విడదల రజినీ... జంప్ జిలానీ!

సైబరాబాద్ మొక్క విడదల రజినీ వైసీపీ నుంచి జంప్ జిలానీ అవబోతున్నారు. త్వరలో పార్టీ మారడానికి విడుదల రజినీ సన్నాహాలు చేసుకుంటున్నారు. అప్పట్లో తాను చంద్రబాబు సైబరాబాద్‌లో నాటిన మొక్కని అని స్టోరీలు చెప్పి, తెలుగుదేశం పార్టీలో అందలం ఎక్కిన విడదల రజినీ, ఆ తర్వాత జంప్ జిలానీ అయ్యి వైసీపీలో చేరారు. అక్కడ కూడా తన మార్కు భజన కార్యక్రమం చేపట్టి జగన్‌ అనుగ్రహాన్ని పొందారు. మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కూడా పొందారు. మొన్నటి ఎన్నికలలో వైసీపీ తరఫున గుంటూరు వెస్ట్ నుంచి ఈమె పోటీ చేస్తే, గుంటూరు వెస్టోళ్ళు నువ్వు మాకు వేస్టు అని ఓడించారు. ఇక వైసీపీలో వుంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని అర్థం చేసుకున్న ఈ సైబరాబాద్ మొక్క పార్టీ మారడానికి సిద్ధమైనట్టు సమాచారం. వైసీపీలో కీలక నాయకుల మాటలు నమ్మి తానెంతో మోసపోయానని ఆమె తన సహచరుల దగ్గర కన్నీరుమున్నీరు అయినట్టు తెలుస్తోంది. ఇదిగో సైబరాబాద్ మొక్కమ్మా.. నువ్వు పార్టీ మారితే మారుగానీ, ఈ ఏడుపు డ్రామాలు చేయకు.. నీ డ్రామాలు ఎవరూ నమ్మరు.

వైసీపీ అంతానికి ఇది ఆరంభం మాత్రమే!

వైసీపీ పతనం ఇది ఆరంభం మాత్రమేననీ, వచ్చే ఐదేళ్లలో ఆ పార్టీ మరింతగా దిగజారడం ఖాయమనీ, ఇందు కోసం తాను అలుపెరుగని పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వాస్తవానికి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ యుద్ధమే చేశారు. తెలుగుదేశం, జనసేనలకు మించి విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి, మద్యం విధానం, వాగ్దానాలు అమలులో వైఫల్యం, జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులను వంచించిన వైనంతో పాటు సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యవిషయంలో న్యాయం జరగాలంటూ ఆమె ఇచ్చిన పిలుపు ఇవన్నీ జగన్ కు ఆయన పార్టీ నేతలకు నిద్రలేని రాత్రులను మిగిల్చాయంటే అతిశయోక్తి కాదు. షర్మిల జగన్ పై రాజకీయ పోరాటం చేస్తుంటే.. జగన్, ఆయన పార్టీ నేతలు మాత్రం షర్మిల వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ కువిమర్శలకు దిగారు. చివరాఖరికి స్వయంగా జగన్ కూడా సొంత చెల్లి షర్మిల కట్టుకున్న చీర రంగుపై కామెంట్లు చేశారు.  ఎన్నికలకు ముందు వరకూ షర్మిల కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి అవినాష్ రెడ్డిపై విజయం సాధిస్తారన్న భావన వైసీపీ నేతలతో సహా అందరిలోనూ ఉండేది. అప్పట్లో ఆమె ప్రచారానికి వచ్చిన స్పందనే అందుకు కారణం. అయితే షర్మిల కడపలో పరాజయం పాలయ్యారు. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అందరూ దాదాపుగా డిపాజిట్లు కోల్పోయారు. సరే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత, అందునా  జగన్ పార్టీ ఈ ఎన్నికలలో 11 స్థానాలకే పరిమితం కావడం నిస్సందేహంగా షర్మిలకు సంతోషం కలిగించే విషయమే అయినా కూడా ఆమె  షర్మిల ఎక్కడా బయటకు రాలేదు. మీడియాతో మాట్లాడలేదు.   దీంతో షర్మిల కాడె వదిలేశారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో మొదలైంది.  అయితే ఆమె తాజాగా షర్మిల ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ హై కమాండ్ తనకు మద్దతుగా ఉన్నారని పేర్కొనడమే కాకుండా తమ భేటీలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారని షర్మిల తెలిపారు. రానున్న రోజులలో ఏపీలో కాంగ్రెస్ పూర్వవైభవం సాధించడమే కాకుండా, ఒక బలీయ శక్తిగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అవసరమై చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో వచ్చే ఐదేళ్లలో జగన్ ఓటు బ్యాంకు లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేయనున్నదని స్పష్టమౌతోంది. జగన్ భయం కూడా అదే. షర్మిల తన దూకుడు ఇలాగే కొనసాగితే.. వైసీపీ ఓటు బ్యాంకు అంతా షర్మిల కాంగ్రెస్ కు మళ్లించేయడం ఖాయమన్న భయం జగన్ లోనూ వ్యక్తం అవుతున్నదని అంటున్నారు.  

 డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు వై ప్లస్ సెక్యురిటీ 

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం సెక్యురిటీ పెంచింది.  వై ప్ల‌స్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా, ఇవాళ స‌చివాల‌యం వెళ్ల‌నున్న ప‌వ‌న్ త‌న ఛాంబ‌ర్‌ను ప‌రిశీలించ‌నున్నారు. రేపు ఆయ‌న మంత్రిగా బాధ్య‌త‌లు చేపడతారు.  మొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్‌ కల్యాణ్‌కు భారీ మానవహారంతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతి రైతులు. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌కు భద్రత పెంచింది ప్రభుత్వం ఇక స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సోమ‌వారం ఛాంబ‌ర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని ఆయ‌న కోసం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌సేన మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంత‌స్తులో ఛాంబ‌ర్లు కేటాయించారు. 

స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు.. డిప్యూటీగా లోకం మాధవి!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మూడు రోజులపాటు జరిగే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కొత్త స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. అసెంబ్లీకి ఎన్నికైన వారిలో  అయ్యన్నపాత్రుడికి చాలా సీనియారిటీ వుంది. నర్సీపట్నం నుంచి ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. అయ్యన్నపాత్రుడు  ఆయన స్పీకర్‌గా ఎంపికైన నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే, డిప్యూటీ స్పీకర్‌గా జనసేన పార్టీకి చెందిన లోకం మాధవిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవడానికి ముందే ఈనెల 22వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది.

