 డిసంబ‌ర్‌లో హైద‌రాబాద్ స‌మీపంలో జ‌రిగిన న‌లుగురి ఎన్‌కౌంట‌ర్పై సిర్పూర్ కర్ క‌మిష‌న్ త‌న నివేదిక‌ను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ తో కూడిన ధ‌ర్మాస‌నం  క‌మిష‌న్ రిపోర్ట్‌ను అందుకుంది. అయితే దాన్ని సీల్డ్ క‌వ‌ర్‌లోనే వుంచాల‌న్న తెలం గాణ‌ ప్ర‌భుత్వ సూచ‌న‌ని కోర్టు తిర‌స్క‌రించింది. అంతేకాదు ఆ కేసుకు సంబంధించిన వారికి ఆ రిపోర్ట్ అంద‌జేయాల‌ని ధ‌ర్మాస‌నం ఆదేశించింది.  తెలంగాణా హైకోర్టుకి ఆ రిపోర్టు పంపి దాని మీద వెంట‌నే త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌న్న‌ది.  చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ వ్యాఖ్యా నించారు.  ఈ కేసు విచారణలో భాగంగా వీసీ సజ్జనార్‌ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. అలాగే.. నివేదిక కాపీలను ఇరు పక్షాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 26 ఏళ్ల వెట‌ర్న‌రీ లేడీ డాక్ట‌ర్‌ను రేప్ చేసి హ‌త్య చేసిన కేసులో న‌లుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు ఎన్‌కౌం ట‌ర్ చేశారు. ఆ కేసులో విచార‌ణ చేప‌ట్టేందుకు అప్ప‌టి సీజేఐ ఎస్ఏ బోబ్డే ఓ ఎంక్వైరీ ప్యాన‌ల్‌ను ఏర్పా టు చేశారు. సుప్రీంకోర్టు మాజీ జ‌డ్జి జ‌స్టిస్ వీఎస్ సిర్పూర్క‌ర్ నేతృత్వంలో ప్యాన‌ల్ ఆ ఎన్‌కౌంట‌ర్‌పై రిపోర్ట్‌ను త‌యారు చేసింది. ఆ బృందంలో బాంబే హైకోర్టు జ‌స్టిస్ రేఖా బాల్దోటా, సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ డీఆర్ కార్తికేయ‌న్ ఉన్నారు. రిపోర్ట్‌ను సీల్డ్ క‌వ‌ర్‌లోనే ఉంచాల‌ని తెలంగాణ సీనియ‌ర్ న్యాయ‌వాది శ్యామ్ దివ‌న్ కోరారు. కానీ ఆ అభ్య‌ర్థ‌న‌ను సీజేఐ తిర‌స్క‌రించారు. దీంట్లో ర‌హ‌స్యం ఏమీ లేద‌ని, కొంద‌రు దోషు లుగా తేలార‌ని, ఇక హైకోర్టు  ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని సీజేఐ ర‌మ‌ణ తెలిపారు.దిశ నిందితులు మొత్తం 4 మందిని అదే తరహాలో కాల్చివేశారు, మరెంతో మందిని లైంగికంగా వేధించా రు. పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్న షాకింగ్  విష‌యాలేమంటే..రేప్ కేసు నిందితుల‌ను చంపా ల‌న్న ఉద్దేశంతో పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేసిన‌ట్లు క‌మిటీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. న‌లుగురు నిందితుల్లో ముగ్గురు మైన‌ర్లు ఉన్నార‌ని, హైద‌రాబాద్ పోలీసుల ప‌నితీరుపై కూడా రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఈ కేసు విచార‌ణ‌లో చాలా లోపాలు ఉన్న‌ట్లు క‌మిష‌న్ వెల్ల‌డించింది. ఈ కేసుతో లింకు ఉన్న ప‌ది మంది పోలీసు ల్ని విచారించాల‌ని క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. ఎన్‌కౌంట‌ర్‌లో మృతిచెందిన జోలు శివ‌, జోలు న‌వీన్‌, చింత‌కుంట చెన్న‌కేశ‌వులు మైన‌ర్లు అని రిపోర్ట్‌ పేర్కొన్న‌ది. ఎన్‌కౌంటర్ పట్ల ఆనందం వ్యక్తం చేసిన దిశ కుటుంబ సభ్యులు, తెలంగాణ పోలీసుల చర్య పట్ల  దేశ మంతటా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. కానీ  మానవ హక్కులు ఉల్లంఘించారని మరికొన్ని వర్గాల గొగ్గోలు పెట్టేయి.  10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని క‌మిష‌న్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని  క‌మిష‌న్ తెలిపింది.  దీన్ని గురించి తీసుకునే చ‌ర్య‌లకు ఎప్పుడు శ్రీ‌కారం చుడ‌తారో ప్ర‌జ‌ల‌కు తెలియాలి. ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుంద‌న్న‌దీ కావాలి.  నిజానికి ప్ర‌భుత్వానికి ఇదో పెద్ద త‌ల‌నొప్పిగా మారుతుంద‌న్న భ‌యంతోటి  అనుమానంతోనే  మొత్తం రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని మొన్నటి జూబ్లీహిల్స్ కారు రేప్ కేసువేపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు బాగానే చేసేరు.  ప్ర‌జ‌లు దీని మీద చ‌ర్చించ‌డంలో వున్నందువ‌ల్ల గ‌త కేసుల గురించి ఆట్టే ప‌ట్టించుకోరులే అనుకోవ‌డ‌మే పెద్ద పొర‌పాటు. 

రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల .. 18న పోలింగ్.. 21న ఓట్ల లెక్కింపు

దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతిపై సార్వత్రిక ఎన్నికలలో ఉండే ఆసక్తి ఉత్కంఠ నెలకొంది.  రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం  విడుదల చేసిన షెడ్యూల్ మేరకు రాష్ట్రపతి ఎన్నికతో పాటే ఉప రాష్ట్రపతి ఎన్నికా జరుగుతుంది. రాష్ట్రపతి  ఎన్నికకు జూన్ 15న  నోటిఫికేషన్ విడుదల అవుతుంది.  నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరుగుతుంది. అదే నెల 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగియనుండడంతో  కొత్త రాష్ట్రపతి జూలై 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికతో పాటే ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.   దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండే  ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. అసెంబ్లీల విషయంలో ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది.  ఎమ్మెల్సీలకు ఉండదు. ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యుల ఓటుకు  ఓ విలువ ఉంటుంది. ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా ఎమ్మెల్యేలకు మరో విధంగా  ఉంటుంది.  ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు.  మొత్తం ఎలక్టోరల్ కాలేజీ  ఎలాక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10.98.903 ఓట్లు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నది. బీజేపీకి సొంతంగా తాను నిలబెట్టే అభ్యర్థిని గెలిపించుకునేంత బలం ఎలక్టోరల్ కాలేజీలో లేకపోవడంతో అనివార్యంగా ఇతర పార్టీల మద్దతు పై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇక విపక్షాలు కూడా బీజేపీ ఆధిపత్యానికి అడ్డు కట్ట వేయడానికి రాష్ట్రపతి ఎన్నికను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఈ సారి ప్రజలందరి దృష్టీ కూడా ఈ ఎన్నికలో ఎవరిది పై చేయి  అన్న విషయంపై ఉంది.   ఇప్పటికీ అటు బీజేపీ కానీ, ఇటు విపక్షాలు కానీ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించగా, బీజేపీయేతర పక్షాలు కాంగ్రెస్ ఖరారు చేసే అభ్యర్థి ఎవరన్న దానిపై దృష్టి సారించాయి. బీజేపీ యేతర పార్టీలతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు.  ఇక రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ   పలువురి పేర్లు పరిశీలిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో అందరి ఊహలకు, అంచనాలకు అందకుండా తెరమీదకు తీసుకువస్తున్న బీజేపీ ఈ సారి కూడా అదే పంథాను అవలంబించాలని భావిస్తోంది.   2017లో అనూహ్యంగా రామ్ నాథ్ కోవింద్ ను అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చిన కమలనాథులు ఈ సారి ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోనికి దింపుతారన్న విషయంలో సస్పెన్స్ నెలకొంది.   బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఈ సారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని రంగంలోనికి దింపే అవకాశం ఉందని కూడా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తోందంటున్నారు. ఎందుకంటే కర్నాటక వినా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ఇప్పటివరకూ పట్టు లేదు. ఈ సారి ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న కమలనాథులు రాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని రంగంలోనికి దింపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇక విపక్షాల నుంచి ఇప్పటి వరకూ ఉమ్మడ అభ్యర్థి   విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకింత ప్రయత్నం చేసినా అది పెద్దగా కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు.  దీంతో కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్థికే వపక్షాలు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఈడీ సమన్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వీధి పోరాటాలు ..?

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమాన్లు జారీ చేసింది. విచారణ జరుగుతోంది. ఈ నేపధ్యంలో,  కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకునే ప్రయత్నం చేస్తోందా, అంటే, రాజకీయ పరిశీలకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.  గతంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి, కొరివితో తల గోక్కుంది. అంతకు కొద్ది నెలల ముందు జరిగిన ఎన్నికలో  కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ప్రజలే, ఆ తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ ( జనతా) ప్రభుత్వం ఇందిరా గాంధీని అరెస్ట్ చేయడాన్ని క్షమించ లేక పోయింది. అందుకే కేవలం 11 నెలలలోనే జనతా ప్రభుత్వం కూలిపోయింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికలలో  ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నా. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని అగౌరవ పరిచినా, కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసి అవమానాలపాలు చేసినా దేశ ప్రజలు క్షమించరని. కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో  నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసును రాజకేయంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యే సమయంలో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా  ఆందోళనలు నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ  అనారోగ్యం కారణంగా, నిన్న (బుధవారం) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కాలేదు. నిజానికి పక్షం రోజుల క్రితమే, జూన్ 8 న విచారణకు హాజరు కావాలని, ఈడీ ఆమెకు సమన్లు జారీచేసింది. అయితే, ఇటీవల ఆమెకు  కరోనా సోకినా నేపధ్యంలో విచారణకు మూడు వారాలు గడవు కోరారని, కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల కరోనా బారిన పడిన సోనియా.. ఇంకా కోలుకోని కారణంగా ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని.. విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు పేర్కొన్నాయి. మరోవంక ఇదే కేసులో, సమన్లు అందుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూడా విదేశాలలో ఉన్న కారణంగా, జూన్ 2 న విచారణకు హాజరు కాలేదు. అయితే అయన అభ్యర్ధన మేరకు ఈడీ విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. కాగా,రాహుల్ గాంధీ ఈనెల 13న విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాల సమాచారం. మరో వంక ఇదే కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. మరోవంక  నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆరోపణల జుగల్ బందీ నడుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయదాన్నికాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. నేషనల్ హెరాల్ద్ కేసు విషయంలో సోనియా, రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా పేర్కొన్నారు. బీజేపే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ‘నేరం చేసిన వారు ఎవరైనా నేరం చేశామని అంగీకరిస్తారా?   అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తల్లీ కొడుకులు నేరం చేయందే నిజం అయితే ఆ ఇద్దరూ  విచారణకు హాజరై, తమ నిజాయతీని నిరూపించుకోవాలని నడ్డా కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు.   అదలా ఉంటే కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. మరో వంక  ఈనెల 13న ఈడీ విచారణకు హజరుకావాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ హజరయ్యే రోజు.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులందరినీ పిలిచినట్లు తెలుస్తోంది.  ఈ సమావేశంలో రాహుల్ గాంధీ హాజరు అంశంపై చర్చించనున్నారు. రాహుల్‌ ఈడీ ఎదుట విచారణకు హాజరైన రోజు.. దేశ వ్యాప్తంగా భారీగా నిరసన కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ఉంది కాంగ్రెస్‌. సోనియా, రాహుల్‌ ఈడీ విచారణకు హాజరు అయ్యే అంశంపై పార్టీ సినియర్‌ నేతలు చర్చించినట్లు ఏఐసిసి వర్గాల వెల్లడించాయి. ఈ రోజు (గురువారం) వర్చువల్‌గా జరిగిన భేటీకి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులు   ఏఐసీసీ ఆదేశాలమేరకు హాజరయ్యారు. సో.. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు రాజకీయ మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే, న్యాయస్థానాల్లో తేల్చుకోవలసిన అంశాన్ని వీధుల్లోకి తీసుకురావడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ప్రయోజనం దక్కుతుందా లేక అది కూడా బూమ్రాంగ్ అవుతుందా అనే విషయంలో  కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

