TDP moves Supreme Court over BC reservations

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు టీడీపీ.. జీవో 176 అమలుకు డిమాండ్...

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గింపును సవాలు చేస్తూ టీడీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, అలాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కలిసి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే, చివరికి వాళ్ల కన్నుల్లో పొడుస్తూ, రిజర్వేషన్లు కుదించారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు తగ్గడం కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా 15వేల పదవులను బీసీలు కోల్పోనున్నారని అన్నారు.  అయినా, సొంత కేసుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సీనియర్ న్యాయవాదులను పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి.... బీసీల కేసుల విషయంలో మాత్రం ఎందుకు సమర్ధుడైన లాయర్ ను నియమించలేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా, జీవో 176ను యథాతథంగా అమలు చేయాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. నిజంగానే జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, 34శాతమున్న బీసీ రిజర్వేషన్లు... 24శాతానికి ఎలా పడిపోతుందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప, వాళ్లకు న్యాయం చేయడం లేదని జగన్ పై మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. అయినా, కోర్టుల ద్వారా బీసీ రిజర్వేషన్లకు అమలుకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ముందే ఎందుకు గుర్తించలేదని కొనకళ్ల ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై జగన్ ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్లే, తాము సుప్రీంను ఆశ్రయించామన్న టీడీపీ నేతలు... బలహీనవర్గాలకు న్యాయం చేయకపోతే, బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.

Nirbhaya Mother Asha Devi On New Hanging Date

నాల్గ‌వ డెత్ వారెంట్! ఈసారైనా అమ‌లౌతుందా?

మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించాలని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్లను జారీ చేసింది.  ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. నాలుగోసారి డెత్ వారెంట్లను పటియాలా హౌస్ కోర్టు గురువారంనాడు జారీ చేసింది. ఎప్ప‌ట్టిలాగే గురువారంనాడు కూడా నిర్భ‌య తల్లి ఆశాదేవీ పటియాలా హౌస్ కోర్టు హాల్‌లో ఉత్కంఠ‌త‌తో తీర్పు  విన‌డం కోసం ఆతృత్ర‌తో ఎదురుచూస్తున్నారు.   న్యాయ‌మూర్తి  త‌న తీర్పు వెల్ల‌డించారు.  మార్చి 20న ఉదయం 05.30 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశాలు జారీ చేశారు. నలుగురు దోషులు ముకేష్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ సింగ్ నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయనున్నారు. తీర్పు అనంతరం ఆమె తరఫున వాదించిన న్యాయవాదిని కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. డెత్‌వారెంట్లు జారీ అనంతరం ఆశాదేవి మీడియా మాట్లాడారు. 'నా కూతురిపై అత్యాచారం జరిపిన నలుగురు దోషులను ఉరితీసే సమయం ద‌గ్గ‌ర ప‌డింది.  నలుగురు కామాంధులను ఉరితీసిన రోజే నా కూతురికి న్యాయం జరిగినట్టు. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా పడటం విచారం. ఇక వారికున్న న్యాయపరమైన అంశాలన్నీ ఇక మూసుకుపోయాయి. దోషులు చట్టం నుంచి ఇక తప్పించుకోలేరు. ప్ర‌భుత్వం అవకాశం ఇస్తే వారి చావును చూడాలని ఉంది' అని అన్నారు. 2012 డిసెంబర్ 16న ఆరుగురు దోషులు... కదులుతున్న బస్సులో నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ని దారుణంగా చిత‌క‌బాదారు. ఆ తర్వాత నిర్భయను నడిరోడ్డుపై బస్సులోంచీ విసిరేశారు. ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం సింగపూర్ తరలించినా... ఆమె బతకలేదు. ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ కావడంతో  మూడేళ్ల శిక్ష తర్వాత 2015లో విడుదలయ్యాడు. మిగతా నలుగురు ముకేష్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ సింగ్ కి ఉరిశిక్ష పడింది. ఐతే చట్టంలో లొసుగులును ఉపయోగించుకొని ఉరిశిక్షను మూడుసార్లు వాయిదాపడేలా చేశారు. దోషులకు ఉన్న న్యాయపరమైన అంశాలన్నీ మూసుకుపోవడంతో ఈసారి శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Nagababu Gives Clarity On Chiranjeevi Rajya Sabha Seat

సినీ రంగానికే చిరంజీవి జీవితం అంకితం.. రాజ్యసభ సభ్యత్వంపై నాగబాబు క్లారిటీ...

మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం దక్కనుందనే ప్రచారంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మెగా అభిమానుల్లో గందరగోళం సృష్టించేందుకే కొంతమంది ఇలా చేస్తున్నారని నాగబాబు మండిపడ్డారు. ప్రస్తుతం చిరంజీవికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. పవన్ కల్యాణ్ జనసేనతో కూడా చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, పవన్ ఆలోచనలను అన్నయ్యగా చిరంజీవి సమర్ధిస్తారని చెప్పుకొచ్చారు. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం అంటూ తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టిస్తున్నారని నాగబాబు ఫైరయ్యారు. చిరంజీవి ఏ పార్టీలోకి వెళ్లినా గొప్పగా స్వాగతం లభిస్తుందని, అలాంటప్పుడు రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిందన్నారు. అయితే, చిరంజీవి తన జీవితాన్ని తిరిగి సినీ రంగానికే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే రాజకీయాలను వదిలేసి, సినిమాలపై దృష్టిపెట్టారని నాగబాబు తెలిపారు. అందుకే, వరుస సినిమాల్లో నటిసక్తున్నారని చెప్పుకొచ్చారు. మెగా హీరోల్లో అందరి కంటే చిరంజీవే సినిమాల్లో బిజీగా ఉన్నారని గుర్తుచేశారు. అన్నదమ్ములిద్దరూ ఒకే రంగంలో ఎందుకనే ఉద్దేశంతోనే చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారని నాగబాబు తెలిపారు. అంతేకాదు, తమ్ముడు పవన్ కోసం తన రాజకీయ జీవితాన్ని చిరంజీవి త్యాగం చేశారంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తనకంటే పవన్ అద్భుతంగా ప్రజలకు సేవ చేయగలడని, ఆయనకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్ ఉండాలంటే తాను అందులో ఉండకూడదని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారని నాగబాబు వివరించారు. చిరంజీవికి అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉంటాయని, అంతమాత్రాన ఆయా పార్టీల నిర్ణయాలకు ఆయన మద్దతు ఉన్నట్లు కాదన్నారు. ఇకకైనా, చిరంజీవిపై తప్పుడు ప్రచారం మానుకోవాలని నాగబాబు సూచించారు.

peddapalli mla sister family death mystery

కరీంనగర్ కారు మిస్టరీలో కొత్త కోణం... సత్యనారాయణరెడ్డి డైరీలో కీలక ఆధారాలు...

