పవన్ కల్యాణ్ స్పీడ్ మామూలుగా లేదుగా?

పవన్ కల్యాణ్ అనగానే ఆయన సమయ పాలన విషయంపై పెద్దగా దృష్టి పెట్టరన్న భావన అందరిలోనూ ఉంది. అయితే అది అపప్రద మాత్రమేనని పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే రుజువు చేశారు. ప్రజా సమస్యల విషయంలో ఇసుమంతైనా ఉదాశీనత ప్రదర్శించబోనని తన తీరు ద్వారా స్పష్టం చేశారు. ఔను ముంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఆయన మినిస్టర్ ఆన్ డ్యూటీ అన్నట్లుగా పనిలోకి దిగిపోయారు. తన శాఖలపై సుదీర్ఘ సమీక్ష చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. ప్రజా సమస్యలపై పనుల వేగవంతంపై చర్చించారు.  ఔను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే పనిలో దిగిపోయారు. బుధవారం (జూన్ 19)న ఆయన సెక్రటేరియెట్ లోని తన చాంబర్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతే ఆ క్షణం నుంచీ ఆయన డ్యూటీ మొదలెట్టేశారు. తొలి రోజే ఆయన అధికారులతో తన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష కూడా అలా ఇలా కాదు ఏకంగా పది గంటల పాటు సాగింది. అధికారులకు ఆయన మూడు నెలల టార్గెట్ ఫిక్స్ చేశారు.  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులకు ఆయన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, గ్రామాలలో నీటి కొరత పరిష్కారం తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రెడీ చేయాలని ఆదేశించారు. ఈ సమస్యలన్నీ మూడు నెలల్లో పరిష్కారం కావాలని నిర్దేశించిచారు. అలాగే మూడు నెలలలో వివిధ అంశాలపై సాధించాల్సిన లక్ష్యాలపై టార్గెట్ ఫిక్స్ చేశారు.  పవన్ కల్యాణ్ ప్రధానంగా గ్రామాలలో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. అలాగే మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.  ప్రజా సమస్యల పరిష్కారంలో  నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఈ సుదీర్ఘ సమీక్ అనంతరం పవన్ కల్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తో తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సంతకాన్ని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే ఫైలుపై సంతకం చేశారు. రెండో సంతకం గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం చేశారు.

 కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసిన ఎవిడెన్స్ ఉంది: ఈడీ

అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే ఉద్దేశ్యంతో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించింది. ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు.  అనూహ్యంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ బుధవారం కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. పీఎంఎల్ఏ కింద ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో కూడా ఆయనను నిందితుడిగా పేర్కొనలేదన్నారు. కిందికోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మే 10న సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. అయితే డబ్బులు తీసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆయనను అరెస్ట్ చేయడానికి ముందే ఆధారాలు సేకరించినట్లు తెలిపింది.  

