ap cabinet meeting key decisions

ఉగాది రోజే 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ

ఇక ఏపీలో వైఎస్సార్‌ జగనన్న కాలనీలు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర స‌మాచారశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. ‘‘స్థలం పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి పత్రంతో పాటు, ఐదేళ్ల వరకు స్థలం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత విక్రయానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతున్నారు. ఇందుకోసం అందరు తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్టార్లుగా హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమిని సిద్దం చేశారు. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ప్రైవేటు భూమి ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు. ఈ కాలనీలన్నింటికీ వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తారు. ఎన్‌పీఆర్‌కు సంబంధించి మైనారిటీలకు అభయమిచ్చేలా తీర్మానం చేశారు. 2010లో చేసిన ప్రక్రియకే పరిమితమై గత ప్రశ్నలే ఉంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. అప్పటి వరకు ఎన్‌పీఆర్‌ ప్రక్రియను ఏపీలో నిలిపివేయాలని తీర్మానించిన‌ట్లు  మంత్రి పేర్ని వివర‌ణ ఇచ్చారు. రుణం తీసుకునేందుకు సీడ్‌ కార్పొరేషన్‌కు అనుమతి పోర్టుల నిర్మాణానికి ఏర్పాట్లతో పాటు అడ్డంకులు తొలగించేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న‌ట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు పరిధి కుదింపునకు రాటిఫికేషన్‌ చేయడంతో పాటు అక్కడ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ.500కోట్ల రుణం తెచ్చుకునేందుకు సీడ్‌ కార్పొరేషన్‌కు కేబినెట్‌ అనుమతి ఇచ్చింది. ఒంగోలులో తెదేపాకు కేటాయించిన రెండు ఎకరాల భూమిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు.  ఆ భూమిని తిరిగి జలవనరుల శాఖకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.   భోగాపురం విమానాశ్రయం పనుల్లో జీఎంఆర్‌కు అనుమతిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది.

Demand for masks soaring in Hyderabad

మాస్క్‌ల ధరలకు రెక్కలు వచ్చాయి!