నీట్ పరీక్ష లీక్ పై జెడి లక్ష్మినారాయణ వెరైటీ ట్వీట్ 

మునుపెన్నడూ లేని విధంగా నీట్ పరీక్ష వివాదాస్పదమైంది. ప్రతిపక్ష పార్టీలకు నీట్ పరీక్ష అస్త్రంగా మారింది. నీట్‌ పేప‌ర్ లీక్ అయ్యిందంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న వేళ సీబీఐ మాజీ జేడీ, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 'ఒక దేశాన్ని నాశ‌నం చేయాలంటే ఆట‌మ్ బాంబులు అవ‌స‌రం లేదు. నాసిర‌కం విద్య‌, విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌నివ్వ‌డం లాంటి విధానాల‌ను ప్రోత్స‌హిస్తే ఆ దేశం దానంత‌ట అదే నాశ‌నం అవుతుంది. అలా చ‌దివిన డాక్ట‌ర్ల చేతిలో రోగులు చ‌నిపోతారు అంటూ ప‌లు ఉదాహరణలను  ఓ యూనివ‌ర్సిటీ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద‌ రాశార‌ని' ఆయన పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.   ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మొదట వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీక‌రించారు. నీట్‌ అక్రమాలు గుజరాత్‌, బీహార్‌లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. మెడికల్ కాలేజీలకు ఈ ఏడాది అర్హత పరీక్ష, నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ పై వివాదం, దీర్ఘకాల వ్యవస్థాగత లోపాలపై దృష్టిని ఆకర్షిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  1,500 కంటే ఎక్కువ మంది అభ్యర్థుల గ్రేస్ మార్కులను రివర్స్ చేసి, వారికి మళ్లీ పరీక్షకు అవకాశం ఇచ్చింది. ఈ విద్యార్థులకు మొదట్లో తప్పుడు ప్రశ్నపత్రం ఇచ్చారు. సరైన పేపర్‌కి మారడంలో కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వారికి పరిహారం మార్కులు ఇవ్వబడ్డాయి.  ఈ “సాంకేతిక లోపం”ని అంగీకరించడానికి అనేక పిటిషన్‌లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. . 4,500కి పైగా పరీక్షా కేంద్రాల్లో కేవలం ఆరింటిలో మాత్రమే తప్పు జరిగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ,   ఈ సంవత్సరం పరీక్షలో అరవై ఏడు మంది విద్యార్థులు  రాణించారు, మరికొంత మంది విద్యార్థులు ఒకటి లేదా  రెండు మార్కులు తక్కువగా వచ్చాయి.  - గత సంవత్సరం ఇద్దరు మాత్రమే టాపర్‌లు గా నిలిచారు. 2022లో కూడా  ఒక టాప్ ర్యాంకర్  సాధించారు. 2021లో ముగ్గురు టాపర్‌లు నిలిచారు.   ఏ సంవత్సరం లేని పరీక్ష ఫలితాలు ఈ సంవత్సరమే వచ్చాయి.ఒకే సారి 67 మంది టాపర్లుగా నిలవడం బిజెపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. 

ఈవీఎంల మీద జగన్ సుద్దపూస ట్వీట్!

సంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్దపూసనీ లాగా నంగి వేషాలు వేయాలంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాతే ఎవరైనా. తాను ఐదేళ్ళపాటు అద్భుతంగా  పరిపాలించానని, ఎక్కడో ఏదో తేడా జరిగి తాను ఘోరంగా ఓడిపోయానని ఆయన బలంగా నమ్ముతున్నారు. శ్లేష్మంలో ఈగలాగా అలాంటి నమ్మకంలో కొట్టుమిట్టాడుతున్న ఆయన కళ్ళకు ఏం కనిపిస్తుంది? ఈవీఎంలు కనిపిస్తాయి. అందుకే తన ఓటమికి బాధ్యతని ఈవీఎంలకి అంటగట్టే ప్రయత్నం మొదలెట్టారు. అందులో భాగంగా ఎక్స్ అలియాస్ ట్విట్లర్లో ఒక మెసేజ్ పారేశారు. ఆ మెసేజ్‌లో సారాంశం ఏంటంటే, ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన అన్ని ప్రజాస్వామ్య దేశాలు పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నాయి. ఈవీఎంలను వాడటం లేదు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్ దిశగా అడుగులు వేయాలి. జరిగిన న్యాయం కనిపించాలని ఏ విధంగానైతే కోరుకుంటామో... అలాగే ప్రజాస్వామ్యం పటిష్టంగా వుండటమే కాకుండా, నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి’’ అని. అమ్మా జగనూ.. నీ పని అయిపోయింది. నువ్వెన్ని సుద్దపూస కబుర్లు చెప్పినా జనం నమ్మరు. అది తెలుసుకో ముందు.

యూపీకి సీఎం అయినా అమ్మకూచే!