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటన ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్ హయాంలో సర్వ విధాలా భ్రష్టుపట్టిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా అవహేళనలు ఎదుర్కొంది. అభివృద్ధి అడుగంటి పోయింది. అరచకం రాజ్యమేలింది. జగన్ ప్రభుత్వ పతనం తరువాత అన్ని విధాలుగా వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి బాట పట్టించి, అదే సమయంలో ప్రజా సంక్షేమానికీ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే గురుతర బాధ్యత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబుపై పడింది. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచే అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే   పని మొదలు పెట్టేశారు. అవినీతి అధికారులను తప్పించడం దగ్గర నుంచి ఏయే రంగాల్లో ఏయే పనులు జరగాలన్నదానిపై ఒక స్పష్టమైన విజన్ తో ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన ప్రాధాన్యతలు ఏమిటన్నది విస్పష్టంగా చాటుతున్నారు. ప్రధానంగా పోలవరం, అమరావతి నిర్మాణాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా తన తొలి అధికారిక పర్యటన పోలవరం నుంచే మొదలు పెట్టారు. ఇక ఆ తరువాత అమరావతి నిర్మాణం. సీఎంగా ఆయన రెండో పర్యటన అమరావతి ప్రాంతంలోనే చేయనున్నారు. గురువారం (జూన్ 20) చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు.  నాడు జగన్ ప్రభుత్వం తన విధ్వంస పాలన ఆరంభించిన చోట నుంచే చంద్రబాబు తన పర్యటన మొదలు పెడుతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక కూల్చివేతలో జగన్ తన విధ్వంస పాలనకు శ్రీకాం చుట్టారు. ఇప్పుడు ఆ ప్రజావేదిక శిధిలాల పరిశీలనతోనే జగన్ తన పర్యటన ప్రారంభించనున్నారు.  అక్కడ నుంచి ఆయన అమరావతి ప్రాంతాలలోని నిర్మాణాల పరిశీలనకు బయలుదేరుతారు. జగన్ నిర్వాకం కారణంగా అమరావతి విధ్వంసం ఏ స్లాయిలో ఉందో పరిశీలిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉద్దండరాయుని పాలెంలో 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి సీడీయాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఇకానిక్ నిర్మానాల కోసం కేటాయించి పనులు ప్రారంభించిన ప్రదేశాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.  ఐదేళ్ల జగన్ పాలనలో రాజధాని పనులను నిలిపివేసి, నిర్మాణం పూర్తైన, నిర్మాణంలో ఉన్న భవనాలను పాడుబెట్టేసిన సంగతి తెలిసిందే. దాదాపు 80శాతం పూర్తైన భవనాలను సైతం జగన్ సర్కార్ అలాగే వదిలేసింది. గతంలో విపక్ష నేతగా చంద్రబాబు అమరావతి పర్యటనను జగన్ సర్కార్ అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించి జగన్ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో పరిశీలించనున్నారు.  

కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ జులై 3 వరకు పొడిగింపు 

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కోర్టు జులై 3వ తేదీ వరకు పొడిగించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పైన కొన్నిరోజులు బయట ఉన్నారు. తిరిగి ఈ నెల 2వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోయారు. నాటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. తాజాగా కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కూతురు కవిత ఇదే కేసులో మూడు నెలల క్రితం అరెస్ట్ అయినప్పటికీ ఇంత వరకు బెయిల్ లభించలేదు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ  మాజీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా అందరికంటే ముందు అరెస్ట్ అయినప్పటికీ  ఇంతవరకు బెయిల్ లభించకపోవడంతో  కవిత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. తన అన్న కెటీఆర్ గత శుక్రవారం తీహార్ జైల్లో ములాఖత్ అయినప్పుడు కవిత ఎమోష్ నల్ అయ్యింది. బాపూ(కెసీఆర్) ఆరోగ్యం ఎలా ఉంది. పిల్లలు ఎలా ఉన్నారు? నేను ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయా అని కెటీఆర్ ను కవిత అడిగినట్లు తెలుస్తోంది. నీకు బెయిల్ వస్తుంది అని కెటీఆర్ చెల్లెలు కవితకు భరోసా ఇచ్చారు. చెల్లెలు బాగా ఎమోష్ నల్ కావడంతో  కెటీఆర్  పార్టీలో కవితకు సన్నిహితులైన మహిళా నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇద్దరు మాజీ మంత్రులైన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లను మంగళవారం తీహార్ జైలుకు వెళ్లి పరామర్శించాలని కోరినట్టు సమాచారం. కెటీఆర్ కోరిక మేరకు సబిత, సత్యవతి రాథోడ్ ములాఖత్ లో కవితను కల్సి ధైర్యం చెప్పారు. 

ఏపీ జనం మీ ఓటర్లు కాదని అంటారా జగన్!