సాక్షి అనుమానాస్ప‌ద మృతి.. వివేకా హత్య కేసులో అసలేం జరుగుతోంది?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక  హై ప్రొఫైల్ కేసులోనే సాక్షి అనుమానాస్పద స్థితిలో మరణించడం ఏమిటి? అసలేం జరుగుతోంది ఏపీలో. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయాన చిన్నాన్న వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు సీబీఐ దర్యాప్తు చేస్తున్నసంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలుగు చూస్తున్న తరుణంలో   ఈ కేసులో  సాక్షిగా వున్న వ్య‌క్తి అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో మృతి చెంద‌డం కలకలం రేపుతోంది.   చిత్ర‌మే మంటే సినిమాటిక్‌గా ఆ వ్య‌క్తి అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించ‌డం. గ‌తంలో ప‌రిటాల ర‌వి  కేసులో  సాక్షులు వ‌రుస‌గా ఇలానే మృతి చెంద‌డాన్ని గుర్తు చేస్తూపలువురుకేసు ఎలా సాగుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ కేసు దర్యాప్తు చేస్తున్నసీబీఐ అధికారులకే  బెదరింపులు రావడం తెలిసిందే.   అస‌లు రాజ‌కీయ నాయకుల‌కు సంబంధించిన కేసుల్లోనే  ఇటువంటి ప‌రిస్థితి గురించి విన‌డం, చూడ‌టం పోలీసువ‌ర్గాల మీద న‌మ్మ‌కం త‌గ్గిస్తుంది.  మంత్రి  వై.ఎస్‌.వివేకా  నంద రెడ్డి హ‌త్య‌కేసు ఇప్ప‌టికే మ‌లుపులు తిరి గింది. ఇపుడు ఆ కేసుకు సంబంధించిన సాక్షి గంగా ధ‌ర్ రెడ్డి బుధ‌వారం రాత్రి మృతి చెంద‌డంతో  కేసు మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింద‌నే అనాలి.  అంత‌పురం జిల్లా యాడికి కి చెందిన గంగాధ‌ర్ త‌న నివాసంలో మ‌ర‌ణించేడు. గురువారం ఉద‌యం లేవ లేదు. కుటుంబ‌స‌భ్యులు వైద్యుల్ని సంప్ర‌దించ‌గా అత‌ను ప‌ల్స్‌రేట్ ప‌డిపోవ‌డం వ‌ల్ల‌నే మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌క‌టించేరు. పోలీసులు ఈ మ‌ర‌ణం స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని  తేల్చేరు. కేసు విష‌యానికి వ‌స్తే, వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి మూడేళ్ల‌యింది. కానీ అస‌లు సూత్ర‌ధార‌లు ఎవ‌ర‌న్న ది సిబిఐ ఇప్పటి వరకూ తేల్చ‌లేక‌పోయింది.  ఈ కేసులో వివేకా  మాజీ కారు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా  మారాడు. అప్ప‌టి నుంచి త‌న ప్రాణాల‌ను కాపాడాల‌ని పోలీసుల‌కు మొర‌పెట్టుకుంటూనే వున్నాడు.  ఏ క్ష‌ణాన త‌న‌కు ఏమ‌వుతుందోన‌న్న భీతిలోనే బ‌తుకుతున్నాడు. పోతే, ఈ కేసు ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారు ల‌పై  ఉల్టా కేసు పెట్ట‌డ‌మేకాకుండా, వారి డ్రైవ‌ర్‌నీ బెదిరించ‌డం మ‌రీ చిత్రం.  సీబీఐ వారు దేన్ని అనుమానించ‌క వ‌ద‌ల‌రు. రెండు రోజుల క్రిత‌మే పులివెందుల‌లోని ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యానికి ద‌గ్గ‌రలోనే వున్న ఎం.పీ అవినాష్ రెడ్డి, వివేకా నివాసంలో, ప‌రిస‌రాల్లో మ‌ళ్లీ త‌ని ఖీలు చేప‌ట్ట‌డ‌మేకాకుండా  ప్ర‌భుత్వ స‌ర్వేయ‌ర్‌తో నివాసాల కొల‌త‌ల‌ను తీయించేరు. సీబీఐ ద‌ర్యాప్తు కాస్తంత‌ వేగిరంగా కానిస్తోంది అనుకున్నారు. ఇంత‌లో  గంగాధ‌ర్ రెడ్డి  అస‌హ‌జ మ‌ర‌ణం  ప్రాధాన్య‌త  సంతరించుకుంది.  గంగాధ‌ర్ అనుమానాస్ప‌ద మృతి గురించి వింటూంటే గ‌తంలో టీడీపీ నేత మాజీమంత్రి ప‌రిటాల ర‌వి  హత్య కేసులో ముద్దాయిగా ఉన్న మొద్దు శీనుకు, శీనును హత్య చేసిన ఓంప్రకాశ్ లకు జరిగినట్లే వివేకా హత్య కేసులో కూడా సీన్ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ముద్రగడ కాపు కాస్తారనేనా?!