అమ్మ చిన్నతనంలో కొంగున ముడి వేసుకున్న చిల్లర డబ్బులను కొడుకు చేతిలో పెట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో బాబూ అని చెబుతుంది. అటువంటి తల్లిని కుమారుడు పెద్దయ్యాకా నెత్తిన పెట్టి చూసుకుంటారు. అయితే రాజకీయాలలో తల్లి, చెల్లి కాదు, అధికారం, ఆధిపత్యం ఇవే రాజ్యమేలుతాయి.  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో అదే జరిగింది. తన కోసం, తాను రాజకీయంగా ఉన్నతంగా ఎదగడం కోసం అహర్నిశలూ కృషి చేసిన తల్లినీ చెల్లినీ జగన్ రాష్ట్రం దాటించేశారు. తన అధికారం స్వార్జితమనీ, అందులో మీకు భాగం లేదనీ తన చేతల ద్వారా విస్పష్టంగా చెప్పేశారు. చెల్లిని ముందే గెంటేసిన జగన్ పార్టీ ప్లీనరీ వేదికగా అమ్మ చేత వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. పార్టీతో అప్పటి వరకూ ఉన్న బంధాన్ని పుటుక్కున తెంచేశారు. ఇది ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు అయితే... దేశంలోనే అతి  పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ది మరో తీరు. ఆయనకు అమ్మమీద అపారమైన ప్రేమాభిమానాలున్నాయి. అయితే కుమారుడి అధికారం, హోదా, పదవి కారణంగా వచ్చే ఏ సౌకర్యమూ తనకు వద్దనుకుంది యోగి తల్లి. ఎందుకంటే కాషాయ వస్త్రధారుడైన తన కుమారుడికి తాను బలహీనతగా మారకూడదని తలచిందా తల్లి..  ఎందుకంటే కుటుంబ బంధాలు లేని ‘యోగి’ ఆదిత్యనాథ్ ది నిరాడంబర జీవనశైలి. దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆయనది మితాహారమే. పవళింపు నేలమీదే. కుమారుడి బాటలోనే ఆయన తల్లీ నడుస్తున్నారు. తనయుడు ముఖ్యమంత్రి అయినా ఆమె తన రెక్కలకష్టంతోనే బతుకుతున్న పేదరాలు. వారిరువురూ తాజాగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. అదెక్కడంటే.. రుద్రప్రయాగ్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు రిషికేష్ లోని ఎయిమ్స్ కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సావిత్రీదేవిని చూసి నిర్ఘాంత పోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూసి కరిగి కన్నీరైన కుమారుడిని ఆ తల్లే ఓదార్చింది. క్షేమ సమాచారం కనుక్కుంది. వేళకు తింటున్నావా నాయనా అని ఆరా తీసింది.  యోగి తన తల్లిని చూడడం రెండేళ్ల తరువాత ఇదే మొదటి సారి.  తల్లికి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెనుదిరిగి వెడుతున్న యోగి ఆదిత్యనాథ్ ను చేయి పట్టి ఆపి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో బాబూ అంటూ పదివేల రూపాయలను కుమారుడికి ఇచ్చిందా తల్లి. అమ్మ ఇచ్చిన సొమ్మును కళ్లకద్దుకుని జాగ్రత్తగా జేబుతో పెట్టుకున్న యోగి ఆదిత్యనాథ్ ఆమె కాళ్లకు నమస్కరించి కన్నీటితో వెనుదిరిగారు. అనుబంధాలు, ఆప్యాయతలకు నిలువెత్తు నిదర్శనంగా  నిలిచిన ఈ దృశ్యం అక్కడి వారందరినీ కదిలించేసింది.  

చంద్రబాబు చేతుల మీదుగా ప‌సుపు చొక్కా.. దీక్ష విర‌మించిన దండ‌మూడి

దేశంలో ఏ రాజ‌కీయ పార్టీ అయినా క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అధినేత‌కు ర‌క్ష‌ణ క‌వచంలా ఉండే కార్య‌క‌ర్త‌లు చాలా అరుదుగా ఉంటారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో అలాంటి వారిని వేళ్ల‌పై లెక్క‌పెట్టోచ్చు.  అధికార పార్టీలో ఉండ‌ట‌మే రాజ‌కీయం అన్న‌ట్లుగా నేటి రాజ‌కీయ నేత‌లు మారిపోతున్నారు. కానీ, తెలుగు దేశం పార్టీకి ఆ ప‌రిస్థితి లేదు‌. ఆ పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువే. తెలుగుదేశం ఐదేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు అండ‌గా చాలా మంది నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ర‌క్ష‌ణ‌ క‌వ‌చంలా నిలిచారు. అలాంటి వారిలో ఒక‌రు కృష్ణా జిల్లా తెలుగు యువ‌త అధ్య‌క్షుడు దండ‌మూడి చౌద‌రి. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన ఐదేళ్ల పాల‌న‌లో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, నారా లోకేశ్ స‌హా ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను నానా ఇబ్బందులు పెట్టారు. నేత‌ల‌పైనే కాదు.. ఏకంగా చంద్ర‌బాబు నాయుడుపైనే అక్ర‌మ కేసులు పెట్టి జైలు పంపించారు. ఆ స‌మ‌యంలో పార్టీకి అన్నివిధాల అండ‌గా నిలిచిన తెలుగుదేశం నేత‌ల్లో దండ‌మూడి చౌద‌రి ఒక‌రు.  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీడీపీ శ్రేణుల‌పై సాగిస్తున్న ద‌మ‌న‌కాండ‌ను నిర‌సిస్తూ  2023 జ‌న‌వ‌రి నెల‌లో న‌ల్లచొక్కా ధ‌రించి దండ‌మూడి చౌద‌రి దీక్ష‌  పూనాడు. ఆ రోజు నుంచి న‌ల్ల‌చొక్కాను ధ‌రిస్తూ జ‌గ‌న్ పాల‌న‌పై నిర‌స‌న తెలుపుతూ వ‌చ్చారు. జ‌గ‌న్ అరాచ‌క పాల‌న నుంచి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆదేశాల‌తో ముందుకు సాగారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో తెలుగుదేశం కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో దండ‌మూడి చౌద‌రి చంద్ర‌బాబును క‌లిసి బాబు చేతుల మీదుగా ప‌సుపు చొక్కాను స్వీక‌రించి న‌ల్లచొక్కా దీక్ష‌ను విర‌మించాడు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పార్టీ బ‌లోపేతానికి కృషిచేస్తూనే, జ‌గ‌న్ అరాచ‌క పాల‌నలో  ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తూ వ‌చ్చిన దండ‌మూడి చౌద‌రిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా  అభినందించారు. ప‌సుపు చొక్కాను చౌద‌రి భుజాల‌పై క‌ప్పి మున్ముందు పార్టీ బ‌లోపేతానికి మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేస్తూ, అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను తొల‌గించేలా పార్టీ త‌ర‌పున కృషిచేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు.  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చి, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి  ప్ర‌భుత్వ పాల‌న‌పై దృష్టిసారించారు. వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల బాగోగుల‌పైనా చంద్ర‌బాబు దృష్టి సారించారు. త‌న క్యాబినెట్ ఎంపిక‌లోనూ ఆ మార్క్ చూపించారు. రాబోయే కాలంలో.. గ‌త ఐదు సంవ‌త్స‌రాల కాలంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేసిన నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించి వారికి పార్టీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టేందుకు చంద్ర‌బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే దండ‌మూడి చౌద‌రికి కీల‌క ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌జ‌రుగుతుంది. అధికారంలో ఉన్న‌ప్పుడే కాదు.. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడుకూడా పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ, పార్టీ బ‌లోపేతానికి క‌ష్ట‌ప‌డే నేత‌ల‌కు తెలుగుదేశంలో ఏ విధంగా న్యాయం జ‌ర‌గ‌బోతుందో రాబోయే కాలంలో చంద్ర‌బాబు చూపించ‌బోతున్నార‌ని ఆ పార్టీ  నేత‌లు పేర్కొంటున్నాయి.