ఘోర ఓటమి షాక్ లో ఉన్న జగన్ కు అర్ధం కావడం లేదు కానీ.. బ్యాలెట్ అయినా, ఈవీఎంలైనా జగన్ కు ఇదే మర్యాద జరిగి ఉండేది. ఇప్పుడిలా ప్రజాస్వామ్యం, ఈవీఎంలు, నమ్మకం అంటూ మాట్లాడుతున్న జగన్ గత ఎన్నికలలో తన విజయంపై నమ్మకంతో ఈవీఎంలకు మద్దతుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో  తెగ చక్కర్లు కొడుతోంది. అయినా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి ముందే జగన్ తన పరాజయాన్ని బ్యాలెట్ లలోనే ఖరారు చేసుకున్నారు. ఆ విషయాన్ని చాలా కన్వీనియెంట్ గా మర్చిపోయి లేకపోతే మరిచిపోయినట్లు నటిస్తూ జగన్, ఆయన మేనమావ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వంటి వారు ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే చంద్రబాబు విజయం అంటూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. అయితే గత ఏడాది మార్చిలో బ్యాలెట్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల ఘోర పరాజయం గురించి ఇప్పుడు నెటిజనులు గుర్తుచేస్తూ జగన్ ఓటమి జనం రాసిన స్క్రిప్ట్ అని చెబుతున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పార్టీ పరాజయం పాలైనప్పుడూ, జగన్ తనకు పెట్టని కోటగా చెప్పుకునే రాయలసీమలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారనీ, ఆ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనూ జరిగిన విషయం జగన్ కు గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు.   అయితే అప్పట్లో సకల శాఖల మంత్రి, జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  ఈ ఓటమిని లెక్కే చేయం, అయినా వీళ్లు మా ఓటర్లు కాదని వాకృచ్చారు. ఇప్పుడూ మా పార్టీని ఓడించిన ప్రజలు మా ఓటర్లు కాదు అని అంటారా జగన్!

ప్రభుత్వ ఫర్నిచర్... జగన్‌కి ‘జీబీ’ మాములుగా లేదుగా!

2019లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుచేసుకుందాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు స్పీకర్‌గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ‘‘నా నివాసంలో కొంత ప్రభుత్వ ఫర్నిచర్ వుంది. వాటిని స్వాధీనం చేసుకోవల్సిందిగా కోరుతున్నాను’’ అని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకసారి కాదు.. రెండుసార్లు అలా లేఖ రాశారు. అయితే జగన్ ప్రభుత్వం ఆ లేఖలు దాచేసింది. లేఖలు రానట్టు నటించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన పదిహేను రోజుల తర్వాత కోడెల మీద కేసు పెట్టింది. ప్రభుత్వ ఫర్నిచర్ తన దగ్గర ఉంచుకున్నారని, తిరిగి ఇవ్వలేదనేది ఆ కేసు సారాశం. నిబంధనల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన పదిహేను రోజుల లోపల పాత ప్రభుత్వానికి సంబంధించినవారు తమ దగ్గర వున్న ప్రభుత్వ సామగ్రిని తిరిగి ఇచ్చేయాల్సి వుంటుంది. ఈ నిబంధన తెలిసే కోడెల రెండుసార్లు లేఖ కూడా రాశారు. జగన్ ప్రభుత్వం ఒక కుట్రప్రకారం ఆ లేఖలను దాచిపెట్టింది. గడువు దాటేవరకు వేచి చూసి, కోడెల మీద కేసు పెట్టింది. మానసికంగా వేధించింది. ఆయన క్రుంగిపో్యేలా చేసింది. చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది.  ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో, ఆయన క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వానికి సంబంధించిన చాలా ఫర్నిచర్, పరికరాలు వున్నాయి. బుద్ధీ జ్ఞానం వున్న ఎవరైనా ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఫర్నిచర్‌ని తీసుకెళ్ళాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ‘జీ’ (గర్వం), ‘బీ’ (బాధ్యతారాహిత్యం) ఎక్కువ కాబట్టి ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగి ఇవ్వకుండా కూల్‌గా కూర్చున్నారు. ఏ చేయని నేరాన్ని అయితే కోడెల శివప్రసాద్ మీద మోపి, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారో... అదే నేరాన్ని జగన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. జగన్‌కి వున్న అదృష్టం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయంగా వేధించే ప్రభుత్వం కాదు.. జగన్ ఆత్మహత్య చేసుకునేంత సున్నిత మనస్కుడూ కాదు. జూన్ 4వ తేదీన ఎన్నిక ఫలితాలు వచ్చాయి. అంటే బుధవారం (19-06-24) నాటికి పదిహేను రోజుల గడువు పూర్తవుతుంది. ఇంతవరకు జగన్ వైపు నుంచి ఫర్నిచర్ తిరిగి ఇచ్చే ఉద్దేశాలేవీ కనిపించలేదు. దాంతో సచివాలయ జీఏడీ జగన్‌కి బుధవారం నాడు లేఖ రాసింది. ఆ లేఖలో జగన్ స్వాధీనంలో వున్న ఫర్నిచర్, వస్తువుల చిట్టాని కూడా జతచేసింది. అధికారం కోల్పోయిన 15 రోజుల్లోగా ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలన్న సచివాలయ నిబంధనల గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.  ఇదిలా వుంటే, తనదగ్గర వున్న ఫర్నిచర్ విషయంలో జగన్ వైపు నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం, సమాధానం రావడం లేదు. కానీ, వైసీపీ నాయకుడు అప్పిరెడ్డి స్పందించారు. తమ నాయకుడి దగ్గర వున్న ఫర్నిచర్ వెల ఎంతో లెక్క కడితే వాటికి డబ్బు చెల్లిస్తామని ఆయన అంటున్నారు. నిజానికి ఇలా స్పందించాల్సింది జగన్ మాత్రమే. అప్పుడు ప్రభుత్వం వస్తువులకు లెక్క కడుతుందా, లేక వస్తువులే కావాలని అంటుందా అనేది తర్వాత సంగతి. అలాంటిది జగన్ ఎంతమాత్రం స్పందించకుండా, ఎవరో దారిన పోయే దానయ్య స్పందించడం ఒక వింత. ఇప్పటికైనా జగన్ తన ‘జీ’ (గర్వం) ‘బీ’ (బాధ్యతారాహిత్యం) తగ్గించుకుని ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగి ఇచ్చే విషయంలో స్పందిస్తారో... లేక ఈ విషయాన్ని తెగేదాకా లాగి గొడవకి దిగుతారో చూడాలి.

