అస‌లు త‌ప్పు త‌లిదండ్రుల‌దే ..!! హోం మంత్రి ఉవాచ‌!

ఆడ‌పిల్ల‌లు, మ‌హిళ‌ల  మీద అఘాయిత్యాలు, హ‌త్య‌లూ  ఇటీవ‌ల పెరిగిపోతున్నాయి. గ‌త వారం రోజులు గా నానుతున్న జూబ్లీహిల్స్ కారులో రేప్ కేసులో నిందితుల సంగ‌తి తెలిసి కొంద‌రిని ప‌ట్టుకుని వారిలో అధిక భాగం మైన‌ర్లే అని తేల్చి ఒక‌రిద్ద‌రిని జ్యూవెన‌ల్ హోమ్ కి త‌ర‌లించేరు. అక్క‌డ బాగుబ‌డి ర‌మ్మ‌ని. అస లు నింది తులు మైన‌ర్లేన‌ట‌. రాజ‌కీయప్ర‌ముఖుల పిల్ల‌లు నిందితుల్లో వున్నార‌ని కేసు నానుస్తున్నార‌ని రాష్ట్ర‌మంతా కోడై కూస్తోంది. పోలీసులు ఇంకా నీళ్లు న‌ములుతూనే వున్నారు. ఈలోగా   తెలంగాణా   హోం శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీగారు బుధవారం గొప్ప వ్యాఖ్యానం చేసేరు. మైన‌ర్లు  ఇంత ఘాతుకానికి  ఒడిగ‌ట్ట‌డ మేమిటి?   దీనికి వారి త‌లిదండ్రుల‌దే త‌ప్ప‌ని!  ఉరుము ఉరిమి ఇంటి  మీద ప‌డింది!  పిల్ల‌ల  పెంప‌కం, వారి చ‌దువులు, న‌డ‌వ‌డిక అన్నీ త‌లిదండ్రులే చూసుకోవాలి.  బాగానే వుంది.  కానీ రోజు లు మారిపోయాయి. ఇపుడంతా మొబైల్ కాలం. అన్నీ అందులోనే. పిల్ల‌ల‌కి, వుద్యోగుల‌కూ కావ‌ల‌సిన స‌మాచారాల‌కు, స‌ర‌దాల‌కూ మ‌రో  మార్గ‌ద‌ర్శిగా మారిపోయింది మొబైల్. చ‌దువుకు సంబంధించి, స‌ర‌దాల‌కు సంబంధించిన ప్ర‌తీ చిన్న విష‌యం కూడా దాని తోనే సాధ్య‌మ‌వుతోంది. స్నేహాలు విస్త‌రిస్తున్నాయి. ఇందులో ఆడ‌, మ‌గా తేడా లేదు.  ఇపుడు ఇది ఓ పెద్ద  ఫ్యాష‌న్‌! చేతిలో ఖ‌రీద‌యిన మొబైల్ లేక‌పోయి నా, న‌లుగురితో ఏక‌కాలంలో చాటింగ్ లేక పోయినా కూడా ఇప్ప‌టి యూత్ వారిని  వెలివేసి నంత ప‌ని చేస్తున్నారు. అన్ని ర‌కాల స‌మాచారాలు, సినిమాలు, విధ్వంస‌క దృశ్యాలు, మాన‌సిక దౌర్బ‌ల్యా ల ప్రేర‌కాలు కూడా అదే ప్ర‌సాదిస్తున్న కాలంలో యువత‌ను కాపాడుకో వ‌డం త‌లిదండ్రుల‌కు క‌త్తి మీద సాముగానే మారింది. అయితే ఇది ఎంత‌వ‌ర‌కూ క‌ట్ట‌డి చేయ గ‌ల్గుతారు? బ‌డికి, కాలేజీకి, వుద్యోగా నికి వెళ్లే ఆడపిల్ల‌ల‌కు ర‌క్ష‌ణార్ధం అనేక సౌక‌ర్యాలున్న మొబైల్ అందించ‌క త‌ప్ప‌డం లేద‌ని త‌లిదండ్రులే అంటు న్నారు.  ఎప్పుడైనా స‌మ‌స్య ఎదుర‌యి న‌పుడు వెంట‌నే తెలిసి ప‌రుగులు పెట్ట‌డానికి వీల‌వుతుంద‌ట‌! కానీ ప్ర‌భుత్వాలు,పోలీసు వ్య‌వ‌స్థ   అందిస్తున్న యాప్ లతోనే అమ్మాయిలకు రక్షణ లభిస్తుందంటే  ఇంకేమి?  ఘాతుకాలు, దాడులు తెలిసి జ‌ర‌గ‌వు. హ‌ఠాత్తుగానే జ‌రుగుతా యి. వాటి నుంచి త‌ప్పించు కోవ డానికి  చేసే ప్ర‌య‌త్నంలో  త‌ప్పించుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నంలోనే ప్రాణం పోతున్నంత ప‌ని అవు తుంది గ‌దా! ఇటీవ‌లి కాలంలో స్కూళ్లు, కాలేజీల్లో చేరుతున్న పిల్ల‌ల‌కు అనేకానేక జాగ్ర‌త్త‌లు త‌లిదండ్ర‌లు తీసుకుం టున్నారు. అయినా ఎక్క‌డోక్క‌డ‌, ఏదో రోజు, ఏదోక క్ష‌ణాన స్నేహితుడ‌నే వాడో,  తెలిసిన‌వాడో, ఏకంగా టీచ‌రో, ఆటోవాడో అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ప్ర‌తీఒక్క‌రం ప‌క్క‌వాడిని చూసి భ‌యం భ‌యం గా బ‌తికేయాల్సిన దారుణ కాలంలో బ‌త‌కాల్సి వ‌స్తోంది. దారుణాలు జ‌రిగినపుడ‌ల్లా పోలీసులు దాదాపు వెంట‌నే స్పందించ‌డం, నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం జరుగుతోంది. కానీ ఇటీవ‌ల ప‌బ్‌ల చుట్టూనే ఇలాంటి  ఉదంతాలు చోటు చేసుకోవడ‌మే మ‌రీ అన్యాయంగా మారింది.  ప‌బ్‌ల‌కు వెళ్ల‌డం,స‌ర‌దాగా స్నేహితుల‌తో గ‌డ‌ప‌డం అనేది  ఈ రోజుల్లో చాలా మామూలు సంగ‌తి! కానీ  తాగి కార్లు న‌డ‌ప‌డం, స‌ర‌దాల్లో భాగంగా విచ్చ‌ల‌విడిగా తిర‌గ‌డం స్థాయి నుంచి ఇపుడు గంజాయి, మ‌త్తు మందుల మ‌త్తులో చిత్త‌యి జీవితాలు కోల్పోవ‌డం సంఖ్య పెరుగుతూనే వుంది.  అస‌లు ప‌బ్‌ల‌కు ఇస్తున్న స్వేచ్ఛ‌, లైసెన్స్‌లు గురించి పోలీసులు సీరియ‌స్‌గా ఎందుకు తీసు కోరో అర్ధంగానిదేమీ లేదు. వాటి య‌జ‌మానులో, మ‌ద్ద‌తుదారులో  రాజ‌కీయ‌రంగంలోనో, వ్యాపార రంగం లోనే  బిగ్‌షాట్స్ అనే స‌మాచారంతో ఎవ‌రికీ తొంద‌ప‌డి చ‌ర్య తీసుకోవ‌డానికి కాళ్లూ చేతులు ఆడ‌వు.  ఫిర్యా దులు అలానే వుంటాయి.   ఆరోప‌ణ‌ల‌న్నీ గోడ‌మీద సున్నం.. అంతే! ప‌బ్‌లకు వెళ్లిన‌వారిలో స‌గం పైగా పిల్ల‌లు ఇష్ట పూర్వ‌కంగానే వెళుతుంటారు. బ‌ల‌వంతంగానో, స్నేహితుల మొహ‌మాటంతోనో వెళ్లే వారు త‌క్కువ‌. అక్క‌డ స‌ర‌దాల‌తో పాటు మ‌ద్యం మ‌త్తులో విప‌రీత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, అందుకు కొంద‌రు తోడ్ప‌డ‌డం జీవితాల్ని ఛిద్రం చేస్తున్నాయి. ఇందుకు అబ్బాయిల‌నేకాదు, అమ్మాయిల‌నూ త‌ప్పు ప‌ట్టాల న్న ఆరోప‌ణ‌లూ వున్నాయి.  మొన్న‌టితో ప‌బ్‌ల భాగోతాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌న్న డిమాండ్  పెచ్చు మీరాయి.  ప‌బ్‌లు క్ర‌మేపీ  మ‌త్తు పానీయాల కంటే గంజాయి వాడ‌కానికి పెద్ద అడ్డాలుగా మారాయ‌న్న ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో వింటు న్నాం. దీన్ని గురించి పోలీసుల‌కు గ‌ట్టి స‌మాచారం ల‌భించినా, దోషుల‌ను ప‌ట్టుకోవ‌డంలో, వారిని  కోర్టుకి లాగ‌డం, శిక్షించ‌డం వేగిరం జ‌ర‌గాలి. కానీ లేటెస్ట్ కేసులో మాత్రం ఇంకా న‌త్త‌న‌డ‌క‌న సాగుతూనే వుంది.  పైగా మంత్రి మనవడు వున్నాడ‌న్న మాట బ‌య‌టికి పొక్క‌డంతో  పోలీసులు అతి జాగ్ర‌త్త‌లు తీసుకుం టున్నారు. . నామ్‌కే వాస్తే ఒక‌రిద్ద‌రిని అరెస్టు చేయ‌డంతో  బ‌య‌టి నుంచి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను త‌ట్టుకోవ‌చ్చ‌ని అనుకున్నారు.  చిత్ర‌మేమంటే ఇపుడు ఏకంగా  హోంమంత్రి అలీ గారు గొప్ప జ్ఞానం బోధించేరు. అదేమంటే అస‌లు పిల్ల‌ల పెంప‌క‌మే అట్లా ఏడిచింద‌ని. త‌లిదండ్రులు త‌మ పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌లో భాగంగా వారి న‌డ‌వ‌డిక‌ను కూడా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తుండాల‌ని బోధించేరు.  కేసులో త‌మకి సంబంధించిన‌వారు ఉన్నార‌న్న‌దానికి స‌మాధానంగా ఈ విధంగా కేసులో నిందితుల‌ను బ‌యటికి పొక్క‌నీయ‌కుండా ఈ విధ‌మ‌యిన స్టేట్‌మెంట్ల తో దారిమ‌ళ్లించే య‌త్నాలు, మ‌ర్చిపోయేట్టు చేసే య‌త్నాలు ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌స‌మో ప్ర‌భుత్వానికే తెలియాలి. 

విన్ విన్ ఫార్ములాతో బీజేపీకి బాబు ఎర!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తు పొడుపుల చర్చ ఎన్నికల వరకూ సాగుతూనే ఉండేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీకి ప్రజాదరణ వేగంగా, గణనీయంగా తగ్గిపోతోందన్న అంచనాతో పార్టీలు వేటికవి తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవిడానికి ఇదే అదును అని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొత్తు పొడుపుల చర్చ ఆగకుండా నడుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనతో పొత్తు పొడుపులపై దాదాపు స్పష్టత వచ్చింది. జనసేనాని ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఇటు తెలుగుదేశం పార్టీ, అటు బీజేపీ రెంటికీ పెద్దగా అక్కరకు రాని మిత్రుడిగా మిగిలిపోయారు. ఇక మిగిలింది తెలుగుదేశం, బీజేపీ.. ఈ రెండు పార్టీలూ కూడా ఏపీలో కలిసి పోటీ చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాయి. అయితే బీజేపీకి ఏపీలో కనీసంలో కనీసం ఒక శాతం ఓట్లయినా ఉన్నాయా అన్నది అనుమానమే. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం, మరో మారు అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉండటంతో ఆ పార్టీకి ఏపీలో అసెంబ్లీ స్థానాల కన్నా.. పార్లమెంటు నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం ముఖ్యం. దీంతో పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవాలంటే అందుకు తెలుగుదేశంతో పొత్తు ఆ పార్టీకి అవసరం. జనసేనతో కలిసి వెళ్లినా.. ఆ పార్టీ అండతో పార్లమెంటు స్థానాలలో విజయం సాధించగలమన్న ధీమా బీజేపీలో కనిపించడం లేదు. దానికి తోడు ఆయన చీటికీ మాటికీ   తన బలాన్ని హెచ్చుగా ఊహించుకుంటూ కండీషన్స్ అంటున్నారు. ఈ కారణంగానే నడ్డా తన రాష్ట్ర పర్యటనలో భాగంగా చేసిన ప్రసంగాలలో ఎక్కడా జనసేన ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరిని విస్పష్టంగా తెలియజేశారు. అంతటితో ఊరుకుని ఉంటే తెలుగుదేశం, బీజేపీ పొత్తులపై ఇన్ని రాజకీయ స్పెక్యులేషన్స్ వచ్చి ఉండేవి కావు. ఇప్పటి దాకా రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ పై ఒకింత అభిమానం ఒలకబోస్తూ తమల పాకుతో తట్టినట్లుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ, విపక్ష తెలుగుదేశంపై మాత్రం పదునైన ఘాటు విమర్శలతో విరుచుకుపడేవారు. నడ్డా అందుకు భిన్నంగా తెలుగుదేశంపై చిన్న పాటి విమర్శ కూడా లేకుండా, అదికార వైసీపీపైనే తన విమర్శల దాడి సాగించారు.  ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి చేరువ అవ్వడానికి బీజేపీ సిద్ధమన్న సంకేతం ఇవ్వడమే. ఆ సంకేతాన్ని తెలుగుదేశం సరిగ్గానే అందిపుచ్చుకుంది. బీజేపీతో పొత్తు కుదిరితే లాభ నష్టాలపై పార్టీలో అధినేత చంద్రబాబు నేతృత్వంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చల్లో పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు వల్ల లాభల కంటే నష్టాలే ఎక్కువ అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమైందని చెబుతున్నారు. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉంటే.. పొత్తులో భాగంగా కనీసంలో కనీసం పాతిక అసెంబ్లీ స్థానాలైనా ఆ పార్టీకి వదులు కోవాల్సి ఉంటుంది. అన్ని స్థానాలలో విజయం సాధించేంత బలం ఆ పార్టీకి ఉందో లేదో అనుమానమే. ఈ అనుమానానికి గత ఎన్నికలలో ఆ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించడం, ఆ పార్టీ అధినేత స్వయంగా రెండు స్థానాలలో పోటీ చేసి రెండు చోట్లా పరాజయం పాలు కావడమే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి అసెంబ్లీ స్థానాలపై పెద్దగా పట్టు ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో తమ స్టేక్ ఏమిటి, తమ బలం ఏమిటి, తమకు ఉన్న ఓటు శాతం ఎంత అన్న స్పష్టత ఉంది.   అదీ కాక ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం చేపట్టడం కన్నా కేంద్రంలో అధికారం నిలుపుకోవడమే ముఖ్యం. అందు కోసం  ఆ పార్టీ పొత్తులో భాగంగా అసెంబ్లీ స్థానాల కోసం పెద్దగా పట్టుబట్టదు. ఆ పార్టీకి పార్లమెంటు స్థానాలలో తమ అభ్యర్థుల విజయం అవసరం. ఇక తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఉద్దేశం ఇప్పటికైతే లేదు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యం. అందుకే బీజేపీతో  పొత్తు కుదరడమంటూ జరిగితే.. ఆ పార్టీకి రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు స్థానాలలో సగం వరకూ ఆ పార్టీకి కేటాయించడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇది విన్ విన్ ఫార్ములాగా చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే ప్రతిపాదనతో బీజేపీకి ఎర వేయాలని ఆయన పార్టీ నేతలతో చర్చ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీకి కూడా ఈ ప్రతిపాదన ఆ పార్టీ అవసరాలకు తగినట్లు ఉంటుంది. రాష్ట్రంలో బలం లేకపోయినా తెలుగుదేశం అండతో పోటీ చేసే పార్లమెంటు స్థానాలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆప్షన్స్ వల్ల తెలుగుదేశం, బీజేపీ దగ్గరయ్యే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వస్తున్నా మీ కోసం.. ఇక ప్రజాక్షేత్రంలోనే చంద్రబాబు

