వ‌ద్దు.. ఇక జ‌గ‌న్‌ను వ‌దిలించుకోవ‌డ‌మే మేలు!

ఫ‌లానా రాజు అద్బుతంగా పాలించేవాడు, ఫ‌లానా మంత్రిగారు బ్ర‌హ్మాండంగా స‌ల‌హాలిచ్చేవారు లాంటివి అనాదిగా వింటూనే వున్నాం. అలాగే వాడు ప‌లికిమాలిన పాల‌కుడు  అనీ దుర్మార్గ దారుణ పాల‌న  అనీ కొంద‌రి గురించి చ‌రిత్ర చెబుతుంది. ఆధునిక కాలంలో జ‌గ‌న్ పాల‌న‌ను  కూడా  మ‌రోలా భ‌విష్య‌త్తులో గుర్తుంచుకుంటారు.. వ‌చ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడ‌ని, బొత్తిగా అర్ధంలేని పాల‌న‌ని! మొద‌ట్లో అంతా బాగుంటుందేమో అనుకున్న‌వారికి కూడా విసిగెత్తేస్తోంది. కుమ్ములాట‌లు, విభేదాలు, ప‌థకాల అమ‌ల్లో లోపాలు, అవి నీతి, ఆర్ధిక స్థితి దెబ్బ‌తిన‌డం అన్నీ వెర‌సి జ‌గ‌న్ పాల‌ను వ‌ద్ద‌నే నినాదా నికి బ‌లం చేకూరింది. జ‌గ‌న్ పాల‌న మూడేళ్లు ముగిసేప్ప‌టికే పార్టీలో, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అస‌లు మంత్రులు, మాజీ మంత్రుల‌కు క‌నీసం మాట్లాడ‌టం కూడా తెలీని స్థితికి జారిపోయారు. కొడాలి నాని, పేర్ని నాని, వంశీ, జోగి ర‌మేష్ త‌దిత‌రులు మామూలుగా మాట్లాడ‌టం మ‌ర్చిపోయారు.  ప్ర‌జాసేవ చేస్తా మ‌ని  ప్ర‌మా ణంచేసి మ‌రీ అధికారంలోకి వ‌చ్చిన‌వారు ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాల మాట  అటుంచితే  అస‌లు  ప్ర‌తి ప‌క్షాల‌మీద‌, ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నిస్తున్న‌వారి మీదా ఏకంగా బూతుల పురాణం వ‌ల్లిం చ‌డమేమిటి?  వైసీపీ నాయ‌కుడు ఈడీ ఆఫీసుల ప్ర‌ద‌క్షిణం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో కుమ్ములాట‌ల్లోనూ పీక‌ల్లోతు కూరుకుపోయారు.  మ‌చిలీప‌ట్నంలో బాల‌శౌరి, పేర్నినాని విభేదాలు పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీస్తున్నాయి. గ‌న్న‌వ‌రంలో వంశీని స‌మ‌ర్ధించాలా?   యార్ల‌గ‌డ్డ ను స‌మ ర్ధించాలా  అన్న‌ది వైసీపి అధిష్టానం తేల్చుకోలేక‌పోతోంది. న‌ర్సాపురం జిల్లా కేంద్రం చేయాల‌న్న డిమాం డ్ చేసిన  కొత్త‌పల్లి సుబ్బారాయుడు, ప్ర‌భుత్వ ఛీఫ్ విప్ ప్ర‌సాద రాజు మ‌ధ్య విభేదాలు వెలుగులోకి  వ‌చ్చా యి. ఇండిపెండెం ట్‌గా పోటీచేసి గెలుస్త‌న‌ని అన్న కొత్త‌ప‌ల్లిని పార్టీ నుంచి బ‌హిష్క రించారు. మ‌రో వంక  ఉమ్మడి విశాఖ జిల్లా  సమన్వయకర్త వై.వి. సుబ్బారెడ్డి టిడిపి నుంచి వ‌చ్చిన వాసుప‌ల్లి గ‌ణేష్ మ‌ధ్య విభే దాలు తీవ్ర‌స్థాయికి చేరుకున్నాయి. అంతేకాదు పార్టీ స‌మ్య‌వ‌క‌ర్త పోస్ట్‌కి  గ‌ణేష్ రాజీనామా  చేశారు. మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ  త‌ర్వాత నెల్లూరులో మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ వ‌ర్గాల మ‌ధ్య  గొడ‌వ‌లు ర‌చ్చ‌కెక్కాయి. వీరిని శాంత‌ప‌ర‌చ‌డానికి తాత‌లు దిగివ‌చ్చారు.  ఇదిలా వుండ‌గా, ఆర్ధిక ప‌రిస్థితులు కూడా అధ్వాన్నంగా మారాయి. అధిక‌వ‌డ్డీల‌కు అప్ప‌లు తెస్తూ రాజ్యాం గ  ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతూ  రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలో ప‌డేసింద‌ని విప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నా యి. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు,  రిజ‌ర్వుబ్యాంక్‌, నీతి ఆయోగ్‌తో చేసుకున్న ఒప్పందాల గురిం చి ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేయాల‌ని  శాస‌న‌మండ‌లి సభ్యుడు, టిడిపి పోలిట్ బ్యూరో స‌భ్యుడు  య‌న‌మ‌ల రామకృష్ణ డిమాండ్ చేసారు. 14, 15 ఆర్ధిక సంఘం గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన ఆరువేల కోట్లు, జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద రాష్టానికి వ‌చ్చిన ఏడువేల కోట్లు ఏం చేశారో స్ప‌ష్టం చేయాల‌ని  య‌న‌మ‌ల డిమాండ్ చేశారు.  అస‌లు రాష్ట్రంలో ఆర్ధిక క్ర‌మ‌శిక్ష‌ణ లోపంతోనే రిజ‌ర్వుబ్యాంకు వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ప‌రిమితుల మీదా ఆంక్ష‌లు విధించింద‌ని య‌న‌మ‌ల ఆరోపించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం 420 720 పేర్ల‌తో మ‌ద్యం వ్యాపా రం చేస్తున్నారేగాని రాష్ట్రంలో అస‌లు నిరుద్యోగుల సంగ‌తే ప‌ట్టించుకోవ‌డంలేద‌ని,  అన్ని వ‌ర్గాల వారిని మోసం చేస్తున్నార‌ని  రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు సోము వీర్రాజు టెక్క‌లి మ‌హాస‌భ‌లో దుమ్మెత్తిపోశారు. దీనికి తోడు విద్యారంగాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు.  ప్ర‌తీయేటా ఉపాధ్యాయుల పోస్టుల భ‌ర్తీ చేస్తాన‌ని చేసిన ప్ర‌మాణం గాలికి వ‌దిలేసేరు.  పాఠ‌శాల‌ల విలీ నంతో ఆ సంగ‌తే మ‌ర్చిపోయారు. దీనికి తోడు ప్రాథ‌మిక పాఠ శాల స్థాయిలోనే ఇంగ్లీషు మాద్యమం అమ‌లు చేయడానికి కంక‌ణం క‌ట్టుకున్నారు. పైగా తెలుగు మీడియం కోసం ఉపాధ్యాయుల‌ను పెద్ద సంఖ్య‌లో తీసు కోవ‌ల‌సి వ‌స్తుంద‌నే  తెలుగు మీడియం ఎత్తివేసేరు. ప్రాథమిక పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల  పోస్టుల భ‌ర్తీ  వ‌దిలేసేరు. ప్ర‌ధానోపాధ్యాయుడు, పిఇటీ పోస్టులను తొల‌గించేం దుకు ఆస‌క్తిచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రాథ‌మిక విద్య‌కు ఈ ప‌రంగా అపార న‌ష్టం వాటిల్లే అవ‌కాశాలున్నా యని విద్యావేత్త‌లు, మాజీ ఉపాధ్యాయు లు విమ‌ర్శిస్తున్నారు. విద్యారంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌న్న ఆరోప ణలు విన‌ప‌డుతున్నాయి. అస‌లు ఇలాంటి ప‌రిస్థితులు క‌ల్పించి రాష్ట్రాన్ని అస్త‌వ్య‌స్తం చేసిన జ‌గ‌న్ పాల‌నను ఎవ‌రు కోరుకుంటా రు.  ప్ర‌జ‌ల‌కు, పార్టీని అభిమానిస్తున్న‌వారికి కూడా జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల విముఖ‌త ఏర్ప‌డింది. బ‌య‌టికి చెప్ప‌క‌పోయినా చాలా ప్రాంతాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచ‌రుల్లోనూ ఈ అసంతృప్తి వుంద‌ని విశ్లేష‌కుల మాట‌. ఇపుడు రాష్ట్రంలో అంద‌రూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌స్తేనే త‌మ జీవితాలు బాగుప‌డ‌తా య‌ని, ఆశ‌లు ఫ‌లిస్తాయ‌నే భావ‌న గ‌ట్టిగా వున్న‌ది. జ‌గ‌న్ పాల‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌తో ముగుస్తుంద‌న్న వూహా గానాలు ఇప్ప‌టికే బాగా ప్ర‌చారంలో వున్నాయి.  

బొమ్మై కన్నీరు కథేంటో ..?