న‌గ‌రంలో మాస్క్‌ల కృత్రిమ కొరత‌ హైద‌రాబాద్‌లోని 80 శాతం మెడిక‌ల్ షాప్‌ల‌లో మాస్క్‌లు లేవు. ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతూ ప్రజల్ని దోచుకుంటున్న మందుల‌షాపులు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద మాస్కులకు విప‌రీత‌ డిమాండ్‌ హైద‌రాబాద్ మెడిక‌ల్ షాప్‌ల‌లో మాస్క్‌ల కొర‌త‌పై తెలుగు వ‌న్ టీం గౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగర ప్రజలకు కరోనా వైరస్ భయంపట్టుకుంది. మాస్క్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.  అందుకేనేమో మాస్క్‌ల ధరలకు రెక్కలొచ్చాయి.  వైరస్ సోకకుండా వుండడానికి మాస్క్‌ల ధరించాలన్న ఉద్దేశంతో చాలా మంది మాస్క్‌లకు ఎగబడుతున్నారు. ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ ఆసుప‌త్రి, గాంధీ, ఉస్మానియా ఆసుప‌త్రి చుట్టుప‌క్క‌ల ఉన్న మెడిక‌ల్ షాప్‌ల‌లో మాస్క్ కొన‌డానికి వెళ్ళిన తెలుగువ‌న్ టీంకు చేదు అనుభ‌వం ఎదురైంది. మొత్తం 38 షాపుల్లో కేవ‌లం 7 షాపుల్లోనే మాస్క్‌లు దొరికాయి. మిగ‌తా 31 మెడిక‌ల్ షాప్‌ల‌లో స్టాక్ లేద‌ని స‌మాధానం. మాస్క్‌లు, శానిటైజ‌ర్‌లు త‌క్కువ మోతాదులో సేల్ అయ్యే ఐట‌మ్స్ కాబ‌ట్టి జ‌న‌ర‌ల్‌గా మెడిక‌ల్ షాపుల్లో స్టాక్ త‌క్కువ‌గా వుంటుందని మెడిక‌ల్ షాప్ నిర్వాహ‌కులు చెబుతున్నారు. షాప్‌కు వ‌చ్చే 10 మంది క‌స్ట‌మ‌ర్ల‌లో 9 మంది మాస్క్‌ల‌నే అడుగుతున్నార‌ట‌! 50 రూపాయ‌లైనా ఇస్తాం. మాస్క్ ఇవ్వ‌మ‌ని డిమాండ్ చేస్తున్నా ఇవ్వ‌లేక‌పోతున్నామంటున్నారు మెడిక‌ల్ షాప్ నిర్వాహ‌కులు. ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ ఆసుప‌త్రికి కిలోమీట‌ర్‌ ప‌రిధిలో వున్న 8 పెద్ద మెడిక‌ల్ షాపుల్లో ఆరు మెడిక‌ల్ షాపుల్లో స్టాక్ లేద‌న్నారు. మెడ్‌ప్ల‌స్ అమీర్‌పేట లాల్‌బంగ్లా బ్రాంచ్ బ‌య‌ట నో స్టాక్ బోర్డే పెట్టేశారు. రెండు షాప్‌ల‌లో సాదార‌ణ మాస్క్‌ను 20 రూపాయ‌ల‌కు సేల్ చేశారు. గాంధీ ఆసుప‌త్రి చుట్టుప‌క్క‌ల 15 మెడిక‌ల్ షాప్‌ల‌లో కేవ‌లం నాలుగు చోట్ల మాత్ర‌మే మాస్క్‌లు దొరికాయి. ఉస్మానియా ఆసుప‌త్రి స‌మీపంలోని 15 మెడిక‌ల్ షాప్‌ల‌లో మాస్క్ కొన‌డానికి వెళ్ళిన మా టీంకు విచిత్ర‌మైన అనుభ‌వం క‌లిగింది. మ‌ధ్య‌నిషేధం వున్న‌ప్పుడు ర‌హ‌స్యంగా బ్లాక్‌లో మందు అమ్మిన‌ట్లు ఇప్పుడు మెడిక‌ల్ షాప్ బ‌య‌ట బ్లాక్‌లో మాస్క్‌లు  అమ్ముతున్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొంత మంది మందుల షాపుల నిర్వాహ‌కులు వాటి ధరలను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నారు.  నిన్నటిదాకా రిటైల్‌గా ఐదు రూపాయలు, హోల్‌సేల్‌లో రూపాయి 60 పైస‌లు విలువ చేసే రెండు లేయర్ల మాస్క్ ధర ఇప్పుడు 20 నుంచి 25  రూపాయ‌లకు  డిమాండ్‌ను బట్టి విక్రయిస్తున్నారు. 40 రూపాయ‌లు  విలువ చేసే ఎన్ 95 మాస్క్‌ను 300 రూపాయ‌ల‌కు విక్రయిస్తున్నారని ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే జనరిక్ మందుల షాపుల్లోనూ మాస్క్‌ ధర అమాంతం పెరిగిపోయింది. ఒక్కో మాస్కును 15 నుంచి 20 రూపాయ‌ల‌కు విక్రయిస్తున్నారు. గతంలో వంద మాస్కుల ప్యాకెట్ 160 రూపాయ‌లుంటే ఇప్పడది ఏకంగా 1600 రూపాయ‌ల‌కు పెరిగింది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోల్‌సేల్‌ అమ్మకందార్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. స్టాక్ ని దాచి పెట్టి తర్వాత ఎక్కువ రెట్లు పెట్టి అమ్ముకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌ల‌తో   కొంత మంది మెడిక‌ల్ షాపుల నిర్వాహ‌కులున్నారు. సానిటైజర్ లు అయితే అసలు లేవని చెప్పేస్తున్నారు. అయితే నిజంగా స్టాక్ లేదా?  లేక కృత్తిమ కొరత సృష్టించి దోచుకుంటున్నారా?   రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే ప‌రిస్థితి ఇంత దారుణంగా వుంటే ప్ర‌భుత్వం ఏం చేస్తోంది?  కృత్రిమ కొరత సృష్టించి మెడిక‌ల్ షాప్‌ల నిర్వాహ‌కులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని జ‌నం బెంబేలెత్తుతున్నారు. ఇప్ప‌ట్టికైనా ముఖ్య‌మంత్రి కెసిఆర్ స్పందించి ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మాస్క్‌ల‌ను అందుబాటులో పెట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. 

coronavirus cases in andhra pradesh

ఏపీలో కలకలం.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మరో ఆరుగురు!

కరోనా వైరస్ లక్షణాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా బయటపడుతున్నాయి. విశాఖ, విజయవాడ, ఏలూరులో పలువురు కరోనా అనుమానిత వ్యక్తులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యులు, వారి రక్త నమూనాలను టెస్టుల కోసం ల్యాబ్ లకు పంపించారు. ప్రస్తుతం వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా వైరస్ లక్షణాలతో చేరారు. బాధితుల్లో ఒకరు గత నెల 18న మస్కట్ నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. విశాఖలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ కుటుంబం కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురిని.. విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి చేరాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన ఆ వ్యక్తి ఇటీవలే జర్మనీకి వెళ్లి వచ్చాడని గుర్తించారు. ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడంతో.. ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు.

Coronavirus hits Andhra Pradesh

గోదావరి జిల్లాలో కరోనా కలకలం!

ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్ లో ఐసోలేషన్ సెంటర్లు వెంటి లెటర్లు తో ప్రత్యేక వార్డ్ లు తాజా ప‌రిస్థితుల‌పై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స‌మీక్ష‌ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న ఈ వ్యక్తి ఇటీవల ఓ పెళ్ళికి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. కొత్తపేట మండలం వాడపాలేనిలోకి చెందిన సదరు వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎపి లో క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్ల‌పై అప్రమత్తమైన AP వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, బాధిత వ్య‌క్తి ఆరోగ్య‌ప‌రిస్థితి, చేప‌డుతున్న చికిత్స‌పై వైద్య అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. కొత్త పేట మండలం వాడపల్లి గ్రామానికి చెందిన బండారు వెంకటేస్వర్లు ఆరోగ్య ప‌రిస్థితిపై నిల‌క‌డ‌గా వుంద‌ని, వైద్య పరీక్షలకు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐస్లేషాన్ వార్డ్ లో వెంకటేస్వర్లు కు వైద్య పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు మంత్రికి తెలిపారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తాజా ప‌రిస్థితిపై స‌మీక్షించారు. కోన సీమ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందవ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టిందని మంత్రి భ‌రోసా ఇచ్చారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్ లో ఐసోలేషన్ సెంటర్లు సిద్ధం చేస్తున్నారు. వెంటి లెటర్లు తో ప్రత్యేక వార్డ్ ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న రెడీ చేశారు. సెక్రటేరియట్ లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 0866-2410978నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.

operation lotus in madhya pradesh

మధ్యప్రదేశ్ లో కర్నాటక తరహా గేమ్... హుటాహుటిన ఢిల్లీకి శివరాజ్ సింగ్...

మధ్యప్రదేశ్ లో కర్నాటక తరహా నెంబర్ గేమ్ మొదలైంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నెంబర్ గేమ్ తర్వాత కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే, బీజేపీ నెక్ట్స్ టార్గెట్ మధ్యప్రదేశే నంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడంతో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆర్నెళ్లు తిరగకుండానే, మళ్లీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో నెంబర్ గేమ్ మొదలైంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉండగా, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు.... బీజేపీ 107 సీట్లు గెలుచుకున్నాయి. అలాగే, నలుగురు ఇండిపెండెంట్స్ గెలవగా, బీఎస్పీ 2, ఎస్పీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. రెండు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు కావాల్సి ఉండటంతో, ఎస్పీ, బీఎస్పీ, నలుగురు ఇండిపెండెంట్స్ తో కలిసి మొత్తం 121మంది బలంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, బీజేపీ కంటే కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ గెలుచుకున్న కాంగ్రెస్.... ఎస్పీ, బీఎస్పీ, ఇండిపెండెంట్స్ మద్దతుతో సర్కారును నడుపుతోంది. ఇదే, బీజేపీకి ఆయుధంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 9 సీట్ల దగ్గర ఆగిపోయిన కాషాయ పార్టీ, ఇఫ్పుడు నెంబర్ గేమ్ మొదలుపెట్టింది. కర్నాటక తరహాలోనే అసమ్మతి రాజేసి గద్దెనెక్కేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే 8మంది ప్రభుత్వ ఎమ్మెల్యేలకు వల విసిరిందని అంటున్నారు. 8మందిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, మిగతా నలుగురు బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలని చెబుతున్నారు. అయితే, బీజేపీ బంధించిన 8మంది ఎమ్మెల్యేల్లో, నలుగురు తప్పించుకుని వచ్చారని, ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ఆధీనంలోనే ఉన్నారని దిగ్విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలతో కమలనాథులు కొట్టిపారేస్తున్నారు. కేవలం సంచలనం కోసమే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. ఏదో ఒక సంచలనం లేదా కలకలం సృష్టించి, తిరిగి రాజ్యసభకు ఎన్నిక కావాలన్న ఉద్దేశంతోనే దిగ్విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ ఆరోపించారు. అయితే, శివరాజ్ సింగ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడంతో మధ్యప్రదేశ్ లో నెంబర్ గేమ్ పై అనుమానాలు పెరుగుతున్నాయి. మరి, స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కమల్ నాథ్... తన సర్కారును కాపాడుకుంటారో లేక... కర్నాటక తరహాలో అధికార పీఠాన్ని కోల్పోతారో వేచిచూడాలి.

coronavirus cases in hyderabad

కరోనా కలకలం.. హైదరాబాద్ లో మరో మూడు కరోనా కేసులు!!

చైనా మొదలుకొని పలు దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. ఇటీవల తెలంగాణలో ఒకటి, ఢిల్లీలో ఒకటి కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం నిర్దారించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తి కుటుంబానికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారందరికీ  పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అతని కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులుండగా.. వారందరికీ కరోనా పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు స్పష్టం చేశారు.  కాగా, ఇప్పటివరకూ భారత్ లో మొత్తం 28 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. తాజాగా తెలంగాణాలో మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మైండ్ స్పేస్ లోని ఓ కంపెనీ ఉద్యోగిని పరిమిలకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్దారించారని సమాచారం. ఆమె రెండు వారాల క్రితం ఇటలీకి వెళ్ళొచ్చినట్టు తెలుస్తోంది. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఆమె పనిచేసే కంపెనీ యాజమాన్యం ఇతర ఉద్యోగులను కొద్దిరోజుల పాటు ఇంటి వద్ద నుండే పనిచేయాలని ఆదేశించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో మరో ఇద్దరిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించినట్టు తెలుస్తోంది. గాంధీ మెడికల్ కాలేజీలోని ఐసీఎమ్ఆర్‌‌ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో, వారి శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల కోసం పూణే లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలాజీ కి పంపించారు. గురువారం పూణే ఎన్‌ఐవీ నుంచి రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐవీలో కూడా పాజిటివ్‌ అని తేలితే ఆ ఇద్దరికీ కరోనా సోకిందని నిర్ధారిస్తారు. వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

amaravathi out from express way

అమరావతికి మరో అన్యాయం.. ఎక్స్‌ప్రెస్‌-వే నుంచి ఔట్‌..!

విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్న జగన్ ప్రభుత్వం... అమరావతి అభివృద్ధి మాత్రం ఆగదని చెప్పుకొచ్చింది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అయితే, అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ అమరావతికి తీవ్ర అన్యాయం చేస్తోంది జగన్ ప్రభుత్వం. అమరావతికి ఎలాంటి అన్యాయం చేయబోమంటూనే చేయాల్సిన నష్టం చేస్తున్నారు. ఇప్పటికే, మూడు రాజధానుల పేరిట సచివాలయాన్ని విశాఖకు... హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం... అమరావతిలో అభివృద్ధి పనులను సైతం నిలిపివేస్తోంది. అమరావతిలో అనేక నిర్మాణాలను నిలిపివేసిన సర్కారు... ఇప్పుడు, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అనంతపురం-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నుంచి అమరావతిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ సాకుల పేరుతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా భూసేకరణ భారంగా మారిందని, రహదారిని అమరావతి వరకు తీసుకెళ్లలేమని, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకే పరిమితం చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, అప్పడది అనంతపురం-చిలుకలూరిపేట ఎక్స్ ప్రెస్ వేగా మాత్రమే మిగిలిపోతోంది. దాంతో అమరావతికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో భూసేకరణ కష్టంగా మారిందని, ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని అధికారులు నివేదించంతో, దాన్ని సాకుగా తీసుకున్న ప్రభుత్వం... అలైన్‌మెంట్‌ మార్చాలని, చిలకలూరిపేట వరకే రహదారి అనుసంధానం చేయాలని, ఆపై వద్దని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది. చిలకలూరిపేట మీదుగా ఎన్‌హెచ్‌-16 వెళ్తోంది. ప్రతిపాదిత ఎక్స్ ప్రెస్ వేను అక్కడ నిర్మిస్తున్న బైపాస్ కు కలపాలని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. అక్కడ్నుంచి గుంటూరు, విజయవాడకు ఎలాగూ... హైవే ఉన్నందున, దానికి సమాంతంగా మరో పెద్ద రహదారి నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతపురం ఎక్స్ ప్రెస్ ను చిలకలూరిపేట బైపాస్ కు కలిపితే, రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు అక్కడ్నుంచి నేరుగా ఎన్ హెచ్ -16 ద్వారా విశాఖ వెళ్లడానికి వీలుగా ఉంటుందన్న కోణంలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. అయితే, కేంద్రం ఆమోదించిన ఆర్వోడబ్ల్యూ ప్రకారం అనంతపురం జిల్లా మర్రూరు నుంచి చిలకలూరిపేట, ప్రత్తిపాడు, ఫిరంగిపురం ప్రాంతాల నుంచి తాడికొండ మండలం పెద్దపరిమి దాకా రహదారిని నిర్మించాల్సి ఉంది. ఇందులో కర్నూలు, కడప నుంచి కలిసే రహదారులను మినహాయిస్తే కొత్తగా నిర్మించేది 394 కిలోమీటర్లు. అయితే, ఈ 394 కిలోమీటర్ల రహదారికి ముందుగానే ఎంత భూమి అవసరమవుతుందో అంచనా వేశారు. 28వేల ఎకరాలు అవసరమవుతుందన్న అంచనాతో ఒక్క భూసేకరణకే 2వేల 500కోట్లు వ్యయమవుతుందని లెక్కవేశారు. ఒకవేళ భూసేకరణ ఖరీదైన ప్రక్రియగా మారితే అదనంగా మరో 500కోట్లు అవసరమవుతాయని అప్పుడే అంచనా వేశారు. అయితే, ఇప్పుడు, భూసేకరణ భారం మారిందన్న సాకుతో అమరావతి వరకు ఎక్స్ ప్రెస్ వే రాకుండా మధ్యలోనే నిలిపివేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అమరావతి కోసం పెద్దఎత్తున పోరాడుతోన్న రైతాంగానికి, అక్కడి ప్రజలకు ఇది మరింత ఆగ్రహం తెప్పించే నిర్ణయంగా కనిపిస్తోంది. పాతిక వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి నుంచి అమరావతిని తొలగిస్తూ జగన్ ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు. ఇంకా, రాజధానిని తరలించకముందే, కీలక ప్రాజెక్టు నుంచి అమరావతిని తొలగించడమేంటని అమరావతి వాసులు ప్రశ్నిస్తున్నారు.