అధికార వైసీపీ నుంచి ఇటీవల  సస్పెన్షన్ కు గురైన కొత్తపల్లి సుబ్బారాయుడితో  కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం  భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ.. నర్సాపురంలోని కొత్తపల్లి నివాసానికి చేరుకుని.. దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. అయితే వీరి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనే అంశాలపై  ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు.  ఈ భేటీ అనంతరం ముద్రగడ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇస్తోందని పరిశీలకులు అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన  నాటి నుంచి.. ఇటీవల వరకు ముద్రగడ యమా సైలెన్స్  పాటిస్తూ వచ్చారు.  ఇక జిల్లాల విభజనకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. తూర్పు గోదావరి జిల్లాను విభజిస్తే... ఓ జిల్లాకు బి.ఆర్ అంబేద్కర్, మరో జిల్లాలకు బాలయోగి పేర్లు పెట్టాలంటూ సీఎం వైయస్ జగన్‌కు నేరుగా ఆయన బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే అమలాపురం కేంద్రంగా కొనసీమ జిల్లా ఏర్పాటు చేసిందీ జగన్ ప్రభుత్వం.. ఆ తర్వాత బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చింది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు వరకు కొత్త పల్లి, ముద్రగడల  మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాల విభజన మొదలు.. బ్రిటిష్ కాలం నుంచి రెవిన్యూ డివిజన్ ఉన్న నరాసాపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం...అలాగే రెవిన్యూ డివిజనే లేని భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం.. జిల్లా విభజన క్రమంలో ఎవరినీ సంప్రదించక పోవడం.. అలాగే నరాసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుని..  ఎమ్మెల్యేగా ఎం ప్రసాదరాజును గెలిపించడం కోసం తాను, తన సోదరుడు కొత్తపల్లి జానకీరామ్‌ పడిన కష్టం.. అన్నీ  పూసగుచ్చినట్లు కొత్తపల్లి ముద్రగడకు వివరించినట్లు చెబుతున్నారు.   అధికారంలోకి వచ్చిన జగన్ ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోవడమే కాకుండా..  అయిదుసార్లు ఎమ్మెల్యే, ఓ సారి ఎంపీగా, మంత్రిగా, కార్పొరేషన్ చైర్మన్‌గా వివిధ పదవులలో సేవలందించి రాణించిన  తన లాంటి సీనియర్‌ను   జగన్ పక్కన పెట్టడం పట్ల కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంపీ రఘు రామకృష్ణంరాజు జగన్ నుఎన్ని తిట్లు తిట్టినా... ఆయనను వదిలేసి.. తనను సస్పెండ్ చేయడం ఏమిటో అర్థం కావడం లేదని ముద్రగడ ముందు కొత్త పల్లి సుబ్బారాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా కాకుండా.. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం పట్ల నరసాపురం ప్రాంత ప్రజలు.. జగన్ పైనా, వైసీపీపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ముద్రగడకు కొత్తపల్లి వివరించినట్లు తెలుస్తోంది.  అదీకాక.. రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యంత కీలకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొత్తపల్లితో భేటీ కావడం.. ఆ క్రమంలో సుదీర్ఘ మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా అందరిలో ఉత్కంఠ, ఆసక్తి రేకెత్తించింది.   

జనాలకు కనిపించరు సరే.. ఎమ్మెల్యేలకూ మొహం చాటేస్తారా?

వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ దర్శనం గగనమేనా?  తమ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకోవాలనుకున్నా, ఇతర సమస్యల గురించి చర్చించాలనుకున్నా జగన్ అప్పాయింట్ మెంట్ దొరకడం దుర్లభమా?  అంటే తాజా మాజీ మంత్రి పేర్ని నాని మాటలు వింటే నిజమేనన పించక మానదు.   బుధవారం సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పలువురు ఎమ్మెల్యేలు నోరు విప్పి, తమ గోడు వినిపించడం విశేషం. ఇప్పటి వరకు కేవలం పార్టీ అధినేత జగన్ చెప్పిన మాటలకు జీ హుజూర్ అంటూ తలొగ్గిన ఒక్కొక్కరూ ఇప్పుడు నోరు మెదిపేందుకు సాహసిస్తున్నారనడానికి బుధవారం జరిగిన వర్క్ షాపే నిదర్శనం. మాజీ మంత్రి పేర్ని నాని మాటల ప్రకారం చూస్తే.. వైసీపీ నేతలు ఎవర్నీ కూడా జగన్ దరికి రానివ్వడం లేదనేది స్పష్టం అవుతోంది. ప్రతి అంశానికీ సలహాదారుల్నే నమ్మడం, వారు చెప్పిందే వినడం, చేయడం తప్పిస్తే.. వాస్తవ పరిస్థితులను ప్రజా ప్రతినిధుల నోటి నుంచి వినేందుకు ఏమాత్రం జగన్ ఇష్టపడడం లేదని చెబుతున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా సమయం కేటాయించకపోయినా.. కనీసం ద్వారం వద్దకు వచ్చి అయినా దర్శనం ఇస్తే.. ఒక్కోసారి కనీసం 20 మంది ఎమ్మెల్యేలు సీఎంను కలుసుకునే అవకాశం ఉంటుందని పేర్ని నాని చెప్పడంలోని వాస్తవాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు. గతంలో జగన్ రెడ్డి తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ద్వార దర్శనం ద్వారా ఎమ్మెల్యేలను పలకరించేవారని, ఆ విధానం అయినా కొనసాగిస్తే మంచిదని పేర్ని నాని జగన్ కు సూచించారు. జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గొంతు విప్పి మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లినప్పుడు జనం తమను ముఖం మీదే మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ , పొలాలకు దారుల గురించి ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, వారి ఆగ్రహాన్ని చల్లార్చడం తమ వల్ల కావడం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక వర్క్ షాప్ లో పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన నియోజకవర్గాల సమస్యల విషయానికి వస్తే..  రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయి. బోర్లు వేయించుకుంటామంటే విద్యుత్ శాఖ నుంచి మెటీరియల్ సకాలంలో ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారని, ఇసుక సమస్య కూడా ఉందని, ఇసుక డిపోల సంఖ్య పెంచాలని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గడప గడపకు కార్యక్రంలో మంచినీళ్ల కోసం ప్రజలు, పొలాలకు వెళ్లేందుకు దారులు నిర్మించాలని రైతులు అడుగుతున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు కొనుక్కున్న ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వడం లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వాపోయారు. ఇలా తమ నియోజకవర్గం సమస్యలు చెప్పుకునేందుకు కూడా సీఎం జగన్ అవకాశం ఇవ్వడం లేదనే అసంతృప్తి వైసీపీ ప్రజాప్రతినిధుల్లో నివురుగప్పిన నిప్పులా మారిందంటున్నారు. అయితే.. ఎమ్మెల్యేలకు సమయం ఇస్తుంటే.. ఒక్కొక్కరూ అరగంటకు పైగా మాట్లాతున్నారని, అలా అయితే.. ఎక్కువ మందితో మాట్లాడడం సాధ్యమయ్యే పనేనా? అని జగన్ అన్నారట. అందుకే కనీసం మీ తండ్రి మాదిరిగా ఒక్కోసారి 20 మంది ఎమ్మెల్యేలకైనా ద్వార దర్శనం కల్పించండి మహప్రభో అని పేర్ని నాని వాపోయారని సమాచారం. జనంలోకి ఎలాగూ రాని జగన్ కనీసం తన పార్టీ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకైనా ముఖం చూపిస్తారో లేదో వేచిచూడాలి మరి?!

లోకేష్ జూమ్ మీటింగ్ లోకి కామెడీ బ్రదర్స్ కొడాలి, వల్లభనేని!