సమస్యల పరిష్కారం.. సమూల ప్రక్షాళన .. లోకేష్ అప్పుడే మొదలెట్టేశారు!

యువనేత లోకేష్... రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా  బాధ్యతల స్వీకారానికి ముందే కార్యాచరణ మొదలెట్టేశారు. రాష్ట్ర ప్రజల ప్రజాదర్బార్ తో ఓవైపు నిత్యం వందలాది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలిసి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం  ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఉపాధ్యాయ , విద్యార్థి సంఘాలు, తల్లి దండ్రులతో భేటీ అవ్వడానికి సమాయత్తమౌతున్నారు. విద్యావ్యవస్థలో పాతుకుపోయి ఉన్న  సమస్యల పరిష్కారం కోసం నడుంబిగించేందుకు రెడీ అయిపోయారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం,  విలువలతో కూడి విద్యనందించడం తప్ప సంబంధం లేని  పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కష్కారం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ చేయడం, చిన్నారులకు  దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిది దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. అదే విధంగా ఐటీ మంత్రిగా కూడా ఆయన రాష్ట్రంలో ఐటీకి గత వైభవం తీసుకువచ్చేందుకు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.   2017-19 నడుమ కేవలం రెండేళ్లు   రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా లోకేష్ పనిచేసిన లోకేష్   ఆయాశాఖల్లో గతంలో ఎవరూ  చేయనంద  అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రెండున్నరేళ్లలో 25వేల కి.మీ.ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా యువనేత లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గాను 2018లో ఆయనకు స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు గాను డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు  కూడా సాధించారు. గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేష్ చేసిన కృషిని గుర్తించి పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం ఇన్నోవేషన్ అవార్డును అందజేసింది. కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా లభించింది.  2018 సెప్టెంబర్ లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్  ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు.  ఇప్పుడు  రాష్ట్ర మానవవనరులు, ఐటి,ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ సారధ్యంలో ఆయారంగాలు  అనూహ్య వేగంతో పురోగతి సాధిస్తాయనడంలో సందేహం లేదు. 

