బీజేపీ టార్గెట్ ప్రాంతీయ పార్టీలేనా?..నడ్డా పర్యటనలు .. అందుకేనా?

భారతీయ జనతా పార్టీ, ఓ వంక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రానున్న సంవత్సరం, సంవత్సరంన్నర కాలంలో, 2024 లోకసభ ఎన్నికలకు ముందు గుజరాత్ సహా  అసెంబ్లీ ఎన్నికలు జరిగే  మరో పది  రాష్ట్రాలపై  దృష్టిని కేంద్రీకరిస్తూనే, 2024 లోక్ సభ ఎన్నికల సన్నాహాలకు కుడా శ్రీకారం చుట్టిందా,అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా త్రయం 2024 ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టిని కేంద్రీకరించిందని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో  ఉన్న రాష్ట్రాలు లక్ష్యంగా దండయాత్రకు సిద్దమవుతోందని అంటున్నారు.  అందులో భాగంగానే, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఒక్కొక్క రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే క్రమమలో ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన నడ్డా ఇప్పుడు బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టిని కేంద్రీకరించడంతో, నడ్డా పర్యటనలు ముందస్తు ఎన్నికల సన్నాహాలనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అయితే, బీజీపే నాయకులు మాత్రం, 2024 ఎనికలను దృష్టిలో ఉంచుకునే నడ్డా వివిధ రాష్ట్రలలో పర్యటిస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే నడ్డా బెంగాల్ పర్యటన నేపథ్యంగా ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నడ్డా ఇప్పడు చేసిన వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నయనే మాట వినవస్తోంది. దొంగలు పడ్డ ఆరు నెలలకు.. అన్నట్లుగా.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసి, సంవత్సరం అయిన తర్వాత... ఆ ఎన్నికలలో బీజీపీ.. ఎందుకు ఓడి పోయింది.. ఎందుకు అధకారంలోకి. రాలేకపోయిండో చెప్పుకోవడం చిత్రంగానే కాదు, ఇంకేదోలా కూడా వుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోనీ అలా చెప్పుకున్నది ఎవరో చిన్నా చితకా నాయకుడు... అయితే అదో రకం. కానీ, ఏకంగా పార్టీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా బెంగాల్  లో అధికారంలోకి రాలేక పోయామని.. చెప్పుకోవడం ఏమిటని, బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజమే, నడ్డా చెప్పినట్లుగా,ఎనిమిది విడతల్లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, నాల్గవ విడత పోలింగ్ ముగిసిన తర్వాత, ఒక్క బెంగాల్ ను మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని, కొవిడ్ సెకండ్ వేవ్ చుట్టేసింది.అయితే నడ్డా, అదేదో ఒక్క బెంగాల్లో మాత్రమే ప్రభావం చూపింది అన్నట్లు, కొవిడ్ కారణంగా ఎన్నికలలో ఓడిపోయామనడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందని బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజమే, నాల్గవ విడత పోలింగ్ ముగిసిన తర్వాత కొవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి పెరింగింది. ఎనికల ప్రచారం ఇంచుమించుగా స్తంభించి పోయింది. అయితే కొవిడ్ ప్రభావం ఒక బీజేపీ ప్రచారాన్నే కాదు, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాల ప్రచారంపై కూడా ప్రతికూల ప్రభావమే చూపింది. అయినా, తృణమూల్ కాంగ్రెస్ 213/294 స్థానాలు గెలుచుకుని వరసగా మూడవసారి, మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరో వంక 200 ప్లస్ అంటూ చివరివరకు ధీమా వొలక పోసిన బీజీపీ, ప్రశాంత్ కిశోర్ సవాలు విసిరిన 100 మార్కును కూడా చేరలేక పోయింది. కేవలం 77 దగ్గరే ఆగిపోయింది. అఫ్కోర్స్, కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఎన్నికలలో బీజీపే 4 నుంచి ఒకే సారి 77 స్థానాలకు చేరి, బెంగాల్ అసెంబ్లీలో తొలిసారి ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందడం మాములు విషయం కాదు. అయితే, ఆశించిన స్థాయిలో బీజేపీ ఫలితాలు సాధించ లేక పోయింది.      అయితే, సంవత్సరం తర్వాత ఇప్పుడు బెంగాల్ ఓటమికి నడ్డా కొవిడ్ ను కారణం చేయడం ఎందుకంటే, అందుకో కారణం ఉందని బీజీపీ నాయకులూ వివరణ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో సహా ఇద్దరు ఎంపీలు,బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ సహా, ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన నేపధ్యంలో, పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు,నడ్డా, అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కొవిడ్ ను కారణంగా చూపారని పార్టీ నాయకులూ అభిప్రాయ పడుతున్నారు. అదలా ఉంటే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకా అన్నట్లుగా ఒకొక్క రాష్ట్రాన్ని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను చుట్టివస్తున్న నడ్డా, బెంగాల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని, పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, నడ్డా రహస్య మిత్ర పక్షం వైసీపీ అధికారంలో ఉన్న ఏపీ సహా ఏ రాష్త్రం వెళ్ళినా, ప్రాంతీయ పార్టీల పాలనలో అవినీతి పెరిగిపోతోందని   ఆరోపణలు గుప్పిస్తునారు. బెంగాల్లోనూ, అధికార పార్టీ అండదండలతో, వ్యాపార లాబీలు, సిండికేట్ పేరిట సాగిస్తున్న అవినీతిని ప్రధానంగా ప్రస్తవించారు. అలాగే, బీజేపీ అవినీతిని సహించదని, అందుకు, దాణా కుంభకోణం కేసులో ఇన్నేళ్ళుగా తిరుగుతున్న లాలు ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడమే నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, బెంగాల్ లోనూ అలాంటి పరిస్థితి వచ్చే రోజు ఎంతో దూరంలో  లేదని హైచ్చారిచారు. అయితే, నడ్డా ప్రకటనను తృణమూల్ కాంగ్రెస్ తప్పుపట్టింది. సీబీఐని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనేందుకు ఇదే నిదర్శనమని ఆరోపించింది. అయితే, తెలంగాణ పర్యటన సందర్భంగా, నడ్డానే హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా ఘాటైన అవినీతి ఆరోపణలే చేశారు., కానీ, చేసిందేమీ లేదని, కేవలం ప్రాంతీయ పార్టీలను ఇబ్బందుల పాలు చేసేందుకే బీజేపీ నాయకత్వం సీబీఐ, ఈడీలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తోందని అంటున్నారు. అయితే, 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తోందని, అందుకు నడ్డా రాష్ట్రాలను చుట్టి వస్తున్న తీరు, ఆయన చేస్తున్న అవినీతి, కుటుంబ పాలన లే నిదర్శనమని అంటున్నారు.

ఈ డెవడండీ బాబూ! జగన్ సర్కార్ తీరుపై జనం సెటైర్లు

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి.. అమ్మ పెట్టా పెట్టదు  అడుక్కు తినా నివ్వదు అన్న చందంగా.. ఉందని విమర్శలు   వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మంగళగిరిలో అన్నా క్యాంటిన్‌ను పోలీసుల సమక్షంలోనే మున్సిపల్ అధికారులు ధ్వంసం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతిది రాజకీయ కోణంలోనే చూడడం..   జగన్ ప్రభుత్వ   స్పెషాలిటి అని మంగళగిరి జనం  సెటైర్లు వేస్తున్నారు.  జగన్ అధికారం కూల్చి వేతలతో ఆరంభమై.. కూల్చివేతలతోనే కొనసాగుతోందని విమర్శిస్తున్నారు.  తొలుత అమరావతి కాదని..మూడు రాజధానులు అన్నారు.... అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయిల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను సైతం   కూల్చివేసిందని.. అదే తరహాలో తాజాగా మంగళగిరిలో అన్న క్యాంటిన్ ధ్వంస రచన జరిగిందని అంటున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ  గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మళ్లీ పోటీ చేయనున్నారు. విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఆ నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలాగే  నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. అక్కడ ఆయన వాలిపోతున్నారు. అలా   ఆ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై దూసుకుపోతున్నారు.  మరోవైపు 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని క్లియర్ కట్‌గా చేప్పేశారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో మరోసారి జెండా ఎగరేయాలని వైసీపీ భావిస్తోంది. దాంతో  మంగళగిరిలో బలమైన అభ్యర్థి కోసం జగన్ భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. మంగళగిరి మాజీ ఎమ్మెల్యను సైతం ఎమ్మెల్సీని చేసి.. పెద్దల సభలో సభ్యుడిగా చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇలా వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు ఏం చేయాలి.. ఎలా ముందుకు కదలాలి.. అనే కోణంలో..  జగన్ యోచిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరిట అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసింది. ఈ క్యాంటిన్ల ద్వారా చాలా తక్కువ ధరకు పేదవారికి కడుపు నిండా బోజనం పెట్టేవారు. అయితే   జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ   క్యాంటిన్లు మూసి వేసింది. అయితే కరోనా సమయంలో పేదలు, సామాన్యలు భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అన్న క్యాంటిన్లు తెరిచి ఉంటే.. ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగే ఉండేదనే ఓ చర్చ అప్పట్లో గట్టిగానే నడిచింది. ఈ నేపథ్యంలో మంగళగిరితోపాటు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురంలో అన్న క్యాంటిన్లు పున: ప్రారంభించారు. అయితే మంగళగిరిలోని అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడం   జగన్ ప్రభుత్వంపై ప్రజల్లోకి ఓ విధమైన తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని అధికార పార్టీలోని కీలక నేతలే పేర్కొనడం గమనార్హం.   Watch video https://www.youtube.com/watch?v=cT58KQ9rS_M

మ‌చిలీ లో వైకాప మ‌చిలీల క‌థ‌!

ఒకే ఇంట్లో వారు ఆనందంగా, ప్ర‌శాంతంగా జీవిస్తార‌నే అనుకుంటాడు కుటుంబ పెద్ద‌. కానీ వూహించ‌ని ప‌రిణామాలు, ప‌రిస్థితులు ప్ర‌శాంత‌త‌ను దెబ్బ‌తీస్తుంది. క‌లిసి జీవించ‌డ‌మూ క‌ష్ట‌మే. ఇపుడు వైకాపాలో ప‌రిస్థితి ఇదే. ఇన్నాళ్లూ అంతా ప‌క‌డ్బందీగా, క‌లిసిమెల‌సి వుంటున్నార‌ని అనుకున్న‌దంతా ఒట్టిదేన‌ని తెలుసున్న‌ది.  అస‌లే ప‌రిస్థితులు బాగాలేద‌నుకుంటుంటే, మ‌చిలీప‌ట్నంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, మ‌చిలీ ప‌ట్నం ఎంపీ వల్ల‌భ‌నేని బాల‌శౌరీ మ‌ద్య విభేదాలు రోడ్డెక్కాయి. వైసీపీలో కీల‌క‌నేత‌గా ఎదిగిన పేర్నినానికి మ‌చిలీప‌ట్నం నియోజ‌వ‌ర్గంలో ఎదురులేకుండా  పోయింది. త‌న మాట చెల్లుబాటు కావా ల‌ని, ఆధిప‌త్య పోక‌డ‌తో వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. కానీ అది మ‌రీ మితిమీరిపోయింది. ఆయ‌న ఆగ‌డాల‌కు అడ్డేలేకుండా పోతోంద‌ని బాల‌శౌరి వ్యాఖ్యానించారు. అదీ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీకి తిరిగే హ‌క్కు లేకుండా పోయింద‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.  ఎంపీగా తాను నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి ప‌రిస్థితులు తెలుసు కోవ‌డం, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినడానికి వీలులేకుండా అడ్డుకోవ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని బాల‌శౌరి ఆ్ర‌గ‌హించారు. నిజానికి ఆయ‌నే పార్టీ వ్య‌తిరేక కార్యక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు బాల‌శౌరి. పార్టీ, ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఇంటింటికి ప్ర‌చారం చేయాల్సింది. కానీ టీడీపీ నేత‌, మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారా య‌ణరావుతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా పేర్ని నానికి ప‌నేంటి అని బాల‌శౌరి ప్ర‌శ్నించారు.  ఎవ‌రు పార్టీకి, ప్ర‌భుత్వానికి అండ‌దండ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు, ఎవ‌రు అస‌లు రంగు బ‌య‌ట పెట్టుకుంటు న్నార‌న్న‌ది వారికి వారే  విభేదాల‌తో  తెలియ‌సేస్తున్నారు. పార్టీకి, అధినేత‌కు విధేయంగా వుంటూ పార్టీ  విజ‌యాల‌కు వెన్నుద‌న్నుగా వుంటామ‌న్న పేర్ని నాని అస‌లు రంగు బ‌య‌ట పెట్ట‌డానికి  తాను మ‌చిలీ ప‌ట్నంలోనే తిష్ట‌వేస్తాను, ఇక్క‌డి నుంచి క‌ద‌ల‌న‌ని శౌరి అన‌డంలో ఆంత‌ర్య‌మూ  అదే కావ‌చ్చు.  