వెండి తెరపైన.. బుల్లి తెరపైన మాత్రమే ఇప్పటి వరకు కమెడియన్స్ ను చూశాం. కానీ కొందరు రాజకీయ కమేడియన్లు జూమ్ మీటింగ్‌లో కూడా క  ఎంట్రీ ఇస్తున్నారు. అదీ తప్పుడు ఐడీలతో, మారుపేర్లతో   దీంతో ఆ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన వారే కాదు... ఈ మీటింగ్‌కు హాజరైన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తర్ణత శాతం 67కి పడిపోయింది. గతంలో ఉత్తీర్ణత 90 నుంచి 95 శాతం ఉండేది.  నేడు ఆ  ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోవడం పట్ల విద్యార్థులు, వారి తల్లీదండ్రులే కాదు.. ప్రతిపక్ష టీడీపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    ఆ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్.. రంగంలోకి దిగి.. 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో గురువారం జూమ్ మీటింగ్  నిర్వహించారు. ఈ మీటింగ్ జరుగుతోండగా.. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు.. కూడా మారు పేర్లతో  విద్యార్థుల ఐడీలతో ఈ జూమ్ మీటింగ్‌కు హాజరయ్యారు.  దీంతో ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లీదండ్రులే కాదు.. ఈ మీటింగ్‌ను వీక్షిస్తున్న వారంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు.  అయితే ఈ మీటింగ్‌కు వీరిద్దరూ హాజరైనా.. నారా లోకేశ్ మాత్రం ఎక్కడా.. కట్టు తప్పకుండా.. మీకు దమ్ముంటే.. నేరుగా రండి... నేరుగా మాట్లాడండంటూ వారికి సవాల్ విసిరారు. అంతేకాదు.. వాళ్ల ప్రభుత్వం చేస్తున్న.. తప్పులు.. వాళ్లు కూడా తెలుసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.    అయితే ఈ మీటింగ్ హాజరైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ముసిముసి నవ్వులు నవ్వడం పట్ల.. సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. వీరిద్దరివీ పిల్ల చేష్టలు అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. సరిపోయింది కామెడీ బ్రదర్స్ వచ్చేశాంటూ మరోకరు ఛలోక్తి విసిరారు. ఇంకొకరు అయితే.. ఒకరు బూతుల మంత్రి, మరొకరు వెకిలి ఎమ్మెల్యే అంటూ కామెంట్ పెట్టారు. అంతేకాదు.. ముందు తప్పుడు మాటలు మాట్లాడడం... ఆ తర్వాత డ్యామేజ్ జరిగిపోయిందంటూ.. నాలుక కరుచుకొని.. బుల్లి తెరపై చర్చ కార్యక్రమాల్లో లైవ్‌లోకి వచ్చి... క్షమించు అక్కా.. తప్పు అయింది అక్కా.. అంటూ కాళ్లా వేళ్లా పడి క్షమాపణలు కొరతాడంటూ మరో నెటిజన్ సెటైర్లు వేశారు.  ఇంకొకరు అయితే వల్లభనేని వంశీవి వట్టి పిల్ల చేష్టలు అని.. ఒక కొడాలి నానివి కితకితల మంత్రి అని.. వీళ్లిద్దరి సంగతి తెలుగు ప్రజలందరికీ తెలిసిందేనంటూ  కామెంట్ పెట్టారు.  అయితే వీరిద్దరు బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి.. వాళ్లను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి.... ప్రతిపక్ష పార్టీ జూమ్ కార్యక్రమంలో మారు పేర్లతో జాయిన్ అయ్యారంటే.…. వీళ్లనేమనాలంటూ నెటిజన్లు.. డాష్.. డాష్.. డాష్.. అంటూ కామెంట్లు పెట్టడం గమనార్హం. కొడాలి నాని కూడా 10వ తరగతే చదివాడు. కానీ ఆ రోజుల్లో పదవ తరగతి తప్పాడని... అందుకే ఈ జూమ్ కార్యక్రమానికి హాజరయ్యారేమోనని.. మరో నెటిజన్ సెటైరికల్‌ కామెంట్ నెట్టింట  విసిరాడు.  అయినా వీళ్లిద్దరికీ సిగ్గు, శరం, వగైరా వగైరా ఏమీ లేవంటూ ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న పదో తరగతి విద్యార్థులు సైతం కామెంట్ చేయడం గమనార్హం. వీళ్లిద్దరు పక్కా కామెడీ బ్రదర్స్‌లాగా ఉన్నారని.. వీళ్లకు కొంచెం జ్జానం ప్రసాదించు తల్లి.. అంటూ ఆ చదువులు తల్లి సరస్వతిని ఈ విద్యార్థులు వేడుకొవడం...ఇప్పుడు సామాజిక మాధ్యమంలో  ట్రెండ్ అవుతోంది.