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే రాజకీయ హీట్  చూస్తుంటే ఇప్పుడో ఇహనో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయా అన్నంత హడావుడి కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు ఉంటాయా ఉండవా అన్న సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది.  మాటల యుద్ధం, పొత్తుల ఎత్తులు జోరుగా నడుస్తున్నాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ మూడూ వేటికవే తమ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. జగన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించి సో కాల్డ్ సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితి రావడానికి ముందే ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలనుకుంటే.. ముందస్తు తథ్యం. ఒక వేళ జగన్ అలా తలపోయకపోయినా.. వైసీపీ పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత ఇలాగే కొనసాగేలా చేసేందుకు తెలుగుదేశం వేగంగా కార్యాచరణలోకి దిగుతోంది. మహానాడు విజయంతో కేడర్ లో ఉప్పొంగుతున్న ఆనందోత్సాహాలను అలాగే కొనసాగేలా చేయడానికి విస్పష్ట కార్యాచరణతో కార్యరంగంలోకి దిగుతోంది. అందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో మహానాడు నిర్వహణతో పాటు జిల్లాల పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నారు. 26 జిల్లాల్లో ఏడాది పాటు విసృత్తంగా పర్యటించేందుకు పక్కా ప్రణాళికను చంద్రబాబు రెడీ చేశారు.   క్యాడర్ లో జోష్ నింపడం, అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నారు. మరో వైపు అక్టోబర్ 2 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేపట్టడం కూడా దాదాపు ఖరారైందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. వైసీపీని ఎదుర్కోవాలంటే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రతి నెలా మూడు రోజుల పాటు పర్యటించాలనీ, ఆ పర్యటనలో  రెండు జిల్లాలను కవర్ చేయాలని ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే ఈ నెల మూడో వారం నుంచి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సమీక్షలు, క్యాడర్ తో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు. జిల్లా టూర్ లో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటూ  ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రసంగిస్తారు. ఏడాదిలో 80కిపైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పర్యటన రూపొందించారు. అటు జిల్లాల పర్యటనలు, ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా జరిగేలా పక్కాగా షెడ్యూల్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తొలుత ఈ నెల 15న అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే మినీ మహానాడులో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారిగా సమీక్షలు 17వ తేదీన చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

పొగిడినా, తిట్టినా పట్టించుకోవద్దు.. జనసైనికులకు పవన్‌ ట్వీటోపదేశం

సినీ నటులకు వుండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద గొప్ప స్టయిల్‌గా డైలాగులు చెప్పడం, నాలుగు ఫైట్లు చేయడంతోనే లక్షలాది మంది అభిమానులు పుట్టుకొచ్చేస్తారు, అభిమాన సంఘాలు ఏర్పడతాయి. తమ స్టార్‌ హీరో ఏదంటే అదే మరి. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవలో తరిద్దామనుకున్నారు. మంచిదే. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఏమాత్రం గట్టిగా నిలవగలుగుతాడన్నది చూడాలి. ఎందుకంటే ఆయన సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నవారు,  రాజకీయాల్లోకి రాగానే ఎన్టీఆర్‌లా ఒకే ఉదుటన సీఎం అయిపోవచ్చుననే అనుకన్నారు. కానీ జరిగింది వేరు. ఆయన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి తిరిగి మొహానికి రంగు వేసు కుని స్క్రీన్‌ మీద నాలుగు ఫైట్లు, రెండు డ్యూయెట్స్‌తో అభిమానుల ఆదరణ నీడలోకి వెళ్లేరు.   ఇదంతా కళ్ల ముందు జరిగినది. దీనికి ప్రత్యేకించి కల్పితాలేమీ లేవు. ఇప్పుడు తమ్ముడు గారు తన అభిమానులకు, రాష్ట్రంలో కొత్త పార్టీ రావాలని, నిలవాలని ఆశించినవారికి పవన్‌ ఆశలు కల్పించేడు. 2019 ఎన్నికలలో తొలి సారి ఎన్నికలలో పోటీకి తనే జనసేన పార్టీ తరఫున అభ్యర్ధులను నిలిపారు. తానూ స్వయంగా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కానీ ఫలితం అత్యంత నిరాశా జనకంగా వచ్చింది. కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలోనే జనసేన విజయం సాధించింది. జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ ఓడిపోయారు. ఈ తరువాత ఈ మూడేళ్లుగా ఆయన రాజకీయ పరిస్థితులు, పరిణామాలను గమనిస్తూనే గడిపేడు. అది పరిశీలనో, భయయో తెలియనీయకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. అప్పుడపుడూ ఏవో స్టేట్‌మెంట్లు ఇస్తూ తన వునికిని తెలియజేస్తూన్నారు. కాగా ఇప్పుడు కాస్తంత స్వరం పెంచి అందరికీ వినపడేట్టు మాట్లాడు తున్నారు. ఎందుకంటే ఆయన మనసులో మాట ఆయన వెంట వున్న నాయకులు, వీరాభిమానులకు సరిగా అర్ధం అయిందా అంటే అనుమానమే గనుక! రాబోయే ఎన్నికలకు టిడీపీకి మద్దతునిచ్చే అవకాశం లేదన్నారు పవన్‌. హీరోగారు ఇంత గట్టిగా చెప్పడంతో బిజెపీ కూడా జనసేనను అంతగా పట్టించుకోవడం లేదు. కాకుంటే కొద్దిరోజులుగా సాగుతున్న పొత్తుల ప్రచార హౌరులో తనను తాను ప్రొజెక్ట చేసుకున్నారు పవర్‌ స్టార్‌. తప్ప ప్రత్యేకించి గట్టిగా తన అను చరులకు సూచనలు చేసిందేమీ లేదు. పైగా ఈ పొత్తులు, మాటలు.. ఇవన్నీ పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని, ఇలాంటివి రాజకీయ నాయకులకు చాలా సహజమని పార్టీ వీరాభిమానులకు తెలియజెప్పేడు. పైగా రాజకీయ నాయకుల తీరు ఒక్కసారిగా మారిందంటే అలా మారడానికి గల కారణాలు తెలుసుకోవాలని, తిట్టినవారే పొగుడుతూ దరి జేరితే పూర్తిగా మారిపోయారని అర్ధం కాదని గొప్ప జ్ఞానబోధ చేసేరు జనసేన అధినాయకుడు. రాజకీయాలు, రాజకీయ నాయకులు కాలానుగుణంగా, సందర్భానుసారం మారవచ్చునన్నది లోక రహస్యం. ఇందులో పెద్దగా ఆలోచించి బాధపడాల్సిందేమీ లేదు. కానీ రాజకీయరంగంలో ఇలాంటివారు వుంటారు, ఇలాంటి వారి మాటల్ని పట్టించుకోవద్దని, వారిని సీరియస్‌గా తీసుకుంటే మనం చేయాల్సిన పనులు జరగవని హెడ్‌మాస్టర్‌ స్థాయిలో తన అభిమానులకు ఒక బహిరంగ రహస్యాన్ని పవర్‌స్టార్‌ సెలవిచ్చాడు. ఇదంతా తాను ఒంటరిగా పోటీచేస్తున్నానని తెలియజేయడానికి. పొత్తుల కోసం చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించవన్న జ్ఞానోదయం కలిగినందుకు. తన ప్రత్యర్ధులు రాజకీయరంగంలో డొక్కశుద్ధి బాగా వున్న వారు కావడం వల్ల. మరంచేత, తాను అనుకున్నవన్నీ తనకే వచ్చి తగలడాన్ని అభిమానులకు గ్రహింపు కలిగే లోగానే వారికి ట్వీటోపదేశం చేశారు పవర్‌స్టార్‌.  

బండి వారి స్వామి భక్తి!

తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎలాగయినా కూలదోసేయాలన్న కంకణం కట్టుకున్నారు యావత్‌ బిజెపీ నాయకులూ. రాష్ట్రానికి ఢిల్లీ నాయకులు రావడం ఇక్కడ హితోపదేశం చేయడం వెళ్లడం మామూలయి పోయింది. అటు నుంచి ఇటు ఏ కాషాయ వస్త్రధారులు వచ్చినా రాజకీయమే మాట్లాడుతున్నారు. ఇక్కడ బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసి తమ సత్తా ఏమిటన్నది చాటడంలో తల మునకలయ్యారు తెలంగాణా బిజెపీ నాయకులు, కార్యకర్తలు. ప్రధాని వెూడీ సైతం తెలంగాణాలో పార్టీ అధికారంలోకి రావాలనే గట్టిగా అనుకుంటున్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ కుటుంబ పాలనలాగానే తెలంగాణాలో కేసిఆర్‌ కుటుంబ పాలన వుందని దీన్ని సాగనీయరాదని పట్టుదలతో వున్నారు యావత్‌ బిజెపీ వర్గీయులు. ఇందుకోసం అనేక మార్గాలు అవలంబిస్తున్నారు. పోతే, నాయకులు ఢిల్లీ వెళ్లి చర్చించడం, వ్యూహ రచనలకు బలం చేకూర్చుకోడం మామూలే. కానీ బండి సంజయ్ ఇక్కడి నుంచి ఏకంగా కొందరు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లను కూడా తీసికెళ్లేరు. వారితో ప్రధాని మాట్లాడటం చాలా చిత్రంగా వుంది.ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పాయింట్ మెంట్ ఇచ్చి కేటాయించే సమయం కంటే ఎక్కువ సమయం కార్పొరేటర్లకు మోడీ కేటాయించి మాట్లాడటం వారి యోగ క్షేమాలు, కుటుంబ సభ్యుల వివరాలు సైతం తెలుసుకుని ఆత్మీయంగా మెలగడం ఏ విధంగా చూసినా ఆశ్చర్యం కలిగించక మానదు. అయితే కార్పోరేటర్లకు ఢిల్లీ నగర సందర్శన చేయించడం, కేంద్రంలో తన పరిచయాలను వారికి తెలిసేట్టు చేసి తన గౌరవాన్ని పెంచుకోవాలన్న తాపత్రయం బండి బాగానే ప్రదర్శించేరు. రైల్లోనో, విమానంలోనో ఢిల్లీ తీసికెళ్లి అక్కడి వాతావరణం పరిచయం చేసి మనం కూడా ఇలా వుండాలని, ప్రధాని చెప్పే సూక్తిముక్తావళిని ఆకళింపు చేసుకుని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తేనే మనకు మనుగడ అన్న సూత్రాన్ని కార్పొరేటర్లకు తెలియజేసి వుంటారు. వారు తమ నాయకుడు ఏకంగా ప్రధానిని కలిసే అదృష్టం కల్పించేరన్న ఆనందం బాగానే వుంటుంది. జీవితాంతం బండి పేరు చెప్పుకుంటారు. ఎందుకంటే వేరే పార్టీలో ఇలాంటి అవకాశం వారికి కలిగే అవకాశం వుండేది కాదేవెూ! కార్పొరేటర్ల సమావేశంలో వారు సమాజసేవతో పాటు అట్టడుగు వర్గాలకు చేయవలసిన సహాయసహకారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని వెూదీ బోధ చేసేరు. అంతే కాదు కేవలం కార్పొరేటర్ల గానే మిగిలిపోకుండా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని గెలవాలని లేనిపోని వూహలు రేకెత్తించారు. అసలే బండి సంజయ్ తో వెళ్లినవారు, పైగా బీజేపీ కార్పొరేటర్లు తప్పకుండా వెూదీ జపం చేసేవారే అయి వుంటారు. మరి ఏకంగా ప్రధానే తమకు గొప్ప మార్గాన్ని సూచించేరు గనుక రేపటి నుంచే కాబోయే ఎమ్మెల్యేలం అనుకుంటే హైదరాబాద్‌ పరిస్థితి ఏం గావాలి అసలే జీహెచ్‌ఎంసీ పనుల పట్ల ప్రజలు విసిగెత్తుతుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలని కలలుగంటూ ఆ ధ్యాసలోనే వుంటే కార్పొరేటర్లుగా వారు వెలగబెట్టేది శూన్యమే! కార్పొరేటర్లను ఢిల్లీ తీసికెళ్లడం బండి సంజయ్ కి రాజకీయంగా ఎంతో వుపయోగపడుతుందేవెూగాని హైదరాబాద్‌కి కాదు. అందుకే టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కి కోపం వచ్చింది. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక ఎన్జీఓ నా అంటూ గట్టిగానే ప్రశ్నించేరు. రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు, చేయవలసిన సాయం గురించి ఆలోచించి తగిన విధంగా స్పందించాల్సిందిబోయి కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు కావడం లక్ష్యంగా పెట్టుకోమని గొప్ప సూచన చేయడం ప్రధాని స్థాయికి తగదేవెూనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమయినప్పటికీ, ఈ విధంగా నగర  కార్పొరేటర్లను ప్రత్యేకంగా కలిసి వారితో మాట్లాడటం, వారికి సమాజసేవ గురించి చెప్పడం ప్రధాని వెూదీ వల్లనే అయింది. బండి   అడుగడుగునా భజంత్రీలతో సిద్ధపడి, తన స్వామి భక్తిని బాగా చాటుకుంటూ చిర్నవ్వుతో తనకు కేంద్రంలో వున్నవారికీ మధ్య సత్సంబంధాలను లోకల్‌ టాలెంట్‌కి బాగానే ప్రదర్శించేరు.  