కిషన్ రెడ్డికి ఇది చాలెంజ్... ఇకపై  జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జి 

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న జ‌మ్మూక‌శ్మీర్‌, హ‌రియాణా, మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్‌ల‌కు బీజేపీ ఇన్‌ఛార్జ్‌ల‌ను నియ‌మించింది. దీనిలో భాగంగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డికి జ‌మ్మూకశ్మీర్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అలాగే హ‌రియాణాకు ఇన్‌ఛార్జ్‌లుగా ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, బిప్ల‌వ్ దేవ్‌ల‌ను నియ‌మించింది. మ‌హారాష్ట్ర బాధ్య‌త‌లు భూపేంద్ర యాద‌వ్‌, అశ్వినీ వైష్ణ‌వ్‌కు అప్ప‌గించ‌డం జ‌రిగింది. ఇక శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌, హిమంత బిశ్వ‌శ‌ర్మ‌లను ఝార్ఖండ్ ఇన్‌ఛార్జ్‌లుగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లో రాజకీయ నేతగా ఎదిగిన వ్యక్తి. ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న హైదరాబాద్ లోనే ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది.  ఒకప్పుడు టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న కిషన్ రెడ్డికి జమ్ము కాశ్మీర్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే టెర్రరిస్టుల స్థావరంలో కిషన్ రెడ్డి ఎన్నికలు  జరపాలని హైకమాండ్ ఆదేశించింది.  లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మళ్లీ ఐదేళ్ల వరకు లోక్‌సభ ఎన్నికలు లేవు. అయినా మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము-కాశ్మీర్ సహా మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం.. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమైంది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులు, సహ ఇంచార్జులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం  ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ఖరారు చేసే సమయానికే ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థుల కంటే నాలుగు అడుగులు ముందుండాలని చూస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో ఎన్నికల ఇంచార్జులు కీలకం కానున్నారు. ప్రదేశ్ చునావ్ ప్రభారీ (రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి) పేరుతో ప్రతి రాష్ట్రానికి బీజేపీ ఇంచార్జులను నియమిస్తూ ఉంటుంది. ఆయా రాష్ట్రాల వ్యవహారాలు చూసుకునే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులకు అదనంగా ఎన్నికల ఇంచార్జులు అక్కడ ఉండి పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి లద్దాఖ్ ప్రాంతాన్ని వేరు చేసిన విషయం తెలిసిందే. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, మిగతా జమ్ము-కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ లో కూడా కొన్ని నియోజకవర్గాలను ప్రకటిస్తూ అసెంబ్లీని పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ద్వారా రాష్ట్రపతి పాలన నడుస్తోంది. ఈ రాష్ట్రానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవగా.. త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ రాష్ట్ర హోదాతో సంబంధం లేకుండా అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే విషయంలోనూ పిటిషన్లు దాఖలవగా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్ము-కాశ్మీర్‌కు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కాశ్మీర్ లోయ పూర్తి అల్లకల్లోలంగా మారింది. ఏడాది కాలం పాటు ఆ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఘర్షణలతో అట్టుడుకిన ఆ ప్రాంతంలో మెల్లమెల్లగా శాంతి నెలకొంది. మారిన కాశ్మీర్ కనిపిస్తోంది. అభివృద్ధి పట్టాలెక్కింది. పర్యాటకం ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ ప్రాంత ప్రజల్లో సైతం మార్పు సానుకూల దృక్పథాన్ని పెంచింది. అయితే ఇదంతా చూసి ఓర్వలేని పాకిస్తాన్.. కుట్రలు చేస్తూనే ఉంది. తమ భూభాగంపై శిక్షణ ఇచ్చి, అధునాతన మారణాయుధాలు సమకూర్చి ఉగ్రవాదులను మన భూభాగంపైకి పంపుతోంది. ఇంతకాలం పాటు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న సీమాంతర ఉగ్రవాదులు, ఈ మధ్య జమ్ము ప్రాంతంలో యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. భౌగోళికంగా హిందూ, సిక్కు ప్రజలు ఎక్కువగా ఉన్న జమ్ములో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమస్య పెద్దగా లేకపోయినా, అత్యధిక శాతం ముస్లిం జనాభా కల్గిన కాశ్మీర్ లోయ కాషాయ దళానికి సవాళ్లు విసురుతోంది. ఆ పార్టీ తరఫు ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారిని ఉగ్రవాదులు వెంటాడి హతమార్చుతున్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం బీజేపీకి అసలు సిసలు సవాలుగా మారింది. ఇలాంటప్పుడు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, వ్యూహాలు, ప్రణాళికలను అమలు చేయడం కూడా అంత సులభమేమీ కాదు. అలాంటి రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి, ఈ రాష్ట్రంపై గట్టి పట్టు సాధించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన అక్కడే ఉండి ఎన్నికల వ్యూహాలు అమలు చేశారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ హైకమాండ్.. అసెంబ్లీ ఎన్నికల బాధ్యతల్ని కూడా ఆయన భుజాలపై మోపింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు సవాళ్లతో కిషన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నాయి.

జగన్ హయాంలో ‘అసలు స్వరూపా’నంద!