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కన్నీరు పెట్టుకున్నారు. ఒక విధంగా ఆయన ఏడ్చేశారు. అయితే, ఆయన కన్నీరు పెట్టుకుంది, రాజకీయంగా ఏదో ఇబ్బంది వచ్చికాదు.  అవును గతంలో అప్పటి ముఖ్యమంత్రి కుమారా స్వామి, సంకీర్ణ ప్రభుత్వ సారధ్య కష్టాలు తట్టుకోలేక అనేక పర్యాయాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు శాసన సభలో కూడా సంకీర్ణ  భాగస్వామ్య పక్షం, తనను అడుగడుగునా అడ్డు తగులుతూ, అవమానాలకు గురి చేస్తోందని ఆయన సభలో కన్నీరు పెట్టుకున్నారు.అయితే, పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా, బీజేపీ కాంగ్రెస్, జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి, గద్దె నెక్కి కూర్చుంది, అనుకోండి అది వేరే విషయం.  అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మైకు కూడా రాజకీయ కష్టాలు లేక పోలేదు. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఇంకా నిండా సంవత్సరం అయినా పూర్తి కాలేదు. అయినా, ఇప్పటికే ఆయన కుర్చీ కిందకు నీళ్లోచ్చాయనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత యడ్యూరప్ప  ముఖ్యమత్రి  బొమ్మైకి పక్కలో బల్లెమై కూర్చున్నారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని, బొమ్మై వర్గీయులు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం, విచారణలు జరగడం వంటి క్రతువంతా జరిగింది, జరుగుతూనే వుంది. అయితే, బొమ్మై కన్నీరుకు రాజకీయాలు కారణం కాదు.  ఒక సినిమా, అందులో కుక్క పాత్ర  అయన చేత కన్నీరు పెట్టించాయి. ఒకే సారి ఐదు భాషల్లో విడుదలైన, ‘777 చార్లీ’ సినిమా చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఈ చిత్రం ఆయనకు, ఒక సంవత్సరం క్రితం చనిపోయిన  తన పెంపుడు కుక్కను గుర్తుచేసింది. ఆ ఉద్వేగంలోనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు.  ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘777 చార్లీ’ చిత్రం ఒక్క బొమ్మైని మాత్రమే కాదు, ఆ సినిమా చుసిన చాలామంది చేత కంటతడి పెట్టిస్తోంది. నిజానికి, కుక్కలంత విశ్వాసపాత్రమైన జంతువూ మరొకటి ఉండదని అంటారు. అది చాలా మందికి అనుభవంలో ఉన్న విషయమే, ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అదే. ఒక మనిషి, కుక్కకు  మధ్య అనుబంధాన్ని చక్కగా తెరకెక్కించిన చిత్రం ‘777 చార్లీ’. అందుకే ఈ చిత్రం ప్రేక్షకులను విరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి బొమ్మై కూడా వీక్షించారు. ‘కుక్కల మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి.కానీ ఈ చిత్రంలో ఒక జంతువులో ఉండే ఎమోషన్‌ను బాగా చూపించారు.అది కళ్లతోనే తన భావాలను పలికించింది.ఇది అందరూ వీక్షించాల్సిన చిత్రం. మనుషుల ప్రేమ కంటే కుక్క మనిషి పట్ల చూపే ప్రేమ షరతులు లేని ప్రేమ. అది స్వచ్ఛమైంది’ అంటూ ఆయన ఉద్వేగానికి గురయ్యారు. తన పెంపుడు కుక్క స్నూబీ గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొద్దిరోజుల ముందు అది మరణించింది. ఆ కుక్కతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన కన్నీరు పెట్టుకున్నారు.  అయితే, ఆయన ఎందుకు కనీరు పెట్టుకున్నా, బొమ్మై కన్నీరు మీద సోషల్  మీడియాలో , ‘మంచి నటుడే’ వంటి పొలిటికల్ కామెంట్స్ కూడా రాకపోలేదు. అయితే, ఈ సినిమా  ఒక్క బొమ్మైని మాత్రమే కాదు, భూతదయ ఉన్న ఎవరినైనా ఈ సినిమా కన్నీరు పెట్టిస్తుందని అంటున్నారు. అయితే మాత్రమేంటి, రాజకీయాలకు కాదేదీ అనర్హం, అనే కదా అంటారు.

తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది..!

తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది.. అన్నట్లుంది తెలంగాణ ప్రభుత్వ తీరు. ఇటీవల  టీఎస్ ఆర్టీసీ బస్‌ ఛార్జీలను పెంచింది. కొద్ది నెలల క్రితమే చార్జీల మోత మోగించిన ప్రభుత్వం ఇంతలోనే మరో సారి చార్జీలు పెంచి, ప్రయాణీకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోంది.   బస్సెక్కిన ప్రతి ప్రయాణీకుడు, చివరకు తెరాస అభిమానులు, కార్యకర్తలు కూడా సర్కార్ ను చీవాట్లు పెడుతున్నారు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది అనే వరకు వెళుతున్నారు. దీంతో, సర్కార్ కు సెగ తగిలిందో ఏమో కానీ, చలనం అయితే వచ్చింది. అయితే, ప్రయాణీకులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విధంగా పెంచిన ధరలను తగ్గించే ఆలోచన చేస్తోందని అనుకుంటే అది పొరపాటే. టీఎస్ ఆర్టీసీ బాటలోనే ఇతర రాష్ట్రాలలోనూ చార్జీలు పెంచాలని, తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటోంది.  నిజానికి  ఒక విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒకటొకటిగా వడ్డనలు మొదలు పెట్టింది. ప్రజల పై భారం వేసేందుకు ఏ చిన్న అవకాశం చిక్కినా చటుక్కున అందుకుంటోంది. చార్జీలు పెంచేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అప్పులు పెరిగి ఆదాయం తరిగిన నేపధ్యంలో వడ్డన మార్గాన్ని తెరాస ప్రభుత్వం ఎంచుకుంది. మరో వంక మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అప్పులను నియంత్రించేందుకు ఆంక్షలు విధించింది.ఈ పరిస్థితిలో ఆదాయం చాలక అప్పులు పుట్టక, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితికి ధనిక రాష్టం పరిస్థితి దిగజారింది. అందుకే  రాష్ట ప్రభుత్వం వరస పెట్టి చార్జీలు పెంచుకుంటూ పోతోంది. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. అంతకు ముందే విద్యుత్ చార్జీలు పెంచింది. మరో వంక పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతమేర తగ్గించినా,  రాష్ట్ర ప్రభుతం మాత్రం పైసా తగ్గించేది లేదని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఇరుగు పొరుగు రాష్ట్రాలకంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండడంతో. ప్రజల నుంచి నిరసన సెగలు తగులు తున్నాయి. నిత్యావసర సరకులు, వంట నూనెలు, కూరగాయలు ఒకటనేమిటి, అన్నిటి ధరలు పెరిగి సామాన్య  ప్రజలు ఏం కొనేట్టు లేదు ఏం తినేట్టు లేదని వాపోతున్నారు. నిజమే కావచ్చును ధరల పెరుగుదల సమస్య దేశం అంతటా వుంది, కానీ, తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై అదనంగా భారం మోపడంతో, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   అదలా ఉంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తాచెడ్డ కోతి ... సామెతను గుర్తుచేస్తూ ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆయా రాష్ట్రాలు కూడా బస్సు చార్జీలు పెంచాలని, టీఎస్‌ ఆర్టీసీ ద్వారా సర్క్యులర్‌ జారీ చేసింది.  తెలంగాణ ప్రభుత్వం  ఆర్టీసీ బస్‌ ఛార్జీలను పెంచడంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చి పోయే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో అసలే నష్టాల ఊబిలో కూరుకు పోయిన టీఎస్  ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. ఈ నేపధ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్‌ ఆర్టీసీ సర్క్యులర్‌ జారీ చేసింది. అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం... ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు.  అందులో భాగంగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు సర్క్యులర్‌లను పంపించినట్టు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పెరగడంతో ఏపీఎస్‌ఆర్టీసీకి సైతం సర్క్యూలర్‌ పంపించారు.అయితే, ఏపీ సహా ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏవీ కూడా టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్’ ను సీరియస్’’గా తీసుకున్నట్లు లేదు. అందుకే సానుకూలంగా స్పందించలేదు. ఇలా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కంటే తెలంగాణలో పెట్ర్రోల్, డీజిల్ మొదలు,ఆర్టీసీ చార్జీల వరకు అన్నీ ఎక్కవే కావడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని, ఒక విధంగా ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వమే బలమైన ఆయుధం అందించిందని అధికార తెరాస ఎమ్మెల్యేలు నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.

రేవంత్ చొరవ.. కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఐక్యతారాగం.. షర్మిలకూ ఆహ్వానం

రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు.. అనూహ్యం అన్ప మాటకే తావుండదు. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు అవుతారు.. నేటి శత్రువులు రేపు ఆప్త మిత్రులు అవుతారు. నిన్నటి దాకా తిట్టి పోసుకున్న పార్టీలు నేడు పరస్పరం ప్రశంసలు, పొగడ్తలతో ఆలింగనం చేసుకుంటాయి.  తెలంగాణలో ఇప్పుడు అదే సీన్ కనిపిస్తున్నది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై గతంలో విమర్శలతో విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు షర్మిల పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటి వరకూ తెలంగాణలో షర్మిల పార్టీని కానీ, ఆమె పాదయాత్రను కానీ పట్టించుకున్న పార్టీ కానీ నేత కానీ లేరు. ఆమె మానాన ఆమె కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ నిరశనలు, పాదయాత్రతో రాష్ట్రంలో ఒంటరి పయనం చేస్తున్నారు. షర్మిల పార్టీని స్వచ్ఛంద సంస్థగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షర్మిలను కాంగ్రెస్ నిర్వహిస్తున్న అఖిల పక్ష భేటీకి ఆహ్వానించారు. రాజకీయ వర్గాలలో ఈ పరిణామం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రారంభించిన సమయంలో రేవంత్ ఆ పార్టీని కేసీఆర్ స్పాన్సర్డ్ పార్టీగా అభివర్ణించారు. ఆ తరువాత కూడా షర్మిల పార్టీని స్వచ్ఛంద సంస్థగా పేర్కొంటూ సెటైర్లు వేశారు. ఆమె పాదయాత్రలను, టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలను పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ టీపీని రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో చీలిక కోసం టీఆర్ఎస్ కోసం, టీఆర్ఎస్ చేత, టీఆర్ఎస్ వలన ఆవిర్భవించిన పార్టీగానే పరిగణించారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా షర్మిల పార్టీని గుర్తించడమే కాదు, కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ లో బుధవారం జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘బచావో హైదరాబాద్’ పేర బుధవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణ తెలుగుదేశం, టీజేఎస్, వామపక్ష పార్టీలు, బీఎస్పీ, జనసేన, ఆప్, లోక్ సత్తా ప్రతినిథులు, మహిళా సంఘాల ప్రతినిథులు, మేధావులు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మరీ షర్మిలను ఆహ్వానించారు. మంగళవారం నిరుద్యోగ దీక్షలో ఉండగా రేవంత్ ఆహ్వానం ఆమెకు చేరింది. దీంతో రెండో ఆలోచన లేకుండా ఆమె ఆ ఆహ్వానాన్ని మన్నించారు. ఖమ్మం జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు ఒక రోజు విరామం ఇచ్చి మరీ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర రాజకీయాలలో తొలి సారిగా షర్మిలకు ఇతర పార్టీల నుంచి వచ్చిన తొలి పిలుపు ఇది.  ఇప్పటి వరకూ టీఆర్ఎస్ సర్కార్ పై ఒంటరి పోరు సాగిస్తున్న షర్మిల కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ఒకింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల ఐక్యతకు ఈ సమావేశాం ఆరంభం కానుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నగరంలో పెచ్చరిల్లుతున్న డ్రగ్స్, జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ గ్యాంగ్ రేప్, క్షీణిస్తున్న శాంతి భద్రతలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

దర్యాప్తు సంస్థలా.. కేంద్రం చేతిలో కీలుబొమ్మలా!