IT Raids On Narayana

శ్రీచైతన్య, నారాయణ క్యాంపస్‌లలో ఐటీ దాడులు

విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్  శ్రీచైతన్య, నారాయణ  క్యాంపస్‌లలో ఐటి శాఖ  మెరుపు దాడి చేసింది. విజ‌య‌వాడ  బెంజ్‌ సర్కిల్‌ వద్ద గల నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్‌లలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం ఉద‌యం ఆక‌స్మికంగా సోదాలు నిర్వహించారు.  ఉదయం 8 గంటలకు నారాయణ క్యాంపస్‌కు వెళ్లిన ఐటీ అధికారులు అక్కడి రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కాలేజీ సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేస్తున్నారు. తాటి గడప, ఈడ్పుగల్లులోని క్యాంపస్‌లలో కూడా దాడులు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్‌ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు.

100 years virus cycle

వందేళ్ళ‌కొక‌సారి కొత్త వైర‌స్ పుడుతుందా?

ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక వైర‌స్ విజృంభించి లక్షల మందిని చంపేస్తుందా? ప్రస్తుతం కరోనా వైరస్ ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. 1720లో ప్లేగ్ మహమ్మారి బీభత్సం సృష్టించింది. 1820లో కలరా కల్లోలం రేపింది. 1920లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని విలవిలలాడేలా చేసింది. 2020లో కరోనా వైరస్ ఎలాంటి విలయతాండవం చేస్తుందోనని యావత్ ప్రపంచం వణికిపోతోంది. గ‌తంలో ప్లేగ్, కలరా, స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని గడగడలాడించాయి. 1720లో ఫ్రాన్స్ లోని మర్సైస్ లో ప్లేగ్ మొదట బయటపడింది. ఎలుకల నుంచి వచ్చిన ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.ఊర్లకు ఊర్లు ఊడ్చేసింది. లక్షల మంది చనిపోయారు. మరణించిన వారిని  పూడ్చి పెట్టడం కష్టంగా మారి సామూహిక దహనాలు చేశారు. 1820లో కలరా(cholera) వ్యాధి బయటపడింది. మన దేశంలోని కోల్ కతా నగరంలో బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు.  తొలిసారి ప్రబలి యూరప్ వరకు వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. లక్షమందికి పైనే చనిపోయారు. 1920లో స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడి కోటి మంది మరణించారు. ప్ర‌పంచంలో అతి పెద్ద విషాదం మిగిల్చిన భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ చ‌రిత్ర‌కెక్కింది.   2020లో కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. ఇప్పటి వ‌ర‌కు  80 దేశాలకు వ్యాపించింది. 3 వేల మందికి పైగా ఈ వైరస్ కారణంగా చనిపోయారు. లక్షల‌ మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకెంతమందిని ఈ వైరస్ చంపుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు.

Ready to AP Local Body Elections

నెలరోజుల్లో ఏపీ స్ధానిక ఎన్నికలు... రెండ్రోజుల్లో నోటిఫికేషన్

  ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నెలరోజుల్లోగా పూర్తి చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలతో రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఎన్నికల తేదీలపై ప్రతిపాదనలు కూడా ఎన్నికల సంఘానికి అందాయి. వీటిపై ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే బుధవారం కేబినెట్ భేటీలో వీటిని ఖరారు చేసే అవకాశముంది. మరోవైపు ఏపీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన రిజర్వేషన్ల ఖరారు వ్యవహారంపై హైకోర్టు ఉత్తర్వులు కూడా వెలువడటంతో నెల రోజుల్లోపు ఈ ప్రక్రియను ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కొన్ని తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు ఉంచింది. వీటి ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 21న, పురపాలక ఎన్నికలను 24న, గ్రామ పంచాయతీ ఎన్నికలను 27న నిర్వహించేందుకు ప్రభుత్వం తన సంసిద్ధతను తెలియజేసింది. అయితే వీటిపై ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే వీటిని బుధవారం కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఈ నెల 7న, పురపాలికలకు ఈ నెల 10న, గ్రామ పంచాయతీ ఎన్నికలకు 15న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఏపీలో మొత్తం 21843 గ్రామ పంచాయతీలు ఉండగా, 74 పురపాలక సంఘాలు, మరో 16 మున్సిపల్ కార్పోరేషన్లు ఉన్నాయి. వీటికి దశల వారీగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లోపు స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన రూ.3400 కోట్లు, పురపాలక ఎన్నికలు నిర్వహించకపోతే మరో రూ.1400 కోట్ల 14వ ఆర్దిక సంఘం నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం ఎలాగైనా నెలాఖరు లోగా ఈ ప్రక్రియ ముగించాలని భావిస్తోంది. 

pilli subhash chandra bose about amaravathi

అమరావతి... ఏపీ రాజధాని కాదని ఎవరన్నారు? దేశానికి మాత్రం హైదరాబాదే సెకండ్ కేపిటల్..!