కరీంనగర్‌ కాకతీయ కెనాల్‌లో దొరికిన కారుపై మిస్టరీ కొనసాగుతోంది. అది ప్రమాదమా? లేక యాక్సిడెంట్‌లా అల్లిన కథా? అనేది ఇంకా తేలలేదు. అయితే, పోలీసులకు మాత్రం ఒక క్లూ దొరికింది. అది ప్రమాదం కాదని మొదట్నుంచీ అనుమానిస్తోన్న పోలీసులకు ఆధారం లభించింది. అనుమానాస్పద స్థితిలో మరణించిన ముగ్గురూ.... పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబం కావడంతో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.... మృతుడు సత్యనారాయణరెడ్డి ఫెర్టిలైజర్‌ షాపులో దొరికిన డైరీలో సంగతులు అనుమానాలకు బలం చేకూర్చాయి. సత్యనారాయణరెడ్డి తన డైరీలో 2020 జనవరి 27కి ముందు... తన ఆస్తి అంతా టీటీడీకి అప్పగించాలంటూ రాసుకున్నారు. దాంతో, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాకే, తన ఆస్తి గురించి డైరీలో రాశారని పోలీసులు భావిస్తున్నారు. డైరీలో దొరికిన ఈ ఆధారాన్ని బట్టి, సత్యనారాయణరెడ్డి కుటుంబానిది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.  డైరీలో దొరికిన ఆధారాల ప్రకారం ఆత్మహత్యగా అనుమానిస్తున్నా, కొన్ని సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. జనవరి 27నే సత్యనారాయణరెడ్డి ఫోన్ స్విచ్ఛాప్ అయితే, అప్పట్నుంచి కారు దొరికే వరకు ఆ కుటుంబం ఏమైందో... ఎక్కడికి వెళ్లిందో... కనీసం ఆరా తీసిన వాళ్లే లేకపోవడంతో... ఆ ముగ్గురి మృతిపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇక, డ్రైవింగ్ సీట్లో ఉండాల్సిన సత్యనారాయణరెడ్డి మృతదేహం... కారు వెనుక సీట్లో ఉండటంపైనా సందేహాలు కలిగించాయి. పైగా అర్ధరాత్రిపూట కాలువలో ఒక బైక్ పడిపోతేనే స్థానికులకు శబ్ధం వినిపించినప్పుడు... మరి, అంతపెద్ద కారు... ప్రమాదానికి గురై... కాలువలో పడిపోతే.... ఎవ్వరికీ చప్పుడు వినిపించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అసలు ఏ రోజు, ఏ సమయంలో కారు... కెనాల్‌లో పడిందనేది సైతం మిస్టరీగా మారింది.  మరోవైపు, కాలువలో కారు బయటపడే నాటికి 15రోజుల కిందట సత్యనారాయణరెడ్డి, రాధ, వినయశ్రీ సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ చెప్పాలంటూ కరీంనగర్ త్రీటౌన్ పోలీసులను, అలాగే పెద్దపల్లి పోలీసులను సంప్రదించిన వ్యక్తులు ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం కూడా కలకలం రేపింది. ఈ ఎంక్వైరీ చేసిందెవరనేది సస్పెన్స్‌గా మారింది. ఈ అనుమానాలన్నింటికీ సమాధానాలు దొరికితేనే, ఈ ముగ్గురి మృతిపై అనుమానాలు తొలగిపోతాయి.  

Nirbhaya Convicts To Hang On March 20

నిర్భయ దోషుల ఉరి తేదీ ఖరారు.. దారులన్నీ మూసుకుపోయినట్టే!

నిర్భయ దోషులకు న్యాయపరంగా, చట్టపరంగా లభించిన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. చివరిగా పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ ను కూడా రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దాంతో, నలుగురు దోషుల ఉరికి తాజాగా డెత్ వారెంట్లు జారీ చేసింది ఢిల్లీ కోర్టు. మార్చి 20న ఉదయం 6గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలంటూ పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడటం, దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోవడంపై ఇక, ఉరిశిక్ష అమలుకు ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని అంటున్నారు. దాంతో, ఈసారి ఉరి అమలు ఖాయంగా కనిపిస్తోంది.   అయితే, దోషులు నలుగురినీ, ఒకే ఉరికంబంపై... ఒకేసారి ఉరితీయనున్నారు. ఉరిశిక్ష అమలు కోసం తీహార్ జైలు అధికారులు ఇఫ్పటికే ఎన్నోసార్లు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. నిర్భయ దోషుల కోసం ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఉరికంబంపై ఉరితీయనున్నారు. నలుగురినీ ఒకేసారి ఉరితీసేందుకు అనుగుణంగా తీహార్ జైల్లో ఏర్పాట్లు చేశారు. అలాగే, ఉరి తీసిన తర్వాత అక్నడ్నుంచి మృతదేహాలను తరలించేందుకు అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మించారు. ఇక, భారత్‌లో ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరితీసిన సందర్భాలుండగా... మొదటిసారి నలుగురినీ ఒకే ఉరికంబంపై ...ఒకే సమయంలో ఉరి తీయబోతున్న జైలుగా తీహార్ కారాగారం రికార్డులకెక్కబోతోంది.