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు వివాదాస్పదంగా మారింది. ఏలిన వారి జేబు సంస్థల్లా వాటి పని తీరు ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థల పని తీరుపై ఆరోపణలు ఉన్నప్పటికీ మోడీ హయంలో మాత్రం వాటి ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా రాజకీయ ప్రత్యర్థులను ఈ విధంగా వేధించిన దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, వారిని రాజకీయంగా క్రియాశీలంగా ఉండకుండా చేయడానికి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని రాజకీయ విమర్శలని కొట్టి పారేయడానికి వీలులేని విధంగా అవి వ్యవహరిస్తున్న తీరు ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ విమర్శలకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కొందరు ఇస్తున్న సమాధానాలు కూడా ఉద్దేశ పూర్వకంగానే మోడీ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.     యూపీఏ హయాంలో కూడా   ప్రత్యర్ధులను వేధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని బీజేపీ నాయకులు, కొందరు కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు..అప్పుడు వారు చేసిన దానికి ఇప్పుడు ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నామన్నట్లుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద మోడీ సర్కార్ రాజకీయ లెక్కలు సరి చేయడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటున్నదని.. అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారని వారి మాటలే రుజువుచేస్తున్నాయి. అయితే బీజేపీకి ప్రజలు పట్టం కట్టింది రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునే అవకాశం ఇవ్వడానికి కాదు.  కాంగ్రెస్ హయాంలో జరిగిన అవకతవకలు, తప్పిదాలు, పొరపాట్లు జరగకుండా ప్రజా రంజక పాలన అందిస్తామన్న  విశ్వాసంతో. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం అధికార పార్టీ.. వారు అప్పుడు చేశారు కనుక ఇప్పుడు మేం చేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  గవర్నర్ల నియామకం దగ్గర నుంచి ప్రత్యర్ధులపై కేసుల బనాయింపు వరకూ అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ విధానాలనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అనుసరిస్తోంది.  యూపీఏ హయాంలో దర్యాప్తు సంస్థలు అప్పటి అధికార కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతలనూ విచారించాయి. ఆరోపణలపై ఆధారాలున్నాయని తమ విచారణలో బయట పడితే వారిని అరెస్టు చేయడానికీ వెనుకాడ లేదు. యూపీఏ హయాంలో షాని గుజరాత్‌లో బూటకపు ఎన్‌ కౌంటర్ల కేసుల విచారణ సమయంలో ప్రస్తుత హోం మంత్రి అమిత్‌ షాను అరెస్టు చేసిన సంగతి విదితమే. అదే యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్‌, బొగ్గుగనుల కుంభ కోణాలపైనా సీబీఐ దర్యాప్తు చేసింది. ఆ సందర్భంగా  యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలనూ విచారించింది. మధుకోడా వంటి వారిని అరెస్టు చేసింది.  యూపీఏలో కీలక  భాగస్వామ్య పార్టీ అయిన డిఎంకె సీనియర్‌ నాయకుడు ఎ రాజా, పార్టీ ఎంపీ కనిమొళి సైతం అరెస్టయ్యారు. అయితే మోడీ హయాంలో దర్యాప్తు సంస్థలు పూర్తిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవి కేవలం బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలపై మాత్రమే దాడులు చేస్తున్నాయి, వేధిస్తున్నాయి అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ , ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీకీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు సమన్లు పంపడం, రాహుల్ గాంధీని గత రెండు రోజులుగా సుదీర్ఘంగా విచారించడం రాజకీయ కక్షగానే కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పరిశీలకులు సైతం అదే అంటున్నారు.  ఇక రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న తీరు.. గతానికి భిన్నంగా విచారణ సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చి ఆయన బయటకు వెళ్లి వచ్చేందుకు అవకాశం ఇవ్వడం, భారీ బందోబస్తు మధ్య ఈడీ వాహనంలోనే విచారణకు తీసుకు వెళ్లడం గమనిస్తుంటే ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానంతోనే కాంగ్రెస్ శ్రేణులు కూడా హస్తిన సహా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగానే ఆ సంస్థల తీరు ఉంటున్నదన్నది మాత్రం వాస్తవం.  

కోనసీమ అల్లర్లెవరి పనో తేలిపోయింది!

పచ్చటి కోనసీమలో అల్లర్ల చిచ్చు ఎవరి పనో తేలిపోయింది. కోనసీమ అల్లర్ల కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే. వీరిలో మంత్రి పినిపె విశ్వరూప్ అనుచరులు సైతం ఉన్నారు. ఈ అల్లర్లలో మంత్రి పినిపె విశ్వరూప్ నివాసం దగ్ధమైన సంగతి విదితమే. పోలీసులు అల్లర్ల కేసులో అరెస్టు చేసిన వారిలో అత్యధికులు ఆ మంత్రిగారి అనుచరులే ఉండటం చూస్తుంటే నిర్ద్వంద్వంగా అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయే అన్న విషయం తేటతెల్లం అవుతుంది. ఇప్పటి వరకూ కోనసీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన వారు రెండు వందల మందికి పైనే ఉన్నారు. వారంతా వైసీపీ కార్యకర్తలే. కోనసీమ సాధన సమితి నేతలనూ పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టారు. వారు కూడా పినిపై విశ్వరూప్ అనుచరులే. ఈ అరెస్టులను బట్టే వైసీపీ కుట్రతోనే కోనసీమలో చిచ్చు పెట్టిందని అవగతమౌతోంది. వాస్తవం ఇలా ఉండగా... ఇప్పటి వరకూ కోనసీమ విధ్వంసంపై ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం జగన్ అనంతపురంలో మంగళవారం కోనసీమలో విపక్షాలు చిచ్చు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు. ఏకంగా మంత్రి ఇంటిని దగ్ధం చేశారు అంటూ తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పించారు. అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయేనంటూ పోలీసులు అరెస్టుల సాక్షిగా తేటతెల్లమైపోతుంటే.. జగన్ మాత్రం ఆ అల్లర్ల వెనుక ఉన్నది విపక్షాలేనంటూ జనం సానుభూతి పోందేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లర్లు జరిగి ఇన్ని రోజులైనా.. ఆ విధ్వంసంలో ఏకంగా మంత్రి నివాసం దగ్ధమైనా జగన్ ఇప్పటి వరకూ మంత్రిని పరామర్శించిన పాపాన పోలేదు. దీనిని బట్టి కోనసీమ విధ్వంసాన్ని  విపక్షాలపై విమర్శలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యావే కానీ.. వాస్తవాలు బయటపడుతున్నా, అరెస్టయిన వారంతా అధికార పార్టీ అనుచరగణం అని తేలిపోయినా అంగీకరించేందుకు మాత్రం వైసీపీ కానీ జగన్ కానీ సిద్ధంగా లేరని అవగతమౌతోంది.  వర్గాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడమే జగన్ సర్కార్ ధ్యేయంగా కనిపిస్తున్నది. జగన్ సర్కార్ ఓట్ల వేటలో కోనసీమ జిల్లాలో చిచ్చు రగిల్చింది. అసలు  జగన్ సర్కార్ తన విధానాలతో రాష్ట్రంలో ప్రశాంతతకు తావు లేకుండా చేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికి పోతోంది.అందులో భాగంగానే ప్రశాంతతకు మారు పేరైన కోససీమలో కుల చిచ్చు రేపి పబ్బం గడుపుకోవాలన్న జగన్ సర్కార్ యత్నం.. బూమరాంగ్ అయ్యింది. అల్లర్ల వెనుక ఉన్నది వైసీపీయే అన్న విషయం తేటతెల్లమయ్యేలా అల్లర్ల కారకులంటూ పోలీసులు అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే ఉన్నారు, వారిలోనూ మంత్రి అనుచరుల సంఖ్యే ఎక్కువ.  అసలు కోనసీమలో చిచ్చు పెట్టడం కోసమే  కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన సమయంలోనే పలు దళిత సంఘాలు కోనసీమకు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాయి. అప్పడు వాటి వినతిని పెడచెవిన పెట్టి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది. అంతే కాదు నిర్ణయం తీసేసుకున్నాం ఇక మార్పు లేదంటూ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రకటనలు కూడా చేసేశారు.  ఆ తరువాత  హఠాత్తుగా కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వైసీపీ కార్యకర్తలే ఆ మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, అల్లర్లకు దిగారని విశ్లేషకులు అంటున్నారు. అసలు మొదటే జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ అని పేరు పెట్టి ఉంటే ఎలాంటి ఆందోళనలకూ తావుండేది కాదనీ, కానీ అలా చేస్తే వైసీపీకి పొలిటికల్ మైలేజీ ఉండదన్న ఉద్దేశంతోనే  సర్కార్ కోనసీమలో కులచ్చిచ్చును ప్రేరేపించేలా కుట్రపన్నిందనీ అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పడు అల్లర్ల కారకులంతా వైసీపీవారేనని పోలీసుల అరెస్టులతో తేటతెల్లమవ్వడంతో కోనసీమ విధ్వంసంలో దోషి ప్రభుత్వమేనని పరిశీలకులు అంటున్నారు.  

రాష్ట్రపతి ఎన్నిక.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్న శరద్ పవార్

రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ ముందు వరకూ ఉత్కంఠ రేపినా చివరకు వచ్చేసరికి ఏకపక్షంగా మారిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. విపక్షాల అనైక్యత కారణంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అనే పరిస్థితి ఏర్పడింది. సరిగ్గాఈ కారణంగానే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యమైన శరద్ పవార్ పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారన్నది విశ్లేషకుల మాట. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తొలి నుంచీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వచ్చింది. అయితే విపక్షాల ఐక్యతకు చొరవ చూపే విషయంలో వివిధ పార్టీల నాయకల మధ్య సయోధ్య లేకపోవడంతో.. అది సాకారం కాలేదు. ఇప్పుడు తీరా  రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని బీజేపీ యేతర పక్షాల నేతల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది.  మమతా బెనర్జీ కూడా బీజేపీయేతర పక్షాల నేతలకు ఆహ్వానం పంపే విషయంలో తనదైన శైలిని అనుసరించారు. సోనియాకు ఆహ్వానం పంపిన ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించలేదు. మరో వైపు కాంగ్రెస్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోనియా ప్రతినిథిగా మల్లిఖార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించింది. అందరి కంటే ముందు ఈ పని కోసం కాలికి బలపం కట్టుకు తిరిగిన కేసీఆర్.. తన ప్రయత్నాలకు బీజేపీ యేతర పార్టీల నుంచి సానుకూలత రాకపోవడంతో కినుక వహించి మౌనం వహించారు. ఇలా విపక్షాల అనైక్యత కారణంగా అభ్యర్థి ఎంపిక ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి రేసులో తాను లేనంటూ శరద్ పవార్ మంగళవారం విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరన్న విషయంలో మళ్లీ సస్పెన్స్ నెలకొంది. తొలుత శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకువచ్చింది. రాజకీయాలలో సీనియర్ అయిన  శరద్ యాదవ్ అభ్యర్థిత్వం పట్ల ఏ బీజేపీయేతర పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అయితే పార్టీలుఈ విషయాన్నిప్రకటించే విషయంలో జరిగిన జాప్యం, అలాగే వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తాయన్న స్పష్టత రావడంతో శరద్ పవార్ తాను రేసులో లేననీ, పోటీకి సుముఖంగా  లేననీ ప్రకటించేశారు. ప్రస్తుత సినేరియాలో విపక్షాలకు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైనన్ని ఓట్లు ఎలక్టోరల్ కాలేజీలో లేవు. దీంతో గెలిచే అవకాశంలేని పోటీలో దిగడమెందుకన్నభావనతోనే శరద్ పవార్ రేసు నుంచి తప్పుకున్నారని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు.

మిత్రులారా..! విజ‌య‌మో.. వీరావేశ‌మో తేల్చుకుందాం!!