డామిట్ కథ అడ్డం తిరిగింది.. మాజీ హోంమంత్రి సుచరిత ఆవేదన

టైమ్ బాగుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది...అదే బాగు లేకపోతే తాడే పామై కరుస్తుంది. ప్రస్తుతం ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత టైం ఏ మాత్రం బాగోలేదనిపిస్తోంది. మేకతోటి సుచరిత హోంమంత్రి పదవిని కోల్పోయి కేవలం రెండంటే రెండు నెలలయ్యింది. ఈ రెండు నెలలలో ఆమె పార్టీ అధిష్ఠానం నుంచీ, క్యాడర్ నుంచీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవమానాలు భరించారు. ఒక దశలో ఏకంగా ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.  ఆ తరువాత ఎలాగోలా పరిస్థితి సద్దుమణిగిందని అనిపించింది. సుచరిత కోరుకున్నట్లుగా అధిష్ఠానం నుంచి పిలుపూ వచ్చింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే మంత్రి పదవి పోయింది తప్ప మరే ఇతర కారణాలూ లేవనీ హై కమాండ్ ఆమెకు నచ్చ చెప్పింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఉరుములేని పిడుగులా ఆమె భర్త మేకతోట దయాసాగర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇందుకు కారణమేమిటంటే మళ్లీ వైసీపీలోని మేకతోట సుచరిత వ్యతిరేక వర్గమే కారణమని తేలుతోంది. స్వయంగా సుచరితే  ఈ ఆరోపణ చేస్తున్నారు. సుచరిత హోంమంత్రిగా ఉన్న సమయంలో  ఆమె భర్త, ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్  విజయవాడలో ఆదాయపన్ను శాఖలో కీలక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆ  సమయంలో పలువురు వైసీపీ నేతలు స్వయంగా ఐటీ కార్యాలయానికి వెళ్లి దయాసాగర్‌కి పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ శుభాకాంక్షలు చెప్పి ఫోటోలు  దిగారు. అయితే ఆయన స్వరాష్ట్రానికి రావడం.. అదీ కీలక పదవిలో రావడం.. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలకు ఏ మాత్రం నచ్చలేదని సమాచారం. దీంతో వారు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి.. ఓ రాష్ట్రంలో భార్య కీలక మంత్రి పదవిలో ఉండి.. భర్త మరో కీలక పదవిలో ఉండడం చట్టాలకు విరుద్దమంటూ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేయడమే కాదు.. సుచరిత భర్తను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీపై సాగనంపే వరకు సదరు నేతలు నిద్రపోలేదు. ఈ విషయాన్ని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అంతేకాదు.. దయాసాగర్ బదిలీ కోసం ఆ నేతలు ఢిల్లీలోనే  తిట్ట వేసుకుని.. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో దగ్గరుండి మరీ దస్త్రాలు కదిలేలా చేశారనే టాక్.. కూడా అప్పట్లో హాట్ హాట్‌గా నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడింది. కానీ ఈ దయాసాగర్‌కు అక్కడ పని చేయడం సుతరాము ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలో ఆయన వీఆర్ఎస్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇలా దరఖాస్తు చేసుకోవడం.. అలా అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం.. శర వేగంగా జరిగిపోయిందట.       మరోవైపు దయాసాగర్ పదవి విరమణ తర్వాత..  ఆయన్ను లోక్‌సభ లేదా అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని సుచరిత స్కెచ్ వేశారని.. ఆ క్రమంలోనే ఆయన్ని స్వరాష్ట్రానికి రప్పించారని.. ఇక్కడే ఉద్యోగం చేసి... ఇక్కడే పదవి విరమణ చేసిన తర్వాత.. ఆయన్ని రాజకీయాల్లోకి దింపాలని ఈ మాజీ మంత్రిగారు ప్లాన్ సిద్దం చేసుకున్నారని... కానీ ఈ విషయాన్ని ముందే పసిగట్టిన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వైసీపీ    కీలక నేతలు .. దయాసాగర్‌ను బదలీ చేయించే వరకు నిద్రపోలేదనే వార్త వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది.  మరి తాజాగా మాజీ అయిన హోం శాఖ మంత్రి భర్త.. వచ్చే ఎన్నికల్లో ఏదైనా నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబడి.. తన సత్తా చాటి.. తనను బదిలీ చేయించిన  వైసీపీ నేతలకు ఝలక్ ఇస్తారా? అనే చర్చ అయితే ఇప్పడు పత్రిపాడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

జ‌గ‌న్‌కు త‌న‌వారి సెగ‌! ప‌రువు చిత్రం చూపిన మంత్రులు,ఎమ్మెల్యేలు!

అంద‌రూ క‌లిసిక‌ట్టుగా చేయాల‌నుకుని ప్ర‌మాణం చేసుకున్న‌పుడు దానికి క‌ట్టుబ‌డే వుండాలి. కాల‌క్ర‌మం లో అంతా నేనే అంటూ అంద‌రిమీదా పూర్తి అజ‌మాయిషీ చేస్తే పూర్తిగా లొంగిపోయి, భ‌య‌ప‌డుతూ ఎవ‌రు ఎన్నాళ్లు ప‌నిచేస్తారు. ముందు బాగానే వున్నా ఆన‌క అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డుతున్న‌పుడు త‌గు జాగ్ర‌త్త లు తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంలో త‌ప్పులేదు. ఏదో ఒక సంద‌ర్భంలో, ఏదో  ఒక  అంశంపై అభి ప్రాయభేదాలు రావ‌డం, వ్య‌తిరేక‌త‌ను అనాస్త‌త‌ను చూచాయిగా అయినా వ్య‌క్తం చేస్తారు. కానీ  అదీ ప‌ట్టిం చుకోని ప‌రిస్థితుల్లో ఇహ గ‌ట్టిగానే  విన‌ప‌డేట్టు వ్య‌తిరేక‌త వెల్లువెత్త‌డం వారి స్నేహం ఏ స్థాయిలో దెబ్బ తిన్న‌ది స్ప‌ష్టం చేస్తుంది. ఇది మామూలు స్నేహ‌మ‌యితే ఫ‌ర‌వా ఇల్లే.  ఇదంతా జ‌రిగింది ఆంధ్ర‌ప్రదేశ్ సీఎం జ‌గ‌న్ రెడ్డి స‌మ‌క్షంలోనే వారి మంత్రులు, ఎమ్మెల్యేల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు. మొన్న జ‌రిగిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యుల‌తో జ‌రిగిన ప్ర‌త్యేక స‌మావేశంలో రాష్ట్రంలో ప్ర‌భుత్వం తీరు తెన్నులు, వైసీపీ గురించి ప్ర‌జ‌ల్లో వున్న అభిప్రాయంలో తెలుసుకోగోరేరు. కానీ  పార్టీ అధినేత‌, ముఖ్య మంత్రి జ‌గ‌న్ ఉప‌న్యాసంలో మంత్ర‌లు, ఎమ్మెల్యేలు ఊహించిన స్థాయికి ప‌నిచేయ‌డం లేద‌ని కాస్తంత కోప‌గించారు. అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మ‌కుండ‌లేదు. వారూ  ధైర్యం చేసి వారు ఎదుర్కొం టున్న ప‌రిస్థితుల‌ను, అస‌లు ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో వున్న వీరాభిమానం ఏపాటిద‌నేది కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.  జ‌గ‌న్‌కి విన‌డం అంత‌గా న‌చ్చ‌ద‌నేది ఈ సమావేశం బాగా స్ప‌ష్టం చేసింది. త‌న ప‌నితీరు బాగాలేద‌ని ధైర్యం చేసి చెప్పడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కాస్తంత త‌ట‌ప‌టాయించారు. కానీ ఆయ‌న మాత్రం వాళ్ల ప‌నితీరు దారుణంగా వుంద‌ని, వాళ్ల‌మీద విసుక్కోవ‌డానికి అర‌నిమిషం ప‌ట్ట‌లేదు. ఇది వారి మ‌ధ్య సంబం ధాల‌ను బ‌ట్ట‌బ‌యలు చేసింది. పార్టీ టికెట్ ఇవ్వ‌డం, నిల‌బెట్ట‌డం గెల‌వ‌డానికి కావాల్సిన అన్ని స‌దుపా యాలు చేయ‌డం కూడా తానే చేస్తున్న‌పుడు త‌న మాటే వినాల‌ని, త‌ను అనుకున్న ఫ‌లితాలు సాధించ డానికి చ‌మ‌టోడ్చాల‌ని కండిష‌న్స్ పెట్ట‌డం ఎంత‌కాలం ఎవ‌రు భ‌రిస్తారు. ప‌థ‌కాల అమ‌లు ఇత‌ర అం శాల్లో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌, రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టంలో కేంద్రం నుంచి ఎలాంటి మ‌ద్ద తు కూడ‌గ‌ట్టుకోవ‌డంలో వెనుక‌బాటు అన్నీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌వ‌నుకోవ‌డ‌మే జ‌గ‌న్ పొర బాటు. ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించిన‌పుడు వారికి న‌చ్చ‌కుంటే సీఎం అయినా, మంత్రి, ఎమ్మెల్యేల‌యినా ఒక‌టే గ‌దా! మ‌రి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నిరోజులు వారి తాకిడిని త‌ట్టుకోవాలి. వారి వ్య‌తిరేక‌త‌ను, వారి ఆగ్ర‌హా వేశాలు, ప్రశ్న‌ల‌కు సీఎం నుంచి స‌మాధానం అడిగిన‌పుడు సానుకూల, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో అన్ని చ‌ర్చించుకోవాలి. అడ్డంకులు తొల‌గించ‌డానికి, ప్ర‌జ‌ల‌ప‌ట్ల ప్ర‌భుత్వానికి న‌మ్మ‌కం క‌లిగేందుకు  ఏమి చేయా ల‌న్న‌దీ మంత్రులు చేసుకోవాల‌ని ఆ్ర‌గ‌హించి ప్ర‌యోజ‌న‌మేమిటి?  అనేకానేక  అంశాల మీద అభిప్రాయాలు, ప్ర‌శ్న‌లు, అనుమానాలు వ‌చ్చిన‌పుడు వాటికి సీఎంగా, పార్టీ అధినేత‌గా స‌మాధానం చెప్ప‌డం, వారి ఆందోళ‌న‌ను దూరం చేయ‌డం అవ‌స‌రం. అది నా ప‌ని కాదు పొమ్మంటే వారి మ‌న‌సులో వున్న‌మాట‌ను గ‌ట్టిగా వినిపించేట్టే చెబుతారు. స‌రిగ్గా అదే వైసీపీ ఎమ్మ‌ల్యేలు, మంత్రులూ చేసారు.  ఈ సమావేశానికి కారణం  రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగుపరుచుకోవడం తెలుగుదేశం మహానాడు గొప్పగా జరగడం, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగు తమ్ముళ్లు రెచ్చపోయి మాట్లాడుతుండ డం, గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి నిరసనలు ఎదురుకావదు వంటి పరిణామాలు ముఖ్య మంత్రిని ఆలో చనలో పడవేశాయి. చెప్పిన ప్రకారం, చెప్పిన తేదీకి, చెప్పినంత మొత్తం నవ రత్నాల పేరుతో పంచిపెడుతున్నాను కాబట్టి, జనం తనను దేవుడి క్రింద ఆరాధించేర‌ని భావించా రా యన. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపుకు ధోకా వుండదని నమ్మాడు. తెలుగుదేశం వంటి ప్రతిపక్షాలు అదృశ్యమై పోతాయని అంచనా వేసుకొన్నాడు. కానీ ప్రజలలో పరిస్థితి వేరొక రకంగా వుంటంతో ఎమ్మె ల్యేలను అర్జెంట్ గా సమావేశపరచారు.  తన మాట చెప్తే ఎమ్మెల్యేలు హడలిపోయి, పద్ధతులు మార్చు కొంటారు అనుకొన్నాడాయన.కానీ ఈ సమావేశం అట్లా ముగియలేదు. మా సంగతి తర్వాత, ముందు మీరు నడుపుతున్నప్రభుత్వం పట్ల ప్రజల వైఖరి ఎట్లా వుందో తెలుసు కోండి అని ఎదురు బాణాలు సంధించారు ఎమ్మె ల్యేలు. కరెంట్, రోడ్లు, అమ్మఒడి వంటి అంశాలు లేవనెత్తారు. ఇసుక దోపిడీని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటలు వినకుండా తమలో తాము చర్చలకు దిగారు. ఆ చర్చలలో ప్రజలలో ప్రభుత్వం పట్లతీవ్రమైన వ్యతిరేకత వస్తున్నదని, దాన్ని సరిదిద్దుకో వాలని ఉచిత సలహాలు ఇచ్చారు. ఈ తంతుచూసిన ముఖ్యమంత్రి మనసు నొచ్చుకొన్నది. ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద ఆ కోపం నేరుగానే వ్యక్తంచేశారు. ప్రజలలో నా గ్రాఫ్ బాగా వుంది, ఎమ్మెల్యేలుగా మీ తీరు బాగోలేనందు వల్లనే ప్రతి పక్షాలకు అవకాశం లభిస్తున్నదనే భావన వ్యక్తం చేశాడు. కానీ ఎమ్మెల్యేలు  ఆ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రభుత్వం మీదనే ప్రజలు తిరుగుబాటు ప్రకటిస్తున్నారనే  నిశ్చిత అభిప్రాయం ప్రకటించారు. మొత్తం మీద ఎమ్మెల్యేలను బెదరించడానికి సమావేశం జరిపితే, తననే భయపెట్టడాన్ని జీర్ణించు కోలేక పోతున్నాడు ముఖ్యమంత్రి. అందువల్లే ఎమ్మెల్యేలు అడిగిన ఏ ఒక్క కోరికను కూడా తీరుస్తానని హామీ ఇవ్వలేదు. ఆఖరకు ద్వార దర్శనానికి కూడా ఒప్పుకోలేదు. ఈ సమావేశ ప్రతిపాదన తెచ్చింది ప్రశాంత్కి షోర్ తరఫున పార్టీ వ్యూహాలు రచిస్తున్న రిషి రాజాసింగ్. కనీసం 30 మంది ఎమ్మెల్యేలు మళ్లీగెలిచే అవకాశం లేదని నివేదిక ఇచ్చాడట ఆయన.పార్టీ పరిస్థితి వివరిస్తూ ఈ సమావేశంలో పవర్పా యింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. రేపటిఎన్నికలలో వైకాపాను గెలిపిస్తానని దాదాపు 500కోట్ల రూపాయల భారీ ఫీజుతో ఒప్పందం చేసుకొని వున్నాడట ప్రశాంత్ కిషోర్. ఒకవేళ పరిస్థితి వికటించినా తన తప్పు లేదు అని తప్పించుకోవడానికి ఇప్పటి నుంచే ఎమ్మెల్యేల మీద నెపం మోపుతున్నాడు. వారి వ్యూహం ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తే, ఆర్థికంగా బల వంతులైవున్నవారు పార్టీని దెబ్బ తీయకుండా వదలి పెట్టరు. అట్లని వారికే మళ్లీ టిక్కెట్లు ఇస్తే జనం మెచ్చరు.ముందుకు పోవాలన్నా, వెనక్కు రావాలన్నా ఇరకాటం తప్పడం లేదు ముఖ్యమంత్రికి. మొత్తానికి వైకాపా అధినేతని ఒక వంక  పి.కె. ఆక‌ట్టుకుంటుంటే.. సిటింగ్ ఎమ్మెల్యేల సంగ‌తి ఆందోళ‌న పెడుతోంది.