Nara Brahmani Coming In to Active Politics

బ్రాహ్మణికి తెలుగుదేశం పగ్గాలు..! త్వరలో చంద్రబాబు కీలక నిర్ణయం

నారా లోకేష్ విందు రాజకీయంపై తెలుగుదేశంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ విందులో పాల్గొన్నది మొత్తం టీడీపీ నేతల రాజకీయ వారసులే. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన సుపుత్రులు, సుపుత్రికలే. అయితే, ఇది పేరుకే విందు కార్యక్రమం అయినా, తాజా రాజకీయ పరిణామాలే ప్రధానాంశాలుగా ఈ మీటింగ్ జరిగింది. భవిష్యత్ కార్యాచరణతోపాటు పార్టీ బలోపేతంపైనా డిస్కషన్ చేశారు. అయితే, ఈ పార్టీలో బ్రాహ్మణి హైలైట్ అయ్యారు. లోకేష్‌తో కలిసి అందరితో మాట్లాడిన బ్రాహ్మణి... తన ఆలోచనల్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై లోకేష్‌తో కలిసి పార్టీ నేతలతో చర్చించారు. అయితే, ఎన్నడూలేనిది, పార్టీ యంగ్‌స్టర్స్‌ మీటింగ్‌లో నారా బ్రాహ్మణి పాల్గొనడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బ్రాహ్మణిని క్రియాశీల రాజకీయాల్లోకి తేవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేయాలనుకుంటున్నారట. లోకేష్‌కు చేదోడువాదోడుగా ఉండేలా క్రియాశీలకం చేయాలనుకుంటున్నారని, త్వరలోనే బ్రాహ్మణికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. నందమూరి ఆడపడుచుగా, నారా వారి కోడలిగా బ్రాహ్మణికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. కుటుంబ వ్యాపారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ బిజినెస్ మీటింగ్స్ లో ప్రసంగించి మెప్పించిన బ్రాహ్మణి... రాజకీయాల్లోకి వస్తే, ప్రజలను కూడా ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు. అయితే, నిన్నమొన్నటివరకు ప్రస్తుతం తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చిన బ్రాహ్మణి... ఇఫ్పుడు పార్టీ యంగ్‌స్టర్స్‌ మీటింగ్‌లో పాల్గొనడం చూస్తుంటే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముందడుగు వేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, చంద్రబాబుకు వయసు మీదపడటం, ఏదోఒక రోజు నారా లోకేష్ చేతుల్లోకి పార్టీ వెళ్లక తప్పదు కనుక, భవిష్యత్తులో లోకేష్‌కు చేదోడువాదోడుగా ఉండేందుకు ఇఫ్పట్నుంచే బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, పార్టీలో కీలక పదవి ఇవ్వాలని బాబు ఆలోచిస్తున్నారని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారు.

journey in this buses very dangerous

లారీ లు తీసుకువచ్చి బస్సులు కింద మార్చారు. ఆ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం!!