మూర్ఖ‌పు రాజును గ‌ద్దె దింప‌డానికి  ఇత‌ర రాజ్యాల‌వారు క‌ల‌వ‌డం అనివార్యం. అయితే  అదీ గొప్ప యుద్ధ వ్యూహ ర‌చ‌న‌తోనే జ‌ర‌గాలి. వూరికే క‌లిసి టిఫిన్ చేసి నాలుగు క‌బుర్లు చెప్పుకోవ‌డం కాకుండా ప‌క‌డ్బందీగా  ఒక మాట అనుకుని అంద‌రూ క‌లిసి ముంద‌డుగు వేయాలి. అపుడే ల‌క్ష్యం సిద్ధిస్తుంది. రాజు మొండివాడ యినా న‌లుగురి ఆలోచ‌న మొండివాడికీ బుద్ధి వ‌చ్చేట్టు చేస్తుంది. కానీ  అందుకు ధైర్యంగా ముంద‌డుగు వేయాలి. అదీ ఏ ఒక్క‌రిద్ద‌రో చేస్తే  కుద‌ర‌దు. కానీ మొండివాడికి  వీరి ర‌హ‌స్యాలు తెలిసి  వుంటేనే  క‌ష్టం. అలాంట‌పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ప‌రిశీలించాలి. ఎందుకంటే మొండివాడు ఎప్ప‌టిక‌యినా ప్ర‌మా ద‌మే.  దేశంలో బిజెపి ప్ర‌భుత్వానికి జాతీయ‌స్థాయిలో గ‌ట్టి ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం బాగా క‌లిసివ‌చ్చింద‌నాలి. కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వ విధానాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏదో ఒక సంద‌ర్భంలో ఎండ‌గ‌డుతున్నా యి.  ఎప్ప‌టికప్పుడు ఎదిరించాల‌నుకుంటున్నాయి. కానీ ఏదీ  కార్యాచరణ  దాకా రావడం లేదు. క‌నుక కాం గ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయంగా  కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పెట్టి బిజెపీకి గ‌ట్టి  షాక్ ఇవ్వాల‌నే నిర్ణ‌యించుకు న్నారు. అయితే అందుకు న‌లుగురినీ కూడ‌గ‌ట్టుకోవాలి. అందుకు ఎవ‌రు క‌లిసి వ‌స్తారు? ప‌క్క‌నే వున్న తెలుగు రాష్ట్రం వైసీపీ ప్ర‌భుత్వం అందుకు ముంద‌డుగు వేసే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేని  స్థితిలో వుంది.  అందుక్కార‌ణం వారి ర‌హ‌స్యాల‌న్నీ కేంద్రానికి ఎరుక గ‌నుక‌!  అస‌లే  ఈడీ చుట్టు ప్ర‌ద‌క్షిణాల‌తో గ‌డుపుతున్న ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్ రెడ్డి కేంద్రంలో బిజ‌పీ ప్ర‌భుత్వాన్ని ఎదిరించే సాహ‌సం ససెమీరా చేయ‌లేరు. అస‌లు ఈడీ, ఐటీ శాఖ‌లు  ప్ర‌ధాని మోదీ, బిజెపీ అధినేత షా  జేబులో వుండ‌టంతో ఎవ‌రు మాత్రం ధైర్యం చేస్తారు. కాదు కూడదు అనుకుంటే ఒక్క అడుగు ముందుకేసినా, ఒక్క ఆలోచ‌న‌తో కేంద్రం వేపు చూసినా మ‌ర్నాడు ఉద‌యం తెల్లారుతూనే ఈడీ స‌మ్మ‌న్లు గేట్లో ప‌డుంటాయి!  ఇక  ధైర్యం నీరుగాక  ఛ‌స్తుందా?  కేసీఆర్ ధైర్యంచేసి మోడీపై  డైరెక్ట్ అటాక్  చేస్తుంటే..ఇదంతా లాలూచీ కుస్తీ  అనే  చాలామంది అనుకు న్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా ఇది లాలూచీ కుస్తీ కాదు.. సీరియస్ పోరాటమే అనే సంకేతాలు ఇవ్వడానికి  కేసీఆర్ ప్ర‌యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు రూపంలో కేసీఆర్ కు ఓ అస్త్రం దొరికింది. తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ కు ఇంకో అస్త్రం కావాలి. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మోడీని, బీజేపీని ఎంత విమర్శించినా పెద్దగా మైలేజ్ రాదు.దేశం కోసం నేను బీజేపీకి వ్యతిరేకంగాపోరాడుతున్నా, నాకు మద్దతు ఇవ్వండి" అని ప్రజలకు అప్పీల్ చేయడం కేసీఆర్ కు తేలిక. ఇది అటు లోక్ సభ స్థానాలే కాదు.. అసెంబ్లీ  స్థానాలుగెలవడానికి కూడా జాతీయపార్టీ అనేది కేసీఆర్ కు ఉప‌యోప‌డుతుంది. ఒకవేళ మోదీ  షా తెలం గాణ  అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్ సభకు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లినా..మోడీ హవాని  తెలంగాణలో ఆపడానికి కేసీఆర్  పెట్ట‌బోయే  కొత్త  జాతీయ పార్టీ ఉపయోగపడుతుంది. ఒక జాతీయ పార్టీని  ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ కు  వస్తే ప్రధానమంత్రి  అనే కొండ వస్తుందనే ఆశ. ఆ  కొండ రాకపోతే  కనీసం రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడానికి అయినా ఉపయోగపడుతుందనే ఎత్తు గడ.  అందుకే  కేసీఆర్ జాతీయపార్టీ  ఆలోచన  చేస్తున్నట్లు భావించొచ్చు. ఇక  పీకే  విషయానికొస్తే.. ఆయన కేసీఆర్ దగ్గర డబ్బు కోసం పనిచేస్తున్నాడా..నిజంగానే  కేసీఆర్  మీద నమ్మకంతో  పనిచేస్తున్నాడా అనేది ఇంకొద్ది రోజుల్లో  తేలిపోతుంది. పీకే  గనుక కేసీఆర్ పెట్టే పార్టీలో చేరి బాధ్యతలు తీసుకుంటేనమ్మకం ఉన్నట్లు స్పష్టమవు తుంది. ప్రశాంత్ కిషోర్ కు చాలా రాజకీయ ఆశలు న్నాయి. అంతకుముందు నితీష్ కుమార్ కి  చెందిన జేడీ(యు) లో అయన కొన్నాళ్లున్నారు.  తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించి ఫెయిలయ్యారు. ఇప్పుడు బీహార్ లోపాదయాత్ర చేస్తున్నారు. మత తత్వ అజెండా స్థానంలో ప్రజా స్వామ్యానికి చోటు ఉండదు. రాజకీయంగా ఎదగాలని ఆశ ఉన్న ప్రశాంత్ కిషోర్ తన సలహాలతో కేసీఆర్ స్థాపిస్తున్న పార్టీలోచేరడంపై అభ్యంతరం ఉండకూడదు. కేసీఆర్కు పీకే కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గానే ఉండిపోతే ఆయన కేసీఆర్ దగ్గర డబ్బు కోసం పని చేస్తున్నట్లు అనుకోవచ్చు. కేసీఆర్ జాతీయ పార్టీ వల్ల  ప్రజలకి మాత్రం కొంత మంచి జరిగే అవకాశం ఉంది. బీజేపీని గట్టిగా నిలదీసే ఒక కొత్త గొంతు దేశానికి దొరుకుతుంది. రాజకీయ చర్చల్లో మతతత్వ అజెండా స్థానంలో కొద్దిగా అయినా ప్రజల సమస్యలు అజెండాగా మారే అవకాశం ఉంది. ఈ మేరకు కేసీఆర్  కొత్త పార్టీ వల్ల ప్రజలకు ఏమేలు జరుగుతుందో చూడాలి. 

సారీ దీదీ.. కే.కే వ‌స్తారు.. మ‌మ‌తా స‌మావేశం ప‌ట్ల కేసీఆర్ కినుక‌?