కమల దళంలో ముసలం మోడీ తీరు పట్ల అసంతృప్తి.. మోడీ మూడోసారి డౌటే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడు, ఎనిమిదేళ్ళ పాలన తర్వాత కూడా దేశంలో మోడీకి సరి జోడీ మరొకరు కనిపించడం లేదు. ఇది చాలా మందిలో ఉన్న ప్రస్తుతఅభిప్రాయం. అలాగే, పార్టీలో ప్రభుత్వంలో అయన మాటకు ఎదురుండదు. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మోడీ, షా జోడీదే హావా. ఆ ఇద్దరు ఏ నిర్ణయం తీసుకుంటే, అదే ఫైనల్..నిజమే,కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ఇదే నిజం.ముఖ్యంగా, 2019లో రెండవ సారి, 303 మంది సభ్యుల సొంత సంఖ్యాబలంతో అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీలో, ప్రభుత్వంలో ఆ ఇద్దరే హీరోలు .. మిగిలిన అందరూ జీరోలు, అనే అభిప్రాయం మరింతగా బలపడింది. బీజేపీ అంటే మోడీ, బీజేపీ అంటే అమిత్ షా, ప్రభుత్వంలోనూ ఆ ఇద్దరు చెప్పిందే వేదం, ఎంత మంది సీనియర్ మంత్రులు ఉన్నా, ఆ ఇద్దరు చేసిందే శాసనం, అనే ఒక బలమైన  పర్సెప్షన్ అయితే ఏర్పడింది. సహజంగానే అది సీనియర్లలో అసంతృప్తిని రగిల్చింది.  నిజమే ఒకప్పుడు, కాంగ్రెస్ లో ఇందిరా గాంధీ ఇలాగే, ఓ వెలుగు వెలిగారు  1969లో సీనియర్ నాయకులు అందరినీ పక్కకు నెట్టి, ఇందిరాగాంధీ పార్టీని రెండు ముక్కలు చేశారు. అయినా 1971 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో, ఇందిరా గాంధీ, 353 సీట్లతో తిరుగులేని శక్తిగా, ఎదురు లేని నాయకురాలుగా నిలిచారు. ఈ నేపధ్యంలోనే పార్టీ నాయకుడు దేవకాంత్ బారువా ఇందిరా గాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. ఏకంగా, ‘ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా’ అని ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు, మోడీ షా జోడీ కూడా అలానే పార్టీని, ప్రభుత్వాన్ని తమ గుప్పిటలో  పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు.   అయితే, ఇప్పుడు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో కూడా, మోడీ షా జోడీకి ప్రతిఘటన మొదలైందని తెలుస్తోంది. నిరసన సెగ ఆ ఇద్దరినీ గట్టిగా తాకుతోందని, పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అది కూడా నాగపూర్ సెగ అంటున్నారు.  పార్టీ సర్వోన్నత విధాన నిర్ణాయక కమిటి, పార్లమెంటరీ బోర్డును నిర్వీర్యం చేసి, ముఖ్యమంత్రుల నియామకం వంటి కీలక నిర్ణయాలను ఆ ఇద్దరే, (మోడీ, షా జోడీ)  తీసుకోవడం, ఏమిటనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది.అదే విధంగా, పార్టీతో సంఘ్ పరివార్ సంస్థలతో సంప్రదించకుండా, హిదుత్వ వాదానికి కట్టుబడిన, పార్టీ అధికార ప్రతి నిథి నూపూర్ ‘ ను సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలు నాగపూర్ కు రుచించడం లేదని అంటున్నారు.  ఈ నేపద్యంలో, పార్టీ సీనియర్ నాయకుడొకరు, గడచిన రెండు సంవత్సరాలలో, పార్లమెంటరీ బోర్డు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, అయినా, నాలుగైదు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చారు. ఇటీవల ఎన్నికలు జరిగిన  ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్  రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులనే కొనసాగించాలననే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్న అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్ చనిపోయారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికై రాజకీయ క్షేత్రం నుంచి తప్పుకున్నారు అలాగే గడచిన ఐదేళ్లలో ఇంకొన్ని ఖాళీలు కూడా ఏర్పడ్డాయి. బోర్డ్ సభ్యుల సంఖ్య ఇంచు మించుగా సగానికి తగ్గి పోయింది. ముఖ్యంగా ప్రశ్నించే వారు లేకుండా పోయారు. ఒక్క  గడ్గరీ మినహా మరొకరు గొంతు వినిపించే పరిస్థితి లేదు. అయినా ఖాళీలు భర్తీ  చేయలేదు. చివరకు పార్టీ రాజ్యాంగం అత్యున్నత నిర్ణాయక కమిటీగా పేర్కొన్న, పార్లమెంటరీ బోర్డును, కేవలం కాగితాలకు పరిమితం చేశారు, అంటూ ఆగ్రహం వ్యక్త పరిచారు. ఇదలా ఉంటే, ఇటీవల మూడో సారీ, మళ్ళీ నేనే, అంటూ ప్రధాని మోడీ ప్రకటించిన నేపధ్యంలో, పార్టీలో, సంఘ పరివార్’ లో లుకలుకలు మొదలయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  నాగపూర్’కు ఫిర్యాదులు చేరాయి. కొదరు పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు, పార్టీలో వ్యక్తీ ఆరాధన ఎక్కువుతున్న తీరును, ఆ ఇద్దరు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వలన పార్టీకి జరుగతున్న నష్టాన్ని నేరుగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ దృష్టికి తీసుకెళ్ళారని తెలుస్తోందని అంటున్నారు. ఆ ఇద్దరిని కట్టడి చేయక పోతే. 2024 ఎన్నికలలో పార్టీకి ఓటమి  తప్పదని, సుమారు 150కి పైగా ఎంపీల సంతకాలతో కూడిన నివేదిక  మోహన్ భగవత్’కు చేరిందని సమాచారం. ఇందులో ప్రధానంగా పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను పట్టించుకోక పోవడం వంటి కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.అలాగే, మిత్ర పక్షాలను, ముఖ్యంగా శివసేన వంటి మిత్ర పక్షాలను దూరం   చేసుకోవడం, ఆ పార్టీ నేతలను వేధింపులకు గురిచేయడం, ప్రాంతీయ పార్టీలతో కయ్యానికి కలుదువ్వడం వంటి విషయాలను కూడా ఆర్ఎస్ఎస్ అధినేత దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం.  ఈ నేపధ్యంలోనే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత ఆదేశాల మేరకు, సీనియర్ మంత్రులు, కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో, సీనియర్ మంత్రులు రాజనాథ్ సింగ్, నితిన్ గడ్గరీ ప్రధాని మోడీ వ్యవహార శైలిని ప్రశ్నించడం తో పాటుగా తీరు మార్చుకోక పొతే, 2024 ఎన్నికలలో గట్టెక్కడం కష్టమని గట్టిగా హెచ్చరించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా గడ్గరీ, ప్రధాని మోడీ మధ్య వాగ్వివాదం సైతం చోటు  చేసుకుందని, ఆ సమయంలో మోడీ ‘ఎన్నికలలో ఎలా గెలవాలో , ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసునని, ఎవరూ చెప్పవలసిన అవసరం లేదని అసహనాన్ని ప్రదర్శించారు. అలాగే ఎంపీలు అందరూ తనతోనే ఉన్నారని అన్నారు, దీంతో గడ్గరీ 150 మంది ఎంపీలు సంతకాలతో నాగపూర్’కు పంపిన నివేదికను మోడీ ముందు పెట్టినట్లు సమాచారం.ఆ తర్వాతనే మోడీ, పెట్రోల్, డీజిల్’పై ఎక్సైజ్’ డ్యూటీ భారీగా తగ్గించడం,ఎరువుల సబ్సిడీ పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే, మిత్రపక్షాల విషయంలోనూ పునరాలోచన చేస్తునట్లు తెలుస్తోంది. అయితే, ముడో సారీ నేనే. అంటూ మోడీ చేసిన ప్రకటన సృష్టించిన ప్రకంపనలు అంత తేలిగ్గా చల్లారవని, ముఖ్యంగా ప్రధాని పదవిని ఆశిస్తున్న, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న గడ్గరీ, ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్డమయ్యారని అంటున్నారు. అయితే, అదే సమయంలో మోడీ షా జోడీ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేమని, కమల దళంలో విరిసిన ‘ముసలం’ ఏమి చేస్తుందో, ఎటుగా  సాగుతుందో చూడవలసిందే కానే చెప్పలేమని, పార్టీ నేతలు, పరిశీలకులు అంటున్నారు. అయితే,  బీజేపీ  అంతా బాగుందని, మోడీ షా జోడీకి తిరుగు లేదని, అనుకునే పరిస్థితి  అయితే లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని, పార్టీ నాయకులే అంగీకరించడం ... ఈ కథకు కొసమెరపు.

కేటీఆర్ తో జగన్.. దావోస్‌లో ‘తెలుగు’ సినిమా!