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రెండున్నర నెలలుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు, మహిళలు, ప్రజలు... తిండీతిప్పలు మానేసి... దాదాపు 80రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, నిరసనలు చేస్తున్నారు. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏపీ హైకోర్టు నుంచి ఇంటర్నేషనల్ కోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు, గవర్నర్, రాష్ట్రపతిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని, కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం... అమరావతి నుంచి కేపిటల్ ను తరలిస్తోందని పదేపదే ఫిర్యాదు చేశారు.  అమరావతి కోసం 29 గ్రామాల రైతులు, మహిళలు, యువత, పిల్లలు... ఇలా అందరూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే, మంత్రులు మాత్రం చాలా తేలిగ్గా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి బొత్స ప్రకటనలతో మొదలైన గందరగోళాన్ని, మిగతా మంత్రులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు, అమరావతి... ఏపీకి రాజధాని కాదని ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించారు. తామెప్పుడూ అమరావతి... ఏపీ రాజధాని కాదని చెప్పలేదన్నారు. అయితే, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న మంచి ఉద్దేశంతోనే విశాఖను పరిపాలన రాజధానిగా చేశామని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా హైదరాబాద్ పైనా పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ చెప్పినట్లుగా ఏదో ఒక రోజు కచ్చితంగా హైదరాబాద్... దేశానికి రెండో రాజధాని అవుతుందని అన్నారు.  

6 lakh free insurance cover

రూపాయి చెల్లించ‌కుండానే 6 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ కవరేజ్!

మీకు PF అకౌంట్ వుందా? అయితే ప్రీమియం చెల్లించ‌కుండానే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ల‌భిస్తుంది. ఎలా అంటే ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లకు  మూడు రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ అనేవి ఇవి. తొలి రెండూ అంటే ఈపీఎఫ్, ఈపీఎస్ అనేవి సేవింగ్స్ స్కీమ్స్. ఇక ఈడీఎల్ఐ (ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్) అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. ఈడీఎల్ఐ స్కీమ్ 1976 నుంచి అమ‌లులో ఉంది.  ఉద్యోగులకు ఈపీఎఫ్ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి కంపెనీకి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల ఉద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే  ఈ ఈపీఎఫ్‌వో స్కీమ్ నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈడీఎల్ఐ స్కీమ్‌లో ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ ఈపీఎస్ సేవింగ్స్ స్కీమ్స్‌తో లింక్ అయ్యి ఈ పథకంప నిచేస్తుంది. అంటే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ ఈడీఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది. ఆటోమేటిక్‌గానే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు లభిస్తాయి. కంపెనీ ఈ స్కీమ్‌కు ఉద్యోగి తరుపున కంట్రిబ్యూషన్ చేస్తుంది. డీఏ, శాలరీ ప్రాతిపదికన కంట్రిబ్యూట్ మొత్తం డిసైడ్ అవుతుంది. కంపెనీ గరిష్టంగా 0.50 శాతం లేదా రూ.75లను ఈడీఎల్‌ఐ స్కీమ్‌కు ఉద్యోగి  తరుపున కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి మరణం తర్వాత నామినీకి శాలరీకి 30 రెట్లు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇక్కడ శాలరీ అంటే కేవలం డీఏ, బేసిక్ శాలరీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు అదనంగా రూ.1.5 లక్షల బోనస్ కూడా అందజేస్తారు. ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడే మరణిస్తే.. నామినీకి గరిష్టంగా రూ.6 లక్షల వరకు లభిస్తాయి. ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్‌గా కొనసాగుతున్నారు. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ స్కీమ్స్‌లో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగి డ్యూటీలో మరణించారు. ఈ ఉద్యోగి నెలవారీ జీతం రూ.15,000గా ఉంది. ఇప్పుడు ఉద్యోగి నామినీ ఈడీఎల్ఐ క్లెయిమ్ కోసం అప్లై చేసుకున్నారు. నామినీకి రూ.6 లక్షలతొ నాటె ల‌క్షా 50 వేల రూపాయ‌ల బోన‌స్ వ‌స్తుంది. ఈపీఎఫ్‌వో చట్టం కింద రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీకి ఇది వర్తిస్తుంది. ఈ కంపెనీలు ఈ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ను అందించాల్సి ఉంటుంది.

sex racket busted in madhya pradesh

క్లినిక్ ముసుగులో సెక్స్  దందా!

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో సెక్స్ రాకెట్  గుట్టును రట్టు చేశారు పోలీసులు. 20 నుంచి 30 సంవత్సరాల వయసు వున్న నలుగురు మహిళలు,  ఆరుగురు విటులను రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు.   తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నసచిన్ సింగ్ చౌహాన్,  మహిళా డాక్టర్ గాయత్రి వీర్ సింగ్ తో క‌లిసి భోపాల్ లోని బర్కాహేది ప్రాంతంలో  క్లీనిక్ పేరుతో సెక్స్ దందా న‌డుపుతున్నాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు  ఈ క్లినిక్‌పై దాడి మెరుపు దాడి చేసి నలుగురు మహిళలతో సహా మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ అదితి భవ్‌సర్ తెలిపారు.