ఎన్నో ఆశ‌ల‌తో త‌న ఆలోచ‌నాస‌ర‌ళికి ద‌గ్గ‌రున్న‌వారిని క‌లిసి గొప్ప కార్య్ర‌క‌మం, ఉద్య‌మం చేప‌డ‌దామ‌ను కున్న‌వారికి అనుకున్న స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భించ‌కుంటే ఎంతో బాధ క‌లుగుతుంది. ఊహించిన స్నేహ బంధం ఆశించిన క‌ల‌యిక‌కు వీలు క‌ల్పించ‌న‌పుడు త‌న లక్ష్య‌సాధ‌నకు చేప‌ట్టిన కృషి వృధా అవుతుందే అన్న బాధ ఇబ్బందిపెట్ట‌కా పోదు. తాను త‌ల‌చిన‌పుడు కాకుండా మ‌రొక‌రు త‌ల‌చిన‌పుడు అదే ప‌ని చేప ట్ట‌డానికి, అదే బాట‌లో అడుగులు వేయ‌డానికి వెళ్ల‌వ‌ల‌సి రావ‌డం అయిష్ట‌త‌తోనే జ‌రుగుతుంది.  అందుకే త‌న స్థానంలో త‌న ప్ర‌తినిధిని పంపుతాన‌ని త‌ప్పించుకోవ‌డానికి వెనుకాడ లేదు తెలంగాణా ముఖ్య మంత్రి , టిఆర్ ఎస్ అధినేత కే.చంద్ర‌శేఖ‌ర రావు.  కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వాన్ని ఎలాగ‌యినా ఈసారి ప‌డ‌గొట్టాల‌న్న ప‌ట్టుద‌ల  అటు మ‌మ‌తా బెన‌ర్జీ, ఇటు కేసీఆర్ బాగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కాబోతే, ఒకే ఎజెండా గ‌నుక క‌లిసి వ్యూహాన్ని రూపొందించుకుంటే బాగుం డేది. కానీ అప్పుడే కోప‌గించుకోవ‌డాలు మొద‌ల‌య్యాయి. బుధ‌వారం మ‌మ‌తా బెన‌ర్జీ నాయ‌క‌త్వంలో ఢిల్లీ లో స‌మావేశం జ‌ర‌గ‌నుంది. దానికి బిజెపి వ్య‌తిరేక నాయ‌కులంతా పాల్గొంటున్నారు. స‌మావేశంలో పాల్గొ నాల‌ని తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. కానీ ఆయ‌న కినుక వ‌హించారు. ఒక పెద్ద యుద్దానికి స‌న్న‌ద్ద‌మ‌వుతున్న‌పుడు మ‌రి వ్యూహ‌ ర‌చ‌న‌కు క‌లిసి క‌ట్టుగానే ప‌నిచేయాలి. నేనొక‌టి త‌లిస్తే తానొక‌టి త‌లిచిన‌ట్టుగా వుండ‌కూడ‌దు. నేను అడుగు ముందుకు వేసిన‌పుడు ఉత్సాహ‌ప‌ర‌చ‌లేదు గ‌దా? ఇపుడు వారి పిలుపును అందిపుచ్చుకుని  రంగంలోకి దిగాలంటే ఎలా? అని బ‌హుశా కేసీఆర్ ఇగో దెబ్బ‌తిని వుండ‌వ‌చ్చ‌న్నది విశ్లేష‌కుల మాట‌.   ఆమ‌ధ్య కేసీఆర్ దృఢ నిశ్చ‌యంతో న‌డుం బిగించి ఉత్త‌రాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ముఖ్యంగా బిజె పీని  గ‌ట్టిగా వ్య‌తిరేకించేవారిని క‌లిసి మ‌న‌మంతా ఒక్క తాటి మీద న‌డిస్తే, ఒక ప‌థంలో ముంద‌డుగు వేస్తే కేంద్రాన్ని భ‌య‌ పెట్ట‌వ‌చ్చుని ప్ర‌చారం చేసేరు. అందుకు బ‌య‌లుదేరి వెళ్లేరు. ఆ మ‌ధ్య స‌మా జ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాద‌వ్‌ని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్  , ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతోనూ  స‌మావేశ‌మ‌య్యారు. బిజెపికి వ్య‌తిరేక కూటమిని ఏర్పాటు చేసి మోదీ ప్ర‌భు త్వం మీద యుద్ధం చేయాల‌ని ఎంతో ఆశించారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ లేదు. కేసీఆర్‌కు వారి నుంచి ఆశించిన మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ డంతో తిరుగు ముఖం ప‌ట్టారు. ఆయ‌న‌కు ఊహించ‌ని అవ‌మాన‌భారం మిగిలింది. అయితే కేసీఆర్  ఏ మాత్రం కుంగిపోలేదు. జాతీయ‌ స్థాయిలో కొత్త పార్టీ పెట్టి అంద‌రికీ షాక్ ఇద్దామ‌న్న ఆలోచ‌న‌లో వున్నారు.  ఇదిలా వుండ‌గా, బిజెపి వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటు ఆలోచ‌న‌ను ముందుకు తీసికెళ్ల‌డానికి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ బిజెపి వ్య‌తిరేక పార్టీల నాయ‌కుల‌కు పిలుపునిచ్చింది.  కేసీఆర్ కి ఈ ఆహ్వా నం అంత‌గా రుచించ‌డం లేదు. తాను స్వ‌యంగా ఎంతో న‌మ్మ‌కంతో క‌లిసిప‌నిచేయ‌డానికి చ‌ర్చ‌ల‌కు వెళ్లిన‌పుడు అంత‌గా స్పందించ‌నివారు ఇపుడు త‌న‌ను ఆహ్వానించ‌డంలో అర్ధ‌మేమిట‌ని బ‌హుశా కేసీఆర్ అనుకొని వుండ‌వ‌చ్చు. అయితే త‌న మ‌న‌సులో భావాన్ని బ‌య‌టికి వ్య‌క్తం చేయ‌కుండా త‌నకి  బ‌దులు  టి ఆర్ ఎస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎం.పీ  కే. కేశ‌వ‌రావు స‌మావేశంలో పాల్గొంటార‌ని తెలియ‌జేశారు.  కొత్త‌ పార్టీ రూప క‌ల్ప‌న విష‌యం లో త‌ల‌మున‌క‌ల‌యినందువ‌ల్ల  తాను దీదీ నిర్వ‌హించే స‌మావేశానికి రాలేన‌ని కేసీఆర్ తెలియ‌జేశారు. సోమవారం ఉండ‌వ‌ల్లి మీడియా స‌మావేశం కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు విషయాన్ని స్ప‌ష్టం చేసింది. పైగా కేసీఆర్ కూడ 19న జ‌రిగే పార్టీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో కొత్త పార్టీ ప్రక‌ట‌న చేయ‌డానికీ అవ‌కాశం వుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ త‌ర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప‌లువురు ప్ర‌ముఖుల‌తో స‌మావేశం కావ‌చ్చు. అందులో కొత్త పార్టీ ఎజెండా,జెండా, సాంకేతిక అంశాల‌పై నిపుణ‌ల తోనూ కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.    

రాహుల్ సారీ ఇదిఎన్నోసారి ..

కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల గాంధీ మరో  మారు, క్షమాపణ చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు, ఈడీ అధికారులకు క్షమాపణ చెప్పారు. నిన్న (సోమవారం) ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో అధికారులకు క్షమాపణలు చెప్పారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈరోజు (మంగళవారం) వాంగ్మూలం నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటానని రాహుల్ చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అదలా ఉంటే, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడం ఇదే మొదటి సారి కాదని, గతంలో ఆయన, అనేక సందర్భాలలో వివాదాస్పద, అసత్య వ్యాఖ్యలు చేసి, న్యాయస్థానాలకే కాదు, పార్లమెంట్’కు కూడా క్షమాపణలు చెప్పారని రాజీయ పరిశీలకు గుర్తు చేస్తున్నారు. మాట తడబడి పార్లమెంట్ ‘కి సైతం క్షమాపణలు చెప్పారని పరిశీలకు గుర్తు చేస్తున్నారు.మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం,పేరును స్పష్టంగా పలక లేక, తడబడి నవ్వుల పాలైన సందర్భంలో, రాహుల గాంధీ పార్లమెంట్’లో  జోవియల్ గానే కావచ్చును, సారీ.. సారీ ... సారీ అంటూ సభలో నవ్వులు పూయించారు.  అదలా ఉంటే, 2014 ఎన్నికల ప్రచార సభల్లో  మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం  సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కుట్ర చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణల ఆధారంగా ఆర్ఎస్ఎస్ భివాండి (మహారాష్ట్ర) కోర్టులో పరువు నష్టం దావా వేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీ, ఆరోపణలు అవాస్తమని నిర్ధారించడంతో రాహుల్  గాంధీ ఆర్ఎస్ఎస్’కు, న్యాయస్థానానికి  క్షమాపణలు చెప్పారు.   ఇక రఫేల్‌ కేసుకు సంబంధించి 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, ‘చౌకీదార్‌ చోర్‌ హై' అనే స్లోగన్ కాయిన్ చేశారు. ప్రధాని మోడీని ‘దొంగ’ గా అభివర్ణిస్తూ ప్రచారం సాగించారు. అంతే కాకుండా, ఇందుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానమే, ప్రధానిని తప్పు పట్టిందని తప్పుడు ప్రచారం చేశారని న్యాయస్థానం తప్పు పట్టింది. ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. అమేథి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఉద్దేశించి చౌకీ దార్ చోర్ హై’ అని  సుప్రీంకోర్టు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించింది. ఆయన  వివరణ ఇచ్చారు. క్షమాపణ చెప్పారు. అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు.  వివరాల్లోకి వెళితే, చౌకీదార్‌ చోర్‌ హై అని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి మీనాక్షి లేఖి కోర్టు ధిక్కార కేసు పెట్టారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు రాహుల్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చౌకీదార్‌ వ్యాఖ్యలపై కోర్టును తప్పుదోవ పట్టించడం సబబు కాదని రాహుల్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్‌ ఇప్పటివరకు క్షమాపణ ఎందుకు చెప్పలేదని, చింతించడం అనే పదం కోసం 22 పేజిల అఫిడవిట్‌ ఏంటని సుప్రీం ఆగ్రహించింది. రాహుల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి క్షమాపణలు చెప్పారు. కోర్టును కించపరచే ఉద్దేశం లేదని, క్షమాపణ చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేస్తానని రాహుల్‌ సుప్రీంకు వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతానికి వస్తే,నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు, ఈడీ అధికారులకు క్షమాపణ చెప్పారు. ఈడీ విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో అధికారులకు క్షమాపణలు చెప్పారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈరోజు (మంగళవారం) వాంగ్మూలం నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటానని రాహుల్ చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.అదలా ఉంటే, నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు విచారణకు ఎదుర్కుంటున్న రాహుల గాంధీకి కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు నేతలు సంఘీభావం తెలిపారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ది మూడో ప్లేసేనా?..పీకే సర్వేల ఫలితమిదేనా?

‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’ ఉందట తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ తీరు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయావకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తుంటే.. దేశ రాజకీయాలలో   చక్రం తిప్పుతానంటూ జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ సన్నాహాలు చేయడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు గాలి వీస్తోందన్న నివేదికలు స్వయంగా కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అటియాస్ పీకే బృందం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి మరీ సమర్పించినవే.  ప్రశాంత్ కిశోర్ గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా ఏడు దఫాలు సర్వే చేసి మరీ నివేదిక రూపొందించారు. ఆసర్వేలో కేసీఆర్ పార్టీకి వచ్చే ఎన్నికలలో గట్టి ఝలక్ తప్పదని తేలిందంటున్నారు.  ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని పీకే సర్వేలలో తేలిందని నివేదిక స్పష్టం చేసింది.   పీకే తన బృందం చేసిన సర్వేల ఆధారంగా రూపిందించిన నివేదికను స్వయంగా కేసీఆర్ కు సమర్పించడమే కాకుండా.. పార్టీ బలా బలాలపై పూసగుచ్చినట్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించినట్లు ప్రగతి భవన్ వర్గాల భోగట్టా. ఆ నివేదిక ప్రకారం కేసీఆర్ కేబినెట్ లో కనీసం 11 మంది మంత్రులకు వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు. అన్నిటి కంటే టీఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలవరపెట్టే అంశమేమిటంటే మెజారిటీ స్థానాలలో పోటీ విపక్షాల మధ్యే ఉంటుందన్నది. అంటే మెజారిటీ స్థానాలలో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తలపడనున్నాయనీ, టీఆర్ఎస్ ది మూడో స్థానమేననీ పీకే నివేదిక స్పష్టం చేసిందని పార్టీ వర్గాల సమాచారం. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందనీ, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని ఇప్పటికే పరిశీలకులు పలు మార్లు విశ్లేషణలు చేశారు. సిట్టింగ్ లను పక్కన పెట్టి కొత్త వారిని తెరమీదకు తీసుకువచ్చినా పెద్దగా ఫలితం ఉండదని పీకే సర్వే విస్పష్టంగా తేల్చేసింది. ఏతావాతా పీకే సర్వే సారాంశమేమిటంటే.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెరాస మూడో స్థానానికి పరిమితమౌతుందని. అధికారం కోసం కాంగ్రెస్,బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని. దీంతో టీఆర్ఎస్ శ్రేణులలో కలవరం ప్రారంభమైంది. అందుకే జాతీయ పర్టీ, జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడంపై అసంతృప్తి పెల్లుబకుతోంది.   