పొత్తు పొడుపుల రంధి ఏల.. జనక్షేత్రంలో తేల్చుకుంటే పోలా..!

ఏపీలో ప్రస్తుతానికి పొత్తుల చర్చకు విరామమే. జగన్  పాలనను జన క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. పొత్తులపై చర్చలు, సంప్రదింపులు అన్నీ జనం మూడ్ ను బట్టేనన్న స్పష్టమైన అవగాహనతో తెలుగుదేశం జనసేనలు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. జన సేన అయితే బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నామన్న సంకేతాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీని పక్కన పెట్టి ఏపీలో రాజకీయ హడావుడి జోరందుకుంది. ముందస్తు ఎన్నికలు తథ్యమన్న అంచనాలతో రాజకీయ నాయకులు ప్రజా క్షేత్రంలోకి వెళుతున్నారు. జనం నాడిని పట్టుకోవడం, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు ఇప్పటికే ప్రజలలో గూడుకట్టుకుని ఉన్న ప్రజా వ్యతిరేకతను అలాగే కొనసాగేలా ఉంచడం, మరింత పెంచడం లక్ష్యంగా పార్టీల నాయకుల పర్యటనలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత తన రాష్ట్ర వ్యాప్త పర్యటనను నిరాటంకంగా ఏడాది పాటు కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరు నెలల పాటు బస్సు యాత్ర పేరిట జనంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు పర్యటనలకు రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు అయ్యింది. తెలుగుదేశం శ్రేణులు తమ అధినేత పర్యటన ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. వేసవి ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఇక రాజకీయ వేడి పెంచేయడమే లక్ష్యంగా చంద్రబాబు జగన్ పాలనపై చంద్ర నిప్పులు చెరుగనున్నారు. పవన్ కల్యాణ్ కూడా జగన్ పాలన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్న విమర్శలతో చెలరేగనున్నారు. నిన్న మొన్నటి దాకా పొత్తు పొడుపులు, షరతులు, ఆప్షన్స్ అంటూ జరిగిన చర్చకు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఫుల్ స్టాప్ పెట్టేశాయనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఈ నెల 15 నుంచి చంద్రబాబు రాస్ట్ర పర్యటన ప్రారంభం కానుంది. గతంలో మీకోసం పాదయాత్రలో చంద్రబాబు రాష్ట్ర వ్యమాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అప్పట్లో కవర్ చేయని ప్రాంతాలను కూడా ఈ సారి యాత్రలో కవర్ చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు తన పర్యటన ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక నెలలో రెండు లేదా మూడు జిల్లాలలో పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఆ సందర్భంగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి జిల్లాలోనే మినీ మహానాడు నిర్వహించి తద్వారా కార్యకర్తలలో ఉత్సాహం నింపేలా వ్యూహం రూపొందిచారు. ఈ విధంగా ఏడాదిలో మొత్తం 80 నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. అదే సమయంలో పార్టీ కార్యకలాపాలకు ఏ విధంగానూ అవరోధం కలగకుండా సమాంతరంగా ఆ పనులు కూడా నిర్వహించేలా సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.  అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏకబిగిన ఆరు నెలల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలలో ఎండగట్టాలని నిర్ణయించారు. బీజేపీతో మైత్రికి ఇక చెల్లు చీటీయేనని జనసేనాని దాదాపుగా ఒఖ నిర్ణయానికి వచ్చేసినట్లు ఆయన  తీరును బట్టి అవగతమౌతుంది.  ఆ నేపథ్యలోనే బీజేపీతో చెలిమిని పక్కన పెట్టి తిరుపతి నుంచి తన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి పవన్ యాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5 దసరా నుంచి పవన్‌ పర్యటన తిరుపతి నుంచి ప్రారంభం కానుంది   ఆరునెలల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటన సాగేలా జనసేన శ్రేణులు షెడ్యూల్ రూపొందిస్తున్నాయి.  ఏపీలో విపక్షాల మధ్య పొత్తు వ్యవహారం కూడా టీడీపీ-జనసేన అధినేతల పర్యటన తర్వాత ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. తమ పర్యటనల్లో జనం నాడి, ప్రభుత్వంపై ప్రజల స్పందన, తమ పార్టీ బలాబలాలు బేరీజు వేసుకున్న తర్వాతనే రెండు ప్రధాన పార్టీలూ పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అధినేతల బహిరంగసభలకు వచ్చే ప్రజల స్పందన, ఆయా పార్టీ నేతల బలనిరూపణ వంటి అంశాలు పరిశీలించిన తర్వాత పొత్తులపై పూర్తి స్పష్టత రానుంది. ఏపీలో రాజకీయం పార్టీల కార్యాలయాలను వదిలి ప్రజాక్షేత్రంలో పరీక్షకు నిలబడుతోంది.  

రాష్ట్రపతి ఎన్నిక.. ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు

కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. వచ్చే ఎన్నికలలో రాణించి పార్టీకి పూర్వ వైభవం తెచ్చుకోవాలంటే రాష్ట్రపతి ఎన్నికలలో ఏదో మేర ప్రభావం చూపించాల్సిందేనని తలపోసిన సోనియా గాంధీ బీజేపీయేతర రాజకీయ పార్టీలతో చర్చలకు ఉపక్రమించారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆమె రంగంలోకి దిగారు. ఒక వైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తమ అభ్యర్థిని సొంతంగా గెలిపించుకునే మెజారిటీ లేకపోయినా షెడ్యూల్ విడుదలకు ముందే కసరత్తు ప్రారంభించేసింది. ఇప్పుడు షెడ్యూల్ వెలువడిన అనంతరం కాంగ్రెస్ అధినేత్రి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్ పార్టీల అధినాయకత్వానికి స్వయంగా ఫోన్ చేసి సంప్రదింపులు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్మర్థిని పోటీలో నిలబెట్టే విషయంలో చర్చలు జరిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ కరోనాతో బాధపడుతూ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కారణంగా ఆమె ప్రయత్నాలను ఫోన్ చర్చలకు  మాత్రమే పరిమితమైనా తదుపరి బాధ్యతను రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో కలిసి వచ్చే పార్టీలతో సంప్రదించేందుకు మల్లికార్జున్ ఖర్గే ఇక రంగంలోకి దిగుతారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. శరద్ పవార్ తో సోనియా ఫోన్ లో మాట్లాడిన అనంతరం ఖర్గే ముంబైలో శరద్ పవార్ తో భేటీ అయ్యారు. అలాగే డీఎంకే, టీఎంసీ, శివసేన పార్టీల అధ్యక్షులతోనూ త్వరలో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ యేతర పార్టీలన్నిటితో చర్చించి రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామనీ, ఆ అభ్యర్థి ఎవరన్నది పార్టీలతో చర్చల తరువాత ప్రకటిస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీయేతర పార్టీలకు నేతృత్వం వహించి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే లేదు. ఎన్నికలలో వరుస ఓటములతో ఎలక్టోరల్ కాలేజీలో ఆ పార్టీకి ఉన్న ఓట్ల విలువ బహుస్వల్పం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే కొన్ని ప్రాంతీయ పార్టీలకే ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓటు విలువ ఉంది. దీంతో ఉమ్మడి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ చర్చల ప్రక్రియ ప్రారంభించినా.. నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితిలో అయితే లేదు. ఇక బీజేపీయేతర పార్టీలు అన్నీ ఒకే గూటి కిందకు రావడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వడం అన్నది ఖాయమైంది. అలాగే ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ కూడా ఎన్డీయే అభ్యర్థివైపే మొగ్గు చూపుతుందన్న స్పష్టత ఇచ్చేసింది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో తన వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ వెల్లడించకపోయినా.. ఆ పార్టీ అధినేత చొరవ తీసుకుని ముందుగా చేసిన ప్రయత్నాలకు స్పందన కరవవ్వడంతో ఆయన ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఆ పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఏదో విధంగా రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్ఎస్ దూరంగా ఉండేలా ఆయన నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జులై 24వ తేదీతో పూర్తి కానుంది.   జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను అదే నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 4,809 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో రాజ్యసభ ఎంపీలు 233 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది, ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ జారీ చేసేందుకు ఏ రాజకీయ పార్టీకి అధికారం లేని కారణంగా ఎన్డీయే పక్షాలు కూడా ఆత్మప్రభోదం మేరకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నది. సాక్షాత్తూ బీజేపీలోనే మోడీ విధానాలను, వైఖరిని వ్యతిరేకించే ఎంపీల సంఖ్య అధికంగానే ఉందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఇదేం పోయే కాలం..గుర్తింపు కోసం ఈ పిచ్చి చేష్టలేంటి?