క‌ష్టాలు అంద‌రికీ వుంటాయి. క‌ష్టాలు చెప్పుకోవ‌డానికి ఆత్మీయులు వుండాలి. వారిని నుంచి మంచి స‌ల‌హా ల‌తో వాటిని అధిగ‌మించే అవ‌కాశాలు వుంటాయి. కుటుంబంలో వ‌చ్చిన క‌ష్టాల‌ను పంచుకునేందుకు జ‌గ‌న్‌కు కేటీఆర్ దొరికేడు! దావోస్ స‌ద‌స్సుకు వెళ్లిన ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్, తెలంగాణా టిఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య క్షుడు కేటీఆర్  అక్కడ కలుసుకున్నారు.  కష్టసుఖాలు కలబోసుకున్నారు.  ఇక్క‌డ యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచేది వారి మ‌ధ్య రాజ‌కీయ‌ప‌ర‌మైన విమ‌ర్శ‌ల‌కు తావులేద‌న్న ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం. ఎందుకంటే అంత‌కు కొద్ది రోజుల ముందే కేటీఆర్ తెలంగాణాలో గ్రామాల్లోనూ రోడ్డు ర‌వాణా బాగుంటుంద‌ని, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని, ఆంధ్రా ప్రాంతాల కంటే తెలంగాణా ఇటీ వ‌లి కాలంలో ఎంతో అభివృద్ధి చెందింద‌ని అన్నాడు. ఒక‌ విధంగా ఆంధ్రా కంటే తామే మెరుగ‌యిన స్థాయిలో వున్నామ‌ని వెక్క‌రించ‌డ‌మే చేశారు. కానీ  కొద్ది రోజుల త‌ర్వాత దేశం స‌రిహ‌ద్దులు దాటంగానే వారి మ‌ధ్య ఈ త‌ర‌హా రాజ‌కీయ‌ ప‌ర‌మైన విభేదాలు మ‌టుమాయ‌మైపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అస‌లేం జ‌ర‌గ‌న‌ట్టే వాళ్లిద్ద‌రూ చ‌క్క‌గా మాట్లాడుకున్నారు. అక్క‌డ ఇరు రాష్ట్రాల అభివృద్ధి, రాజ‌కీయాల గురించే కాకుండా చాలా ఆత్మీయంగా ఇంటి విష‌యాలు కూడా చ‌ర్చించుకోవ‌డం చిత్రం! ఆర్చినా తీర్చినా నువ్వే వ‌దినా! అంటూ తోడికోడ‌ళ్లు మాట్లాడుకున్నంత ప్రేమ‌గా వీరిరువురూ మాట్లాడుకోవడ మే పెద్ద చ‌ర్చ‌గా మారింది.   ఇద్ద‌రూ  కుర్రాళ్లు గ‌నుక  ఖాళీ స‌మ‌యంలో, పోనీ  లంచ్ బ్రేక్‌లో ఏదో  మెగా స్టార్, ప్ర‌భాస్ల   గురించి మాట్లాడు కోలేదు. ఏకా ఎకీ  అన్న చెల్లెళ్ల మ‌ధ్య విభేదాల గురిం చి చ‌ర్చించు కోవ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగించింది. జ‌గ‌న్ చెల్లెలు ష‌ర్మిల తెలంగాణాలో ఒక పార్టీ అధినేత‌. ఆమెతో అన్న‌కి ప‌డ‌టం లేద‌న్న‌ది చాలా రోజు లుగా విన‌వ‌స్తున్న స‌మాచారం. కానీ కేటీఆర్ కూడా అదే సంగ‌తి జ‌గ‌న్‌ను అడిగేడు. అందులో నిజ‌మెంత  అని!  జ‌గ‌న్ ఔననే స‌మాధాన‌మిచ్చాడు. తండ్రి వై.ఎస్‌.మ‌ర‌ణానంత‌రం వారి మ‌ధ్య విభేదాలు  తారస్థాయి కి చేరు కుని, ష‌ర్మిల  కొత్త‌ పార్టీ పెట్టి ఇటు తెలంగాణాలో నిల‌దొక్కుకోవాల‌న్న ప్ర‌య‌త్నాల్లో త‌ల‌మున‌క ల‌యింది.   మ‌ర‌ణానికి బాగా ముందే త‌మ ఆస్తి పిల్ల‌లు ఇద్ద‌రికీ స‌రి స‌మానంగా ఇస్తాన‌ని తండ్రి వైఎస్ అన‌డం జ‌గ‌న్‌కు పెద్ద‌గా ఇబ్బంది అనిపించ‌లేదు. కానీ ష‌ర్మిల  వివాహానంత‌రం ఆస్తిలో స‌గ‌భాగం ఎలా అడుగు తుంద‌ని చాలా సాదా సీదా మ‌ధ్య త‌ర‌గ‌తి అన్న‌లానే చెల్లిని, త‌ల్లిని ప్ర‌శ్నించే వుంటాడు.  అదే సంగ‌తి  సోద‌ర స‌మానుడు, మిత్రుడు కేటీఆర్‌తోనూ ప్ర‌స్తావించేడు. అవును సాధార‌ణ ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ చెప్పింది క‌ర‌ష్టే క‌దా అనుకున్నాడు కేటీఆర్‌.  కానీ రాజ‌కీయ‌ప‌రంగా కుటుంబంలో త‌లెత్తిన విభేదాలు ఆఖ‌రికి జ‌గ‌న్‌కి త‌ల్లిని కూడా దూరం చేసిన‌ట్టు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ష‌ర్మిల తెలంగాణాలో కొత్త‌ పార్టీ పెట్టిన పుడు ఆమె త‌ల్లి చాలా ఆనందించింది.   అన్నా చెల్లి మ‌ధ్య విభేదాలు  సామ‌ర‌స్యంగానే ముఖ్యంగా  ఆస్తి వివాదాలు ఎలాంటి  ఇబ్బంది లేకుండా ప‌రిష్క‌రించుకోవాలి. దాదాపు ఇలాంటి స‌ల‌హానే సోద‌ర స‌మానుడ‌యిన ప్రియ‌మిత్రుడు  చెప్పేడు. అవును  వైఎస్ కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదాలు  న్యాయప‌రంగా ప‌రిష్క‌రించు కోవాల్సిం దేన‌ని జ‌గ‌న్ వివ‌ర‌ణ‌.   క‌ష్ట‌సుఖాలు పంచుకోవ‌డానికి జ‌గ‌న్ కి  కేటీఆర్ దొరికేడు.  ఈ చ‌ర్చ‌, ఈ సాన్నిహిత్యం మ‌రి వారి రాజ‌కీయా భివృద్ధికి ఏమాత్రం ఉప‌క‌రిస్తుంది? ఇప్ప‌టివ‌ర‌కూ మంచి స్నేహితులే. ఆన‌క  ఏ బిజెపీ వారి వ‌ల్ల‌నో,  కేటీ ఆర్ తండ్రి కేసీఆర్  రాజ‌కీయ వ్యూహాల చిక్కుల‌తోనో ఈ స్నేహం దెబ్బ‌తింటే ప‌రిస్థితి ఏమిటి. అపుడు ఒక‌రికి ఒక‌రు సాయం చేసుకుని ముందడుగు సినిమాలోలా క‌లిసి ముంద‌డుగు వేయ‌డానికి వీలుంటుం దా?  ఎందుకంటే  తెలంగాణాలో ష‌ర్మిల కేటీఆర్ కుటుంబాన్ని అన్ని వేదిక‌ల మీదా, పాద‌యాత్రల్లోనూ తిట్టిపోస్తోంది మ‌రి!

జోరు పెంచని నడ్డా పర్యటన.. బీజేపీ క్యాడర్ బేజారు!

ఎవ‌రో వ‌స్తార‌ని ఏదో చేస్తార‌ని... అదేదో సినిమాలో పాట‌! అవును మ‌నిషి ఆశ‌లు అడియాశ‌ల‌యిన‌పుడు మ‌నిషి స్థితి అది. కానీ బిజెపి జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా వ‌స్తే మ‌హాద్భుత‌మే జ‌రుగుతుంద‌నుకున్నారు ఆంధ్రా ప్రాంత బిజెపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. తీరా రాజు వ‌చ్చి వెడ‌లె అయింది. పార్టీ ప‌రువు బుడ‌గ గాలి తీసేసేరు.  అంత‌కుముందు వ‌ర‌కూ ఢిల్లీ నుంచి వ‌చ్చిన నాయ‌కుల ప్ర‌వ‌చ‌నాల‌కు, న‌డ్డా ప్ర‌వ‌చ‌నానికి బొత్తిగా పొంత‌నే లేదు. రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు అన్ని విధాలా అంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డాల‌ని ఉద్భోధ‌చేయడం ఎవ‌రిక‌యినా ప‌రిపాటి.  కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను బాగా ప్రచారం చేస్తూనే మ‌రోవంక  అధి కార ప‌క్షాన్ని, ఇక్క‌డ పాల‌నా విధానాన్ని చీల్చిఛండాడాల‌ని బిజెపి నాయ‌కులు, కార్య‌క ర్త‌లూ  అందుకు గ‌ట్టిగా పూనుకోవాల‌ని గ‌తంలో రాష్ట్రానికి వ‌చ్చిన ఉత్త‌రాది బిజెపి నాయ‌కులంతా చెప్పి వెళ్లేరు. అది పార్టీ వ‌ర్గాల‌ను  నిజంగానే ఉత్సాహ‌ప‌రిచింది. ఇపుడు  న‌డ్డా  రాక‌తో మ‌రింత అద్భుతాలు జ‌రుగుతాయి అని  అంతా ఆశించేరు. కానీ అందుకు పూర్తి విరుద్ధ‌మే  జ‌రిగింది. ఇది పూర్తిగా ఎవ్వ‌రూ వూహించ‌నిది. ఎన్నికల‌కు ఇంకా బోలెడు స‌మ‌యం వుందిగ‌నుక పొత్తుల సంగ‌తి వ‌దిలేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాలు, కేంద్రప‌థ‌కాల అమ‌లులో జ‌రుతుగున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను ఎత్తిచూపడంలో మ‌న‌సు పెట్ట‌మ‌ని న‌డ్డా సూచిం చేరు. బిజెపికి కాస్తంత స‌న్నిహితంగా వున్న జ‌గ‌న్ విష‌యంలో ఈ విధంగా ఆయ‌న సూచ‌న‌లు ఇవ్వ‌డ‌మే ఇక్క‌డి బిజెపి వ‌ర్గాల‌ను కంగారుపెట్టింది. పైగా చూచాయిగా తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విష‌యంలోనూ ఆచీతూచీ వ్య‌వ‌హ‌రించాల‌ని, ఇష్టారీతిగా విమర్శలు, కామెంట్లు విస‌ర‌వ‌ద్ద‌ని అన్యాపదేశంగా చెప్ప‌డం బిజె పి ప్రాంతీయ నాయ‌కుల‌ను కాస్తంత ఇబ్బంది పెడుతోంది. న‌డ్డా నుంచి ఈ విధమైన సూచ‌న‌లు  స‌లహా లు అన్యాపదేశంగానైనా రావ‌డం   టిడిపి ప‌ట్ల ర‌వ్వంత ప్రేమ‌ను తెలియ‌జేయ‌డ‌మేనా?  మొత్తానికి న‌డ్డా  హెచ్చ‌రిక‌లు ఇక్క‌డి నాయ‌కుల‌కు ఏమాత్ర‌మూ మింగుడు ప‌డ‌టం లేదు.   రాజమహేంద్రవరం జ‌రిగిన స‌మావేశంలో న‌డ్డా ఎంతో  భావోద్వేగ ఉప‌న్యాసంతో బిజెపి కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సా హప‌రిచి రాబోయే యుద్ధానికి సిద్ధ‌పరిచేందుకు మార్గాలు సూచిస్తార‌నుకున్నారు అంతా.  కానీ జ‌రిగిన‌ది అందుకు పూర్తి విరుద్ధంగా ప్ర‌సంగించ‌డంతో వ‌చ్చిన జ‌నం బాగా విసిగెత్తేరు. అసలు వచ్చిన జనమే అంతంగా, సభ కోసం వేసిన కుర్చీలు మూడోంతులు ఖాళీగానే దర్శన మించ్చాయి.  ఇక రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పక పోవడంతో బీజేపీ రాష్ట్ర నాయకులలో కొత్త సందేహాలు మొలకెత్తడానికి దోహదపడిందే తప్ప ఇక్కడి కేడర్ లో సమరోత్సాహాన్ని ఇసుమంతైనా నింప లేదు. అసలే ఏపీలో బీజేపీకి ఉన్న కేడర్ అంతంత మాత్రం నడ్డా వారి పర్యటన, ప్రసంగాలతో ఆ క్యాడర్ కూడా జారిపోయే ప్రమాదం ఉందని ఇక్కడి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలో నడ్డా సభానంతరం పిచ్చాపాటిలో ముచ్చటించుకోవడం కనిపించింది.

సమస్యఒదిలేసి వైసీపీ సర్కస్ ఫీట్లు! టెన్త్ ఫలితాలపై పొలిటికల్ బ్లేమ్ గేమ్

స్కూళ్లలో పాఠాలు చెప్పనివ్వకుండా మరుగుదొడ్లు ఫోటోలు తీసే పనికి టీచర్లను పెడితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఉపాధ్యాయులను సారా దుకాణాల వద్ద కాపలాకి పంపిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. టీచర్లను మానసికంగా వేధిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. పాఠాలు బోధించేవారు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసేలా సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. స్కూళ్లలో దామాషా ప్రకారం మాస్టార్లను నియమించకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? పైసలిస్తే ఫలితాలు రావు. మౌలిక సదుపాయాలు ఇచ్చినంత మాత్రాన ఫలితాలు మెరుగు పడవు. ప్రాథమిక విద్యలో ప్రతి సబ్జెక్ట్ కి ఒక టీచర్ ని వేయండి ఫలితాలు ఎందుకు రావో చూద్దాం. హైస్కూళ్లలో పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే ఫలితాలు ఎందుకు రావో చూద్దాం. ఇకనైనా మారండి. మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వండి’ ఏపీలోని ఓ సగటు ఉపాధ్యాయుడు ఆవేదనతో అన్న మాటలివి.  ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సుమారు రెండు లక్షల మంది ఫెయిలవడం, పాస్ శాతం 67.26 శాతానికి పడిపోవడం, 71 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాని సందర్భంలో ఆ సగటు టీచర్ లో పెల్లుబుకిన ఆవేదన ఇది.ఈ ఏడాది టెన్త్ పాస్ శాతం దారుణంగా తగ్గిపోవడానికి కరోనా కారణమని కొందరు, ప్రభుత్వ వైఫల్యమే అని మరికొందరు, ప్రశ్నాపత్రాలు లీకవడం అని ఇంకొందరు, విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోకపోవడమూ కారణమే అని కొందరు, స్కూళ్లలో టీచర్లే లేపోవడం అని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.  అధికార, విపక్షాలైతే బ్లేమ్ గేమ్ కు దిగారు.  కరోనా వల్ల రెండేళ్లు పరీక్షలు లేకపోవడం, ప్రత్యక్ష తరగతులకు అవకాశం లేక విద్యార్థులకు  ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించడం, నారాయణ విద్యాసంస్థలో ప్రశ్నాపత్రాలు ముందే లీకవడం లాంటి కారణాలను వైసీపీ సర్కార్ సాకుగా చూపిస్తోంది.  ఈ సారి పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు కరోనా వల్ల వారి 8 ,9 తరగతుల్లో పరీక్షలు నిర్వహించలేదని, అప్పుడు వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయడం కారణమే అని చెబుతోంది. ఆన్ లైన్ క్లాసులు విన్నట్లు కొందరు విద్యార్థులు నటిస్తూ, ఫోన్ లలో ఇతర వీడియోలు చూడడం వల్లే ఉత్తీర్ణత తగ్గడానికి కారణం అని చెప్పుకొస్తోంది. నాడు- నేడు నెపంతో వైసీపీ సర్కార్ మూడేళ్లుగా ఆర్భాటపు ప్రచారం చేసుకుందని, తమ హయాంలో 90 నుంచి 95 శాతం వరకు టెన్త్ పరీక్షా ఫలితాలు రాబట్టామని.. వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి తీరుతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ విధానాల వల్లే 2 లక్షల మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోయే దుస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు. పరీక్షల్లో ఫెయిల్ అయింది విద్యార్థులు కాదని, ప్రభుత్వ వ్యవస్థలే అనేది ఆయన ఆరోపణ. విద్యా వ్యవస్థను వైసీపీ సర్కార్ సర్వనాశనం చేసిందని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. టెన్త్ ఫలితాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ‘ఇది పదో తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ కాదు.. జగన్ రెడ్డి సర్కార్ ఫెయిల్యూర్’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఫెయిల్ చేయడం ద్వారా అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థులను దూరం చేసే కుట్ర జరిగిందని ఆయన ఆరోపణ. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ తో ఆభాసు పాలైందని విమర్శించారు. నాడు- నేడు పేరుతో 3 వేల 500 కోట్లు మింగేసిన వైసీపీ సర్కార్, డీఎస్సీ నిర్వహించలేదని, టీచర్లను నియమించలేదని, అందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిలయ్యారన్నారు. అందుకు ‘నారాయణ’ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారమే కారణం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేయడం గమనార్హం. చదువు‘కొన్న’వాడివి నువ్వు రిజల్ట్స్ గురించి మాట్లాడడమేంటని వ్యక్తిగత విమర్శలకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కూడా రంగంలోకి వచ్చి.. ‘చదువంటే ఇసుక తోడడం కాదు. భవిష్యత్తుకు పెట్టుబడి.. పాఠశాల గోడలకు రంగువేయడం, పుస్తకాలు పంపిణీ చేయడం కాదు’ అంటూ జగన్ సర్కార్ ను ఎద్దేవా చేశారు. 71 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణతా శాతాన్ని చూసి సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలని తూర్పారపట్టారు. భారీ సంఖ్యలో టెన్త్ విద్యార్థులు పెయిలవడానికి జగన్ సర్కార్ వైఫల్యమే కారణమని టీడీపీ నేత కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి భారం తగ్గించుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నించిందనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 97 శాతం ఉత్తీర్ణత వస్తే.. వైసీపీ పాలనలో 67 శాతానికి పడిపోవడంపై ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. ప్రకటించిన దానికన్నా రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని నిందించారు. ఇంగ్లీష్ మీడియంపై మోజుతో మాతృభాషను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంవల్ల కూడా విద్యార్థులకు భారీ నష్టం కలిగిందని విశ్లేషించారు. ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకు వచ్చారు. గతంలో కార్పొరేట్ సంస్థల అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవని సెలవిచ్చారు. పరీక్షా ఫలితాలపై కోవిడ్ ప్రభావం పడిందట. ఉత్తీర్ణతా శాతం తగ్గడాన్ని విపక్షాలు వేలెత్తి చూపించకూడదంటున్నారు. దీన్ని విపక్షాలు అస్త్రంగా వాడుకుంటున్నాయని ఉపన్యాసం ఇచ్చారు. పైగా టెన్త్ ఫలితాలపై విపక్షాలు తలకాయ లేకుండా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అసలు టీడీపీ హయాంలో మాదిరిగా పరీక్షల్లో అక్రమాలు జరగకుండా తమ ప్రభుత్వం అడ్డుకుందని, అందుకే ఉత్తీర్ణతా శాతం తగ్గిందని విశ్లేషించారు. కాపీ కొట్టేందుకు వీలుండే బిట్ పేపర్ తీసేయడం కూడా పాస్ శాతం తగ్గడానికి ఒక కారణం అంటున్నారు. అంటే నిఖార్సయిన వారు, నిజాయితిగా పరీక్షలు రాసిన వారే పాస్ అవడం తమ విజయం అని చెప్పుకొచ్చారు. పరీక్ష ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనలో మునిగిపోతే.. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వారి భవిష్యత్తును మెరుగు పరిచేందుకు ఏం చేయాలో, ఎలా చక్కదిద్దాలొ ఆలోచించకుండా అధికార, విపక్షాల నేతలు ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.