ఎవరికి వారే యమునా తీరేనా?: రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి

దేశంలో మోడీ సర్కార్ విద్వేష పూరిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందనీ, విచ్ఛిన్న రాజకీయాలు నెరపుతోందనీ బీజేపీయేతర పార్టీలన్నీ ఆరోపణలతో దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చే విషయంలోనే ఆ పార్టీల యత్నాలు ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్లే విషయంలో చర్చలకు మమతా బెనర్జీ ఆహ్వానానికి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో బీజేపీకి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి టెన్షన్ లేని వాతావరణం నెలకొంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై విపక్షాలనే ఏకతాటిపైకి తీసుకురావడానికి మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఈ విషయంపై చర్చకు రావాల్సిందిగా మమతా బెనర్జీ 22 మంది విపక్షాల నేతలకు ఆహ్వానం పంపిన సంగతి విదితమే. కేసీఆర్ సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తెలిసింది. కేసీఆర్ మాత్రం పూర్తిగా గైర్మాజర్ అనుకోకుండా తన బదులుగా, లేదా తన ప్రతినిథిగా కేకేను పంపిస్తున్నారు. ఏది ఏమైనా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రేపు హస్తిన వేదిక గా జరగనున్న విపక్ష నేతల భేటీ విపక్షాల అనైక్యతకు మరో ఉదాహరణగా మిగిలిపోనున్నదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉండనున్నారు. అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఈడీ విచారణ, అందుకు కాంగ్రెస్ నిరసనలతో కాంగ్రెస్ తరఫు నుంచి ఈ సమావేశానికి ఎవరైనా హాజరౌతారా అన్నది అనుమానమే. ఇక కేసీఆర్ హాజరు కాబోవడం లేదని తేలిపోయింది. మహాముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల హాజరుపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ల హాజరుపై కూడా ఎటువంటి సమాచారం లేదు.  మమతా బెనర్జీ నిర్వ‌హిస్తున్న ఈ సమావేశానికి దూరంగా ఉండాలని పలు వామపక్ష నేతలు కూడా భావిస్తున్నారు. ఇలా ఉండగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలను విడిగా చేస్తున్నదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై వివిధ పార్టీల నేతలతో చర్చించేందుకు ఇప్పటికే సోనియా గాంధీ మల్లిఖార్జున్ ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టే మమతా బెనర్జీ కూడా తాను నిర్వహించే సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపలేదు.  ఇక పోతే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 18న ఎన్నిక జ‌రుగుతుంది.

బాదుడే బాదుబు.. దేవిని ఓదార్చిన మీనాక్షి నాయుడు

ఇద్ద‌రు అమ్మాయిలు క‌లిస్తే ప్ర‌భాస్ గురించే మాట్లాడుకుంటారు. ఇద్ద‌రు అబ్బాయిలు క‌లిస్తే త‌మ‌న్నా గురించే మాట్లాడుకుంటారు. ఇద్ద‌రు పిల్ల‌ల పిల్ల‌ల త‌ల్లులు క‌లిస్తే అత్తింటి ఆర‌ళ్ల గురించే మాట్లాడుకోవ‌చ్చు. మావాళ్లు ఇలా అంటు న్నారు అంటే మావాళ్లే న‌యం అని తోటికోడ‌ళ్లు కొంగులు త‌డిపేసుకోవ‌డం అనాదిగా వున్న‌దే.   రెండు పార్టీల వారు క‌లిస్తే ఒక‌రినొక‌రు తిట్టుకోవ‌చ్చు. కానీ అందుకు విరుద్ధంగా జ‌రిగింది ఆదోని మండ లం బ‌ల్లేక‌ల్లులో!   ఎంతో ఆశిస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని టిడిపి నాయ‌కుడు మీనాక్షి నాయుడిని చూసి  ఆదోని బ‌ల్లేక‌ల్లు వైసీపీ ఎంపిటీసీ స‌భ్యురాలు దేవీ క‌మ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్ల‌కు త‌న‌ను క‌లిసి క‌ష్టాలు ఏమిటని, ఎలా వున్నార‌ని అడుగుతున్నందుకు అమాంతం ఆమె ఘొల్లుమంది.  అది చూసినవారు కూడా ఎంతో బాధ‌ప‌డ్డారు. ఎంతో ఆశించాము కానీ ఎంతో అన్యాయం జ‌రుగుతోంద‌ని అనుకున్నారు.  జ‌గ‌న్ పాల‌న క‌డు ద‌రిద్రంగా వుంద‌ని, జ‌గ‌న్‌ని దించేయ‌డం అంద‌రికీ మేల‌ని ప్ర‌చారం చేయ‌డంలో భాగంగా తెలుగుదేశం బాదుడే బాదుడు అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. జ‌గ‌న్ పాల‌న అన్ని రంగాల్లో ప్ర‌గ‌తి శూన్యం, ప్ర‌జాసంక్షేమం వూసే లేద‌ని టిడిపి తిరుగుబాటు లేవ‌నెత్తింది. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో భాగంగా టిడీపీ నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అంద‌రినీ క‌లుస్తూ ఇక వైసీపీ ప్ర‌భుత్వం ప‌ని అయిపోయిన‌ట్టే, రాబోయేది మ‌న పాల‌నే ఇబ్బందులు తొల‌గిపోతాయ‌ని అంద‌రికీ ధైర్యం చెబుతు న్నారు. అలా ఆయ‌న‌ ఒక ఇంటికి వెళ్లేరు. ఆ ఇంట్లో వున్న‌ది ఎవ‌రో కాదు స్వ‌యానా వైసీపీ ఎంపీటీసీ స‌భ్యురాలు దేవీ క‌మ్మ‌.  మీనాక్షినాయుడు అంద‌రినీ క‌లిసిన‌ట్టే ఆమెనీ క‌ల‌వ‌డానికి వెళ్లారు. ఇక్క‌డే అనుకోని సంఘ‌ట‌న జ‌రిగిం ది. ఆయ‌న్ని చూడ‌గానే దేవీ అమాంతం క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఏమ‌యింద‌క్కా.. అంటూ ప‌ల‌క‌రిస్తే వెక్కిళ్లు దిగ‌మింగుకుంటూ అన్నా జ‌గ‌న్ పాల‌నలో అంతా గొప్ప‌గా వుంటుంద‌ని అనుకున్నాను. కానీ  ఏ మాత్రం స‌హాయ‌స‌హ‌కారాలు లేవు. నానా ఇబ్బందులూ ప‌డుతున్నాము. దేనికీ ఉల‌క‌డు ప‌ల‌క‌డు. గ‌తం లో చంద్ర‌బాబు నాయుడుగారే వెయ్యి రెట్టు న‌యం అని ఏడ్చేసింది!  క‌ష్టాలు క‌ల‌ కాలం వుండ‌వు, మంచి కాలం ముందుంది, దిగులు ప‌డ‌కు. అంతా మంచే జ‌రుగుతుంద‌ని మీనాక్షి నాయుడు  ఆ వైసీపీ ఎంపి టీసీ దేవీ క‌మ్మ‌కు ధైర్యం నూరిపోసారు. అంతేక‌దా.. ఏద‌యినా కాలమే చెబుతుంది. జ‌గ‌న్ పాల‌న‌లో అనుకున్న‌ది ఒక‌టి, అయిన‌ది ఒక‌టి.  దేవీ ఒక్క‌రే క‌ష్టాన్ని ఇలా త‌మ‌ను ఆద‌రించి ప‌ల‌క‌రించ‌డానికి వ‌చ్చిన‌వారికి క‌ష్టాల గోడు పెట్టుకున్నారని అనుకోవ‌ద్దు. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో ఇంకెంతో మంది ఈ విధంగా బాధ‌లు చెప్పుకుంటున్నారు.

ఉండవల్లితో భేటీ అందుకేనా..? పొలిటికల్ సర్కిల్స్’లో హాట్ డిస్కషన్

ఉండవల్లి సరే... ఆయనకు రాజకీయంగా ఉన్నదీ లేదు, పొయేదీ లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి నందుకు 2014లోనే కాంగ్రెస్  ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అ తర్వాత ఆయన కూడా రాజకీయాలకు దూరంగా, చేసేది లేకనే కావచ్చును,  ప్రవచనాలతో కాలక్షేపం చేస్తున్నారు. సో .. ఇప్పడు ఆయన ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ప్లేట్ ఫిరాయించినా, కేసీఆర్’ను పొగడ్తలతో ముంచెత్తినా, కేసీఆర్ భజన చేసినా ఇంకో మెట్టు కిందకు దిగి, కేసీఆర్ పెట్టే పార్టీకి సలహాదారు గానో, లేదా మరో పాత్రో పోషించినా ఆయనకు పోయేదేమీ లేదు. ఆఫ్కోర్స్, రాజమహేంద్రవరం ఎంపీగా ఆయన సంపాదించుకున్న గత వైభవం కారణంగా మిగిలున్న పరువులాంటిది ఏదైనా అంతో ఇంతో ఇంకా మిగిలుంటే, అది కాస్తా, ఖర్చయిపోతే పోవచ్చును. అంతకు మించి ఆయనకు పోయేది లేదు. వచ్చేది అయితే అసలే లేదు.  కానీ, కేసీఆర్ పరిస్థితి, అది కాదు... ఆయన క్రియాశీల రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను సక్సెస్ఫుల్’గా ఎస్టాబ్లిష్ చేసిన ఆయన,ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. కారణాలు ఇంకైమైనా కావచ్చును కానీ, జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేసేందుకు, వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ను ఆశ్రయించిన కేసీఆర్, ఇప్పుడు ఉండవల్లితో మంతానాలు సాగించారు. కేసీఆర్ ప్రవచిస్తున్న జాతీయ జాతీయ పార్టీ ఏర్పాటుకు, ఈ భేటీకి ఏదైనా సంబంధం ఉన్నా  లేకున్నా రాష్ట్ర రాజకీయాలపై మాత్రం ఈ భేటి ప్రభావం తప్పక ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే, ఆయన ఆశలు, అవసరాలు ఎలా ఉన్నా, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినా, తిప్పక పోయినా, ఆయన పునాదులు మాత్రం తెలంగాణలో మరీ మాట్లాడితే, తెలంగాణ అస్తిత్వ వాదంలోనే ఉన్నాయన్నది నిజం. అవును, తెలంగాణ సెంటిమెంటే ఆయన బలం. ఆ సెంటిమెంటే ఆయన్ని ఈ స్థితికి చేర్చింది. అయితే, ఇప్పుడు  కరుడు కట్టిన సమైక్యవాదిగా ముద్రవేసుకుని,  పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లునే న్యాయ స్థానంలో సవాలుచేసి, ఇంకా న్యాయపోరాటం చేస్తున్న, తెలంగాణ వ్యతిరేకి ఉండవల్లి అరుణ కుమార్’తో మంతనాలు జరపడం, అనేక సందేహాలకు తావిస్తోంది. చావు నోట్లో తలపెట్టి తెచ్చానని చెప్పుకునే తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇప్పుడు పోయి పోయి కరడు కట్టిన సమోక్యవాది ఉండవల్లితో రాజకీయ మంతనాలు సాగించడం ఏమిటి? తెలంగాణ ప్రజలు ఈ ‘భేటీని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి ఈ భేటీ ద్వారా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ప్రజలకు ఏమి సమాధానం చెపుతారు?  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.  తెలంగాణ సెంటిమెంట్’ను అడ్డుపెట్టుకునే తెరాస  ఒకటికి రెండు సార్లు ఎన్నికలలో  విజయం సాధించింది. అయితే ముచ్చటగా  మూడవ సారి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టేందుకు, తెలంగాణ సెంటిమెంటును మాత్రమే నమ్ముకుంటే ప్రయోజనం ఉండదని, సెంటిమెంటును నమ్ముకుంటే ఈసారి విజయం సాధించడం అయ్యే పనికాదని కేసీఅర్’కు అర్థమై పోయిందని అంటున్నారు. ముఖ్యంగా, దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రమాద ఘంటికలు వినిపించిన నేపధ్యంలో, కేసీఆర్, జాతీయ రాజకీయాల పేరిట దక్షిణాది సెంటిమెంట్ ‘ను ఆశ్రయించారని, అందులో భాగంగానే, ఆయన ఎన్నికల వ్యూహకర్త పీకే డైరెక్షన్’లో పావులు కదుపుతున్నారని, అంటున్నారు. ఇందులో భాగంగానే, ఉండవల్లితో కేసీఆర్ భేటీ అయ్యారని తెలుస్తోంది. అంతే కాదు, ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు,  ఉద్యమ సంఘాలే కాదు, తెరాస నాయకులు కార్యకర్తలు కూడా  ఈ పరిణామాన్ని జేర్ణించుకోలేకుండా ఉన్నారని అంటున్నారు.  ఇప్పటికే తెలంగాణ ఉద్యమా స్పూర్తిని, లక్ష్యాలను, ఉద్యమం కోసం ప్రాణ త్యాగం చేసిన 1200 మంది అమరవీరుల త్యాగాలను మరిచి,  ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి, కుటుంబ పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న కేసీఆర్, ఇప్పుడు ఏకంగా, సమైక్య వాదానికి చెరగని చిరునామాగా నిలిచిన ఉండవల్లితో రహస్య మంతానాలు సాగించడం ఎవరి వరకో ఎందుకు, తెరాసలోనే ఒక వర్గం గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్’లో ప్రధాని మోడీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏదో అన్నారని, ప్రధానిపై   ఇంతెత్తున ఎగిరిపడిన తెరాస నాయకులు, ప్రధాని మోడీ తెలంగాణను ఏపీలో విలీనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేసిన నాయకులు, ఇప్పుడు, కేసీఆరే అలాంటి సంకేతాలు పంపుతున్నారా? పునః విలీనానికి సిద్దమవుతున్నారా ? అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు. అయితే, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం, కేసీఆర్ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారని సీనియర్ జర్నలిస్టు ఒకరు స్వీయ అనుభవం వ్యక్తపరిచారు.ఆలాగే , కొద్ది రోజుల క్రితం సినిమా నటుడు ప్రకాష్ రాజ్’ను ఇలాగే, కొద్దిరోజులు వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టారని, ఇప్పడు ఉండవల్లిని కూడా కరివేపాకులా తీసేసిన ఆశ్చర్య పోనవసరం లేదనీ అంటున్నారు.