వెర్రి వేయి విధాలు అన్నారు పూర్వీకులు.. కానీ ఇప్పటి సామాజిక మాధ్యమంలో కనిపిస్తున్న వేలం వెర్రిగాళ్ల వ్యవహారం చూస్తే వేయి ఎన్ని విధాలో ఏ గణిత మేధావీ కూడా గణించలేడని తేల్చేసే వారేమో. వ్యూలూ, లైకుల పిచ్చి కొందరిలో పీక్స్ కు వెళ్లిపోయింది. అందు కోసం ఎంత పిచ్చి పని చేయడానికైనా వారు వెనుకాడటం లేదు. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు..నవ్వితే, నచ్చిందన్న లైక్ కొడితే చాలు అన్నట్లుగా వారి వేలం వెర్రి ముదిరిపోయింది. సరిగ్గా అలాంటిదే ఈ 44 ఏళ్ల యూట్యూబర్ చేసిన పని. సైఫుల్ ఆరిఫ్ అనే 44 ఏళ్ల వ్యక్తి ఇండోనేసియా నివాసి. అతగాడికి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పేసుకోవాలనే పిచ్చి కోరిక పుట్టింది. దానికి ఏం చేయాలని ఆలోచించాడు. సామాజిక మాధ్యమంలో ఇప్పటి వరకూ ఎవరూ చేయని వింత పని ఒకటి చేస్తే చాలనుకున్నారు. అంతే చేసేశాడు. దానికి యూట్యూబులో అప్ లోడ్ చేసేశాడు. అంతే అతను పోస్టు చేసిన వీడియో యూట్యూబ్ లో క్షణాల్లో వైరల్ అయిపోయింది. నవ్వుకున్నా, తిట్టుకున్నా, ఇదేం పొయె కాలంరా బాబూ అని నెటిజన్లు కామెంట్లు పెట్టినా సైపుల్ ఆరీఫ్ కు మాత్రం వెంటనే గుర్తింపు వచ్చేసింది. అతగాడు కోరుకున్నది అదేగా మరి. అందుకే తెగ హ్యాపీ ఫీలైపోతున్నాడు. ఇంతకీ అతడు ఇందు కోసం ఏం చేశాడో తెలుసా?.. పెళ్లి చేసుకుని ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. పెళ్లి వీడియో పోస్టు చేస్తే ఎందుకు అంత వైరల్ అవుతుందని ఆశ్చర్యపోకండి. పెళ్లిళ్లలో పెళ్లి కూతురు డాన్స్ చేస్తేనే వైరల్ అయిపోతున్న రోజులివి. అందుకే అతడు మనిషిని కాకుండా ఒక మేకను పెళ్లి చేసుకున్నాడు. సంప్రదాయ బద్ధంగా వివాహ క్రతువు జరిపించుకుని మేక మెడలో తాళి కట్టాడు. మేకకు కన్యాశుల్కం కింద సొమ్మ కూడా చెల్లించాడు. అతడి పిచ్చి పనికి నెటిజన్లు నవ్వుకున్నారు. తిట్టుకున్నారు. ఏమైతేనేం మొత్తానికి అతగాడికి లక్ష్యం నెరవేరింది. గుర్తింపు వచ్చేసింది.  

సముద్ర గర్భంలో అపార పసిడి నిక్షేపం!

సముద్రాన్ని ఏ క్షణంలో చూసినా అదో కొత్తదనం, అదో అద్భుతం.. సముద్ర తీరంలో ఎన్ని గంటలు గడిపినా..ప్రతి గంటా, ప్రతి నిముషం, ప్రతి క్షణం అలల కదలికలో, ఆటుపోట్లలో ఓ కొత్తదనం కనిపిస్తుంది. ఓ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. అలాంటి సముద్ర గర్భంలో మరెన్నో వింతలూ, అద్భుతాలు ఉన్నాయని పర్యావరణ నిపుణులు చెబుతూనే ఉంటారు. వేల ఏళ్ల కిందటి నిధులనూ, నిక్షేపాలనూ, రహస్యాలనూ కూడా సముద్రం తన గర్భంలో అతి పదిలంగా కాపాడుతుంటుందనడానికి తాజా సాక్ష్యమే ఇటీవల అధికారులు గుర్తించిన భారీ పసిడి గని, . సముద్ర గర్భంలో కొలంబియా అధికారులు గుర్తించిన పసిడి నిథి విలువ దాదాపు 17 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఆ నిథి ఎప్పుడో 1708లో స్పానిష్ యుద్ధ సమయంలో మునిగిపోయిన రెండు ఓడలలో తరలిస్తున్న బంగారంగా అధికారులు భావిస్తున్నారు.  అప్పట్లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ నౌకల దాడిలో మునిగిపోయిన ఓడల తాలూకు శిథిలాలను ఇప్పుడు గుర్తించారు. ఆ శిథిలాలలోనే భారీ బంగారు నిక్షేపాన్నీ గుర్తించారు. సముద్ర గర్భంలో దాదాపు మూడు వేల అడుగుల లోతున ఈ నిక్షేపం ఉన్నట్లు గుర్తించారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఈ బంగారు గనిని వెలికి తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అదేమంత తేలికైన పని కాదని నిపుణులు అంటున్నారు.

మహాలో శివసేన, ఎంఐఎం భాయి భాయి!

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు అన్నది నానుడి. అలాగే శత్రువుకు శత్రువు మిత్రుడు అని కూడా అంటారు. సరిగ్గా అలాగే జరుగుతోంది మహారాష్ట్రలో. దేశంలో ముస్లింల సంక్షేమం, భద్రత కోసం పుట్టిన పార్టీ  ఎంఐఎం.  దేశంలో హిందువుల ఐక్యత అంటూ పని చేస్తున్న పార్టీ శివసేన. అయితే ఈ రెండు పార్టీలూ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కలిసాయి. ఈ రెండు పార్టీలూ తమతమ పార్టీల సిద్ధాంతాలను ఏమీ మార్చుకోలేదు. కానీ కలిశాయి. అందుకు ప్రాతిపదిక రాజ్యసభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ఓడించాలన్న ఏకైక లక్ష్యమే. రెండు పార్టీలకూ బీజేపీతో పొసగడం లేదు. బీజేపీ-ఎంఐఎం పార్టీల మధ్య వైరుధ్యం తెలిసిందే. విమర్శలూ, ప్రతి విమర్శలు ఇరు పార్టీల మధ్యా సర్వ సాధారణం. ఎప్పుడూ ఇరు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉంటుంది. ఇక శివసేన విషయానికి వస్తే.. మౌలికంగా శివసేన, బీజేపీ రెండు పార్టీలదీ హిందుత్వ అజెండాయే అయినా రెండూ సుదీర్ఘ కాలం పొత్తులతో సాగినా మోడీ హయాంలో రెండు పార్టీల మధ్యా చెడింది. బీజేపీ బిగ్ బ్రదర్ షో ను శివసేన సహించలేకపోయింది. అందుకే సైద్ధాంతికంగా పెద్దగా తేడా లేకపోయినా రెండు పార్టీల దారులూ వేటికవి అయిపోయాయి.   మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమికి నేతృత్వం వహిస్తూ రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం ఆ కూటమితో చేతులు కలిపింది. రాజకీయ పార్టీల మధ్య రాజకీయ అవసరాలకి తగ్గట్టుగా నిర్ణయాలు, పొత్తులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.  అందులో భాగంగానే శత్రువుకు శత్రువు అన్న చందాన ఎంఐఎం శివసేనతో చేతులు కలిపింది. మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికలలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇరు పార్టీలూ ఏక మార్గంలోకి వచ్చాయి. దీంతో ఎంఐఎం రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ పరాజయం కోసం శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థిగా రంగంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం సభ్యులు ఓటేస్తారు. ఈ విషయాన్ని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్వీట్ చేశారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. శివసేనతో తమ సైద్ధాంతిక విభేదాలు అలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు.  ఒక్క రాజ్యసభ ఎన్నికల కోసమే ఆ పార్టీతో తాము చేతులు కలిపామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు నిన్న అంటే జూన్ 10న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఏడుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు.   సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పార్టీలు చేతులు కలపడం ఇదేం కొత్త కాదు. గతంలో బీజేపీ స్వయంగా ఈ పని చేసింది. జమ్మూ కాశ్మీర్ లో అధికారం పంచుకోవడానికి మెహబూబా ముఫ్తి నేతృత్వంలోని ప్రొగ్రసివ్ డెమెక్రటిక్ ఫ్రంట్ తో చేతులు కలిపింది.

వైసీపీ నుంచి విజయమ్మ ఔట్?