జగన్ పై క్విడ్ ప్రోకో కేసుల విచారణ రేపటికి వాయిదా 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. జగన్‌పై నమోదైన క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసుల విచారణ నేడు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జరగాల్సి ఉంది. అయితే, న్యాయమూర్తి సెలవులో ఉండడంతో కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు.వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! రాష్ట్ర స్థాయిలోనే కాదు... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అవినీతి చరిత్ర ఆయనది! ‘క్విడ్‌ ప్రోకో’ అనే పదాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే! అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 2012 మే 27వ తేదీన అరెస్టయ్యారు! అంటే... ఇప్పటికి సరిగ్గా పన్నెండేళ్లు! దాదాపు పదేళ్లుగా ఆయన బెయిలుపైనే ఉన్నారు. ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు! అయితే... ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు! ఇకపై జరగబోయేది మరో ఎత్తు!... అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగ్ రిపోర్టులో కెసీఆర్ అడ్డగోలు ఖర్చు 3 లక్షల కోట్ల రూపాయలు..

బిఆర్ఎస్ పాపాల పుట్ట పెరిగిపోతుంది . కాగ్ తాజా నివేదికలో ఈ విషయాలు  వెల్లడయ్యాయి. తవ్వే కొద్దీ పాపాల పుట్ట వెలికి వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం, గొర్రెల పథకంలో నిధుల గోల్ మాల్ ధరణి  వంటి కుంభకోణాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కాగ్ ఇచ్చిన నివేదిక చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. కేసీఆర్ అవినీతి అక్రమాలు ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే కాగ్ రిపోర్ట్ మరో ఎత్తుగా పరిగణించాలి.  గులాబీ బాస్ కెసీఆర్ రెండు కోట్ల  88 లక్షలు 811  కోట్ల రూపాయలను కెసీఆర్ ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కెసీఆర్ విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది.  పదేళ్ల క్రితం అధికారంలో వచ్చిన కెసీఆర్ ప్రభుత్వం ఏడాదికి ఏడాదికి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిధులను ఖర్చు చేసుకుంటూ వెళ్లింది. ఆర్థిక క్రమశిక్షణను కెసీఆర్ విస్మరించారని కాగ్ నివేదిక పేర్కొంది. బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం రాష్ట్రానికి అదనపు ఖర్చులు లేవని కాగ్ నివేదిక బయటపెట్టింది. నిబంధనలను కెసీఆర్ పూర్తిగా తుంగలో తొక్కారు. ఇంకా ఎన్ని నిధుల్ని కెసీఆర్ ఎలాంటి  అనుమతులు లేకుండానే ఖర్చు చేశారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారడానికి కెసీఆర్ ప్రధాన కారణమని కాగ్ నివేదిక బయటపెట్టింది. అప్పుల నుంచి బయటపడాలని ప్రణాళికా సంఘం హెచ్చరిస్తున్నప్పటికీ కెసీఆర్ పట్టించుకోలేదు. చరిత్ర చెరిపేస్తే చిరగదు . చింపేస్తే     చిరగదు . తవ్విన కొద్దీ అవినీతి అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. 

రుషికొండ ప్యాలెస్ నిర్వహణ బాధ్యతలు టాటా గ్రూప్ కు?