వంగవీటి వల్లభనేని భేటీ .. అసలేం జరుగుతోంది?

గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా మళ్లీ భేటీ అయ్యారు. గన్నవరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొన్న వీరిద్దరు కొద్ది సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత వంగవీటి రాధాను గన్నవరం ఎమ్మెల్యే వంశీ స్వయంగా కారు ఎక్కించారు. దీనిపై వంశీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. స్నేహితులం కాబట్టి మాట్లాడుకున్నామని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. అయితే దాదాపు ఆరు నెలల తర్వాత వీరిద్దరు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. వీరి భేటీతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో  రాజకీయం మరోసారి హీటెక్కింది. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ టికెట్‌పై గెలుపొంది.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టారు. నాటి నుంచి నేటి వరకు అంటే.. చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం.. నుంచి గన్నవరం నియోజకవర్గంలో వంశీని ఏకాకిని చేసేందుకు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గంతోపాటు దుట్టా రామచంద్రరావు వర్గం ఒకేతాటిపైకి వచ్చి.. ఎంత చేయాలో అంత చేస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ.. ఇరు వర్గాలపై ఒంటరి పోరాటం చేస్తున్నారని ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.   మరి వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ టికెట్ నాది అంటే నాదంటూ వంశీ, యార్లగడ్డ, దుట్టా వర్గాలు.. పోటీ పడి మరీ వరుసగా ప్రకటనలు చేస్తున్నాయి. అంతేకాదు... ఈ నియోజకవర్గ పంచాయతీ ప్రస్తుతం  జగన్ భార్య భారతీ వద్దకు చేరిందని సమాచారం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుపై.. ఎక్కడి నుంచి వంశీ పోటీ చేస్తారనే చర్చ అయితే గన్నవరం నియోజకవర్గంలో చాలా హాట్‌హాట్‌గా నడుస్తోంది.  రానున్న ఎన్నికల్లో వైసీపీ గన్నవరం అసెంబ్లీ టికెట్ వంశీకి  ఇచ్చే చాన్స్ లేదని ఆ పార్టీ వర్గీయులే తెగేసి చెబుతున్నారు.  ఇప్పటికే చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శల నేపథ్యంలో వంశీపై మహిళల్లో చాలా వ్యతిరేకత వచ్చిందని.. దీనిని గమనించే వంశీని దూర పెట్టేందుకు జగన్ నిర్ణయించుకున్నారనీ అంటున్నారు. అందుకే   యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావు వర్గాలను  వ్యూహాత్మకంగా రంగంలోకి దింపి రెచ్చగొడుతోందనే ఓ చర్చ కూడా గన్నవరం నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది.    గతేడాది డిసెంబర్‌లో వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడలో వంగవీటి రాధా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నాటి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కలిశారు. ఆ క్రమంలో చిన్న గొన్నూరులో రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా తన హత్యకు రెక్కీ జరిగిందని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడే వల్లభనేని వంశీ, కొదాలి నాని సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అంటే దాదాపు ఆరు నెలల తర్వాత వంశీ, వంగవీటి రాధా భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

జగన్ కు విషయం బోధపడిందా? ఆత్మకూరుపై టెన్షన్ అందుకేనా?

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి అయింది. ఈ మూడేళ్ల ఆయన పరిపాలన.. మూడునాళ్ల ముచ్చటగానే సాగిందనే ముచ్చట రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకోందా? ఈ విషయం సీఎం జగన్‌కి కూడా తెలిసిపోయిందా? అందుకే ఇటీవల పార్టీ నిర్వహించిన వర్క్‌షాప్‌లో.. పలువురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని సీఎం జగన్ క్లియర్ కట్‌గా చెప్పేశారా? ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఏడుగురు మంత్రులతోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలను రంగంలోకి దించి.. సదరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వారిని  ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారా? అంటే సీఎం క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి మాత్రం అవుననే సమాధానం వస్తోందీ.  మేకపాటి ఫ్యామిలీకి నెల్లూరు జిల్లాలోనే మంచి గుడ్ విల్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డిని.. పలుమార్లు లోక్‌సభ సభ్యుడిగా నెల్లూరు ప్రజలు గెలిపించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా తండ్రిలా అంతా సాఫ్ట్ అన్న విషయం కూడా విధితమే.  2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గౌతమ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత  అంటే 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఇదే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్ కేబినెట్‌లో అత్యంత కీలకమైన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా.. జగన్ పార్టీ గౌరవ మర్యాదలు ఎక్కడా తగ్గకుండా చూసుకొన్న అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో గౌతమ్ రెడ్డి ఉంటారనివైసీపీ వర్గీయులు చెప్పుకుంటారు. అలాంటి గౌతమ్ రెడ్డి.. ఆకస్మిక మరణం.. జగన్ పార్టీకి గట్టి దెబ్బేనని.. ఆ పార్టీలో  ఓ చర్చ అయితే బలంగా ఉందట. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. గౌతమ్ రెడ్డి చాలా డిగ్నిఫైడ్‌గా ఉండేవారని చెబుతుంటారు. అంతేకాదు.. వైసీపీలో మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్నినాని తాజా మంత్రి  ఆర్కే రోజాల వ్యవహారశైలికి గౌతమ్ రెడ్డి వ్యవహార శైలికి నక్కకూ నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంటుందనే ఓ చర్చ కూడా పార్టీలో గట్టిగానే సాగుతోంది.    అలాంటి మేకపాటి ఫ్యామిలీ నుంచి  విక్రమ్ రెడ్డి ఈ ఉప ఎన్నికల బరిలో నిలిస్తే.. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని వైసీపీయే కాక విపక్షాలు కూడా భావిస్తున్నాయి. మరి అలాంటి వేళ.. ఇంత మంది మంత్రులు, ఇంత మంది ఎమ్మెల్యేలను ఈ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ఎందుకు దింపారని వైసీపీ నేతల్లోనే కాదు.. విపక్ష తెలుగుదేశంలోనూ సందేహం వ్యక్తం అవుతోంది. పైగా ప్రధాన విపక్షం పోటీలో లేదు. పోటీలో ఉన్న బీజేపీ ఉనికి జిల్లాలో నామమాత్రమే. అయినా ఆత్మకూరు ఉప ఎన్నిక విజయంపై జగన్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారన్న ప్రశ్నకు   ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని... జగన్ కు బాగానే అర్థమైందని అందుకే.. ఇంతలా.. మంది మార్బలాన్ని  ఈ ఉప ఎన్నికకు మోహరించారని పార్టీ వర్గీయులే అంటున్నారు. మరోవైపు మేకపాటి ఫ్యామిలీపై అభిమానం ఉన్నా.. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు కాస్తా.. బీజేపీకి పడితే.. ఫలితం తారుమారు అయి.. పొరుగున ఉన్న తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు లాంటి సీన్ రిపిట్ అయితే.. పరువు పెన్నానదిలో కలుస్తుందని జగన్ భయపడుతున్నట్లు చెబుతున్నారు.  ఇంకోవైపు  వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు   అనైక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందట. ఇది నెల్లూరు జిల్లాలో అయితే ఈ అనైక్యత ముదిరి పాకన పడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిందరినీ ఏక తాటిపైకీ తీసుకు వచ్చి..  ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్‌ విధించారని సమాచారం. దీంతో ఇన్ చార్జ్‌లుగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. తమ టాలెంట్ జగన్‌కి చూపించాలని ఉబలాటపడుతున్నారట. మరి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల చిత్తంలో ఏముందనేది మాత్రం అర్థం కావడం లేదని ఫ్యాన్ పార్టీ నేతల్లో ఓ గుసగుస మొదలైంది.            ఇక ఈ ఉప ఎన్నికకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం తమ పార్టీ అభ్యర్థిని నిలిపింది. ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు నిలిచారు. ఆత్మకూరు ఉప ఎన్నిక జూన్ 23న జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 26న వెలువడనుంది.