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు  విజయమ్మ... తన గౌరవాధ్యక్షురాలి పదవి రాజీనామా చేయడం ఖాయమేనా? అందుకు కౌంట్ డౌన్ మొదలైందా? మరి కొద్దిరోజుల్లో ఆమె ఆ పదవికీ రాజీనామా చేసి... హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, తన కుమార్తె వైయస్ షర్మిల వద్దే ఉండనున్నారా? అంటే వైసీపీ వర్గీయుల నుంచి అవుననే సమాధానం వస్తోందీ.  వచ్చే నెల 8, 9 తేదీల్లో అధికార వైసీపీ ప్రతిష్టాత్మంగా నిర్వహించనున్న ప్లీనరీ వేదికగా ఆమె తన పదవికీ రాజీనామా చేయనున్నారని సమాచారం. విజయవాడ - గుంటూరు జాతీయ రహదారిపై ఆచార్య నాగార్జున నగర్ సమీపంలోని మైదానంలో  ప్లీనరీ నిర్వహించాలని వైసీపీ ఇప్పటికే నిర్ణయించింది. ఆ క్రమంలో అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభకానున్నాయని తెలుస్తోంది. ఈ సభను జయప్రదం చేసేందుకు ఇప్పటికే.. ఆ పార్టీ అగ్రనేతలు దృష్టి సారించారు. 2017, జులై 8న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్లీనరీని నిర్వహించిన సంగతి తెలిసిందే.   నాటి ఈ సభకు భారీగా ప్రజలు తరలి రావడమే కాదు...ఈ సభా వేదికపైన వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల కూడా ఉన్నారు.   కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో   షర్మిల,  విజయమ్మ.. హైదరాబాద్ కు పరిమితమైపోయారు. ఆ క్రమంలో   వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి.. ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తోంది. దీంతో దాదాపుగా  జగన్‌కు సోదరి, తల్లిలతో గ్యాప్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో వీరిద్దరు ఎడముఖం పెడ ముఖంగా ఉంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితిలో.. రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉంటూ.. అధికారంలో ఉన్న ఓ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగడం భావ్యం కాదనే ఆలోచనలో   విజయమ్మ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే తన పదవికీ రాజీనామా చేసి..  గౌరవంగా ఫ్యాన్ పార్టీ నుంచి  తప్పుకోవాలని ఆమె భావించారని.. ఇదే విషయాన్ని తన కుమారుడు సీఎం వైయస్ జగన్ వద్ద   విజయమ్మ ప్రస్తావించగా.. ప్లీనరీ వరకు వేచి ఉండాలంటూ   జగన్  సూచించినట్లు గతంలో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో జూలై 8వ తేదీన తన పదవికీ విజయమ్మ రాజీనామా ప్రకటిస్తారని తెలుస్తోంది. మరోవైపు.. ఈ ప్లీనరీకి ఎలాగో వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు   షర్మిల రారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో  విజయమ్మను  ప్లీనరీకి  షర్మిలా పంపుతారా? అంటే సందేహమే అనే చర్చ కూడా  వైసీపీలో జరుగుతోంది. ఏదీ ఏమైనా గతంలో వైసీపీ  ప్లీనరీకే కాదు.. నాడు ప్రతిపక్ష నేతగా   జగన్ చేపట్టిన పాదయాత్రకు సైతం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులే కాదు.. పలు వర్గాల ప్రజలు కూడా జగన్ కు, ఆయన పార్టీకీ దూరమయ్యారన్న సంగతి విదితమే. అలాంటి పరిస్థితుల్లో  జగన్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్లీనరీకి జనం పొటెత్తుతారా? అంటే సందేహమే అని వైసీపీలోని ఓ వర్గం బల్లగుద్దీ మరీ చెబుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఎంతగా దోహదం చేశారో.. అంతగా   విజయమ్మ,  షర్మిల కూడా  తోడ్పాటునందించారు. కానీ నేడు.. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ఫ్యాక్ సంస్థతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రుషి రాజ్ సింగ్ .. జగన్ వెంటనే ఉన్నారు. కానీ   విజయమ్మ,  షర్మిలలు.. జగన్ వెంట లేకపోవడం  పెద్ద లోటేనని ఫ్యాన్ పార్టీలోని ఆ వర్గం  నేతలు అభిప్రాయపడుతున్నారు.   రానున్న ఎన్నికల్లో.. తల్లి చెల్లి లేకుండా జగన్ నెగ్గుకురాగలరా అంటే ఏమో అని ఆ పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేయడం పలు సందేహాలకు తావిస్తున్నట్లవుతోందని రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొనడం గమనార్హం.

కేసీఆర్ సంచలన ప్రకటన ఎప్పుడో?

తెలంగాణ ముఖ్యమత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించి చాలా రోజులైంది. బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపి హైదరాబాద్ తిరిగొచ్చే సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కుమార స్వామి కూడా ఇంచు మించుగా అలాంటి ప్రకటనే చేశారు. కేసేఆర్ త్వరలోనే ‘సంచలన’ ప్రకటన చేస్తారని చెప్పారు. ఆ సమయంలో కేసీఆర్, చేసే ‘సంచలన’ ప్రకటన రాష్ట్రపతి ఎన్నికలకు సంబందించే ఉంటుందని ఉహాగానాలు వినవచ్చాయి. అయితే, బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్, జాతీయ రాజకీయాల గురించి ఎలాంటి ముందడుగు వేయలేదు. అప్పటి నుంచి, ఆయన ఫార్మ్ హౌస్’కే పరిమిత మయ్యారు. ఇంచుమించుగా పక్షం రోజులకు పైగానే కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు, వినిపించనూ లేదు.  అయితే, రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన నేపధ్యంలో కేసీఆర్ ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ప్రగతి భవన్’ లో ముఖ్య నేతలతో సమా వేసమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కీలక సమావేశం’ లో రాష్ట్రపతి ఎన్నిక, జాతీయ రాజకీయాలపై చర్చిస్తారా లేక రాష్ట్రంలో, ‘సంచలనం’ గా మారిన, జూబ్లీహిల్స్ మైనర్ బాలిక, సాముహిక అత్యాచారం కేసు సహా, ఇతర రాజకీయ, పాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారా,అనే విషయంలో స్పష్టత రావాల్సి వుంది. జుబ్లీహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో అధికార పార్టీ, మిత్ర పక్షం నాయకుల పిల్లలు పాత్రపై  రచ్చ జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. ఒక్క ముఖ్యమంత్రి అనే కాదు, అధికార పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. ఒక విధంగా ఈ కేసు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చివరకు ఇలాంటి ‘సంచలన’ సంఘటనల పై ‘సంచలన’ వ్యాఖ్యలు చేసే సినిమా డైరెక్టర్ వర్మకూడా ట్విటర్’ వేదికగా సర్కార్’కు  గట్టిగా చురకలు అంటించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు జోక్యం చేసుకోకపోయుండే, అసలు దోషులు, ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన ముద్దాయి, ‘ఎమ్మెల్యే గారబ్బాయి... తప్పించుకునే వారని వర్మ ట్వీట్ చేశారు. నిజానికి, ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగినా, అధికార పార్టీ పై పడిన మచ్చ మాత్రం అలాగే వుంది.  నిజానికి, రోజులు గడుస్తున్న కొద్దీ, ఈ కేసులో ప్రధమ ముద్దాయి ప్రభుత్వం అనే అభిప్రాయం మరింతగా బలపడుతోందని, పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంటే, జుబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసు  నేపధ్యంగా, గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, మహిళా దర్బార్ నిర్వహించారు. ఈ దర్బార్’లో వచ్చియన్ ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుతాన్ని వివరణ కోరతామని ఆమె చెప్పారు.అయితే, రాష్ట్ర ప్రభుతాన్ని వివరణకోరివదిలేస్తే, ఓకే, కానీ, సంవత్సర కాలంగా, రాజభవన్, ప్రగతి మధ్య ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం సాగుతున్న నేపధ్యంలో  ఆమె అంతటితో అగుతారని అనుకోలేమని, మహిళా దర్బార్’ లో అందుకున్న ఫిర్యాదులను కట్టకట్టి కేంద్రానికి పంపుతారని, అందుకే ముఖ్యమంత్రిలో కదలిక వచ్చిందని అంటున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. అజెండా రాష్ట్రపతి ఎన్నికేనా?

హమ్మయ్య కేసీఆర్ సుదీర్ఘ మౌనముద్ర వీడారు. శుక్రవారం ఆయన మంత్రులతో, ఎమ్మెల్యేల  తోసమావేశం అవుతున్నారు. పార్టీ వ్యవహారాల కోసమేనని చెబుతున్నప్పటికీ, రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన విధానం ఏమిటన్నదానిపైనే ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.  బీజేపీ (ఎన్డీయే) అభ్యర్థిని ఓడించడమే లక్ష్యం అంటూ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన కేసీఆర్ ఆ తరువాత ఎందుకో నిరుత్సాహ పడ్డారు. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవని భావించి చప్ప బడిపోయారు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు మకాం మార్చేసి మౌనమునిలా మారిపోయారు.  మాటల మాంత్రికుడిగా, మాటలతో ఎటువంటి వారినైనా నిరుత్తురలను చేయగల సమర్ధుడిగా పేరొందిన కేసీఆర్ మౌనంతో తెలంగాణలో ఒక విధమైన నిశబ్దం తాండవిస్తోందా అనిపించే వాతావరణం నెలకొంది. దీనికంతా కారణం జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్ చేసిన యత్నాలు అంతగా ఫలించకపోవడమేనని పరిశీలకులు సెటైర్లు వేసినా కూడా పట్టించుకోలేదు.  గత కొద్ది కాలంగా విపక్షాల విమర్శలకు సైతం ఆయన మౌనమే సమాధానంగా ఉంటోంది. ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చ కోసమే ఆయన పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అయ్యారు. కాగా ఇప్పటికే ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్నది నిర్ణయించేశారనీ, దానిని వివరించడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. పైకి ఏం చెబుతున్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజర్ కావడమే తెరాస నిర్ణయంగా ఉంటుందని, అదే అధినేత కేసీఆర్ నిర్ణయమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఏమిటి అన్న ఉత్కంఠకుమరి కొద్ది సేపటిలో తెరపడనుంది.   టీఆర్ఎస్ ఈ ఎన్నికను బహిష్కరించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి.   ఇప్పటికే వైసీపీ, బీజేడీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయన్నది ఖాయమైన నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం అయనా, బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేసినా పెద్దగా ఫరక్ ఉండదు కానీ,   టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడమంటే బీజేపీకి మద్దతు ఇచ్చినట్లేనని పరిశీలకులు అంటున్నారు. అయితే టీఆర్ఎస్ ఓటింగ్ కు దూరం కావడానికి ఓ అడ్డంకి ఉంది. అదేమిటంటే రాష్ట్రపతి ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులందరూ తప్పని సరిగా ఓటు వేయాలన్న నిబంధన. ఆ నిబంధన నుంచి తప్పించుకుని ఓటింగ్ కు గైర్హాజరయ్యే మార్గాల గురించి కూడా కేసీఆర్ పార్టీ ఎంపీలు,  ఎమ్మెల్యేల సమావేశంలో చర్చంచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.  ఎన్డీయే కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడం బీజేపీకి ఎంత ముఖ్యమో, బీజేపీ ఆధిక్యతను నిరోధించే యత్నం కాంగ్రెస్ కు ఎంత ప్రధానమో, తనదైన ప్రత్యేకతను కల్పోలేదని చాటుకోవడానికి రాష్ట్రపతి ఎన్నిక    కేసీఆర్ కూ అంతే ముఖ్యం. బీజేపీ యేతర అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవడం అంటూ శతధా ప్రయత్నించిన కేసీఆర్ ఒకానొక దశలో కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెడితే టీఆర్ఎస్ బేషరతు మద్దతు ఇస్తుందంటూ ప్రతిపాదించేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే అది కూడా కుదరకపోవడంతో ఉమ్మడి అభ్యర్థి ఆమోదయోగ్యమైతేనే ఓటు అంటూ ఒ మెట్టు వెనక్కు తగ్గారు. దాంతోనే ఆయన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో గైర్జాజర్ విధానానికే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషణలు చేశారు. ఇక ఇప్పుడు పార్టీ ప్రజా ప్రతినిథులతో సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా .. టీడీపీదే జయం ..విజయం ఎలైట్ ముందస్తు సర్వే చెప్పిన నిజం