రియల్ రంగంపై ఎన్ఆర్ఐ ఎఫెక్ట్

రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్ ఏమిటి? ఆర్థిక,వ్యాపార, వాణిజ్య రంగాల్లో, అలాగే సామాన్య మధ్యతరగతి వర్గాల్లో తరచూ వినిపించే ప్రశ్నల్లో.. ఇది తప్పక ఉంటుంది. అలాగే, ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఎప్పటికప్పడు మారిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా బూమ్ వచ్చేస్తుంది. అంతలోనే ఢమాల్ మంటుంది. రియల్ వ్యాపారం కుదేలై పోతుంది. కొవిడ్’తో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా కోలుకుంటున్న సమయంలో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది. సిమెంట్, ఇనుము, ఇసుక ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా వ్యయం పెరిగింది. ఇంకా అనేకం .. మొత్తంగా నిర్మాణ వ్యయం పెరింగింది. పెరిగిన ధరల ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం మరో మారు కుదేలైంది. ఇలాంటి వడిదుడుకులు అన్నిరంగాలలో ఉంటాయి. ముఖ్యంగా, రియల్ ఎస్టేట్ వంటి స్పెక్యులేషన్ రంగంలో వడిదుడుకులు. పడి లేవడాలు , సహజం. అయితే, ఇప్పడు రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడే ప్రమాదం ఉందని రియల్ రంగం నిపుణులు అంచనా కొస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఇప్పటికే కొంత ప్రభావం చూపుతున్న విదేశీ  వలసల ప్రభావం’ ముందు ముందు మరింతగా ఉంటుందని అంటున్నారు. ఒకప్పుడు, (ఇప్పటికి కూడా) పల్లెల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి నగరాలకు, ఇతర  రాష్ట్రాలకు వలసలు సాగితే, ఇప్పుడు ఏకంగా విదేశాలకు వలసలు పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికీ వెళ్ళినా, భారతీయ సంతతికి చెందిన ప్రవాస భారతీయులు ఎంతో పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.భారత్ నుంచీ విద్యా, ఉద్యోగ, వ్యాపార, జీవన వ్యాపకాల కోసం విదేశాలకు వెళ్ళిన వారిలో, ఎక్కువ మంది అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా స్థిరపడుతున్నారు.   భారత  విదేశాంగ శాఖ అధికారిక లెక్కల ప్రకారం, 32 మిలియన్ల మంది భారతీయ సంతతికి చెందిన ప్రవాస భారతీయులు విదేశాలలో ఉన్నారు. ప్రపంచ దేశాలలో జీవిస్తున్న విదేశీ సంతతి పౌరులలో భారత దేశానిదే ప్రథమ స్థానం. ప్రతి సంవత్సరం 25 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. ప్రపచ దేశాలు అన్నిటిలో, ప్రతి సంవత్సరం విదేశాలకు వెళుతున్న వారిలోనూ మన దేశానిదే ప్రథమ స్థానం. మరో వంక, భారత పౌరసత్వాన్ని వదులు కుంటున్న ప్రవాస భారతీయుల సంఖ్య కూడా సంవత్సర సంవత్సరానికి గణనీయంగా పెరిగి పోతోందని గణాంకాలు సూచిస్తున్నాయి. విదేశాంగ శాఖ వెబ్సైటు అందించిన వివరాల ప్రకారం, 2017 నుంచి 2021 మధ్య సుమారు 6.08 శాతం మంది భారతీయులు, భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దేశ జనభాలో ఒక శాతం మంది విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ సంఖ్య ఏడాది ఏడాదికి పెరుగుతోంది. నిజానికి గతంలో ఉద్యోగ, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన వారు, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చి, ఇళ్ళు వాకిళ్ళు ఏర్పరచుకుని, పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడం ఉండేది. ఈ క్రమంలో, గత మూడు నాలుగు దశాబ్దాలుగా  ప్రవాస భారతీయులు రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు  పెడుతూ వచ్చారు. ఇప్పటికీ, కొంత వరకు ఆధోరణి కొనసాగుతోంది.  అయితే, ఇప్పుడు తరాలు మారుతున్న నేపధ్యంలో విదేశాలలో స్థిరపడిన వారు, భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. మరోవంక భారతదేశంలో ఇప్పటికే ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. చివరకు వారసత్వంగా వచ్చిన  ఆస్తులను కూడా తెగనమ్ముకుని తామున్న దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి ఇపుడు చాలా వేగంగా పెరిగిపోతోంది. దేశంలో, రియల్ ఎస్టేట్ వ్యాపరం జోరుగా సాగే, హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఈ ఈ ధోరణి కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే, అనేక కారణాల చేత వడిదుడుకులు ఎదుర్కుంటున్న రియల్ ఎస్టేట్ రంగం ముందు ముందు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అది ఇప్పటికిప్పుడు జరుగుతుందా అంటే, లేదు ... ఇప్పుడే మొదలైన ఈ ధోరణి ఇలాగే సాగితే మటుకు, రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడుల సంక్షోభంతోపాటుగా మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కునే ప్రమాదం లేక పోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలది జీరో పెర్ఫార్మెన్స్!

గడప గడపకూ కార్యక్రమంలో  వైసీపీ ప్రజా ప్రతినిథులు నిరసన సెగలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా అధినేత ఆదేశం కదా అని ఆపసోపాలు పడుతూ ప్రజా నిరసన సెగను తట్టుకుంటూ అతి కష్టం మీద ఆ కార్యక్రమాన్ని నెట్టుకోస్తుంటే.. పులి మీద పుట్రలా సీఎం జగన్ జిల్లాల వారీగా గడపగడపకూ కార్యక్రమంపై సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేల ఫెర్మార్సెన్స్ ను నిర్ణయిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం  సమీక్షను నిర్వహించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ చార్జీలు హాజరయ్యారు. ఈ సమీక్షకు ముందే గడపగడపకూ కార్యక్రమంలో ప్రజాప్రతినిథుల భాగస్వామ్యంపై జగన్ జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. సమీక్షలు ఆయనా నివేదికల ఆధారంగా ప్రజా ప్రతినిథుల పెర్ఫార్మెన్స్ కు మార్కులు వేశారు. ఇందులో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ జీరో అని సీఎం జగన్ డిక్లేర్ చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లు ఇప్పటి వరకూ గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొననే లేదు. వీరు కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిలు కూడా జీరో పెర్ఫార్మెన్స్ జాబితాలో ఉన్నారు. జీరో పెర్ఫార్మెన్స్ జాబితాలో నెల్లూరుకే చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటంపై జగన్ ఫైర్ అయినట్లు సమాచారం. అలాగే జగన్ కేబినెట్ లో మంత్రులుగా పని చేసి ఉద్వాసనకు గురైన ఇద్దరు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉండటం గమనార్హం. 

కేసీఆర్ క‌ల‌వ‌రు.. బిజెపీది క‌లిసే ఉత్సాహం!