గత ఐదేళ్ల కాలంలో జగన్ హయంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు అన్నీ  ఇన్నీ కాదు. జగన్ హయాంలో అక్రమార్జన, ప్రభుత్వ ధన దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు అంటే  జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. నిబంధనలను తోసి రాజని జగన్ తన అస్మదీయులకు, అనుయాయులకు అప్పనంగా  ప్రభుత్వ ధనాన్ని దోచి పెట్టేశారు. రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడానికి  పైసా విదల్చని జగన్ ప్రభుత్వం తన అనుయాయులకు మాత్రం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టింది. అలా జగన్ హయాంలో ఆయాచితంగా కోట్ల రూపాయల మేర లబ్ధి పొందిన వారిలో, అనుచిత ప్రయోజనం పొందిన వారిలో స్వరూపానంద స్వామి కూడా ఉన్నారు.  ఔనుజగన్ హయాంలో  ప్రజాధనంతో విలాస జీవితాలు గడిపిన వారిలో  వైసీపీ నాయకులే కాదు.. వారితో పరిచయం, కొద్ది పాటి స్నేహం ఉన్నవారు కూడా ఉన్నారు. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తిన్నారన్నట్లు.. జనం సొమ్ముతో జల్సాలు చేసుకున్న వారిలో స్వరూపానంద స్వామి ఒకరు. జగన్ హయాంలో  ఆయనకు సకల సౌకర్యాలూ నడిచివచ్చేశాయి.  జగన్  హయాంలో అర్హతలు లేకపోయినా స్వరూపానంద స్వామికి వై కేటగరి సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించింది.  పెందుర్తిలోని ఆయన పీఠం నలుగురు గన్ మెన్లతో పికెట్ ఏర్పాటు చేసింది. దీనిని పర్యవేక్షించడానికి అదనంగా ఒక ఎస్ ఐను నియమించింది. ఒక ప్రొటోకాల్ కారును సైతం కేటాయించింది. స్వరూపానంద స్వామికి నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన ఈ ఏర్పాట్ల కారణంగా ప్రభుత్వానికి నెలకు 18 నుంచి 24 లక్షల ఖర్చు అయ్యేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు స్వరూపానంద స్వామికి భద్రతను తొలగించారనుకోండి అది వేరే సంగతి. ఇక తన భద్రతా సిబ్బందితో స్వరూపానంద దురుసుగా ప్రవర్శించేవారన్న ఆరోపణలు ఉన్నాయి5. స్వరూపానంద ఆగడాలు ఇంతటితో ఆగలేదు. ఆయన తిరుమల వెళ్లిన ప్రతి సారి ఘాట్ రోడ్డుపై తన వాహనాన్ని వేగంగా నడపాలని డ్రైవర్ ను ఆదేశించేవారు. అలిపిరి నుంచి తిరుమలకు పదిహేను నుంచి ఇరవై నిముషాలలో వెళ్లా4లని ఒత్తిడి తెచ్చేవారట. నిబంధనల మేరకు అలిపిరి నుంచి తిరుమల వరకూ ఏ వాహనమైనా సరే 45 నిముషాల కంటే తక్కువ సమయంలో వెళ్లేందుకు వీలులేదు. కానీ ముఖ్యమంత్రి జగన్ కు గురువు అన్న ఒకే ఒక్క కారణంతో అధికారులు స్వరూపానంద ఆగడాలను చూసీ చూడనట్లు వదిలేసేవారు. స్వరూపానంద అరాచకాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. 

19 నుంచి పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సెక్రటేరియెట్లో చాంబర్ రెడీ అయిపోయింది. ఆయనకు రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 నంబర్ రూం కేటాయించారు. అదే అంతస్థులో జనసేన కు చెందిన ఇద్దరు మంద్రుల చాంబర్లు కూడా ఉన్నాయి. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ చాంబర్లు పక్కపక్కనే ఉండేలా కేటాయింపులు జరిగాయి. చంద్రబాబు కేబినెట్ లో పవన్ కల్యాణ్ కు తన కేబినెట్ లో కీలకమైన శాఖలు కేటాయించారు. పవన్ కల్యాణ్ కూడా తనకు కేటాయించిన శాఖల పట్లే కాకుండా, తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులకూ కేటాయించిన శాఖల పట్ల సంతృప్తి, సంతోషం కూడా వ్యక్తం చేశారు. తమ పార్టీకి కేటాయించిన శాఖలు తమ పార్టీ మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ఇక తనకు కేటాయించిన శాఖలు తన మనస్సుకు దగ్గరగా ఉన్నాయని చెప్పిన పవన్ కల్యాణ్.. ఈ నెల 19న బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.  ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదన్న కృత నిశ్చయంతో మూడు పార్టీల నేతలూ, క్యాడర్ కలిసి పని చేయడంతో ఓట్ల బదలీ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా సాగింది. ఫలితమే జగన్  అత్యంత అవమానకరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలలో గెలిచిన వైసీపీ ఈ ఎన్నికలలో 11 స్తానాలకే పరిమితమైందంటే, కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోలేదంటేనే జనం జగన్ ను ఆయన పార్టీని ఎంతగా తిరస్కరించారో అర్ధమౌతుంది.  

పవన్ కళ్యాణ్ కు చాంబర్ కేటాయింపు 

ఇటీవలె జరిగిన ఎపి సార్వత్రిక ఎన్నికల్లో నూటికి నూరు మార్కులు సంపాదించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సంపాదించింన జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక చాంబర్ కేటాయించారు.  స‌చివాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఛాంబ‌ర్ అలాట్ అయ్యింది. . రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని ఆయ‌న కోసం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌సేన మంత్రులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంత‌స్తులో ఛాంబ‌ర్లు కేటాయించారు. దీంతో ఈ ముగ్గురు ప‌క్క‌ప‌క్క గ‌దుల్లోనే త‌మ విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు.  ఇక ప్ర‌స్తుతం ఆయా ఛాంబ‌ర్ల‌లో ఫ‌ర్నిచ‌ర్‌, ఇత‌ర సామాగ్రిని అధికారులు స‌మ‌కూర్చే ప‌నిలో ఉన్నారు. కాగా, ఎల్లుండి మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.  కాగా, చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్‌ను ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది.

ఇక సోమవారం కాదు పోలవారం!