ఏపీలో జగన్ పాలన మటాష్.. మొన్న కేటీఆర్.. నిన్న హరీష్ విమర్శ

అంద‌రం ఒక‌టే. అంద‌రం తెలుగువాళ్ల‌మే. కాబోతే రాజ‌కీయంగానే విడిపోయాం. మ‌న‌మంతా  సోద‌రుల మే అని తెలంగాణా, ఆంధ్రా నాయ‌కులు తెగ ప్ర‌చారం చేసుకున్నారు. కాల‌క్ర‌మంలో రాజ‌కీయాల సెగ‌లో మాట ల తూటాలతో పొడ‌వ‌డం మెల్ల‌గా  ఆన‌వాయితీగా మారింది. ముఖ్యంగా రాష్ట్రాల అభివృద్ధి విష యంలో తెలంగాణా రాజ‌ధానిలో జ‌రుగుతున్న అభివృద్ధిని చూపుతూ ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య మంత్రి జ‌గ‌న్ రెడ్డిని ఎద్దే వా చేయ‌డం చూచాయిగా జ‌రుగుతోంది.  చాలా స్నేహ‌పూర్వ‌కంగా  విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టిఆర్ ఎస్ నేత హ‌రీష్ రావు తిరుప‌తి ప‌ర్య‌ట‌కు వెళ్లిన‌పుడు క‌లిసిన వారితో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో అస‌లు ఆం ధ్రాలో  రైతుల‌కు విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించ‌డంలో అక్క‌డి ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌యింద‌న్న‌ది అక్క‌డి వారి మాట‌ల్లోనే అర్ధ‌మ‌యిందిట‌. రైతుల‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన‌ట్లు తొమ్మిది గంట‌లు  కాదు గ‌దా  క‌నీసం ఏడుగంట‌లు కూడా  విద్యుత్ అందంచ‌డం లేద‌ని రైతులు గోడు పెడుతున్నార‌ని హ‌రీష్‌ను క‌లిసిన‌వారు చెప్పార‌ట‌. అలాంట‌పుడు తెలంగాణా కంటే ఆంధ్రాలో రైతాంగానికి గొప్ప సేవ‌లు అందిస్తు న్నామ‌ని ప్ర‌చారం చేసుకో వ‌డంలో అర్ధ‌మే మిటో తెలియాలి. రాష్ట్రంలో ప్ర‌చార ఆర్భాటాలే త‌ప్ప నిజానికి  అభివృద్ధి కార్య క్ర‌మాలు శూన్య‌మ‌ని విప‌క్షా లు ఇప్ప‌టికే దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ స‌మయంలో హ‌రీష్ ఆంధ్రాలో రైతుల ప‌రిస్థితి  అంత గొప్ప‌గా లేద‌ని అక్క‌డివారే తెలియ‌జేశార‌ని అన‌డం జ‌గ‌న్‌కి ఇబ్బంది క‌ర‌మే. హ‌రీషే కాదు ఆ మ‌ధ్య కేటీఆర్  కూడా పాసింగ్ కామెంట్ చేసేరు. దావోద్ ఆర్ధిక స‌ద‌స్సుకు వెళ్ల‌డానికి ముందు అస‌లు ఆంధ్రాలో రోడ్లు, పుర‌పాల‌క వ్య‌వ‌స్థ గొప్ప‌గా ఏమీ లేద‌ని కేటీఆర్ కామెంట్ చేసేరు. హైద రాబాద్‌తో పోలిస్తే ఆంధ్రాలో ఏ న‌గ‌రంలోనూ అంత‌గా అభివృద్ధి క‌న‌ప‌డ‌దన్నారు. ఆ త‌ర్వాత దావోస్  స‌ద‌స్సు సంద‌ర్భంగా జ‌గ‌న్‌ని స్నేహ‌పూర్వ‌కంగా క‌లిసిన‌పుడు మాత్రం ఇద్ద‌రూ పాత మిత్రుల స్థాయిలో స్వ‌విష‌యాలు కూడా మాట్ల‌డుకోవ‌డ‌మే వింత‌!  పైకి స్నేహంగా క‌న‌ప‌డుతున్న‌ప్ప‌టికీ ఈ స్నేహం రాజ‌కీయాంశాల విష‌యంలో క‌న‌ప‌డ‌టం లేదు.  విడిపో యిన‌ప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మా స‌హ‌కారం ఎప్ప‌డూ వుంటుద‌ని విడిపోయిన కొత్త‌ల్లో అన్న మాట‌ల‌కు మ‌రి అర్ధాలువేరా? ఏమో ఈ స్నేహ‌పూర్వ‌కంగా క‌నిపించే రాజ‌కీయ ధోర‌ణికి అర్ధం కూడా యువ నేత‌లే బ‌య‌ట‌పెట్టాలి.

ఏపీలో ఏరువాక సందడి గోవిందా.. గోవింద?

ఏరువాక పున్నమి   సమయానికి రుతుపవనాలు బలపడి, వర్షాలు మొదలవుతాయి. దుక్కిదున్ని పొలం పనులను మొదలుపెట్టడానికి ఇది అనువైన సమయం. అంతేకాదు! అందరూ ఒకేసారి పనులు మొదలుపెడితే వ్యవసాయం కూడా క్రమ పద్ధతిలో ఉంటుంది. అందుకోసమే… జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వ్యవసాయ పనులను మొదలు పెడతారు. ఒక రకంగా ఏరువాక వ్యవసాయానికి ఉగాది లాంటిది. కర్షకులకు క్యాలెండర్‌ ఇది! ఏరువాక అంటేనే దుక్కి మొదలుపెట్టడం అని అర్థం. ఈ ప్రత్యేకమైన రోజును ఓ వేడుకలా నిర్వహిస్తారు రైతులు. ఎద్దులను శుభ్రం చేసి, వాటిని చక్కగా అలంకరిస్తారు. పొంగలిని నైవేద్యంగా పెడతారు. మరో విశేషం ఏమిటంటే… గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజు ఎద్దులతో తొలి దుక్కి దున్నించడంతో పాటు.. ఆ సమయంలో, తాము కూడా కాడి పడతారు రైతులు. తమ కష్టసుఖాలలో తోడుండే మూగజీవుల పట్ల తమ గౌరవాన్ని తెలియచేసే ఆచారమది!  అటువంటి ఏరువాక ఈ సారి ఏపీలో అందునా గోదావరి జిల్లాల్లో ఎటువంటి సందడీ లేకుండా సాదాసీదాగా సాగిపోతోంది. జగన్ ప్రభుత్వ వ్యవసాయ విధానాల కారణంగా అన్నదాతకు సాగు బరువుగా మారింది. అందుకు నిరసనగా తూర్పుగోదావరిలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారు. దీంతో ఏరువాక సందడే కనిపించడం లేదు. రైతుల ఉగాది ఉషస్పు లేకుండా గడిచిపోయింది. 

ఉండ‌వ‌ల్లీ... జ‌రిగేవి చెప్ప‌రాదా!

ఎవ‌రు ఎంత ప్ర‌య‌త్నించినా  కాని ప‌ని ఒక్కోసారి వూహించ‌ని దారి క‌నిపించి ల‌క్ష్యాన్ని సాధించే వీలు క‌ల్పిస్తుంది. రాష్ట్ర హోదా సాధించుకోవాల‌ని  ఎంతగా ప్ర‌య‌త్నస్తున్నా కేంద్ర‌ప్ర‌భుత్వం  అందుకు వీలు ప‌డద‌నే సంకేతాలే ఇస్తోంది. అది త‌ప్ప వేరేది ఏద‌యినా మాట్లాడుకుందామ‌నే కేంద్రంలోనివారు అంటున్నా రు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను  దృష్టిలో పెట్టుకుని అనేకం అడ‌గాల‌ని వెళ్లిన  ప్ర‌తీసారి అక్కడేమి జ‌రిగిందీ ఎవ‌రికీ తెలియ‌కుండానే పోతోంది. మొన్న‌టికి మొన్న కూడా సేమ్ సీన్ రిపీట్‌. అయితే ఇప్పుడు హ‌ఠాత్తుగా ఒక చిన్న అవ‌కాశం వుంద‌ని మాజీఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సూచించ‌డం గ‌మనార్హం. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బిజెపీ అభ్య‌ర్ధి విష‌యంలో మ‌ద్ద‌తునీయ‌కుండా వెన‌క‌డుగు వేయాలిట‌.  అస‌లే రాష్ట్ర ప‌రిస్థితులు బాగా లేవు. పార్టీ వ‌ర్గాల్లోనూ కుమ్ములాట‌లు, అసంతృప్తులూ ఒక‌టొక‌టీ బ‌య‌ట ప‌డుతున్నాయి. ప్ర‌త్యేక హోదా మాత్ర‌మే కాదు రాష్ట్రానికి రావ‌ల‌సిన నిధులు విష‌యంలోనూ కేంద్రాన్ని అడ‌గ‌ద‌ల‌చుకున్న విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి త‌ట‌ప‌టాయిస్తున్నాడు. ఇక్క‌డ గ‌ట్టిగా మాట్లాడు తున్న‌వాడు వూరు దాట‌గానే కేసుల భ‌యం త‌ల‌కు చుట్టుకుంటుండ‌టంతో అడ‌గ‌లేక‌పోతున్నాడ‌నేది సుస్ప‌ష్టం. ఈ ప‌రిస్థితుల్లో అస‌లు బిజెపిని ఎదిరించి నిల‌వ‌గ‌లిగే  స‌త్తా జ‌గ‌న్‌కి ఎక్క డ‌?  అందువ‌ల్ల ఉండవ‌ల్లిగారి మ‌న‌సులో మాటో, పోనీ జ‌గ‌న్‌కి ఇస్తున్న చిన్న‌పాటి సూచ‌నో అంత‌గా పార‌క పోవ‌చ్చు.   ఏది ఎలా వున్నా ఒక‌రే ల‌బ్ధి పొందుతార‌ట‌! ఆ  ఒక్క‌రి ప్ర‌భావం అలా వుందిట‌! ఎవ‌రా ఒక్క‌రూ ఏమిటా లాభం? అనేదానికి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌వివ‌ర‌ణ ఇచ్చేరు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎవరు గెలిచినా ల‌బ్ధిపొందేది మాత్రం బిజెపీయేన‌ని విలేక‌రుల‌తో అన్నారు. దేశంలో మోదీ విప‌క్షాలు లేకుండా చేసుకోవ‌డానికి  శ‌త విధాలుగా  కృషిచేస్తున్నారు. ఎవ‌రు గెలిచినా బిజెపీతో స‌ఖ్య‌త‌గానే వుండాల్సి వ‌స్తుం ది.  బిజెపి అంత‌గా అన్ని పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌రిచింది.  గ‌తంలో టిడీపీ కేంద్ర వ‌ద్ద సాగిల‌ప‌డింద‌ని కామెంట్ చేసేరు. ఇపు డు కేసుల భ‌యంతో జ‌గ‌న్ చేస్తున్న‌దీ అదే.  తెలంగాణా మాట ఎలా వున్నా ఆం ధ్రాలో బిజెపి బ‌లం పుంజుకుంద‌నే భ్ర‌మ‌లో బిజెపీ వ‌ర్గాలు తెగ ప్ర‌చారం చేస్తున్నాయి. ఎవ‌ర‌యినా త‌మ ను దాటిపోవ‌డం దుర్ల‌భం అని ప్ర‌చారం చేసుకుంటున్నారు బిజెపి నాయ‌కులు. ఎవ‌ర‌యినా త‌మ‌తో క‌ల‌వ‌వ‌ల‌సిందే అంటున్నారేగాని ఎవ‌రూ క‌ల‌వ‌క‌పోయినా తాము తెలుగు రాష్ట్రాల్లో దున్నేస్తామ‌ని అధికా ర ప‌గ్గాలు ప‌డ‌తామ‌ని బిజెపీ కూడా చెప్ప‌లేక‌పోతోంది. కేవ‌లం చ‌ర్చ‌ల్లో గ‌ట్టిగా అరిచి చెప్ప‌డం, విపక్షాల మీద అర‌వ‌డం త‌ప్ప వాస్త‌వానికి అది జ‌రిగే ప‌నికాదు.