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక విధమైన గందరగోళం ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లేదు. ప్రజాభిప్రాయం చాల స్పష్టంగా వుంది ... ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని, ఒక్క అవకాశం కోసం అదే పనిగా ప్రాధేయపడిన, జగన్మోహన్ రెడ్డికి జనం 2019లో ఒక అవకాశం ఇచ్చారు.. కానీ, మూడేళ్ళ తర్వాత ఇప్పుడు, జగన్ రెడ్డి మాట నిలుపుకున్నారా? అద్భుతాలు సాధించారా? రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్ళరా అంటే ... జనం పెదవి విరుస్తున్నారు. అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. 2019 ఎన్నికలలో తాము తీసుకున్న నిర్ణయం తప్పని, ఏకంగా 47.37 శాతం మంది ఓటర్లు స్పష్టం చేశారు. వైసీపే ప్రభుత్వం తమ ఆశలను వమ్ము చేసిందని చెప్పు కొచ్చారు. 38.46 శాతం మంది మాత్రమే, తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. తప్పును ఒప్పుగా పేర్కొన్నారు. మరో 14.16 శాతం మంది అటూ ఇటూ కాకుండా ఉన్నారని  ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది.   ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి సామర్ధ్యం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీల పనితీరు, ప్రాధాన్యతలు, సమర్ధ్య  నాయకత్వం.. ముఖ్యమంత్రి, చివరకు ఈ సారి ఓటేవరికీ .. అనే విభిన్న ప్రశ్నల ప్రామాణికంగా, ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ నిర్వహించిన సర్వేలో  ఏపీ ఓటర్లు, క్లియర్ కట్’ గా వైసీపెకి వ్యతిరేకంగా తీర్పు నిచ్చారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు నాయకత్వాని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ సర్వే మరో మారు సపష్టం చేసింది.    ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 ( 20.02.2022) నుంచి మార్చి 05, 2022 వరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 35 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 350  పోలింగ్ బూతుల పరిధిలో అన్నివర్గాలకు చెందిన 10, 500 మంది ఓటర్లను వ్యక్తిగతం ఇంటర్వ్యూ చేసి, Stratified Random Sampling, పద్దతిలో  సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా తెస్సుకుని రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల పరిస్థితిని విశ్లేషిస్తే, ఎన్నికాలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ తరిగి అధికారంలోకి రావడం తధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా, ఏపీ పోటీ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది మూడో పార్టీకి అవకాశం లేదని విష్యం కూడా సర్వే స్పష్టం చేసిద్నై విశ్లేషకులు అంటున్నారు. మూడో స్థానంలో ఉన్న జన సేనకు మొదటి రెండుస్థానల్లో ఉన్న టీడీపీ, వైసీపీలకు మధ్య ఏ ప్రమాణం ఆధారంగా చూసినా గ్యాప్ .. భారీగా.. భయంకరంగా ఉందని, అందుకే, ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే ఉంటుంది.. అంతిమంగా టీడీపీ విజయం సాధిస్తుందని అంటున్నారు.  ఈ సర్వే ఫలితాల ప్రకారం, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ కొంచెం అటూ ఇటుగా ప్రభుత్వ వ్యతిరేక పస్పుటంగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం మాకొద్దు’ అనే మాటే మూడు ప్రాంతాల్లో వ్యక్తమైంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజాక వర్గాలకు గానూ, 35 నియోజకవర్గాల పరిధిలోని 10,500 ని సర్వే చేస్తే అందులో,  కేవలం 2635 (25.09 శాతం) మంది మాత్రమే ప్రభుత్వ పనితీరు పట్ల సంపూర్ణ సంతృప్తిని వ్యక్తపరిచారు, మరో 2067 (19.68 శాతం) మంది ఫర్వాలేదని పెదవి విరిచారు. మరో 3321 (31.63 శాతం) మంది .. అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే, 2477 (23.59 శాతం) మంది అయితే, ఛీ ..ఛీ అంటూ సంపూర్ణ అసంతృప్తిని వ్యక్తపరిచారు.   పార్టీల పరంగా చూస్తే, 4515 (43 శాతం)  ఓట్లతో తెలుగు దేశం పార్టీ  ప్రధమ స్థానంలో వుంది. వైసీపీ, 4111 (39.15 శాతం) ఓట్లతో రెండవ స్థానంలో వుంది. మూడవ స్థానంలో నిలిచిన జనసేనకు 1103 (10.50 శాతం) ఓటర్లు, ఫోర్త్ ప్లేస్’లో నిలిచిన బీజీపీకి 135 (1.28 శాతం) ఓటర్లు మద్దతు పలికారు. అంటే, ప్రస్తుత పరిస్థితిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచినా టీడీపీకి వైసీపీ కంటే 3.85 శాతం ఓట్లు అధికంగా పోలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.   అదే విధంగా, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందని అడిగితే,చంద్రబాబు నాయుడు సిఎం కావాలని,4506 మంది అంటే 42.91 శాతం మంది కోరుకుంటున్నారు.కేవలం 39.09 శాతం (4102)  మంది మాత్రమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమత్రి కావాలని కోరుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారు, 1112 మంది మాత్రమే, అంటే కేవలం 10.59 శాతం మంది మాత్రమే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.ముఖ్యమంత్రి  రేసులో ఉన్నామని అనుకుంటున్న మిగిలిన అందరికీ కలిపి 7.44 శాతం ( 782) మంది ఓటేశారు.  ఈ ఫలితాలను బట్టి చూస్తే, వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల జనాలకు మూడేళ్ళకే ముఖం మొత్తిందనే విషయం స్పష్టమవుతోందని సర్వే విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, అన్ని సర్వేలలోలానే, ఈ సర్వే లోనూ ఫలితాలు  ప్లస్ ఓర మైనస్ 3 శాతం అతూ ఇటు అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.  ఇదిగాక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రజలు ఆందోళన చేడుతున్నారని సర్వేలో సప్ష్టమైంది. మొత్త 10, 50౦ మందిలో 28. 36 శాతం మంది  రాష్ట్ర రాజకీయాలు చాల చాల సంక్లిష్టంగా ఉన్నాయని అంటే, 17.06 మంది స్వార్ధపూరిత అవకాశవాదరాజకీయాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. మరో 27.12 శాతం మంది రాష్ట్ర రాజకీయాలు ప్రమాదకర పోకడలు పోతున్నాయని ఆందోళన వ్యక్త పరిచారు.

ఏపీలో జగన్ ఔట్.. తేల్చేసిన ఈసీసీ సర్వే

వ‌చ్చిన అవ‌కాశాన్ని రాజ‌కీయాల్లో బాగా స‌ద్వినియోగం చేసుకోవాలి. ప్ర‌జ‌లు ఎలాగో పీఠం ఎక్కించేసేరు. పోనీ పిల్లాడు ఏడుస్తున్నాడు ఓసారి అవ‌కాశం ఇద్దామ‌నుకున్నారు. పాల‌న సాగుతున్నకొద్దీ భ‌జంత్రీల మాట‌లు, పాట‌లు బాగా వింటూ మ‌హాద్భుతంగా సాగుతోంది, ఇక మ‌న సీటు ప‌ర్మ‌నెంట్ అనుకోవ‌డం ఎంతో అమాయ‌త్వం. ఎవ్వ‌రూ అతిగా ఏమీ ప్రేమించ‌రు. ముఖ్యంగా ఓట‌ర్లు. సామాన్య జ‌నానికి కావ‌ల సింది వారికి పాల‌కులు అనువుగా ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్నారా లేదా, వారి మాట వింటున్నారా లేదా అనే వుంటుంది. ఎవ‌రు ఎలాంటి త‌ప్పిందాల‌ను కప్పిపుచ్చుకోవాల‌న్నా వారికి తెలిసిపోతుంది.  ఇక మ‌రో సారి అవ‌కాశం ఇవ్వాల‌న్న ఆలోచ‌నా వారికి వుండ‌దు. కానీ పీఠం మీద వున్న‌వారు  అదే  గ‌ర్వంతో  క‌ళ్లు మూసుకున్న పిల్లిలా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌మాద‌మే. మూడేళ్ల పాల‌న త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి  అదుగో అలాంటి ప్ర‌మాద‌మే వ‌చ్చి ప‌డింది. వార్తాహ‌రులు, బాగా న‌మ్మిన‌వారి స‌మాచారం కాస్త సంతోష‌పెట్టి వుండ‌వ‌చ్చుగానీ, అస‌లు సిస‌లు స‌ర్వేలు అనేవి వుంటాయి. ఆ స‌ర్వే సంస్థ‌ల‌కు బొత్తిగా మొహ‌మాటం వుండ‌దు. జ‌గ‌న్ ..మ‌న సీఎం, వైసీపీ మ‌న పార్టీ అంటూ ఏమీ ప్ర‌త్యేకాభిమానం ఛ‌స్తే వుండ‌దు. కుండ బ‌ద్ద‌లుకొట్టిన‌ట్టు జ‌రిగేది చెబుతుంది. అదేదో సినిమాలో మాంత్రికుడి అద్భుత అద్దంలో లోకాన్ని చూపి న‌ట్టు.. ఇటీవ‌లి స‌ర్వే జ‌గ‌న్‌గారి పాల‌నా ప్ర‌భావం ఏ మేర‌కు తిరిగి ప‌ట్టంగ‌డుతుంది అనేది  స్ప‌ష్టం చేసింది.  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది. ప్రజల మొగ్గు ఎటువైపు ఉంటుం ది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరు?   ప్రస్తుతం రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతున్న చర్చ ఇదే. అంతలా రాష్ట్రంలో రాజకీయ హీట్ పెరిగిపోయింది. ముందస్తు ఊహాగానాలతో ఎక్కడ నలుగురు కలిసినా రాష్ట్రంలో ఇదే చర్చ.  ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు చెందిన ఈఈసీ అనే సంస్థ ఏపీలో నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితం సంచలనంగా మారింది.  ఫిబ్రవరి 20 మార్చి 5 మధ్య కాలంలో అత్యంత శాస్త్రీయం గా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ ర్యాండంగా నిర్వహించిన ఈ సర్వే ఫలితం ఇప్పటికిప్పుడు ఎన్ని కలు జరిగితే తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఖాయమని తేల్చేసింది.   ముందస్తు ఎన్నికల ప్రచా రం ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ కనీసంలో కనీసం 3.85 శాతం ఓట్లు అధికంగా తెచ్చుకుని  అధి కార పగ్గాలు చేపట్టడం ఖాయమని సర్వే ఫలితం పేర్కొంది. వైసీపీకి గతంతో పోల్చుకుంటే ఓట్లూ, సీట్లూ కూడా గణనీయంగా తగ్గే అవకాశాలున్నయని తేల్చింది. ఇక  జన సేప పార్టీ ప్రస్తత పరిస్థితుల్లో కనీసం ఒక సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదనీ, అయితే గతంతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఓట్లు లభించే అవకాశాలున్నాయని పేర్కొంది.  రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాలలో అంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయల సీమ ప్రాంతాలలో ర్యాండమ్ గా  35 నియోజకవర్గాలలో ఈ సర్వే జరిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా లలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉందని, అలాగే రాయలసీమలో మాత్రం అధికార వైసీపీ  స్వల్ప ఆధిక్యత కనబరి చిందని సర్వే ఫలితం తేల్చింది. ఉత్తర కోస్తాలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 7 నియోజకవర్గాలు, దక్షిణ కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 14 నియోజక వర్గాలలో, రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 14 నియోజకవర్గాలలోనూ ఈ సర్వే నిర్వహించింది.  కాగా సర్వేలో 43 శాతం మంది తెలుగుదేశంకు మొగ్గు చూపితే వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి శాతం 39.15, ఇక జనసేనకు 10.50 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. ఇక బీజేపీకి మద్దతుగా ఉన్న వారి శాతం కేవలం 1.28శాతం మాత్రమే. ఈ  సర్వే ప్రకారం వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకి 3.85 శాతం ఆధిక్యత ఉందని సర్వే పేర్కొంది. 2019లో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామన భావిస్తున్న వారి శాతం 47.37శాతం ఉండగా,  సరైన నిర్ణయమే తీసుకున్నా మన్న వారి శాతం 8.46గా ఉంది. ఏమో చెప్పలేం అన్న వారి శాతం 14.16గా ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పని తీరుతో సంతృప్తిగా ఉన్నారా అన్న ప్రశ్నకు లేదని సమాధానం చెప్పిన వారి శాతం 31.62గా ఉండగా, సంతృప్తిగా ఉన్నామన్నవారు పాతిక శాతం మంది. ఫరవాలేదని చెప్పిన వారు 9.68 శాతం మంది.  ఏ మాత్రం సంతృప్తిగా లేదన్న వారి శాతం 23.59 శాతం. ఇక రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం బాగా పని చేస్తుందని భావిస్తున్న పార్టీ ఏదన్న ప్రశ్నకు 42 శాతం మంది తెలుగుదేశం పార్టీ అని సమాధానం ఇవ్వగా, 39 శాతం మంది వైసీపీ అని బదులిచ్చారు. జనసేన కు అనుకూలంగా 10.50 శాతం మంది, బీజేపీకి అనుకూలంగా 1.2 శాతం మంది బదులిచ్చారు. భవిష్యత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరన్న ప్రశ్నకు 42.91 శాతం మంది చంద్రబాబుకు మద్దతు పలకగా, 39.09 శాతం మంది జగన్ కు అనుకూలాంగా ఉన్నారు. 10.54 శాతం మంది జనసేన నాయకుడు పవన్ పేరు చెప్పారు.  ఏ పార్టీకి ఓటు వేస్తారన్న ప్రశ్నకూ తెలుగుదేశం పార్టీకే అత్యధికులు అనుకూలంగా ఉన్నారని తేలింది. తెలుుగదేశం పార్టీకి  అనుకూలంగా  43 శాతం మంది నిలవగా, వైసీపీకి మద్దతుగా 39.15 శాతం మంది ఉన్నారు. జనసేనకు 10.50శాతం మంది, బీజేపీకి 1.28 శాతం మంది మద్దతుగా నిలి చారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర కోస్తాలో 43.76 శాతంతో తెలుగుదేశం ప్రథమ స్థానంలో నిలవగా, వైసీపీ 38.28 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. 10.33 శాతం మద్దతుతో జనసేన 3వ స్థానంలో నిలవగా,బీజేపీ 2.14 శాతానికి పరిమితమైంది. సీఎంగా చంద్రబాబుకు 3.90 శాతం మంది మద్దతు పలికితే, జగన్ కు 38.33 శాతం మద్దతు లభించింది. జనసేనకు 10.19 శాతం, బీజేపీకి 2.23శాతం మద్దతు లభించింది. దక్షిణ కోస్తా విషయానికి వస్తే.. ఏ పార్టీకి ఓటు వేస్తారన్న ప్రశ్నకుతెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపిన వారి సంఖ్య 44.64శాతం, వైసీసీకి 37.35శాతం, జనసేనకు 13,40 శాతం మంది మద్దతు తెలపగా, బీజేపీకి అను కూలంగా ఉన్న వారి శాతం కేవలం 0.73 శాతం. ముఖ్యమంత్రిగా ఎవరికి మీ మద్దతు అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా 44.69 శాతం మంది నిలవగా, జగన్ కు అనుకూలంా 37.33 శాతం మంది ఉన్నారు. పవన్ కు 13.42 శాతం మంది మద్దతు పలికారు. రాయలసీమ విషయానికి వస్తే.. ఇక్కడ మాత్రం జగన్ కు, వైసీపీ పార్టీకి స్వల్ప మొగ్గు కనిపించింది. ఏ పార్టీకి మీ ఓటు అన్న ప్రశ్నకు వైసీపీకి అనుకూలంగా చెప్పిన వారు 41.16 శాతం మంది ఉన్నారు.  అదే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వారు 40.76 శాతం ఉన్నారు. ముఖ్యమంత్రిగా మీ ఎంపిక ఎవరు అన్న ప్రశ్నకు జగన్ అని జవాబిచ్చిన వారు 41.31 శాతం మంది. చంద్రబాబుకు మద్దతుగా చెప్పిన వారు 40.76శాతం మంది. జనసేన అధినేత పేరు చెప్పిన వారు 7.83 శాతం మంది. మొత్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనీసం 3.35 శాతం అధిక ఓటుతో తెలుగుదేశం విజయం సాధిస్తుందని ఈసీసీ సర్వే తేల్చింది.