క్రికెట్ కు మిథాలీ గుడ్ బై

మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్   అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 1999 జూన్ లో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మిథాలీ రాజ్   ప్రపంచ మహిళా క్రికెట్ లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన రికార్డ్ మిథాలీ పేరుమీదే ఉంది. ఇండియా తరపున ఆమె 232 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు. 50.68 యావరేజ్ తో 7,805 పరుగులను సాధించారు.  మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మన దేశ గెలుపుకోసం తన వంతు కృషి చేశానని మిథాలి తెలిపారు. తనకు ఎంతో సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. భారత మహిళా క్రికెట్ కు మిథాలీరాజ్ అందించిన సేవలు మరువలేనివని బీసీసీఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. మిథాలీ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ ప్రకటన చేసిన నిముషాల వ్యవధిలో జైషే వరుస ట్వీట్లతో మిథాలీరాజ్ క్రికెట్ కు చేసిన సేవలను ప్రస్తుతించారు.   23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో మిథాలీరాజ్ అనితర సాధ్యమైన రికార్డులెన్నో సొంతం చేసుకుంది. దేశంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. ఆమె స్ఫూర్తితోనే మహిళలు క్రికెట్ పట్ల మక్కువపెంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. దేశంలో టెన్నిస్ పట్ల ఆదరణ పెరిగేందుకు సానియా మీర్జా ఎలా స్ఫూర్తిగా నిలిచారో.. మహిళల క్రికెట్ కు ఆదరణ పెరిగేందుకు మిథాలీ రాజ్ అలా దోహదపడ్డారు.

పోలీసులపై సోము దాష్టీకం.. నడి రోడ్డుపై వీరంగం

అమలాపురం బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఇంతకీ ఆయన అమలాపురం ఎందుకు బయలుదేరారంటే.. అమలాపురం అల్లర్లలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు. అయితే అమలాపురం లో ఆంక్షలు అమలులోన ఉన్నందున ఆయనను పట్టణంలోనికి అనుమతించేది లేదని పోలీసులు ఆయనను జొన్నాడ సమీపంలో అడ్డుకున్నారు. ఆయన మొండిగా ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో ఆయన వాహనానికి అడ్డంగా మరో వాహనాన్ని నిలిపారు. నిజానికి అమలాపురంలో ఇంకా ఆంక్షలు అమలులో ఉన్నాయి. దాదాపు పక్షం రోజుల తరువాత మంగళవారం నాడు పట్టణంలో అంతర్జాల సేవలను పునరుద్ధరించారు. బయట వారెవరికీ పట్టణంలోకి అనుమతి లేదన్న ఆంక్షలను ఇంకా తొలగించలేదు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు అమలాపురం పర్యటనకు అడ్డుకున్నారు. అంతే ఒక్కసారిగా సోము వీర్రాజు పోలీసులపై ఫైర్ అయిపోయారు. నచ్చచెప్పబోయిన పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఫోను మాట్లాడుతున్న పోలీసుపై చేయి వేసి పక్కకు నెట్టేశారు. తన వాహనానికి పోలీసలు అడ్డంగా ఉంచిన వాహనం డ్రైవర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనను లారీ నుంచి కిందకు లాగేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపైకి కన్నెర్రచేసి వార్నింగ్ ఇచ్చారు. అల్లర్ల బాధితుల పరామర్శకు వెళుతున్న తనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. సోము ఎంత వీరంగమాడినా పోలీసులు తమ మాటకే వినలేదు. చివరికి చేసేదేమి లేక తన అమలాపురం పర్యటనను రద్దు చేసుకుని సోము వీర్రాజు రావుల పాలెం నుంచి వెనుదిరిగారు. 

న‌డ్డా వ‌చ్చె .. పార్టీ ప‌రువు తీసె!

 రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో త‌మ స‌త్తా చాటి అధికారంలోకి రావాలన్న ఆతృత‌లో బిజెపి భారీ ప్ర‌చారానికి దిగింది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీని నిల‌బెట్టాల‌న్న ప‌ట్టుద‌ల ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇం దుకు కేంద్ర నాయ‌కులు కూడా వ‌చ్చి పార్టీ వ‌ర్గాల ఉత్సాహాన్ని పెంచుతున్నారు. నిజానికి అలా రావ‌డం ప్రాంతీయ నాయ‌కుల‌కు బ‌లాన్ని చేకూరుస్తుంది. కానీ మొన్న బిజెపి జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఆంధ్ర ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న ఇందుకు పూర్తి భిన్న దృశ్యాన్ని చూపింది.  రాష్ట్రంలో ఇప్ప‌టికే పొత్తుల విష‌యంలో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. టిడిపి, జ‌న‌సేన పొత్తుకి అవ‌కాశం లేద‌ని జ‌న‌సేన అధినాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేసేయి. ఈసారి టిడిపి కి స‌హ‌క‌రించేం దుకు సిద్ధంగా లేన‌న్న‌ది ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పాడు. పోతే ఇటు బిజెపి బ‌లం పుంజుకోవ‌డానికి జ‌న‌సేన ను ద‌గ్గ‌ర‌కు చేర్చుకున్న‌ప్ప‌టికీ ఒక‌వేళ అధికారంలోకి వ‌చ్చేంత‌గా గెలిస్తే ప‌వ‌న్‌ను దూరంగా నెట్టేయ‌నూ వ‌చ్చ‌న్న ప్ర‌చారమూ సాగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన న‌డ్డా ఒక్క‌సారిగా బిజెపి నాయకుల ఆవేశం మీద నీళ్లు చ‌ల్లారు. అస‌లు ఎన్నిక‌ల‌కు ఇంకా ఎంతో స‌మ‌యం వుండ‌గా ఇప్ప‌టి నుంచే పొత్తుల చిక్కుల్లో ఎందుకు ప‌డుతున్నారు? అది అప్ప‌టికి ఆలోచించ‌వ‌చ్చున‌ని హెచ్చ‌రించేరు. పైగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌మ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి పార్టీ వ‌ర్గాలు మ‌రింత గ‌ట్టిగా రెట్టించిన ఉత్స హంతో ప‌నిచేయ‌డం, కేంద్ర ప‌థ‌కాలు, వాటి అమ‌లు గురించి ప్ర‌చారం చేయ‌డం, ఓట‌ర్లు త‌మ వైపు తిప్పుకునేందుకు చేయ‌వ‌ల‌సిన వ్యూహాలు, మ‌హ‌త్కార్యాల గురించి ఆలోచించాల‌ని కాస్తంత గ‌ట్టిగానే క్లాస్ తీసుకున్నారు బిజెపి జాతీయ అధ్య‌క్షుడు. నిజానికి న‌డ్డా అన్న‌దానిలో త‌ప్పు లేదు. పార్టీ ఇక్క‌డ గ‌ట్టి ప‌ట్టుసాధించాలంటే క్రింది స్థాయినుంచి పార్టీని బ‌లోపేతం చేయ‌డం, ప్ర‌జ‌ల‌కు ఇక్క‌డి ప్ర‌భుత్వం చేస్తున్న నిర్వాకం బాగా తెలిసేలా కార్య్ర‌క‌మాలు నిర్వ‌హించ‌డం, త‌ద్వారా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డం చేయా లి గాని పొత్తులు, తిట్ట‌డాల‌తో ప‌నేమీ జ‌ర‌గ‌దు.   మా  నాయ‌కుడు వ‌స్తున్నాడు, మ‌హాద్భుతం చేస్తాడు అని  జై నాయ‌కా!  జై జై నాయ‌కా!!  అంటూ గొంతు చించుకుంటూ  నానా హ‌డావుడీ చేసేరు. న‌డ్డా వ‌చ్చేడు. కానీ చేసిందేమిటి, జ‌రిగిందేమిటి?  ఆయ‌న కూడా తిట్ల దండ‌కం అందుకున్నాడే గాని ప్ర‌త్యేకించి పార్టీ క్యాడ‌ర్‌ని ఉత్సాహ‌ప‌రిచిందేమీ లేదు. విప‌క్షా ల‌ను తిట్టిపోయ‌డం త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌ర్చ‌డం ఎలా అవుతుంది. దీని కోసం ఢిల్లీ నుంచే రాన‌క్క ర్లేదు. ఒక ఫోన్‌చేస్తే ఇక్క‌డి నాయ‌కులు ఇక్క‌డి భాష‌లో అర్ధ‌మ‌యేలా తిడుతున్న‌ది మ‌రింత పెద్ద గొంతు క‌తో, మ‌రింత కొత్త‌ప‌ద‌జాలంతో కానిచ్చేవారు క‌దా!  పైగా రాబోయే ఎన్నిక‌ల‌కు తొంద‌ర‌ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని బోధ చేయ‌డం ఇక్క‌డి పార్టీ వ‌ర్గాల‌మీద పెద్ద రాయి ప‌డేసిన‌ట్టే అయింద‌నాలి. ఎంతో ఉత్సాహంతో వున్నవారంతా త‌మ పార్టీ అధినేత నుంచి ఇలాంటి నీరుగార్చే మాట‌లు వినాల్సి వ‌స్తుంద‌ని  క‌ల్లోనైనా ఊ హించి వుండ‌రు. కానీ ఇది కాల కాదు వాస్త‌వ‌మేన‌ని తెలుసుకునేస‌రికి మ‌హానేత ఢిల్లీ  వెళిపోయారు.  ఇక ఇప్పుడు ఏమి చేయ‌వ‌లె? అనే ప్ర‌శ్న తెలుగు రాష్ట్రాల బిజెపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వేసుకుని కంగారు ప‌డు తున్నారు. వ‌చ్చినాయ‌న  వ‌చ్చిన‌ట్టు వెళ్లిపోయినా బాగుండేది, కానీ  ప‌రువు కాస్తా తీసేడు.  న‌డ్డా .. పార్టీ వ‌ర్గాలకు  లేని  త‌ల‌ నొప్పి తెచ్చావుగ‌దా! .. ఇదీ పార్టీ వ‌ర్గాల స్వ‌గ‌తం!!

కేటీఆర్ విదేశీ పర్యటన ఖర్చు ఎంతంటే?