10 Confidential GOs Released

10 నిమిషాల్లో 10 ఈ జీవోలు

  సమయం తక్కువగా ఉండటం కేంద్ర నిధులు కీలకం కావడంతో హైకోర్టు రద్దు చేసిన జీవో స్థానంలో కోర్టు సూచనల మేరకే 50శాతానికి పరిమితమవుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌హ‌స్య‌ జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను కాన్ఫిడెన్షియల్ జీవోలుగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ కొత్త రిజర్వేషన్లను 50శాతానికి ఖరారు చేసింది. అయితే దీనిని జీవో ద్వారా లేదా ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందటం కోసం సమయం పట్టే అవకాశం ఉంది. మ‌రో వైపు ఆర్డినెన్స్ పైన బీసీ సంఘాలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. న్యాయపరంగా చిక్కులు లేకుండా ఉండటానికే ఈ జీవోలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేకుండా చేశారు. బుధ‌వారం సాయంత్రానికి 13 జిల్లాల్లోను రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అవి కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి అందగానే ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఈనెల 27కల్లా ఎన్నికలు పూర్తి చేసుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

step mother and son sex relationship

త‌ల్లి-కొడుకు మ‌ధ్య అక్ర‌మ‌సంబంధం

మొదటి భార్య కుమారుడు రెండో భార్య మధ్య ఏర్పడిన అక్రమ సంబంధ‌మే దామూ నాయక్ ను బలి తీసుకుంది! కర్ణాటక లోని విజయపురా జిల్లాలోని బసవన బాగేవాడిలో గల మడివాళేశ్వర గ్రూప్ విద్యాసంస్ధల అధినేత దామూ నాయక్ ను ఫిబ్రవరి 25న హంతుకులు గొంతుకోసి హత్య చేశారు. పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ హ‌త్య వెనుక శ‌త్రువుల పాత‌క‌క్ష‌లు ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. ఆయనతో శతృత్వం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ పోలీసులకి ఎటువంటి క్లూ దొరకలేదు. దామూ నాయక్ కు కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. అయితే  అయన రెండు పెళ్లిళ్లు  చేసుకున్నాడు.  ఈ కేసును ఆ యాంగిల్‌లో దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. సెల్ ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాము నాయక్ మొదటి భార్య కుమారుడు సుభాష్ నాయక్.. రెండో భార్య ప్రేమా  మధ్య ఏర్పడిన అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు కార‌ణ‌మ‌ని తెలిసింది. దాము నాయక్ ను అడ్డు తొలగించుకుంటే.. కోట్లాది రూపాయల ఆస్తి తమ వశం అవుతుందని నిందితులు భావించారు. వెంట‌నే త‌మ ప్లాన్ అమ‌లు చేశారు. దామూ నాయక్ ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చిన‌ట్లు పోలీసు విచార‌ణ‌లో తేలింది. ప్రధాన నిందితులైన రెండోభార్యను మొదటి భార్య కొడుకుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆరు జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదు

  వేడి వాతావరణంలోనూ కరోనా వైరస్ 48 గంట‌లు బ్ర‌తుకుతుంది పాయింట్ 1 కరోనా గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. అంటే... గుంపుగా జనం ఉన్నా... అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉండదు. కానీ... ఆ జనంలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... వాళ్లు దగ్గినా, తుమ్మినా... అప్పుడు వచ్చే నీటి బిందువుల్లో (తుంపర్లలో) కరోనా వైరస్ ఉంటుంది. అది గాలిలో ఎగురుతూ వచ్చి మనపై పడితే... వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. అంటే వైరస్ మనకు చేరకుండా ఉండాలంటే... మనపై ఏ తుంపర్లూ పడకూడదన్నమాట. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పాయింట్ 2 ఈ వైరస్ ఉన్న వ్యక్తులు ప్రయాణాల్లో బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో, ఆటోల్లో ఎక్కడైనా సరే, ఏదైనా వస్తువును (రాడ్లు, సీట్లు, డోర్లు వంటివి) ముట్టుకుంటే... వాటిపై వైరస్ ఉండే ఛాన్సుంటుంది. అదే వస్తువును మనమూ ముట్టుకుంటే... ఆ వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... వీలైనంతవరకూ అలాంటివేవీ ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. చేతులకు గ్లోవ్స్ వాడితే మంచిదే. లేదంటే ప్రయాణం తర్వాత చేతుల్ని సబ్బుతో బాగా కడిగేసుకోవాలి. అలాగే... ప్రయాణ సమయాల్లో హ్యాండ్ శానిటైజర్ వాడాలి. రెండు, మూడు చుక్కలు చేతిలో వేసుకొని... రెండు చేతులకూ రాసుకోవాలి. అలా ప్రయాణం చేసిన ప్రతిసారీ రాసుకుంటే... వైరస్ మన చేతులకు చేరదు. పాయింట్ 3 ముఖానికి మాస్క్ పెట్టుకుంటే చుట్టూ ఉన్నవాళ్లు మనల్నే చూస్తూ... అమ్మో ఇతనికి వ్యాధి ఉందేమో అనుకునే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ మాస్క్ వాడటం మేలు కాబట్టి... అది వాడొచ్చు. లేదంటే కనీసం కర్చీఫ్ అయినా ముఖానికి (ముక్కూ, నోరూ మూసుకునేలా) కట్టుకుంటే మంచిదే. పాయింట్ 4 వైరస్ ఉన్నవారికి కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఎవరికి వైరస్ సోకిందో మనకు తెలియదు కదా. కాబట్టి... మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే  పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పుల్లటి పండ్లను బాగా తినాలి. వాటిలోని C విటమిన్... ఇలాంటి వైరస్‌లను బాడీలోకి రానివ్వకుండా చేస్తుంది. పాయింట్ 5 జలుబు, దగ్గు, నీరసం, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతోంది. కాబట్టి... ఇలాంటి అనారోగ్యాలు ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి. బయటి ప్రయాణాలు మానుకుంటే బెటర్. పాయింట్ 6 ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ సోకితే... భయపడాల్సిన పనిలేదు. మనో ధైర్యంతో నాకేంకాదు... కచ్చితంగా రికవరీ అవుతా అని మనసులో మాటిమాటికీ అనుకుంటూ ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం పెరిగేకొద్దీ... బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అది వైరస్‌తో పోరాడుతుంది.