అన్నీ వినాలి జ‌గ‌న్‌.. న‌చ్చ‌లేదంటే ఎలా?

పాల‌న అద్బుతంగా వుంటే ఎవరికీ విమ‌ర్శించే అవ‌కాశం వుండ‌దు. ఫ‌ర‌వాలేద‌నిపిస్తే సూచ‌న‌లు, స‌ల‌హా లు యిస్తారు. బొత్తిగా అస్త‌వ్య‌స్తంగా వున్న‌పుడు గ‌ట్టి సూచ‌న‌లు, కాస్తంత అసంతృప్తితో కూడిన వివ‌ర‌ణ‌లూ వుంటాయి. త‌న పాల‌న ఎలా వుంది, ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నార‌ని రాజుగారు మంత్రుల‌తో, సామంతు ల‌తో స‌మావేశం పెట్టిన‌పుడు అనుకూలం, అన‌నుకూల వ్యాఖ్య‌లు, వివ‌ర‌ణ‌లూ కూడా విన‌వల‌సి వ‌స్తుం ది. అం ద‌రూ శ‌భాష్ అన‌రు. వారు తెలుసుకున్న‌విశేషాల‌ను అన‌స‌రించి స‌మా చారం అంది స్తారు. అది రాజు గారికి  న‌చ్చ‌వ‌చ్చు, న‌చ్చ‌కాపోవ‌చ్చు. అన్నంత మాత్రాన వాస్త‌వం మారి పోదు గ‌దా?!   కానీ  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య మంత్రి జ‌గ‌న్ రెడ్డి మాత్రం ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యేలు, కీల‌క నేత ల‌తో  వ‌ర్క్ షాప్ నిర్వ‌హించేరు. అంతా మంచి వార్త‌లు చెబుతార‌ని, విని న‌వ్వుకుంటూ వెళిపోవ‌చ్చ‌ని, త‌న‌కు అం ద‌రూ భ‌జ‌న‌చేస్తార‌ని జ‌గ‌న్ ఆశిం చేరు. కానీ అందుకు కాస్తంత విరుద్ధ వాతావ‌ర‌ణ‌మే అక్క‌డ ఏర్పడింది. వ‌ర్క్‌షాప్ లో పాల్గొన్న‌వారిలో మాజీమంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రావు అమ్మ ఒడి ప‌థ‌కం అమ‌లు విష‌యం లో చాలా అసంతృప్తినే వ్య‌క్తం చేసేరు. ప్ర‌కాశం జిల్లా ల‌బ్దిదారుల్లో అంత‌కుముందు వున్న‌వారిని కూడా తొల‌గిం చడమేమి ట‌ని ఆశ్చ‌ర్యంతో కూడిన  ప్ర‌శ్నేసంధించారు. వారంతా అనర్హులుగా గుర్తించ‌డం వ‌ల్ల‌నే తొల‌గించాల్సి వ‌చ్చింద‌ని జ‌గ‌న్ స‌మాధానం. అయితే  అంత‌కుముందు పొర‌పాట్లు జ‌రిగినందు వ‌ల్ల ఈసారి స‌వ‌రించే క్ర‌మంలో వారిని తొల‌గించామ‌న్నారు. కానీ ఆ స‌మాధానం మాజీ మంత్రిని అంత‌గా సంతృప్తి ప‌ర‌చ‌లేదు.  తొలి రెండువిడ‌త‌ల్లో వారికి డ‌బ్బులు వేయ‌డం పొర‌పాటున జ‌రిగింద‌ట‌!  ఇక కందుకూరు ఎమ్మెల్యే మ‌హీధ‌ర్ రెడ్డి ప‌ట్ల జ‌గ‌న్  ఆగ్ర‌హానికి కార‌ణ‌మేమంటే  గ్రామాల్లో విద్యుత్ స‌మ స్యతో పాటు ఇసుక స‌మ‌స్య గురించి కూడా  వ‌ర్క్‌షాప్‌లో  చ‌ర్చ‌కు తేవ‌డం. గ్రామాల్లో కార్య‌క‌ర్త‌లు చేసిన ప‌నుల‌కు బిల్లుల విష‌యం తేల‌క‌పోవ‌డం ఇబ్బందిక‌రంగా మారింద‌న్నారు.  అలాగే విద్యుత్ స‌మ‌స్య తీవ్రంగా వుంద‌ని అన‌డం జ‌గ‌న్ చాలా ఇబ్బంది పెట్టింది. ఏవోనాలుగు మంచి  మాట‌లు చెబుతార‌ని,  ఆనందాన్నిచ్చే స‌మాచారం ఇస్తార‌ని అనుకుంటే, ఇలాంటి అంశాలు  సీఎంకు చిరాకు క‌లిగించాయి.  అందుకే  కందుకూరు ఎమ్మెల్యే పైనా కాస్తంత విసుక్కున్నారు.    ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించారు. త‌మ‌కు కావ‌ల‌సిన ప‌నులు జ‌ర‌గాల‌నుకుంటారు. త‌మ‌కు అన్ని ప‌థ‌కా లు స‌వ్యంగా అమ‌లుజ‌ర‌గాల‌నే ఆశిస్తారు. త‌ప్ప రాజ‌కీయంగా అధికారంలో వున్న‌వారికి ల‌బ్ధి చేర‌డానికి వారు ఓట్లు వేయ‌లేదు. ప్ర‌జ‌లు ప్రేమిస్తారు, ఓట్లు వేస్తారు, చిరాకేస్తే రాళ్లూ వేస్తారు, ఘాటుగా విమ‌ర్శ‌లూ చేస్తార‌న్న‌ది జ‌గ‌న‌న్న‌కి ఇంకా తెలియ‌క కాదు. అలాంటివి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డు. ఆయ‌న‌కు  అదేదో సిని మాలో వ‌లె  రోజూ  వీల‌యితే ప్ర‌తీ క్ష‌ణం భ‌జ‌న‌చేసే వారంటే మ‌హా యిష్టం. అదే  కోరుకుంటున్నారు ఆంధ్రా  సీఎం.  మ‌రి అలాంట‌పుడు వ‌ర్క్‌షాప్‌లు నిర్వ‌హించి  మీరీ చెవికి ఇంపుగా లేని అంశాల‌ను విన డం దేనికి, ఎలాగూ స్పందించ‌రు. పాల‌నా వ్య‌వ‌హారాల‌లో మార్పులు చేర్పులు వుండ‌వు, తాను  అను కున్న విధంగానే చేస్తారు, చేయ‌మ‌ని హెచ్చ‌రిస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులూ  వారి చిర్నవ్వు  చూస్తూ ప‌ద‌వీ కాలం ముగించేయాలంతే!

పాల‌న సుదీర్ఘం.. గిరిజ‌నుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం కాంగ్రెస్‌పై మోదీ చుర‌క‌

దేశ ప్ర‌జ‌లు అన‌గానే కేవ‌లం ప‌ట్ట‌ణ, ప‌ల్లె ప్ర‌జ‌లే కాదు గిరిజ‌న‌లూ, గిరిజ‌న ప్రాంతాలూ లేక్క‌లోకి వ‌స్తార న్న‌ది పాల‌కులకు గుర్తుండాలి. గిరిజ‌నులు, తాండా వాసుల‌ను కేవలం  ఓట‌ర్లుగా మాత్ర‌మే చూస్తే మొత్తం దేశాభివృద్ధికి అర్ధం లేదు. చాలాకాలం నుంచి అధికారంలో  వుండి అట‌వీ, గిరిజ‌న ప్రాంతాల‌ను  నిర్ల‌క్ష్యం చేయ‌డం ఏపాటి ప్ర‌భుత్వం అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ  గ‌త కాంగ్రెస్ పాల‌న పై ధ్వ‌జ‌మెత్తారు. గుజ‌రాత్ న‌వ‌తారిజిల్లాలోని ఖుద్వేల్ గిరిజ‌న ప్రాంతంలో రూ.3,050 కోట్లతో అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేసారు. అనంత‌రం అక్క‌డ ర్యాలీలో ఆయ‌న ప్ర‌సంగించారు. దేశం న‌లుమూల‌లా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భావం, ప్ర‌తిష్ట విస్త‌రించి దేశాన్ని గొప్ప‌గా పాలించామ‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌డం త‌ప్ప నిజానికి అస‌లు అభివృద్ధి చెందాల్సిన అట‌వీప్రాంతాలు, గిరిజ‌న తాండా వాసుల జీవితాలు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి సామెత‌లానే వున్న‌ది. కాంగ్రెస్ గ‌త వైభ‌వం గురించి ప్ర‌చారం చేసుకోవ డ‌మే త‌ప్ప వాస్త‌వానికి గిరిజ‌నుల‌కు, అట‌వీప్రాంతాల వాసుల‌కు ప్ర‌త్యేకించి చేసిందేమీ లేదు.  అధికార‌కాంక్ష‌తో ఎన్నిక‌లు గెల‌వ‌డం త‌ప్ప ప్ర‌జ‌ల‌కు మంచి నాణ్య‌మ‌యిన జీవితాన్ని ఎన్నడూ కాంగ్రెస్ ఇవ్వ‌లేద‌ని మోదీ ఆరోప‌ణ‌. గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేయాలి. అది కాంగ్రెస్ వారి వ‌ల్ల జ‌ర‌గ‌దు. ప్ర‌జ‌ల కోసం పాటుప‌డ‌టం అనేది అధికార కాంక్ష‌తో వున్న‌వారికి ఎలా సాధ్యమ‌వుతుం ది? అంతెందుకు గ‌తంలో అట‌వీప్రాంతాలు, గిరిజ‌న ప్రాంతాల్లో ఆరోగ్య ప‌థ‌కాల ప్ర‌చారంగాని, వాక్సినేష న్ కార్య‌క్ర‌మాల‌కు వెళ్లాలంటే చాలా ప్రాయాస‌ప‌డి వెళ్లాల్సివ‌చ్చేది. కానీ ఇపుడు ఆ ప‌రిస్థితి లేదు. అక్క డికే వెళ్లి వారికి ఆరోగ్య సేవ‌లు చేప‌ట్ట‌డానికి ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొనే కాలం పోయింది.  అందుకు బిజెపి ప్ర‌భుత్వం రెండు ద‌శాబ్దాలుగా  తీసుకున్న నిర్ణ‌యాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వీలుక‌ల్పించా య‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. 