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం బహుళార్థ సాథక ప్రాజెక్టును జగన్ సర్కార్ పక్కన పెట్టేసింది. చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పడకేశాయి. రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ పోలవరం ప్రాజెక్టు పనుల వేగాన్ని గణనీయంగా తగ్గించేశారు. కనీస అవగాహన లేని అంబటి రాంబాబుకు జలవనరుల మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టిన జగన్ పోలవరంపై తనకు ఉన్న శ్రద్ధ ఏమిటో చెప్పకనే చెప్పేశారు.  జగన్ అరాచకపాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు ద్వారా చరమగీతం పాడేశారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో పోలవరం పనులు ఇక జోరందుకుంటాయన్న ఆశ సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో గతంలో చంద్రబాబో పోలవరం ప్రాజెక్టు పనులను  తరచుగా పర్యవేక్షించి ఆ పనులను పరుగులెత్తించిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వారం వారం పోలవరం సందర్శనకు ప్రత్యేక సమయం కేటాయించే వారు. వారం ఆరంభంలోనే ఆయన పోలవరం సదర్శనకు రావడంతో ఆయన పర్యటన ఫలితంగా వారం అంతా పనులు జోరుగా సాగేవి. నిర్దేశించిన గడువు మేరకు నిర్దేశిస పనులు పూర్తయ్యేలా ఆయన తరచూ చేసే సమీక్షలు పోలవరం వేగం పుంజుకోవడానికి దోహదపడ్డారు. ఆయన హయంలో సోమవారం పోలవారంగా మారిపోయింది. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పేవారు. తనకు సోమవారం లేదనీ, అది పోలవారమని చంద్రబాబు చమత్కరించేవారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు మొత్తం మొత్తం 83 సార్లు పోలవరం పనులను సమీక్షించారు. అంతే కాదు పోలవరం పూర్తికి అత్యంత కీలకమైన ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయ్యే వరకూ తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేది లేదని భీష్మించి మరీ అనుకున్నది సాధించారు.  అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయంపాలై వైసీపీ అధికారలోకి వచ్చి జగన్ సీఎం కావడంతో పోలవరం పనులు ముందుకు సాగలేదు. అవగాహనా లోపం,  ప్రాధామ్యాలు మారిపోవడంతో జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, పురోగతి కంటే బటన్ నొక్కుడు సంక్షేమంపైనే జగన్ దృష్టి పెట్టారు. దీంతో పోలవరం పనులు కుంటుపడ్డాయి. దీనిపై రైతులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తిపై జగన్ దృష్టి పెట్టక పోవడాన్ని రైలులే కాదు సామాన్య జనం కూడా తప్పుపట్టారు. సరే ఇప్పుడు జగన్ ప్రభుత్వం గద్దెదిగి చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో పోలవరం పరుగులు పెడుతుందనీ, ఆంధ్రప్రదేశ్ నీటి కొరతే లేని రాష్ట్రంగా మారేందుకు ఎక్కువ సమయం పట్టదనీ ప్రజలు భావిస్తున్నారు. 

ఇరికిస్తే కోడెల... దొరికిపోతే జగన్!