సెక్స్‌కు పెళ్లికి ముడి!

సెక్స్ ఈక్వల్స్ టు మ్యారేజ్ అంటున్నారు ర‌ష్య అధ్యక్షుడు పుతిన్ సెక్స్ అంటే అది పూర్తిగా పెళ్లితో నిమిత్తం అయింద‌ని, ఒకరితో సెక్స్ లో పాల్గొంటే వారిని పెళ్లి చేసుకున్నట్టే అని  అధ్యక్షుడు పుతిన్  రాజ్యాంగంలోనే స‌వ‌ర‌ణ చేయ‌డానికి సిద్ధ‌మైయ్యార‌ట‌. సెక్స్ అనేది మనిషి కనీస అవసరం. సెక్స్ కోసమని పెళ్లి చేసుకోవడం లేదా సెక్స్ చేసిన వారితో పెళ్లి అయిపోయిందంటే ఎలా అని ర‌ష్యాలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మ‌రో ప‌క్క స్వలింగ సంపర్క వివాహాలను కూడా రష్యాలో నిషేధిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. వివాహం అంటే అది స్త్రీ- పురుషుడికి జరిగిదే అని.. మగాడు-మగాడు స్త్రీ- స్త్రీ పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్లిని ఆమోదించేది లేదని పుతిన్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు ఆమోదమే లేకుండా కొత్త చట్టాలను చేస్తున్నారు ఇప్పుడు ర‌ష్యాలో.

స్టూడెంట్‌తో టీచర్ కామక‌లాపాలు!

త‌న స్టూండెంట్‌పైనే క‌న్నేసాడు ఆ టీచ‌ర్‌. మాయ మాట‌ల‌తో లొబ‌ర్చుకున్నాడు. రూంకు పిలిపించుకొని ఎంజాయి చేశాడు. ఈ దారుణం  కర్ణాటకలోని మైసూర్ జిల్లా నంజన్‌గుడ్ తాలుకా రాంపురా గ్రామంలో జ‌రిగింది. రిటైర్‌మెంట్ వ‌య‌స్సుకు వ‌చ్చినా ఈ టీచ‌ర్ బుద్ది అయితే మార‌లేదు. ఇత‌ని పేరు సిద్ధరాజు(58).  రాంపురాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ప‌నిచేస్తున్నాడు. ఈ ఊరిలోనే  దాదాపు 25 ఏళ్ల నుంచి టీచర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. తాను చదువు చెప్పిన స్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. త‌న మాయ‌మాట‌ల‌తో  విద్యార్థినులలో ఒకర్ని లోబర్చుకున్నాడు. ఆమె స్కూల్ విడిచిపెట్టి వెళ్లిపోయినా ఆమెను వెంటాడాడు. తాజాగా, వారిద్దరు ఒక గదిలో కామక్రీడలో పాల్గొన్నారు. జ‌రుగుతున్న దృశ్యాన్ని చూసి   అదే స్కూల్‌కు చెందిన వ్య‌క్తి టీచ‌ర్ కామకార్య‌క‌లాపాల‌ను ఫొటో తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడు. అర్ధనగ్నంగా బెడ్‌పై పడుకొని ఆమెతో ఉన్న ఆ ఫొటో స్థానికంగా వైరల్ అయ్యాయి. దీంతో టీచ‌ర్ ఊరు విడిచిపెట్టి పారిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామ‌స్థులు కామ‌పిశాచి టీచ‌ర్ సిద్ధరాజును స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మైనార్టీల‌కు అండ‌గా వుంటా.. సిఎం జ‌గ‌న్ భ‌రోసా

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించి తీర్మానం క్యాంప్ కార్యాల‌యంలో జ‌రిగిన మైనార్టీ నేత‌లు, ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో సి.ఎం. భేటీ. జాతీయ జనాభా పట్టికలో(ఎన్పీఆర్‌) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్పీఆర్‌పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. ఎన్పీఆర్‌ అంశంపై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిపామని పేర్కొన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని అన్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వెల్లడించారు. NPR, NRC కు సంబంధించిన అంశాలపై ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌ" ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో చర్చించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ SB. అంజాద్ భాష మీడియాతో మాట్లాడారు.