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత నెలలో ఐదు రోజుల పాటు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దావోస్ చేరుకోవడానికి ముందు ఆయన ఐదు రోజుల పాటు బ్రిటన్ లోనూ పర్యటించారు. అంటే మొత్తం పదిరోజుల విదేశీ పర్యటనకు ఆయన, ఆయనతో పాటు వెళ్లిన పది మంది అధికారుల  అధికార బృందానికి కలిసి అయిన వ్యయం 13.22 కోట్ల రూపాయలు. కేటీఆర్ విదేశీ పర్యటన కోసం తొలుత ప్రభుత్వం బడ్జెట్ లో రెండు కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఆ మొత్తం సరిపోదని, మరో 7.80 కోట్లు అవసరమౌతాయని అధికారులు కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కేటీఆర్ బృందం విదేశీ పర్యటన కోసం ప్రభుత్వం  9.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.  ఆ నిధులను విడుదల చేసింది. కానీ అధికారులు అదనంగా మరో 3.42 కోట్ల రూపాయలు అవసరమౌతాయని చెప్పడంతో ప్రబుత్వం అందుకు అంగీకరించి వారు కోరిన మొత్తాన్ని మంగళవారం విడుదల చేసింది. అంటే బ్రిటన్ దావోస్ లలో కేసీఆర్ బృందం పది రోజుల పర్యటనకు అయిన మొత్తం 13.22 కోట్ల రూపాయలు. అదే దావోస్ పర్యటనకు సతీ సమేతంగా అధికార బృందంతో వెళ్లిన ఏపీ సీఎం ఖర్చు ఎంత అన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి. దావోస్ పర్యటన అని బయలుదేరి జగన్ విదేశీ యానానికి ఉపయోగించిన లగ్జరీ చార్టర్ విమానానికే గంటలకు రూ 12 లక్షలు అద్దె చెల్లించారు. అంటే ఆయన మొత్తం విదేశీయానం వ్యయం ఎంత అయి ఉంటుదన్నది ఊహించుకోవచ్చు. కేటీఆర్ దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి రూ.5వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించారు. అయితే జగన్ పర్యటనతో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్నన్నది రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన సమాచారాన్ని ఇంత వరకూ వెల్లడించలేదు. మొత్తం మీద ఇరు రాష్ట్రాలూ కూడా ఆర్థిక సంక్షోభంలో కూడా విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయలు వెచ్చించడం మాత్రం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాశంగా  మారింది. 

కేటీఆర్ ట్వీట్లపై తెరాసలో ఆందోళన

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, తెరాస అధ్యక్షుడు ఆయనే...అయినా,ఈరోజున అటు ప్రభుత్వం, ఇటు పార్టీ కూడా, ఐటీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామా రావు, కనుసన్నల్లో పనిచేస్తున్నాయనే అభిప్రాయం రోజు రోజుకు బలపడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే పార్టీ అధ్యక్షుడు అన్న విధంగా, ప్రవర్తించిన సందర్భాలు చాలనే ఉన్నాయి. అలాగే, ఇటు మంత్రులు, అటు అధికారులకు అయన ట్విటర్’ పైనే ఆదేశాలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నాయి.  ఒక విధంగా చూస్తే, కేటీఆర్ తెలంగాణ డిఫ్యాక్టో ముఖ్యమంత్రి, తెరాస డిఫ్యాక్టో అధ్యక్షుడు అన్నా, ఎవరూ అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని, అటు ప్రతిపక్షాలే కాదు, స్వపక్ష నాయకుకులుం చివరకు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.సరే, అది ప్రస్తుతానికి అప్రస్తుత చర్చ, అధికార పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే, ఒకప్పుడు ప్రామిసింగ్ లీడర్’ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పడు, ఎందుకనో,, ఏమైందో కానీ, ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెడుతున్నారని, విపక్షాలకు అస్త్రాలను ఆయనే సప్లై చేస్తున్నారనే మాట, పార్టీలోనే వినిపిస్తోంది. ఒక విధంగా కేటీఆర్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారనే రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ బీజేపీ కార్పొరేటర్లు, నగరానికి చెందిన ఇతర నేతలను ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి, తమ అధికార నివాసంలో వారితో సమావేసమయ్యారు. గతంలో ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలో, జీహెచ్ఎంసి కార్పొరేటర్లు,ఇతర నగర నేతలను కలవవలసి ఉన్నా అప్పుడు సమయాభావం వల్లనో ఏమో అందరినీ కలవలేక పోయారు. ఈ నేపధ్యంలో, కార్పొరేటర్లు ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించుకుని వారితో, సుమారు గంటన్నర సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ప్రతి ఒక్కరినీ ప్రధాని పరిచయం చేసుకొని వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని వారికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఈ దశలో మరింత కష్టపడితే సునాయాసంగా అధికారంలోకి వస్తామని చెప్పారు. నిజానికి ఇది, బీజేపీ అంతర్గత వ్యవహారం. ప్రభుత్వానికి సంబందించిన విషయం కానే కాదు. అయితే, మంత్రి కేటీఆర్ బీజేపీ పుట్టలో వేలు పెట్టారు. కార్పొరేటర్లు కమ్యూనిటీ సేవ చేయాలన్న ప్రధాని వ్యాఖ్యలను, ఎక్కడ నుంచి పట్టుకున్నారో, ఏమోకానీ, పట్టుకున్నారు. అదేదో మహాపరాధం అయినట్లు తప్పుబట్టారు. మోడీజీ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ఎన్జీవోనా?   అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.హైదరాబాద్‌ గతంలో ఎన్నడూలేని రీతిలో భారీ వరదలను ఎదుర్కొందని, కానీ ప్రధాని మోడీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని కుడా మంత్రి ప్రశ్నించారు.అఫ్కోర్స్, ఇతర విషయాలు కూడా ప్రస్తవించారు అనుకోండి అది వేరే విషయం.  ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై, బీజేపీ నాయకులు విరుచుకు పడుతున్నారు. తెరాసలోనూ చర్చ మొదలైంది. నగర కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు కమ్యూనిటీ సేవ చేయాలనడం ఏ విధంగా తప్పని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు  ప్రజను దోచుకోవాలే కానీ, ప్రజలకు సేవ చేయ రాదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ, వ్యాపార దృక్పథంతో చూడడం, అన్నిటికీ అదే మందు ‘జిందా తిలస్మాత్’ అన్నట్లుగా, కేద్రంపై విరుచు పడడం చూస్తుంటే, ఆయనకు, బీజేపీ, మోడీ ఫోబియా  పట్టుకుందని అనిపిస్తోందని, బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవంక, కేటీఆర్ చేస్తున్న తొందరపాటు ట్వీట్లు, తమకు తలనొప్పులు తెస్తున్నాయని తెరాస నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలంటే కేవలం నిధులు ఇచ్చిపుచుకోవడమేనా, అని ప్రశ్నిస్తున్నారు. విషయం ఏదైనా కేంద్రం ఏమీ చేయలేదు, ఏమీ  ఇవ్వలేదు, చిప్పలో చిల్లిగవ్వ రాల్చలేదు అని విరుచుకు పడడం, వాపోవడం రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడుతోందని సొంత పార్టీ నేతలే చిరాకు పడుతున్నారు.  అలాగే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) గురించి అనేక సందర్భాలలో స్వయంగా కేటేఆర్ మాట్లాడారు.అంతేకాదు, ఆయనే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎపీలు ఇతర పార్టీ నాయకులను ప్రోత్సహించి, అంబులెన్సులలని విరాళంగా సేకరించారు. అదే విధంగా, కొవిడ్ సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒకటి రెండు నెలల జీతాలను ముఖ్యమంత్రి, ప్రధాని సహాయ నిధిని విరాళంగా ప్రకటించారు. అదే విధంగా ప్రధానమంత్రి తమ పార్టీ కార్పొరేటర్లు సేవా భావంతో పని చేయాలని చెపితే చెప్పారేమో, అందులో తప్పేముందని, తెరాస నాయకులు కూడా విస్మయం వ్యక్తపరుస్తున్నారు. ఈమధ్య కేటీఆర్, తొందరపడి చేస్తున్న ట్వీట్లు తమకు తల నొప్పులు తెస్తున్నాయని అంటున్నారు.  మరోవంక నిజానికి ప్రధాన మంత్రి కార్పొరేటర్లతో ఏమి మాట్లాడారు, ఏమి మాట్లాడలేదు అనే విషయాన్ని, పక్కన పెట్టి, దేశ ప్రధాని నగర కార్పొరేటర్లకు అంత సమయం కేటాయించడం నుంచి తెరాస నాయకత్వం నేర్చుకోవలసింది చాలా ఉందని రాజకీయ విశ్లేషుకులు అంటున్నారు. ముఖ్యమంత్రి మంత్రులకు కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వరని, ప్రగతి భవన్’ గేట్లు కూడా తెరుచుకోక, తానూ. హరీష్ రావు సహా మరి కొందరు   మంత్రులు గేటు వద్ద ఏడ్చిన సందర్బాలు ఉన్నాయని. గతంలో  ఈటల చేసిన విమర్శలు హుజురాబాద్ ఉప ఎన్నికలలో ప్రభావం  చూపిన విషయాన్ని మరిచి పోరాదని అంటున్నారు. నిజానికి, ప్రస్తుతం రాష్ట్రంలో వీస్తున్న తెరాస వ్యతిరేక పవనాలకు, ఇది కూడా ఒక కారణమని, విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దిశ కేసులా ఎందుకు డీల్ చేయరు!

దేనిక‌యినా ఒక హ‌ద్దూ ఆపు వుండాలి.  ఒక సంఘ‌ట‌న పూర్వాప‌రాలు తెలిసీ న‌త్త‌న‌డ‌క‌న చ‌ర్య‌లు సాగ నిస్తే ఎవ‌రు హ‌ర్షిస్తారు?  జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు ఏడురోజులుగా సాగ‌దీసి నీరుగారుస్తున్నారు.  పోలీసు లు నిందితుల‌ను గుర్తించామ‌ని, వారిలో  కొంద‌రిని ప‌ట్టుకున్నామ‌ని, ఆ ప‌ట్టుకున్న‌వారిలో మైన‌ర్లు వున్నా రని, వారి వివ‌రాలు చెప్ప‌డం కుద‌ర‌ద‌ని సీపీ ఆనంద్ అన్నారు. పోనీ మిగ‌తావారి విష‌యంలో కూడా గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఇన్ని రోజులు చేయ‌డంలో అర్ధ‌మేమిటి?  వీడియో రికార్డింగ్‌లు ప‌రిశీలించ‌డం, నిందితుల‌ను గుర్తించ‌డం, ఫోటోలూ బ‌య‌టికి రావ‌డం జ‌రిగిపోయాయి, కానీ పోలీసుబాస్ మాత్రం ఎందుకో అరెస్టుల‌కు నిదానం ప్ర‌ధానమ‌న్న విధానాన్నే అనుస‌రించ‌డం చూస్తున్నాం.  దిశ‌ కేసులో హుటాహుటిని నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం, ఎన్‌కౌంట‌ర్ చేసేయ‌డ‌మూ వేగంగా చేయ‌గ‌లిగిన పుడు  ఈ కేసును న‌త్త‌న‌డ‌క‌న సాగించ‌డం పోలీసు వ్య‌వస్థ మీద అప‌న‌మ్మ‌కం క‌లిగించింది. నిందితుల‌ను ఎందుకు కాపాడుకునే మార్గం చూస్తున్న‌ట్టు?  ఒక‌రు మాజీ మంత్రి కుమారుడ‌ని, మ‌రొక‌డు హోంమంత్రి మ‌న‌వ‌డు అనీ తాత్సారం చేస్తున్న‌ట్టే వుంది. ఇది చాలా సీరియ‌స్ కేసుగా మారిందే ఈ రెండు అంశాలు వెలుగు చూడ‌టంతో. అన్నిరేప్ కేసుల్లో రెండింత‌లు వుత్సాహం చూపే పోలీసు శాఖ ఈ కేసులో ఇన్ని రోజులు మీన‌మేషాలు లెక్కిస్తూ తీసుకోవాల్సిన చ‌ర్య‌లకు త‌ట‌ప‌టాయించ‌డం నిందితుల‌ను ర‌క్షించ‌డా నికే! అస‌లు రేప్ జ‌రిగింద‌ని చెబుతున్ కారులో అస‌లు ఎమ్మెల్యే కొడుకు లేడ‌ని డిసీపీ విలేక‌రులకు స‌విన‌యంగానే చెప్పారు.  కానీ ఆన‌క వీడ‌యోలో బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత కేసు రూప‌మే మారింది. అవును ఆ కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా ద‌ర్శ‌న‌మిచ్చేడు. అదీ వాస్త‌వ‌మే, కానీ అత‌గాడు స‌గం దూర‌మే వుండి ఆ త‌ర్వాత వెళిపోయాడ‌ని కొత్త వార్త వినిపించేరు. మ‌రి ఆ కొద్ది స‌మ‌య‌మ‌యినా ఆ కుర్రాడు చాలా బుద్ధి గా కూచుని వున్నాడా అన్న‌ది అనుమాన‌మేగ‌దా!  చిత్ర‌మేమంటే, సీపీ ఆనంద్ ఆ ఎమ్మెల్యే పేరు చెప్ప డానికి, ఆ దొరికిన ఇన్నోవా ఎవ‌రిద‌నేది చెప్ప‌డానికీ  ధ‌డుసుకోవ‌డం! పైగా నిందితులు మ‌ద్యం సేవించిన‌ట్టు గ‌ట్టి ఆధారాలేవీ చెప్ప‌లేదు.  ఇంత‌టి కేసు గురించి వారినోట వీరినోటా అయినా సీఎం కేసీఆర్ వినేవుంటారు. సందేహం లేదు. మ‌రి దీన్ని గురించి ఇంత‌వ‌ర‌కూ ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. త‌మ రాష్ట్రంలో ఆడ‌బిడ్డ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు, ముఖ్యంగా భాగ్య‌న‌గ‌రం బ‌హు బాగు అంటూ ప్ర‌చారాలు మాత్రం వూద‌ర‌గొట్టిన ప్ర‌భుత్వం  ఇటీవ‌ల ఇలాటి కేసులు పెచ్చుమీరిపోతున్న సంగ‌తి తెలియ‌కుండా వుంటుందా?  ప‌రువు హ‌త్య‌ల్ని పేప‌ర్ల‌లో చూసి తెలుసుకుంటున్న తెలంగాణా సీఎంకి మ‌రి మంత్రిగారి అబ్బాయి నిందితుడ‌ని అంటు న్న ఈ కేసును ప‌ట్టించుకోవ‌డం ప్ర‌బుత్వ ప్ర‌తిష్ట‌ను కాపాడుకోవ‌డానికి వ‌హిస్తున్న మౌనమే అనుకోవాలి. ఇది ఎంత‌వ‌ర‌కూ న్యాయం. అదే మ‌రెవ‌రిదో హ‌త్యా, రేప్ కేసో అయితే వెంట‌నే నిందితుల‌ను ప‌ట్టుకోవ డం, క‌ఠిన శిక్ష విధించ‌డానికి ఏమాత్రం తాత్సారం చేయ‌నీయ‌ని అధికారులు, ప్ర‌భుత్వం ఈ విష‌యంలో మాత్రం చాలా నిదానంగా, నిమ్మ‌ళంగా వుండ‌టం దారుణం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 40 రోజులలో నిందితులను శిక్ష పడేలా చేస్తే రాష్ఠ్ర ప్ర‌జ‌లు సంతోషిస్తారు. 