సీఎంగా మాజీ ముఖ్యమంత్రి జగన్  హయాంలో జరిగిన అవకతవకలు, నిష్పూచీగా తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాల కారణంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనుకబడింది. బాధ్యత లేని వ్యక్తులు పాలకులు రాష్ట్రం ఏ స్థాయిలో వెనుకబడుతుందో  జగన్ హయాంలో ఏపీ పరిస్థితిని చూస్తే అర్ధమౌతుంది.  జగన్  నిర్వాకాల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కొత్తగా కొలువుదీరిని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రుషికొండకు బోడి గుండు కొట్టేసి, ఆ కొండపై గతంలో ఉన్న రిసార్టును కూల్చేసి  మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కట్టించిన ప్యాలస్ ఎందుకూ కొరగాకుండా ఉంది. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలను కూల్చేసి మళ్లీ టూరిజం ప్రాజెక్టు కడతామంటూ అబద్ధాలు చెప్పి, అత్యంత రహస్యంగా అక్కడో రాజభవనం లాంటి ప్యాలెస్ కట్టేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ కూలిపోయింది. కూటమి సర్కార్ కొలువుదీరింది. జగన్ పదవీచ్యుతుడైన తరువాతే రుషికొండ రాజభవనం రహస్యాలు బయటకు వచ్చాయి.  జనం డబ్బుతో జగన్ తన జల్సాల కోసం కట్టుకున్న ప్యాలెస్ అన్నది వెల్లడైంది.  జనం విస్తుపోయారు. ఎన్నికల ముందే ఈ బండారం బయటపడి ఉంటే.. జగన్ పార్టీకి ఆ పదకొండు స్థానాలూ కూడా వచ్చి ఉండేవి కాదని అంటున్నారు. సరే అదంతా పక్కన పెడితే.. ఇప్పుడా ప్యాలెస్ ను ఏం చేయాలన్నది కొత్త ప్రభుత్వం ముందున్న సమస్య. స్టార్ హోటల్ గా చేద్దామంటే ఆ ప్యాలెస్ లో ఉన్నది 12 బెడ్ రూంలే.  టూరిజం భవనంగానూ పనికిరాదు. పోనీ సీఎం విశాఖ క్యాంప్ ఆఫీసుగా వినియోగిద్దామంటే సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు అంత ఖరీదైన ప్యాలెస్ ను వినియోగించడానికి అంగీకరించరు.  550 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన ఆ భవనాన్ని  ఉపయోగకరంగా మార్చాలంటే ఏం చేయాలి? ఎవరికీ అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విలాస భవనం వినియోగం విషయంలో టాటా గ్రూప్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.  ఎందుకంటే టాటా గ్రూపు మూడు బ్రాండ్ల కింద హోటల్స్ ను నడుపుతోంది. అందులో పెద్ద బ్రాండ్  ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్. ఆ కంపెనీకి ఈ రుషికొండ ప్యాలెస్ నిర్వహణ బాధ్యత అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.   ఈ మేరకు ఇప్పటికే టాటా గ్రూప్ లో సంప్రదించినట్లు చెబుతున్నారు. అలా టాటా గ్రూప్ కు అప్పగించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని అన్నా క్యాంటీన్లకు వినియోగించాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.   