వెనకటికి ఒకడు విపరీతంగా దొంగతనాలు చేసేవాడు. విలాసంగా దర్జాగా బతికేవాడు. తన తెలివి తేటలతో డబ్బులు సంపాదించేస్తున్నాడు అనుకుని  అతన్ని ఆ ఊరి జనం దొరదొరా  అని సంభోధించడం ప్రారంభించారు. దొంగతనాలు చేసి దర్జాగా బ్రతుకున్న విషయం ఓ స్నేహితుడికి తెలియగంతో అతన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. వొరేయ్ నువ్వు దొంగతనం చేస్తున్నావని ఊరి జనానికి తెలిస్తే నీకు అవమానం కాదా అని ప్రశ్నించాడు. ఇందుకు ఆ దొంగ సమాధానం నేను దొరికితే కదా అప్పటి వరకు దొరగానే చెలామణి అవుతాను అని జవాబిచ్చాడు.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితి కూడా ఆ దొంగ పరిస్థితే  ఉంది.   వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నీచర్‌ను అక్రమంగా తన ఇంట్లో ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎక్కువగా  తన క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన చేసేవారు. సెక్రటేరియట్ కు కేవలం మంత్రి వర్గ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేవారు. తాడేపల్లిలోని తన ఇంటి పక్కనే మరో భవనం నిర్మించారు. దాన్నే క్యాంప్ ఆఫీసుగా చెబుతున్నారు. సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పరంగా జీవోలు విడుదల చేసి ఆ ఇంటికి అదనపు సౌకర్యాలు, ఫర్నీచర్ కల్పించారు. అంతా ప్రజాధనంతోనే  ఈ సౌకర్యాన్ని కల్పించారు. ప్రజల ముక్కుపిండి  వసూలు చేసిన పన్నులు పూర్తిగా ప్రజాధనం అవుతుంది.  ఆ ప్రజాధనం మీద జగన్ కన్ను పడింది. ఐదేళ్ల నుంచి దోచుకున్న ప్రజాధనంతో తన ఇంటికి అవసరానికి మించి  ఫర్నిచర్  వాడుకున్నాడు. ఎపి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది. తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మీద  ఉన్నమమకారం తగ్గించుకోని జగన్ తన ఇంట్లో అట్టే పెట్టేసుకున్నాడు.  . ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎంగా రాజీనామా చేసినప్పటికీ ఫర్నిచర్ను మాత్రం అప్పగించలేదు. ప్రస్తుతం ఇదే అంశం వివాదాస్పదమైంది.  ఇప్పుడు తాడేపల్లిలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించిన భవనాన్ని పార్టీ కార్యాలయంగా  ప్రకటించారు. ఆ పార్టీ కార్యాలయంలోనే జగన్ తన పార్టీ సమీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  ఎంపీలతో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశం వైరల్ అయింది. దీనికి కారణం ఎప్పుడూ అధికారిక సమీక్షలు, రివ్యూలు, బటన్లు నొక్కే కార్యక్రమాలు నిర్వహించే చాంబర్ లోనే ఆయన సమావేశం పెట్టారు. ఇప్పటి వరకూ అది సెక్రటేరియట్ అనుకున్నాం కానీ జగన్ ఇల్లా అని ఆశ్చర్యపోతున్నాయి టీడీపీ శ్రేణులు. జగన్ వాడుకున్న ఫర్నిచర్ ను గత ఐదేళ్లుగా చూసిన వారు  అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే ఫర్నిచర్ ను వాడటాన్ని సహించలేకపోతున్నారు. న్యూటన్ థర్డ్ లా ను మననం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వెల్  అండ్  అండ్ అపోజిట్ రియాక్షన్ అనేది ప్రపంచప్రఖ్యాత తత్వవేత్త న్యూటన్ థర్డ్ లా చెబుతుంది.  80 వ దశకంలో పల్నాడు ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్  కోడెల శివప్రసాద్  ఎన్టీఆర్ స్పూర్తితో    రాజకీయాల్లో వచ్చారు. హోంమంత్రిగా, సుదీర్ఘకాలం శాసనసభా స్పీకర్ గా పని చేసిన అనుభవం ఉంది. పదవీకాంక్ష లేకుండా ప్రజల మేలు కోసమే తన జీవితం చివరి క్షణాల్లో  పోరాడిన కోడెల శివ ప్రసాద్ పై ఫర్నిచర్ దొంగ కోడెల అని జగన్ ప్రచారం చేసాడు. తన భజన బృందంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయించాడు. పల్నాడు ప్రాంతంలో కోడెలకు ఉన్న ఇమేజిని దెబ్బతీసే విధంగా వ్యవహరించాడు.  గతంలో   వైకాపా  పార్టీ  అధికారంలోకి రాగానే జగన్ తన మార్కు రాజకీయం చేశాడు. మాజీ స్పీకర్ హోదాలో కోడెల జగన్ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు..  తన స్పీకర్ కార్యాలయం కు సమీపంలోనే ఉన్న గెస్ట్ హౌజ్ ఉండేది.   ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ కొంత తన వద్దే ఉండిపోయిందని వెంటనే ఈ ఫర్నిచర్ ను తీసుకెళ్లాలని మొదట కోడెల అర్జీ పెట్టుకున్నారు. స్పందన రాకపోయే సరికి కోడెల రెండో సారి అర్జీ పెట్టుకున్నారు. ఈ రెండు లెటర్లను జగన్ ప్రభుత్వం దాచేసి కోడెల దోచేశాడని ప్రచారం చేశారు. . కోడెల ఫర్నిచర్ దొంగ అని జగన్ తందాన బ్యాచ్ ప్రచారం చేసింది. దీంతో కోడెల తీవ్ర మనస్థాపం చెంది తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందే వారు. . డిప్రెషన్ కు లోనైన కోడెల చివరకు  ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోడెల జగన్ చేసే బ్యాడ్ ప్రొపగండకు బలయ్యారు. అబద్దాన్ని నిజం చేయడం, నిజాన్ని అబద్దం చేయడంలో జగన్ సిద్ద హస్తుడు. కోడెల ఆత్మహత్యకు పురిగొల్పిన జగన్ ఇప్పుడేమో నీతి వచనాలు పలుకుతున్నాడు.టిడిపి శ్రేణులు జగన్ ద్వంద వైఖరిని  తట్టుకోలేకపోతున్నాయి. అధికారం కోల్పోయి ఇన్ని రోజులైనా జగన్ తన ఫర్నిచర్ విషయాన్ని గోప్యంగానే ఉంచాడు. కోడెల రెండు లెటర్లు రాస్తే జగన్ ఒక్క లెటర్ కూడా ఇవ్వకుండా  తన వద్ద  ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ కొనేస్తానని బేరం పెట్టాడు. అదే  కోడెల విషయంలో రెండు నాల్కల వైఖరి అవలంబించాడు.      రెండు లక్షల విలువ చేయని ఫర్నిచర్ కోడెల వద్ద ఉన్నప్పుడు జగన్ రాచిరంపాన పెట్టాడు. పైగా కోడెల ఆత్మహత్యకు కారకుడయ్యాడు జగన్ . ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శల దాడి చేశారు.జగన్‌కు చెందిన ప్రైవేటు ఆస్తికి ఆయన సీఎం అయిన మొదటి ఐదు నెలల్లోనే రూ. 15 కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు  రిలీజ్ చేసుకున్నారని జీవోలతో సహా కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటిని జగన్ వద్ద నుంచి రికవరీ చేయాలని అంటున్నారు.   మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌ని వేధించిన కర్మఫలం జగన్ రెడ్డిని వెంటాడుతోందని వ్యాఖ్యానించారు.కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం దారుణమని, ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా? అని జగన్‌ని ఆయన ప్రశ్నించారు. ‘‘దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం.. రేటు కడతాం.. అంటే నాడు ఒప్పుకోని చట్టం నేడు ఒప్పు అవుతుందా? ఫర్నిచర్‌కు కక్కుర్తి పడ్డ వాళ్లు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారో అర్థమవుతుంది’’ అని ఉమ విమర్శించారు. నవ్వుతారని కూడా లేకుండా జగన్ చేసిన ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా? నాటి మంత్రివర్గ సభ్యులు చెప్పాలని దేవినేని ప్రశ్నించారు. తనపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

పోలవరాన్ని సందర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం (17-6-24) ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్ట్ దగ్గరకి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గరకి వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్ వే సహా వివిధ ప్రాంతాలను ఆయన చూశారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు తన పోలవరం సందర్శనలో భాగంగా స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. 

పరీక్షలకు తట్టుకుని నిలబడిన ‘స్కిల్ ’