బిజెపి స్కిట్‌... ప్ర‌భుత్వపై నిర‌స‌నకు కొత్త‌మార్గం

స‌మాజంలో ప్ర‌తీవారికి ప్ర‌తీ ఒక్క‌రూ న‌చ్చాల‌ని లేదు. రాజ‌కీయాల‌లో అయినా, సామాజిక అంశాల్లోన‌యినా, వ్య‌క్తిగ‌తంగా న‌యినా విభేదాలు, అభిప్రాయ‌భేదాలు వుండ‌వ‌చ్చు. కాకపోతే, కొంద‌రు మౌనంగా  ప‌క్క‌కి తొలు గుతారు, కొంద‌రు గ‌ట్టిగా గోల‌ చేసి చెబుతారు, ఇంకొంద‌రు అవ‌మానించి ఏడిపించ‌డానికే గ‌ట్టిగా  పూను కుంటారు. ఎవ‌రు ఎలా అనుకున్నా, ఎలా వున్నా బిజెపి వారి మార్గం వేరు. ఎలాగ‌యినా స‌రే రోజులో ఒక సారి తెలంగాణా ప్ర‌భుత్వాన్ని తిట్టిపోయాల‌న్న దీక్ష‌బూనిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  వ్య‌తిరేక‌త ప్ర‌దర్శిం చ‌డంలోనూ స‌రి కొత్త మార్గాన్ని అనుస‌రించేరు  తెలంగాణాలో క‌మ‌ల‌నాధులంతా. మామూలు ప్ర‌చారాలు, ఉప‌న్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంతో పాటు స్టేజీ మీద స్కిట్ ద్వారా కూడా  బిజెపి తెలంగాణా ప్ర‌భుత్వం మీద విరుచుకుప‌డింది! జూన్ రెండ‌వ తేదీన నాగోల్‌లో  అమ‌రుల యాదిలో- ఉద్య‌మ ఆకాంక్ష‌ల సాధన స‌భ పేరిట బిజెపి నాయ కుడు జిట్టా బాల‌కృష్ణారెడ్డి  ప్ర‌త్యేకంగా స‌భ నిర్వ‌హించేరు. అందులో ఇత‌ర తెలంగాణా వీరాభిమానుల‌తో పాటు తెలంగాణా బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ సందర్భంగా సుదీర్ఘ ఉప‌న్యాసాలు వుంటాయ‌నే అంతా భావించేరు. కానీ స‌భ‌కి వ‌చ్చిన వారిని ఒక స్కిట్ అమితంగా ఆక‌ట్టుకుంది. అది కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని    కించ‌ప‌రిచే విధంగా వుండ‌డంతో కేసీఆర్ వీరాభిమానులు ఆగ్ర‌హించ‌డం మామూలే. ఇది రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప‌రువు తీసేవిధంగా వుంద‌ని  జిట్టా ని వెంట‌నే అరెస్టు చేయాల‌ని, త‌గిన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిఆర్ ఎస్ మీడియా క‌న్వీన‌ర్ వై.స‌తీష్ రెడ్డి హ‌య‌త్‌న‌గ‌ర్ పిఎస్‌లో ఫిర్యాదు చేసేరు. ఏదో చిన్న‌పాటి పిచ్చిప‌నే అయితే ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించు కోరు. కానీ రెండ‌వ తేదీ స‌భ‌లో స్టేజీ మీద బిజెపి క‌ల్చ‌ర‌ల్ టీమ్ బొడ్డు ఎల్ల‌న్న ప్ర‌ద‌ర్శించిన స్కిట్  కేసీ ఆర్ ప‌రువు తీసేదిగా వుంది. దీన్ని లోక‌ల్ ఛాన‌ళ్లు ప్ర‌సారం చేయ‌డంతో ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు మండి ప‌డ్డాయి.  జిట్టాను వెంట‌నే అరెస్టు చేయాల‌న్న డిమాండ్ రావ‌డంతో పోలీసులు మ‌ఫ్టీలో మాటు వేసి గురువారం రాత్రి ఘ‌ట‌కేస‌ర్ టోల్ ప్లాజా వ‌ద్ద  అరెస్టు చేశారు. రాత్రి ఇలా మాటువేసి త‌న‌ను అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌ని, అరెస్టు వారెంటు చూపాల‌ని మ‌ఫ్టీలో వున్న  జిట్టా పోలీసుల‌తో గొడ‌వ‌ప‌డ్డారు. కానీ  ఆయ‌న ప్ర‌శ్నల‌ను  వాళ్లు ప‌ట్టించుకోలేదు.  త‌న‌ను ఎక్క‌డికి తీసు కెళుతున్నార‌న్న‌దీ చెప్పాల‌న్న‌దానికీ పోలీసుల నుంచి స‌మాధానం లేదు.   ఈ విధంగా అరెస్టుచేసి గుర్తు తెలియ‌ని ప్రాంతానికి తీసికెళ్ల‌డం లో ఆంత‌ర్య‌మేమిట‌న్న‌ది ఇపుడు అంద‌రూ అడుగుతున్న‌ ప్ర‌శ్న‌. బండి సంజ‌య్‌, రాణీ రుదమ‌, బొడ్డు ఎల్ల‌న్న అలియాస్ దరువు ఎల్ల‌న్న ఇత‌రుల మీద కూడా కేసులు బుక్ చేసేరు. ఆ స‌భ‌, వేదిక మీద నిర్వ‌హించిన స్కిట్ తాలూకు వీడియోలు ప‌రిశీలించిన త‌ర్వాత అదంతా తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా వుంద‌ని పోలీసులు నిర్ధారించుకుని జిట్టాను అరెస్టు చేసేరు.  స్కిట్ అయినా, డైలాగుల‌యినా, పాట‌యినా స‌రే ప్ర‌భుత్వం మీద అయిష్ట‌త‌నో, పూర్తి వ్య‌తిరేక‌త‌నో వ్య‌క్తం చేయ‌డానికి ఒక ప‌ద్ధ‌తి, ప‌రిమితీ వుండాల‌ని, జిట్టా అన్ని ప‌రిమితుల‌ను తుంగ‌లోతొక్కి చాలా ఓవ‌రాక్ష‌న్ చేశార‌ని టిఆర్ ఎస్ వీరాభిమానుల మాట‌. మొత్తానికి స్టేజీ మీద స్కిట్స్ ఈవిధంగానూ వుప‌యోగించ‌వ‌చ్చ న్న‌ది  ప్ర‌బుత్వం, కేసీఆర్ వ్య‌తిరేకుల‌కు బిజెపి మార్గ‌ద‌ర్శి అయింద‌నాలి.

సర్కార్ కు తోచదు..విపక్షం చేస్తే నచ్చదు!

అమ్మ పెట్టా పెట్టదు..అడుక్కు తినా నివ్వదు అన్నది సామెత.  ఏపీలో వైసీపీ ప్రభుత్వ తీరు సరిగ్గా సరిగ్గా ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. ఔను నిజమే.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితతి ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదన్నట్లుగా ఉంది. ప్రభుత్వం ధరల అదుపు బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంది. ఇదీ అదీ అనే తేడా లేకుండా అన్ని వస్తువుల ధరలూ పెంచేస్తూ..పేద వారి బతుకును దుర్లభం చేసేసింది వైసీపీ సర్కార్. ఇదుదొ విపక్షం విమర్శ కాదు. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ సాక్షాత్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రతి గడపలోనూ వైసీపీ నేతలూ, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి ఎదురైన ప్రశ్న. ఆ ప్రశ్నలలోనే వేడినీ, వేదననూ గమనించి ప్రభుత్వమే పేదలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాల్సింది పోయివిపక్ష తెలుగుదేశం పేదలకు చవకగా పట్టెడన్న పెట్టేందుకు ప్రయత్నించడాన్ని సహించ లేకపోతోంది. అన్న క్యాంటిన్ ఏర్పాటు చేసి పేదలకు రెండు రూపాయలకే రుచికరమైన భోజనం అందించాలన్న సదాశయాన్ని మొగ్గలోనే తుంచేసింది. మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటిన్ ను జేసీబీలతో కూల్చేశారు పోలీసులు. అందుకు వారు చెప్పిన కారణం అన్న క్యాంటిన్ ఏర్పాటుకు అనుమతి లేదు అని.  అయితే వైసీపీ ప్రభుత్వ తీరును మంగళగిరి స్థానికులు సైతం తీవ్రంగా గర్హిస్తున్నారు. అన్న క్యాంటిన్ ను కూల్చివేయడం అమానుషమనీ, దారుణమనీ అంటున్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి ప్రయత్నించడం కూడా తప్పేనా అని నిలదీస్తున్నారు. అనుమతి లేకపోతే ఇవ్వోచ్చుగా అని సలహా కూడా ఇస్తున్నారు.  గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్లు పేదలకు ఎంతో సేవ చేశారని, శుభ్రమైన, శుచికరమైన, రుచికరమైన బోజనం చవుకగా అందించాయనీ వారు గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వస్తూనే అన్న క్యాంటిన్లను రద్దు చేసి పేదవాడి నోటి కాడ కూడును లాగేసుకుందని విమర్శించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ను కూల్చివేసి పేదల నోటి కాడ కూడు లాగేయడంపై వైసీపీ సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్న క్యాంటిన్ కూల్చివేతను అడ్డుకున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలన పోలీసులు అరెస్టు చేశారు. అయినా తగ్గేదే లే అంటూ తెలుగు తమ్ముళ్లు శపథం చేశారు. అన్న క్యాంటిన్ ఏర్పాటును అడ్డుకోవడానికి జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా, పోలీసులను ప్రయోగించినా మంళళగిరిలో అన్న క్యాంటిన్ ఏర్నాటు చేసి రెండు రూపాయలకే పేదలకు భోజనం అందిస్తామని ఎవడడ్డోస్తాడో చూస్తామని తెలుగు తమ్ముళ్లు సవాల్ చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు అన్న క్యాంటిన్ కూల్చివేతను తీవ్రంగా విమర్శించారు. పేదలకోసం చేస్తున్న ఒక మంచి ప్రయత్నాన్ని రాజకీయ కారణాలతో ప్రభుత్వం అడ్డుకోవడం విడ్డూరమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనిని చేయకపోగా, విపక్షం పేదలను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చెడగొట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.