త‌మ పాల‌న ఎలా సాగుతోంది, ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నార‌న్న‌ది తెలుసుకోవ‌డానికి పూర్వం రాజుల‌కు మంత్రుల స‌మాచారం బాగా వుప‌యోగ‌ప‌డేది. ర‌వ్వంత అనుమానం వ‌స్తే  వేగుల‌నీ ప‌ట్ట‌ణంలోకి పంపే వారు, చంద‌మామ క‌థ‌ల్లో అయితే ఏకంగా రాజుగారే తోచిన మారువేషం వేసుకుని క‌బుర్లు చెప్ప‌డానికి మంత్రిని కూడా తీసికెళ్లేవాడు. అలా తిరిగి ఏదో ఒక మంచి స‌మాచారంతోనే సాయింత్రానికి  నివాసం చేరే వారు. దాడులు, తిరుగుబాటులు అలా అరిక‌ట్టేవారు. ప్ర‌స్తుతం అత్యాధునిక కాలంలో విప‌క్షాల ఎత్తుల‌కు పై ఎత్తులలో భాగంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను, వీరాభిమానుల‌ను వూళ్ల‌లో తిరిగి స‌మాచారం అందించ‌మంటు న్నారు. ప్ర‌ధాని మోదీ ఇంకాస్త బాగా ఆలోచించి ప్ర‌జాద‌ర్బార్ల పేరుతో అంద‌రూ అందరినీ క‌లుస్తుండ మ‌ని పార్టీవర్గీయుల‌ను ఉత్సాహ‌ప‌రిచేరు. ద‌ర్బార్ లో భాగంగానే ఆయ‌న  ఇటీవ‌ల హైద‌రాబాద్ కార్పోరేట ర్ల‌నూ క‌లిసేరు. వారం ద‌రినీ పార్టీ విజ యానికి, తెలంగాణాలో పాల‌నాప‌ర‌మ‌యిన లోపాల్ని అంద‌రికీ  తెలిసేలా చేయాల‌ని, భ‌వి ష్యత్తులో ఎమ్మె ల్యేలుగా ఎద‌గాల‌ని వారిని ఉత్సాహ‌ప‌రిచి మ‌రీ పంపేరు.  ఇలా బిజెపి చాలా ప‌క‌డ్బందీగా ఎన్నిక‌ల స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది.  రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కూడా ప్ర‌జాదర్బార్‌పేరిట అంద‌రినీ క‌లిసి రాష్ట్ర‌ప‌రిస్థితుల‌ను మ‌రింత తెలుసుకునేందుకు పూనుకుంటున్నారు. తెలంగాణాలో సి.ఎం కేసిఆర్ పాల‌నా వ్య‌వ‌హ‌రాల‌తో  ప్ర‌జ‌లు నానా అవ‌స్థా ప‌డుతున్నార‌ని రాష్ట్ర బిజెపి నాయకుడు బండి సంజ‌య్ ద్వారా కేంద్రానికి బాగా ప్ర‌చారం అవుతోంది. కేసీఆర్  కేవ‌లం ఫామ్‌హౌస్‌కే ప‌రిమితమ‌వుతున్నారే త‌ప్ప ప్ర‌జ‌ల గోడు అంత‌గా ప‌ట్టించుకో వ‌డం లేద‌న్న‌ది  గ‌త కొంత‌కాలం నుంచీ విన వ‌స్తున్న ఆరోప‌ణ‌. ఆయ‌న కేంద్ర రాజ‌కీయాల‌పై  దృష్టిపెట్టి రాష్ట్ర పాల‌న‌కు నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌నీ ప్ర‌చారం జ‌రిగింది. త‌మ పార్టీ వారికి కూడా ఆయ‌ను  క‌లిసే అవ కాశం లేనంత దూరంగా వుండ‌డం పార్టీ వ‌ర్గీయుల‌కు, మంత్రుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది.  ఇదే విప క్షాల దాడికి అస్త్రంగా మారింద‌నాలి. కేసీ ఆర్‌కి ఏద‌న్నా విన్న‌వించుకోవాలంటే ఆయ‌న బొత్తిగా  అందు బాటులో వుండ‌డం లేద‌ని అధికారులూ విసి గెత్తుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బిజెపి రాష్ట్ర యంత్రాంగం మ‌రింత చురుగ్గా జ‌నాల్లోకి  వెళ్లి తెలంగాణా ప్ర‌భుత్వం తీరుతెన్నులు ఎలావున్న‌దీ తెల‌య‌జేస్తూ వారిని ఆక‌ట్టుకునే  ప‌నిలో వున్న‌ది. అయితే  ఈ వ్యూహం బిజెపికి ఎంత‌వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డుతుంది? ఏమేర‌కు విజ‌యాన్ని అందిస్తుంద‌నేది తెలియాలి.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి ఖ‌చ్చితంగా  అధికారంలోకి వ‌స్తుంద‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో తెలంగాణాలో పాల‌న స‌రిగా లేద‌ని, కుటుంబ పాల‌న‌నుంచీ రాష్ట్రాన్ని విముక్తిచేయాల‌ని ప్ర‌చారం చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇప్ప‌టికే అనేక వేద‌క‌లు, స‌భ‌లలో ఇదే అంశాన్ని తెర‌మీద‌కి తెచ్చారు.  ఇంత జ‌రుగుతున్నా, టిఆర్ ఎస్ ఎలాంటి కార్య‌క్ర‌మానికి వ్య‌హం సిద్ధం చేయ‌క‌పోవ‌డం,  కేసీఆర్ త‌న పార్టీ వ‌ర్గాల‌ను స‌మాయ‌త్తం చేయ‌క‌పోవ‌డం విచిత్రం. బిజెపి వారు ఆవేశ‌ప‌డుతున్నంత‌గా ఇక్క‌డేమీ లేద‌ని, వారిది అంతా తాటాకు చ‌ప్పుళ్లే అని చ‌లోక్తులు విస‌ర‌డంతోనే కాలంగ‌డిపేస్తున్నారు. రాష్ట్రానికి  రావ‌ల సిన నిధుల విష‌యంలో, ఇక్క‌డి ప్రాజెక్టుల‌కు అందించాల్సిన ఆర్ధిక మ‌ద్ద‌తు విష‌యంలో మాట మాట్లా డ‌ని కేంద్రం రోజుకో నాయ‌కుడిని తెలంగాణా ప‌ర్య‌ట‌నకు పంపి ప్ర‌భుత్వాన్ని తిట్టి పోయ‌డం  ఒక  గొప్ప కార్య‌క్ర‌మంగా పెట్టుకుంద‌ని కేటీఆర్  అంటూండ‌టం ష‌రామామూలే!   తెలంగాణాలో బిజెపి చేస్తున్న హ‌డావుడిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, వారి ఎత్తుగ‌డ‌లు పారే అవ‌కాశం లేద‌ని ముఖ్యంమంత్రి కేసీఆర్‌ వీల‌యిన‌పుడ‌ల్లా  మంత్రుల‌తో చెప్పిస్తున్నారు.  ఇక్క‌డి ప‌రిస్థితులు, కేంద్రం ఏమాత్రం సాయం చేస్తు న్న‌దీ తెలిసి కూడా ఇక్క‌డి బిజెపి నాయ‌కులు త‌మ అధినేత‌కు చెప్పి చేయించ‌డంలో విఫ‌ల‌మ‌యి,  ఇక్క‌డ కేవ‌లం  భ‌జ‌న‌బృందంగా మారార‌నేది టిఆర్ ఎస్ నాయ‌కుల మాట‌!  కానీ  బిజెపీ స్పీడుకి  మ‌రి టిఆర్ ఎస్  బ్రేకులు వేయ‌గ‌ల్గుతుందా?  