హామీల అమలు .. బాబు ముందు భారీ టాస్క్!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందు భారీ టాస్క్ ఉంది. జగన్  తన అరాచక పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేశారు. పాలన సాగించేందుకు అవసరమైన రోజు వారీ సొమ్ము కోసం కూడా అప్పులపైనే అధారపడేంత అద్వాన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కొలువుతీరడంతో  చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సి ఉంటుంది. అంత కంటే ముందు ఆయన ఎదుట భారీ టాస్క్ ఒకటి ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూలై మొదటి తేదీకి వృద్ధాప్య పింఛన్లు చెల్లించాల్సి ఉంది. అలాగే ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ రెండింటికీ రూ.11500కోట్లు సమీకరించాల్సి ఉంది. చంద్రబాబు ఉద్యోగుల జీతాలు 1వతేదీన వేస్తారని పేరు ఉంది. దాన్ని ఆయన అధికారంలో వచ్చిన తరువాత మొదటి నెలలోనే నిలుపుకోవాల్సిఉంది. జీతాలు రూ.6000కోట్లు కావాల్సిఉంది. అలాగే వృద్ధాప్య పింఛన్లకు రూ.5500కోట్లు కావాలి.  జులై 1వతేదిన  ఏప్రిల్ నెలలనుంచి వేయి చోప్పున మూడు నెలలకు మూడువేలు, జులై నెలది నాలుగువేలు కలిపి మొత్తం రూ.ఏడువేలు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. అలాగే  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాల్సి ఉంది. తెలంగాణలో లాగా ఆర్టీసీకి ప్రతినెల ఉచిత ప్రయాణ ఖర్ఛును చెల్లించాలి. అలాగే 18ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ  ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇస్తామని హామీ , రైతులకు పెట్టుబడి రూ.20వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పింది.ఖరీఫ్ సీజన్ ముంచుకొచ్చింది కావున రైతులకు వెంటనే ఇవ్వాల్సిఉంది.  ఇవే కాక విద్యాదీవెన పథకం. ఈ పథకం కింద తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక  నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 ఇస్తామని హామీ ఇచ్చారు.అదీ వెంటనే ప్రారంభించాల్సి ఉంది. వీటన్నింటినీ అమలు చేయాలంటే రూ.1.75లక్షల కోట్లు అవసరం. ఇక మెగా డీఎస్సీ నియామకాలు జరిగితే వేతనాల భారం మరింత పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు ముందున్న టాస్క్ నిధుల సమీకరణ. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన గతంలో అలా చేసి చూపించారు. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే.. జగన్ హయాంలో అరకొర సంక్షేమంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేసి రచించినా, వాటి ఫలాలు అందిరావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇచ్చిన హామీల అమలు మాత్రం సత్వరమే ఇంకా చెప్పాలంటే వెంటనే జరగాల్సి ఉంటుంది.  అదే ఇప్పుడు సీబీఎన్ ముందున్న పెద్ద సవాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆయన స్వామి కాదు.. జగన్‌కి భాగస్వామి!

ఐహిక బంధాలకు కాషాయం కడితే ఎలా వుంటుందో తెలుసా? ఎలా వుంటుందంటే, విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందలా వుంటుంది. ఈయన్ని అందరూ ‘స్వామి’ అని పిలుస్తూ వుంటారుగానీ, జగన్‌కి భాగస్వామి అని పిలిస్తే మంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ స్వామిగారు జగన్ మీద భక్తితో చంద్రబాబును విమర్శిస్తూనే వుండేవారు. ఈ దేవాలయంలో ఈ సమస్య వుంది.. ఆ దేవాలయంలో ఆ సమస్య వుంది.. హిందూ ధర్మం కష్టాల్లో పడిపోయింది అంటూ ఎప్పుడూ చెవిలో జోరీగలాగా అంటూనే వుండేవారు. ఆ తర్వాత ఆయన జగన్‌కి హిందుత్వం ఇచ్చి, హిందూ ఓటర్లని ఆకర్షించడానికి తనవంతు కృషి చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వరూపానందని బాగానే చూసుకున్నారు. ఆయనకి నలుగురు గన్‌మన్లతోపాటు ఆరుగురు సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేయించారు. దీనికి నెలకు ఖర్చు ఎంతో తెలుసా.. అక్షరాలా 24 లక్షల రూపాయలు. నెలకు 24 లక్షల చొప్పున ఈ ఐదేళ్ళకి 14 కోట్ల 40 లక్షలు. ఎవడబ్బ సొమ్మని ఈ స్వామివారు ఇన్ని కోట్ల జనం సొమ్ముని నాశనం చేశారు? సన్యాసి అయిన ఈయనకి చంపేంత శత్రువులు ఎవరున్నారని ఈ సెక్యూరిటీ? దేశంలో ఏ సన్యాసికీ లేని సెక్యూరిటీ ఈయనకే ఎందుకు? ఒకవేళ ఈయనకి అంతగా ప్రాణభయం వుంటే, సొంత డబ్బుతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి గానీ, జనం సొమ్ముతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం ఏమిటి? వడ్డించేవాడు మనవాడే కదా, తేరగా సెక్యూరిటీ వస్తోంది కదా అని జనం సొమ్ముని కరిగించేశారు. స్వామిలా వుండాల్సిన ఈ పెద్దమనిషి, జగన్ చేసే దుబారా ఖర్చులో ఈయన కూడా ‘భాగస్వామి’ అయ్యారు. గురువే గుళ్ళో లింగాలు మింగేవాడు అయినప్పుడు, శిష్యుడు గుడినే మింగకుండా వుంటాడా? స్వరూపానంద, జగన్ విషయంలో ఇదే జరిగింది కదా..!