బీజేపీ నెత్తిన కేసీఆర్ పాలు.. రాష్ట్రపతి ఎన్నికకు టీఆర్ఎస్ దూరం?

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఏమిటి అన్న ఉత్కంఠకు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు తెరపడినట్లే. బీజేపీయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థికి బేషరతు మద్దతు అంటూ వచ్చిన కేసీఆర్ ప్లేట్ ఫిరాయించినట్లేనని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఈ ఎన్నికను బహిష్కరించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటమంటే బీజేపీ నెత్తిన పాలు పోయడమే. సొంతంగా అభ్యర్థిని గెలిపించుకునేంత బలం లేని బీజేపీ మద్దతు కోసం ఇతర పార్టీల మీద మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతోంది. ఇప్పటికే వైసీపీ, బీజేడీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయన్నది ఖాయమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడమంటే బీజేపీ అభ్యర్థి విజయానికి మార్గం సుగమం చేసినట్లే.  సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం జనం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తారో.. అంతకు మించి ఉత్కంఠ ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కనిపిస్తున్నది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 25తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోరాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నిక బీజేపీకి ఎంత ప్రతిష్ఠాత్మకమో, బీజేపీ యేతర పక్షాలకు అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడమూ ఆ పార్టీలకు అంతే ప్రతిష్ఠాత్మకం. అయితే  బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి కోసం కేసీఆర్ శతధా ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. కనీసం రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనైనా బీజేపీయేతర కూటమిని తన నాయకత్వం కింద ఏకం చేద్దామన్న ఆయన ప్రయత్నాలూ ఫలించలేదు. దీంతో ఆయన ఓ రెండు మెట్లు దిగి సోనియాగాంధీతో భేటీకి ప్రయత్నించారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థికి టీఆర్ఎస్ బేషరతు మద్దతు ఇస్తుందని ఆమెకు చెప్పాలన్న ప్రయత్నమూ విఫలమైంది. కేసీఆర్ తో భేటీకే సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో ఇప్పడు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన ఏ వైఖరి తీసుకుంటారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.  విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కేసీఆర్ కు ఆమోదయోగ్యం అయితే సరే లేకుంటే మాత్రం టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటుందన్నది ఆయన ఉద్దేశంగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీయేతర కూటమి కోసం, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం కోసమంటూ కాలికి బలపం పట్టుకు తిరిగిన కేసీఆర్.. తన ప్రయత్నాలు విఫలమైన తరువాత విపక్షాల ఉమ్మడి అభ్యర్థి తనకు ఆమోదమే అని చెబుతారా అన్నది అనుమానమే. రాజకీయ వర్గాలైతే ఖచ్చితంగా అనరు అనే అంటున్నాయి. అంటే టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటమే జరుగుతుందని పరిశీలకుల విశ్లేషణ. టీఆర్ఎస్ ఒక వేళ అదే నిర్ణయం తీసుకుంటే బీజేపీ నెత్తిన పాలు పోసినట్లే. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా గెలిపించుకునేంత బలం బీజేపీకి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటమంటే బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి మార్గం సుగమం చేసినట్లే.  పరిశీలకుల విశ్లేషణ ప్రకారం టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటమంటూ జరిగితే.. కేసీఆర్ ఇంత కాలం వ్యక్తం చేస్తున్న బీజేపీ వ్యతిరేకత ముసుగు తొలగిపోయినట్లే. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కాకుండా ఉండేందుకే టీఆర్ఎస్ బీజేపీకి లేని ప్రాముఖ్యత ఇచ్చిందనీ, రాష్ట్రంలో త్రిముఖ పోరు జరిగితే లబ్ధి పొందాలన్నది కేసీఆర్ లక్ష్యం కాగా, కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యానికి తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనం చేయడం ద్వారా కొంచం చేరువ కావచ్చన్నది బీజేపీ ఉద్దేశంగా చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ తొలి నుంచీ కూడా తెలంగాణలో బీజేపీ బీ టీమ్ టీఆర్ఎస్ అని విమర్శిస్తూ వస్తున్నది. అలాగే ఇరు పార్టీలూ కలిసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు మార్లు ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ( బీజేపీయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థి తనకు ఆమోదయోగ్యమైన వ్యక్తి కాకపోతే) టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటే ఇంత కాలంగా వేసుకున్న ముసుగును కేసీఆర్ తొలగించినట్లేనని, వాస్తవంగా కేసీఆర్ కోరుకున్నది కూడా ఇదేననీ రాజకీయవర్గాలలో ఒక చర్చ ప్రారంభమైంది.  అసలు బీజేపీయేతర కూటమి అంటూ కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన కూడా విపక్షాల మూడ్ ను తెలుసుకుని బీజేపీకి చేరవేయడానికేనని కూడా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాకు రాష్ట్రపతి ఎన్నికకు టీఆర్ఎస్ దూరం కావడంతో తెరపడుతుందన్న చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.

ఆయ‌న రూటే సెపరేటు..!

యుద్ధ‌భ‌యంతో వూళ్లు వ‌దిలి పోయేవారుంటారు.  ఉద్యోగాల‌కోసం వున్న‌వారు వ‌దిలేసేవారుంటారు. ఉద్యో గంలో ప్ర‌మోష‌న్ త‌ప్ప‌దుగ‌నుక ఆ ప‌రంగా వేరే ప్రాంతానికి వెళిపోతారు. కానీ తెలంగాణా ముఖ్య మంత్రి కేసి ఆర్ మాత్రం గ‌జ్వేల్‌ను కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని వ‌దిలేసుకున్నారు. ఎప్పుడూ వున్న చోటేనే మ‌రో ప్రాంతంలోనూ మ‌న స‌త్తా చూపాల‌నుకున్నారు కేసీఆర్‌. పార్టీ ప‌గ్గాలు కుమార ర‌త్నం కేటీ ఆర్‌కి అప్ప‌జెప్పి బిజెపి ప్ర‌భుత్వాన్ని ప‌నిగ‌ట్టుకుని తిట్టుకుంటున్న‌వారిని అంద‌రినీ క‌లిసి కొత్త కూట‌మి గా ఏర్పాటుచేసి ఏకంగా ప్ర‌ధాని కావాల‌న్న కోరిక కేసీఆర్‌ను గ‌జ్వేల్‌ని వొదిలేయ మంది. మ‌నసు చెప్పిన మాట విని అనుసరించితీరాలిగ‌దా!    కేసీఆర్ రాజ‌కీయ జీవితంలో గ‌జ్వేల్‌ది కీల‌క‌స్థానం. 2014 ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కి సుమారు 87వేల ఓట్లు వేసి గ‌జ్వేల్ ఓట‌ర్లు గెలిపించారు. అలాగే 2018లో కేసిఆర్‌కు ఏకంగా ల‌క్షా 25వేలకు పైగా ఓట్లు వేసి మ‌రీ గెలి పించారు. రెండు ప‌ర్యాలు వంటేరు ప్ర‌తాప్‌రెడ్డినే ఓడిం చేరు. మరి తనను ఇంతలా జనం ఆదరి స్తున్న గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు కేసీ ఆర్ ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారనేది అక్క‌డి వారికి  ఇంకా మింగుడుప‌డ‌టం లేదు. కానీ కేసీఆర్ మాత్రం మెద‌క్ లోక్‌స‌భ స్థానం నుంచి ఈసారి పోటీచేయా ల‌నుకుంటున్నారు. రెండుప‌ర్య‌యాలు గ‌జ్వేల్‌నుంచి గెలిచిన కేసీఆర్ మెద‌క్ నుంచీ పోటీ చేసి గ‌జ్వేల్‌ని వంటేరు ప్ర‌తాప్‌కి వ‌దిలేస్తున్నాన‌నీ అన్నారు. ప్ర‌స్తుతం టిడిపిలో వున్న వంటేరుకు లైన్ క్లియ‌ర్ అయి న‌ట్టే అనుకోవాలి.  ఇటీవ‌లి కాలంలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా  తెలంగాణా సీఎం కేంద్రంలో వున్న‌వారికి బుద్ధిచెప్పాల‌ని గ‌ట్టి నిర్ణ‌యానికి వ‌చ్చేరు. వున్న‌చోటు నుంచే న‌లుగురి బ‌లంతో యుద్ధంచేసేకంటే, తానే  బిజెపి విప‌క్షాల‌ను ఒక తాటి మీద‌కి తేవాల‌ని బాగా ఆలోచించుకుని మ‌రీ ఈమ‌ధ్య ప‌ర్య‌ట‌న‌లు చేశారు. కేజ్రీవాల్‌, మాయావ‌తిల‌ను క‌లిసి తామంతా క‌లిస్తేనే, ఒక మాట అనుకుంటేనే బిజెపికి బుద్ధి చెప్ప‌గ‌ల మ‌న్న గొప్ప సూక్తి వినిపిం చేరు. వారికి అనాదిగా వున్న ఆలోచ‌న‌నే ఈయ‌న మ‌ళ్లీ నొక్కి వొక్కాణించేరు. తెలంగాణా పోరాటగ‌డ్డ గ‌నుక ఆ స్ఫూర్తిని ఇత‌ర రాష్ట్రాల్లోని బిజెపి వ్య‌తిరేకుల‌కు నూరిపోసి అంద‌రికి నాయకుడ‌యి కేంద్రంలో అల‌జ‌డి తేవాల‌ని వేసిన ప‌థ‌కం పార‌లేదు.   భారీ య‌త్నం దెబ్బ‌తిన్న దిగులు క‌మ్మేసింది కేసీఆర్‌ను. దీనికి తోడు  ఈమ‌ధ్య ప్ర‌జ‌ల‌నుంచి కేసిఆర్  ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త బాగా క‌న‌ప‌డుతోంది. తొలినాళ్ల‌కీ ఇప్ప‌టికీ ఆయ‌న పాల‌నావిధానంలో, పాల‌నాప‌ర నిర్ణ యాల్లోనూ ఎంతో మార్పు వ‌చ్చింది.  అంతా ద‌బాయింపు, దేనికీ స‌ర‌యిన స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డం, స‌వాల్ చేయ‌డం కేసీఆర్ ప్ర‌భుత్వం కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తోంది. ప‌థ‌కాల అమ‌లు అద్భుతంగా వుంద ని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కంటే ఇక్క‌డే ప‌థ‌కాల ల‌బ్ధి పొందుతున్న‌వారి శాతం బాగా వుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. వాస్త‌వంలో అంత గొప్ప‌గా ఏవీ జ‌ర‌గ‌డం లేదు. కేంద్రం నుంచీ రాష్ట్రానికి ఎలాంటి స‌హాయం అంద‌డం లేద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్ప కేంద్రం అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌ర‌యిన వివ‌ర ణ‌లు ఇవ్వ‌డం లేద‌ని కేంద్రం నుంచే తిట్లు తింటున్న‌ది తెలంగాణా ప్ర‌భుత్వం. ప‌లుప‌థ‌కాల ల‌బ్ధి దారు లు కూడా నిజానికి వారికి ప్ర‌క‌టించిన ల‌బ్ధి పొంద‌డం లేద‌ని అంటున్నారు. ఈ విధంగా   ఇంట్లో ఇంత‌టి వ్య‌తిరేక‌త వేడికి ఉడికిపోవ‌డం కంటే వేరు మార్గం చూసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌న్న ధోర‌ణిలో  కేసీఆర్ గ‌జ్వేల్  వ‌దులుకుని మెద‌క్ నుంచి కేంద్రంలోకి ఎంట్రీ ఇవ్వాల‌నే ఆలోచ‌న చేస్తున్నారా అనే అనుమానాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏమ‌యిన‌ప్ప‌టికీ కేసీఆర్ నిర్ణ‌యం టిఆర్ ఎస్ పార్టీకి ఎంత‌వ‌ర‌కూ మేలు చేస్తుంద‌ని  వేచి చూడాలి. ఆయ‌న ఆలోచ‌న‌, తీసుకున్న నిర్ణ‌యం కేవ‌లం కేంద్రంపై దృష్టి మ‌ళ్ల‌డాన్నే తెలియ జేస్తోంది. మ‌రి ఆయ‌న రూటే స‌ప‌రేటు గ‌దా!

తిన‌గ తిన‌గ వేము..! వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కే వుద్యోగుల ఓటు!!