వైసీపీ నుంచి దేశంలోకి వలసల వరద

గేట్లెత్తేయగానే వరద గోదారి సముద్రంలో కలిసేందుకు ఉరుకులెత్తి ఉప్పొంగి పారుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల వరద అలాగే వెల్లువెత్తుతుందా అంటే  పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట వేగంగా మసకబారుతోందన్న అంచనాతో ఆ పార్టీ నుంచి ముఖ్య నేతలు సహా కేడర్ తెలుగుదేశం వైపు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాయల సీమ జిల్లాల నుంచి బలమైన నేతలు, కేడర్ కూడా చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్షఅని భావిస్తున్నారు. ఆ విషయమే బాహాటంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వీరశివారె్డి, వరద రాజులు రెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి వారు తెలుగుదేశం గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇటీవలి వారి మీడియా సమావేశాలు, ప్రకటనలను బట్టి అవగత మౌతున్నదని అంటున్నారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి జగన్ పాలన చూసి తుగ్లక్ కూడా నవ్వుకుంటాడని విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా  బుధవారం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో బేటీ అయ్యారు. భేటీ అనంతరం వీలేకరులతో మాట్లాడిన ఆయన తాను త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇంత కాలం వైసీపీకి అనుకూలంగా ఉన్న ఆయన ఇప్పడు జగన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబుతో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. నారా లోకేష్ తో బేటీలో రాష్ట్రంలో పరిస్థితులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించినట్లు చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కూడా తెలుగుదేశం పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రకటించి తాను ఆ పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. ఇక మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి కూడా చంద్రబాబు విధానాలే రాష్ట్రప్రగతికి సోపానాలని పేర్కొన్నారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తతం వైసీపీలో ఉన్న ఆయన త్వరలో తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగడుతున్న రవీంద్రారెడ్డి తెలుగుదేశం గూటికి చేరుతారని ఆయన వర్గీయులు కూడా చెబుతున్నారు. రాయలసీమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జల్లాలలోనూ వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తే అవకాశాలున్నాయనీ, ఉత్తరాంధ్రలో వాసుపల్లి గణేష్, గోదావరి జిల్లాలలోనూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యక్తమౌతున్న ప్రజాగ్రహాన్ని చూసి ఆ పార్టీ నేతలు తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జనసేన తెలుగుదేశంకు బలం కాదు బరువు

ఏపీలో పొత్తుల పై రాజకీయ పార్టీల మధ్య సంప్రదింపులే కాదు.. సామాన్య జనంలో చర్చోపచర్చలూ జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాన్ ఆప్షన్లు అంటూ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో సామాన్య జనంలో ఈ చర్చ మరింత జోరందుకుంది. అయితే ఈ చర్చల్లో జనసేనాని అప్షన్లపై ప్రజలలో అసహనం కనిపిస్తున్నది. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన మనోభీష్టంపై సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ ఒక రేంజ్ లో సాగుతోంది. బలం ఏమిటో తెలియకుండా నేల విడిచి సాము చేయడంలా ఉంది ఆయన వైఖరి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగుదేశం వర్గాలలో అయితే పవన్ ఆప్షన్లపై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో బలమైన విపక్షంగా తెలుగుదేశం జనసేనను కానీ, జనసేన పార్టీని కానీ భుజాన మోయాల్సిన పని లేదని తెలుగుదేశం వర్గాలు విస్పష్టంగా చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ స్వయంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వం అంటూ చేసిన ప్రకటన కారణంగానే  ఆ పార్టీతో పొత్తు అన్న చర్చ తెరమీదకు వచ్చింది తప్ప.. తెలుగుదేశం పార్టీకి జనసేనానితో అంటకాగాల్సిన అవసరం ఇసుమంతైనా లేదని తెలుగుదేశం వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. పొత్తు ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయం సాధించి అధికారంలోకి రావడం తథ్యమన్న ధీమా ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జనసేన అధినేతను మోయాల్సిన అవసరం పార్టీకి లేదన్ని ఆ వర్గాలు కుండ బద్దలు కొడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అన్న జనసేన మాటల వెనుక వ్యూహం ఏమిటన్నది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆయన ఆకాంక్షను బయటపెట్టుకోవడంతోనే  బహిర్గతమైపోయిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ టు డిస్ట్రాయ్ తెలుగుదేశం అన్నదే ఆ కుట్ర అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ప్రస్తతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ పాలన పట్ల విసిగిపోయి ఉన్నారని తెలుగుదేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాకుండా, గత ఎన్నికలలో వైసీపీకి పడిన ఓట్లలో కూడా అధిక భాగం ఈ సారి  తెలుగుదేశం కైవసం చేసుకంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పొత్తు అంటూ ముందుకు వచ్చి తెలుగుదేశం గెలిచే సీట్ల సంఖ్యను తగ్గించడమే జనసేన వ్యూహమని ఆ వర్గాలు అంటున్నాయి. పొత్తులో భాగంగా ఓ 50 అసెంబ్లీ స్థానాలను జనసేన డిమాండ్ చేస్తుందనీ, ఆ పార్టీకి అన్ని సీట్లు గెలిచే సత్తా లేదనీ తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇందులో వ్యూహమేమిటంటే తెలుగుదేశం గెలిచే స్థానాలను పరిమితం చేయడమేనని పేర్కొంటున్నారు. అధిక స్థానాలలో అదీ తెలుగుదేశం గెలిచే స్థానాలకు పట్టుబట్టడం ద్వారా వైసీపీ ఎక్కువ నియోజకవర్గాలలో గెలిచేందుకు సహకరించాలన్నదే జనసేనాని వ్యూహంగా కనిపిస్తోందని వివరిస్తున్నాయి.  అందుకే జనసేనతో పొత్తు తెలుగుదేశం పార్టీకి  భారమే అవుతుందని తెలుగు దేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.