పవన్ కళ్యాణ్ పక్కనే ఆ పుస్తకమేమిటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆయన టేబుల్ మీద కనిపించిన ఒక పుస్తకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘ఆధునిక మహాభారతం’ అనే పుస్తకం. పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ గుంటూరు శేషేంద్రశర్మ అభిమాని. పలు సందర్భాలలో శేషేంద్ర శర్మకు రచనలను, పంక్తులను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తున్న సందర్భంలో కూడా తన పక్కన ఆ పుస్తకాన్ని ఉంచుకోవడం అనేది, శేషేంద్ర శర్మ మీద పవన్ కళ్యాణ్‌కి వున్న అభిమానాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. పవన్ పక్కన ఆ పుస్తకాన్ని చూసిన పవన్ అభిమానులు ‘ఆధునిక మహాభారతం’ పుస్తకాన్ని చదవాలన్న ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు  కుమార్తె అరెస్ట్ 

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ సిపి కుటుంబాలు మొహం చెల్లక పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెక్కేసి అక్కడ దారుణాలకు తెగబడుతున్నారు. ఫ్రస్టేషన్ లో చెన్నై పారిపోయిన వైఎస్ఆర్  సిపి రాజ్య సభ సభ్యులు బీద మస్తాన్ రావు కుమార్తె మాధురి హిట్ అండ్ రన్ కేసులో ఒక యువకుడి ప్రాణాలు బలిగొంది. చెన్నైలో  ఈ దారుణం జరిగింది.. వైఎస్సార్‌సీపీ ఎంపీ కుమార్తె కారు ఢీకొట్టడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెసంట్‌నగర్‌కు చెందిన సూర్య పెయింటర్‌‌గా పని చేస్తున్నాడు. అయితే సోమవారం మధ్యాహ్నం బెసంట్‌నగర్‌ కళాక్షేత్రకాలనీ వరదరాజసాలైలో ఫుట్‌పాత్‌పై సూర్య మద్యం మత్తులో నిద్రపోయాడు. ఆ సమయంలో ఓ కారు ఫుట్‌పాత్‌పైకి వేగంగా దూసుకొచ్చి.. సూర్యపై ఎక్కింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.ఈ ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు మహిళలున్నట్లు తెలుస్తోంది. ఆ కారును నడిపిన మహిళ అక్కడి నుంచి కారుతో సహా పారిపోయారు. మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన స్థానికులతో గొడవకు దిగారు తర్వాత  అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ఇద్దరు మహిళలూ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు, సూర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్, కారు రిజిస్ట్రేషన్‌ నంబరు, పారిపోయిన మహిళల ఫొటోలున్నాయని వారు చెబుతున్నారు.వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు కుమార్తె మాధురిని సోమవారం రాత్రి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె డ్రైవ్ చేస్తున్న కారు పేవ్‌మెంట్‌పై నిద్రపోతున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లడంతో కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సూర్యను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అరెస్ట్ తర్వాత మాధురి స్టేషన్ బెయిలుపై బయటకు వచ్చారు.సూర్యకు 8 నెలల క్రితమే వివాహమైంది. విషయం తెలిసిన ఆయన బంధువులు జే-5 శాస్త్రినగర్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సీసీటీవీ చెక్ చేయగా, ప్రమాదానికి కారణమైన కారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు  గ్రూపు పేరిట పుదుచ్చేరిలో రిజిస్టర్ అయినట్టు గుర్తించారు.  కారుని మాధురి డ్రైవ్ చేసినట్టు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. బీద మస్తాన్‌రావు 2022లో రాజ్యసభ సభ్యుడయ్యారు. బీఎంఆర్ గ్రూప్ అనేది సముద్ర ఆహార ఉత్పత్తుల్లో చిరపరిచితమైన పేరు.