హ‌మ్మ‌య్య మా అబ్బాయి,మా కోడ‌లు ఇంటి ద‌గ్గ‌రే వుంటున్నారు. నాకు చాలా సంతోషంగా వుంది అను కుంటున్నారు మ‌ధ్య‌త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రులు. క‌రోనా తో వ‌చ్చిన క‌ష్టాలు, న‌ష్టాల కంటే ఈమ‌ధ్య ఇలాంటి చిరు సంతోషాలూ  వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐటి వుద్యోగాలు చేస్తున్న వారున్న‌కుటుంబాల్లో .. ఆస‌లా మాట కు వ‌స్తే  దాదాపు ప్ర‌తీ రెండో కుటుంబంలో ఇలాంటి ఓ వుద్యోగి వుంటున్నారు.. వుద్యోగులు నానా అవ‌స్థా ప‌డుతూ ఆఫీ సుల‌కు వెళ్లి రావ‌డం చూసి బాద‌ప‌డుతూండే త‌ల్లిదండ్రుల‌కు వ‌ర్క్ ఫ్రెమ్ హోమ్ అనేది ఒక వ‌రంగా మారింది.  ఇది క‌రోనా క‌ల్పించిన అదృష్టం అంటున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే వుంది. క‌రోనా దెబ్బ‌కి ఐటి కంపెనీల్లో త‌మ వుద్యోగుల‌ను ఇంటికే ప‌రిమితి చేసేరు. వారికి మొద‌ట కొంత ఇబ్బంది వున్న‌ప్ప‌టికీ త‌ర్వా త అంటే రెండో వేవ్ తో అదే మంచి మార్గ‌మ‌నిపించింది. అయితే వీడియో కాల్స్‌తో, స‌మావేశాలు  నిర్వహిం చు కుంటూనే అచ్చం ఆఫీసులోనే వున్న వాతావ‌ర‌ణం వుంటోంద‌ని  అంటున్నా రు వుద్యోగులు.  తిన‌గ తిన‌గ వేము తియ్య‌గా నుండు అన్న సామెత‌లా క్ర‌మేపీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ విధాన‌మే వుద్యోగుల‌కు బాగా న‌చ్చేసింది. ఎందుకంటే రోజూవారి ప్ర‌యాణ ఇబ్బందులు, ప్ర‌యాణం తాలూకు టెన్స‌న్‌లు వుం డ‌వు. ఇంట్లో పిల్ల‌ల్ని, త‌లిదండ్రుల్ని చూసుకుంటూనే త‌న వుద్యోగ  బాద్య‌త‌ల్ని కూడా నిర్వ‌ర్తించ‌వ‌చ్చ న్న‌ది ఎంతో ఆనందక‌రం. వుద్యోగులు ఈ త‌ర‌హా  ప‌నితీరుకు అల‌వాటుప‌డ్డారు. అయితే ఇందులోనూ ఒక చిక్కు వుంది. అధికారులు వారికి వ‌ర్క్ టైమింగ్ పెంచార‌ని, వ‌ర్క్‌లోడ్ కూడా పెరిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ య్యాయి. అయితే ఇంట్లోనే ఒక గ‌దినో, లేదా కొంత ప్లేస్‌ను ఆఫీసు ప‌నికి వుప‌యోగించుకోవ‌డం అల‌వాటు చేసుకున్నారు.  మెగా సిటీల్లో అయితే కొంద‌రు వుద్యోగులు.. ఒక కంపెనీకి చెందిన‌వారు.. క‌లిసి ఒక ఫ్లాట్ తీసుకుని ఆఫీ సుగా  మార్చుకున్నారు. ఇది కొంత‌వ‌ర‌కూ మంచి ఆలోచ‌నే అంటున్నారు. త్రీబెడ్‌రూమ్ ఫ్లాట్ వాళ్లు ఒక గ‌దిని పూర్తిగా ఆఫీస్‌గా మార్చేసుకున్నారు. అదీ భార్యాభ‌ర్త వుద్యోగులే అయితే. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు లేదా ఒకే షిఫ్ట్‌లో వుంటే ఆ గ‌ది పూర్తిగా ఆఫీసే!  భాగ్య‌న‌గ‌రంలో, ఇత‌ర ఐటి హ‌డావుడి వున్న పెద్ద న‌గ‌రాల్లో ఈ మ‌ధ్య కాలంలో కొత్త‌గా అద్దెకు ఇస్తున్న ఇళ్లు లేదా ఫ్లాట్ ఓన‌ర్లు ఈ ఐటీ వుద్యోగుల‌కు కావ‌ల‌సిన విధంగా ఏర్పాట్లు చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. వీరికి కావ‌ల‌సింది వ‌స‌తులు, వారికి కావ‌ల‌సింది రెంట్‌! ఇంటి నుంచి ప‌ని బాగానే వుండ‌డంతో ఇప్పుడు ఆఫీసుల‌కు వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తుంద‌న్న కొత్త భ‌య‌మూ ప‌ట్టు కుంది వుద్యోగుల‌కు. ఇన్నాళ్లూ ఇంట్లో వుంటూ ఇప్పుడు మ‌ళ్లీ వురుకులు, ప‌రుగుల‌కు సిద్ధ‌ప‌డాల‌నుకోవ డం లేదు.  కానీ క‌రోనా బాగా త‌గ్గిపోయి అంద‌రూ ఇత‌ర వృత్తి, వుద్యోగ‌లా త‌మ‌వారిని ఇక ఆఫీసుల‌కు పిల వాల‌న్న ఆలోచ‌న‌లో వున్నారు ఐటీ కంపెనీవారు. అయితే ఎలా నిర్వ‌హించాల‌న్న సందిగ్ధ‌తా లేక పోలే దు.  కొంద‌రిని రెండు ర‌కాల ష‌ఫ్ట్ విధానాల్లో ఆహ్వానించాల‌నుకుంటున్నారు. ఎండాకాలం బడి విధానం లా. బ‌డిలో చిన్న క్లాసుల‌కు పొద్దుటే 8 నుంచి 1 వ‌ర‌కూ 2 నుంచి పెద్ద త‌ర‌గ‌తుల‌కు క్లాసులు నిర్వ‌హించ డం ఆన‌వాయితీగా వుంది. ఇపుడు ఐటీ కంపెనీలు ఆ విధానం పాటిస్తాయా? ఏమో?  కానీ వుద్యోగులు మాత్రం  స‌సెమిరా వెళ్ల‌మ‌నే అంటున్నారు. పైగా ఇపుడు నాలుగో వేవ్ అంటూ మ‌ళ్లీ కొత్త‌గా భ‌యం ప‌ట్టు కుంది.  ఈ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ వుద్యోగుల‌ను అంద‌రినీ ఒకేసారి పిల‌వ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సమో ఐటీ కంపెనీలకే ఎరుక‌.  కానీ క‌రోనా  ప్ర‌భావం ఇంకా పూర్తిగా పోయింద‌నుకోవ‌క్క‌ర్లేద‌ని, నాలుగో వేవ్  అనేది త‌ర‌లివ‌స్తున్న‌ద‌ని అందువ‌ల్ల ఐటీ కంపెనీలు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోరాద‌నే అంటోంది.  ఇంటి ద‌గ్గ‌రుండి ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలామంది వుద్యోగుల ఆరోగ్య‌ప‌రంగానూ ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదు ర్కొన‌డం లేదు. ఇల్లు, ఆఫీసు వేరు వేరు ప్రాంతాల్లో వున్న‌పుడు వుండే టెన్స‌న్ ఇపుడు లేదు గ‌నుక ప్ర‌శాం తంగా అన్నిప‌నులూ సాఫీగానే జ‌రుగుతున్నాయి. ఆరోగ్య‌స‌మ‌స్య‌లు అంత‌గా లేవ‌నే అంటున్నారు ఐటి వుద్యోగులు. మ‌ళ్లీ ఆఫీసులు, ప్ర‌యాణాలు, టెన్ష‌న్ల‌కు గురికావ‌డానికి ఎవ‌రూ సిద్ధంగా లేరు. మ‌రి ఐటి కంపె నీలు వుద్యోగుల‌ను ఇంటి నంచి ప‌నిచేయ‌డానికే అంగీక‌రించి వెళ్లాలంటే ఒక్కింత ఇంటి బెంగ‌తో కూడిన భ‌యం క‌ద‌ల‌నీయ‌దేమో!!

హై‘డరా’బాద్..!

సామూహిక అత్యాచారాలు, హత్యాచారాలతో తెలంగాణ రాష్ట్ర రాజధాని గొప్ప అపకీర్తి మూటగట్టుకుంటోంది. భద్రత లేని నగరంగా విశ్వ విఖ్యాతి చెందుతోంది. ఒక వైపు ప్రభుత్వం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందంటూ హైదరాబాద్ ను కీర్తిస్తుంటే.. మరోపైపు మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు శాంతి భద్రతల జాడ లేని విశ్వనరకంగా విమర్శల పాలౌంతోంది.  విశ్వగరం పరిస్థితి విశ్వనరకంగా మారడానికి కారణం ప్రధానంగా విచ్చలవిడిగా పెరిగిపోయిన పబ్బులు, నిబంధనలను యథేచ్ఛగా తోసి రాజని ఇష్టారాజ్యంగా వాటిని నిర్వహిస్తున్న తీరే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వనగరంగా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతోందని తమ భుజాలను తామే చరిచేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ఈ మహానగరం బాలికల పాలిట ‘అ’భాగ్యనగరంగా మారిపోవడానికి కారణమేమిటో చెప్పాలి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చి బౌలి వంటి ప్రాంతాలలో అత్యంత విలాసవంతమైన బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల యజమానులు ఎవరు, వాటిలో వాటాదారులెవరే, ఎవరెవరి భాగస్వామ్యంతో ఇవి వర్థిల్లుతున్నాయి వంటి వివరాలు సేకరించాల్సి ఉంది. ఎందుకంటే వాటి వెనుక ఉన్నది బడా బడా నేతలేనన్నది బహిరంగ రహస్యమే. అయినా ఎవరూ బయటకు చెప్పరు. వాటకి నిబంధనలతో పని లేకుండానే అనుమతులు మంజూరైపోతాయి. కనీస నిబంధనలను పాటించకపోయినా వాటిపై చర్యలు ఉండవు. ఒక వేళ అనివార్యంగా చర్యలు తీసుకోవలసిన పరిస్థితి వస్తే జరిమానాతో సరిపెట్టేయడానికి వీలైన సెక్షన్ల కిందే కేసులు నమోదౌతాయి. సమయ నియంత్రణ ఉండదు, మైనర్లను అనుమతించకూడదన్న నిబంధన ఈ పబ్బులు, బార్లు, రెస్టారెంట్లలో పాటించరు. పోలీసులూ చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు. వెనకుండి ఈ దందాలకు సహకరిస్తున్నదెవరు? అందరికీ తెలిసన రహస్యమే అయినా అందరూ తెలియనట్టే ఉంటారు.  విశ్వనగరంలో ఖరీదైన బార్లు రెస్టారెంట్లు పబ్బులు హుక్కాసెంటర్లు ఆరోగ్య కేంద్రాలు పేరుతో మసాజ్ పార్లర్లు వ్యభిచార కేంద్రాలు నడుపుతున్నది  సంపన్నులు, రాజకీయ నాయకుల ఉన్నతాధికారుల పేరెన్నికగన్న న్యాయవాదులు డాక్టర్లు కుటుంబాల సభ్యులు వారసులేనని పోలీసు శాఖ వారు ఆఫ్ ది రికార్డ్ అంగీకరిస్తూనే ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36, 45, 10 లలో, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో, బంజారాహిల్స్ లో నిత్యమూ పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న చీకటి దందా పాలకులకు అధికారులకు తెలియదంటే ఎవరైనా నమ్మగలరా?. చీమ చిటుక్కు మంటే ఏలిన వారికి క్షణాల్లో నివేదికలందించే పటిష్ట నిఘా ఉన్న రాష్ట్రంలో.. రాష్ట్ర రాజధానిలో నిబంధనలను తోసి రాజని పబ్బులలో జరుగుతున్న తంతు ప్రభుత్వానికి తెలియదంటే ఎలా నమ్మడం.  తల్లిదండ్రులు ఆరాచకంగా అక్రమంగా అన్యాయంగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో వాళ్ళ సంతానం బార్లు రెస్టారెంట్లు పబ్బులు జూద గృహాలు(క్లబ్బులు) మాసాజ్ కేంద్రాలు, హుక్కాసెంటర్లు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిల్లో రష్యా యూరోప్ నేపాల్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుండి , ఈశాన్య రాష్ట్రాలు నుండి అమ్మాయిలను తీసుకొచ్చి బార్లలో పబ్బుల్లో మసాజ్ సెంటర్లలో వెయిటర్లుగా సర్వర్లుగా డాన్సర్లుగా పెట్టి నడిపిస్తున్నారు. నేడు హైదరాబాద్ నగరంలో నడుస్తున్న అత్యంత విలాసవంతమైన బార్లు పబ్బులు రెస్టారెంట్లులో వాటాదారులు ఎవరో? వాటికి అనుమతులు ఎలా ఇచ్చారో,ఎలా వచ్చాయో? తెలుసుకోవడానికి నిజాయితీ కలిగిన మేధావులతో విచారణ కమిటీ వేయడానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, విపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలు కానీ ఎందుకు ముందుకు రావడం లేదు?  జూబ్లీహిల్స్ అమ్నేషియా  పబ్బుల్లో జరిగిన ఘటన  అనంతరం ఆ కేసులో నిందితులను కాపాడేందుకు పోలీసులు పడిన తాపత్రయం, ఆత్రుత చూస్తుంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ చేయాల్సిన వాళ్లు చేస్తున్నదేమిటి? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలింతకీ ఆ పబ్బు వాటాదారులు నిర్వాహకులు ఎవరో వాళ్ళను, అనుమతులు ఇచ్చిన అధికారులను, కనీస వయసు కూడా లేని మైనర్లను పబ్బులోకి అనుమతిస్తుంటే తెలిసీ ఊరకుంటున్న సంబంధిత పోలీసు అధికారులను   ఆ యువకుల తల్లిదండ్రులను దోషులుగా పోలీసులు మీడియా ముందు నిలబెట్టాలి? అలా ఎందుకు చేయరు? దొంగకు తేలు కుట్టినట్టుగా అందరూ మౌనం వహిస్తున్నారు. పెద్దల ఒత్తిడి, ప్రమేయంతోనే పబ్బుల ఇష్టారాజ్య అరాచకాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారన్న ఆరోపణల్లో నూటికి నూరు శాతం వాస్తవం ఉందన్న ఆరోపణలు అవాస్తవం కాదని సామాజిక ఉద్యమ కారులు అంటున్నారు. ఈ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడనంత వరకూ విశ్వనగరం అమ్మాయిల పాలిట ‘అ’భాగ్యనగరంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.