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో  జగన్ సర్కార్ తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసింది. లేని స్కాం ఉందంటూ ఎటువంటి ఆధారాలూ లేకుండా గాలిలో ఆరోపణలను చేస్తూ చంద్రబాబును వేధించింది. 50 రోజులకు పైగా జైలులో నిర్బంధించింది. ఇంత చేసినా జగన్ సర్కార్ స్కిల్ కేసులో అవినీతిని నిరూపించడంలో ఘోరంగా విఫలమైంది. తాజా ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాభవానికి ప్రధానమైన కారణాలలో చంద్రబాబు అరెస్టు కూడా ఒకటి అనడంలో సందేహం లేదు. జగన్ సర్కార్ దమనకాండకు కూడా వెరవకుండా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ నినదించారు.  యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా యువతకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో గత చంద్రబాబు ప్రభుత్వం  3 వేల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది.  3 వేల కోట్ల రూపాయల్లో 10 శాతం  ప్రభుత్వం ఇచ్చేలా.. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ పది శాతం సొమ్ము ప్రభుత్వం చెల్లించినట్లుగా చూపించి వెనకేసుకున్నారనేది ప్రభుత్వ అభియోగం. దీనిపై సీమెన్స్ కంపెనీ అప్పట్లోనే స్పందించింది. జగన్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, అసత్యం అని కుండబద్దలు కొట్టింది. అంతే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలో  అవినీతికి ఆస్కారమే లేదని అప్పట్లోనే సిమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ విస్పష్టంగా చెప్పారు.   ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడం తనకు ఆశ్చర్యంగా ఉందని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని అప్పుడే తేటతెల్లం చేశారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించిన ఆయన.. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించినట్లు వివరించారు. సిమెన్స్ కంపెనీతో అసలు అగ్రిమెంట్ జరగలేదని సీఐడీ చేస్తున్న ఆరోపణలను ఆయన అభూత కల్పనలుగా అభివర్ణించారు.  ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం సులభమే కానీ, నిరూపించడం అసాధ్యమని చంద్రబాబు అరెస్టు సమయంలోనే ఆయన స్పష్టంగా చెప్పారు.    ఆయన మాటల్లో చెప్పాలంటే.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చింది. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు.. వారిలో   చాలామంది మంచి ఉద్యోగాలలో కూడా స్థిరపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును గతంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ కూడా మెచ్చుకుకున్నారు. అలాంటిది ఇప్పుడు అదే ఏపీఎస్ఎస్డీసీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తోందనేది   అర్థం కావడం లేదు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపి కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లుగా ప్రభుత్వం తీరు ఉంది. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని తేల్చేశారు. ప్రభుత్వం మోపిన అవినీతి ఆరోపణల కేసు ఎలా ఉందంటే.. 'విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు. ఆ వ్యక్తి బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు.  స్కిల్ డెవలప్‍మెంట్ చాలా విజయవంతమైన ప్రాజెక్టు.. 2016లో కేంద్రం ఈ ప్రాజెక్టును విజయవంతమైన నమూనాగా కూడా ప్రకటించింది. ఇదే తరహా ప్రాజెక్టులు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. ఇప్పుడు కూడా చేస్తున్నాం.  ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం పలువురి జీవితాలపై ప్రభావం చూపుతుంది. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు. రెండున్నరేళ్లుగా రకరకాలుగా తమను ఇబ్బంది పెట్టారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో ఏర్పాటు చేసిన 200కు పైగా ల్యాబ్‌లు కనిపిస్తున్నా.. అగ్రిమెంట్ జరగలేదని ఆరోపించడం దారుణం. ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇది స్కాంగా ప్రభుత్వం చెబుతుండటం విస్మయం కలిగిస్తోంది.   చంద్రబాబు అరెస్టు సమయంలో సీమెన్స్ మాజీ ఎండీ చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలని జగన్ ఘోర పరాజయం సందేహాలకు అతీతంగా తేల్చేసింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని సీమెన్స్ మాజీ ఎండీ సుమన్  న్యాయం గెలుస్తుందన్న తన విశ్వాసాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేశారని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.  ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలని ఆకాంక్షించారు. ఆనసీమెన్స్ ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వం బురద చల్లిన తీరుపై గతంలో లోకేశ్, బ్రాహ్మణులు చేసిన పోస్టులను ట్యాగ్ చేశారు. 

చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. గత ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగింది. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడారు. సీఆర్డయే చట్టాన్ని మార్చడానికి ప్యయత్నించారు. మాస్టర్ ప్లాన్ ను పక్కన పెట్టేసి ఇష్టారీతిగా భూముల పందేరానికి కూడా తెగబడ్డారు. అయితే అన్ని విషయాలలోనూ జగన్ ఫెయిలయ్యారు. ఆయన చేయగలిగిందేమిటంటే గత ఐదేళ్లుగా అమరావతి పురుగతిని స్తంభింపచేయడమే. పనులను అర్ధంతరంగా ఆపివేయడం. అమరావతి కేంద్రంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన వారిని వెనక్కు పంపేయడమే.  దీంతో అమరావతి భవిష్యత్ పై అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లోనే కాదు.. ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రుల సొంతం అవుతుందని ఆశించిన వారిలో కూడా ఆందోళన నెలకొంది. ఈ ఐదేళ్లలో అమరావతి విధ్వంసాన్ని కళ్లారా చూసిన జనం మళ్లీ అమరావతి పూర్వవైభవం ఎప్పటికి సంతరించుకునేను అన్న ఆందోళన కూడా వ్యక్తం చేశారు.  అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమైంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో అమరావతి పురోగతి పరుగులు పడుతుందనడంలో సందేహం లేదు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంగా  నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం ఉంటుందని  విస్పష్టంగా చెప్పేశారు.    2014-19 మధ్య ఆయన అమరావతి పనులను పర్యవేక్షించారు.  ఇప్పుడు కూడా ఆయనకు అమరావతి పనుల కొనసాగింపునకు సంబంధించి బాధ్యతలు ఉన్న మంత్రిత్వ శాఖనే చంద్రబాబు కట్టబెట్టారు.  అమరావతి పునర్మిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పిన ఆయన  దీనిపై పూర్తిగా అవహాన చేసుకుని నిర్దిష్టమైన కాల పరిమితిని నిర్ణయిస్తామని చెప్పారు.  అమరావతి ఫస్ట్ ఫేజ్ నిర్మాణానికి 48 వేల కోట్ల రూపాయలు అవుతుందని, మొత్తం మూడు ఫేజ్ లూ పూర్తి చేయడానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమౌతుందని చెప్పారు.   అమరావతి రోడ్ల ధ్వంసం, సామగ్రి చోరీలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధ్వంసం, చోరీలపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.  ఇక అమరావతి లో పేరుకుపోయిన చత్త, ఇష్టారీతిగా పెరిగగిపోయిన ముళ్ల కంపల తొలగింపు వేగవంతంగా జరుగుతోందని వివరించారు.  2019 నాటికే దాదాపుగా పూర్తి అయిపోయిన భవనాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ,  ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారనీ, అటువంటి వాటిని త్వరిత గతిన పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని నారయణ చెప్పారు.  మొత్తం మీద ఆంధ్రుల రాజధాని అమరావతి, ప్రపంచ స్థాయి నగరంలో త్వరలోనే రూపుదాల్చనుందని నారాయణ ఉద్ఘాటించారు.