ఇంజన్ లారీ ది. బాడీ మాత్రం బస్సుది. ఇది తాడిపత్రి మాయాజాలం అంతే. ఈ సంగతి ని తిరగదోడిన ఏపీ రవాణా శాఖ జాయింట్ కమీషనర్ ప్రసాద రావు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం... 2017 లో సుప్రీంకోర్టు లో ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం BS 3 వాహనాలు అమ్మకూడదని చెప్పింది. జాటధర కంపెనీ, సి గోపాలకృష్ణ కంపెనీ Bs 3 వాహనాలు కొని దొంగ రిజిస్ట్రేషన్స్ చేయించారు. 66 వాహనాలకు సంబంధించి ఫిర్యాదు వచ్చాయి. వాహనాలకు సంబంధించి అశోక్ లేల్యాండ్ కంపెనీ కి సమాచారం అడిగాం. నాగా ల్యాండ్ లో 2018 సెప్టెంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి నుంచి నో అబ్ జెక్షన్  కింద ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. 45 లారీలు ఏపీ లో ఉన్నాయి అశోక్ లేల్యాండ్ కంపెనీ 66 లారీ లను స్క్రాప్ కింద అమ్మేసారు. వాహనాలన్ని సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ, జటదర్ కంపెనీ కింద రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాహనాలు కొనుగోలు సమయంలో తాడిపత్రి లో పర్మనెంట్ అడ్రెస్  నాగల్యాండ్ లో టెంపరరీ అడ్రెస్ పెట్టారు. జేసీ ఉమ్మారెడ్డి 4 వాహనాలకు సంతకం చేశారు. 2 వాహనాలకు సి గోపాల్ రెడ్డి పేరుతో సంతకం చేశారు. 6 వాహనాలకు సంబంధించి వాహన యజమానుల తో పాటు అశోక్ లేల్యాండ్ కంపెనీ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసాం. దొంగ ఇన్సూరెన్స్ లు పెట్టారు. యునైటెడ్ చీఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తో కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నాం. ఈ వ్యవహారంపై జాయింట్ కమిషనర్ నేతృత్వంలో యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. దేశంలో తిరగడానికి వీలులేని వాహనాలను తిప్పుతున్నారు. పోలీసుల సర్టిఫికెట్ లు కూడా దొంగవి పెట్టారు. పోలీస్ శాఖ కూడా క్రిమినల్ కేస్ లు కూడా పెట్టింది. కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయితే 100 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందివాహనాలకు సంబంధించిన లావాదేవీలు నిలిపి వేశాం. 25 వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా  లావాదేవీలు నిలిపివేయాలని కోరమన్న జాయింట్ కమిషనర్ ప్రసాద రావు. సీజ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టాం. ఇప్పటికి 23 వాహనాలు సీజ్ చేసాం. 45 లో 23 వాహనాలు సీజ్ చేసాం. ఆ ఇద్దరు వాహనాలు కొని వేరే వ్యక్తులకు అమ్మేశారు. వాహనాలు కొని మోసపోయిన వారు అమ్మిన వారిపై కేసులు పెట్టాలని సూచించాం. రవాణాశాఖ లో ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇంకా 88 వాహనాలు నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. జటధర ఇండర్స్ట్రీస్,సి గోపాల కృష్ణ కంపెనీ కి చెందిన 80 బస్సులు ఉన్నాయి. లారీ లు తీసుకువచ్చి బస్సులు కింద మార్చారు. ఆ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం. 88 వాహనాలకు సంబంధించి 3 కేసులు నమోదు అయ్యాయి. 23 వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారుల ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. అన్ని వాహనాలు అనంతపురంలో రిజిస్ట్రేషన్స్ జరిగాయి. లారీ ఛాసిస్ తో 3 బస్సులు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు క్యారియర్స్ నడిపే వారిపై 4.75 కోట్ల రూపాయలు జరిమానాలు కింద వసూలు చేశామన్న జాయింట్ కమిషనర్.

Kanna Lakshminarayana Fires on CM YS Jagan

ఓటమి భయంతోనే రహస్య జీవోలు... జగన్ రెడ్డిపై కన్నా తీవ్ర ఆరోపణలు...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. నవరత్నాల పేరుతో చాక్లెట్లిచ్చి... నెక్లెస్ లు ఎత్తుకుపోతున్నారని కన్నా విమర్శించారు. మద్యం ధరలు విపరీతంగా పెంచేసి దోపిడీ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఇప్పటికే బస్సు, విద్యుత్, మద్యం ధరలు పెంచేసి ప్రజల నడ్డివిరుస్తోన్న జగన్ ప్రభుత్వం... త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచబోతున్నారని ఆరోపించారు.  ఇక, రాత్రికి రాత్రే రహస్యంగా జగన్ ప్రభుత్వం విడుదల చేస్తోన్న విషపూరిత జీవోల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక, ఎన్నడూలేనివిధంగా కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి, భయభ్రాంతులకు గురిచేసి స్థానిక ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కన్నా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అకృత్యాలను, అరాచకాలకు ప్రజలు ధైర్యంగా ఎదుర్కోవాలని కన్నా పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు వైసీపీ చేస్తోన్న ప్రయత్నాలను ప్రజలే అడ్డుకోవాలన్నారు.     జగన్మోహన్ రెడ్డి పాలనపై అసలు ఆయనకే నమ్మకం లేదని కన్నా విమర్శించారు. అందుకే, విపక్షాలు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడగకుండా చేసేందుకే తప్పుడు జీవోలు తీసుకొచ్చారని కన్నా విమర్శించారు. డబ్బు, మద్యం పంచితే చర్యలంటూ జీవోలు ఇచ్చి ప్రతిపక్షాలను జైలుకు పంపేందుకు కుట్ర పన్నారని కన్నా ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలైన గ్రామ వాలంటీర్లు ఫిర్యాదు చేస్తే చాలు కేసులు పెట్టి జైలుకు పంపుతామనడం దుర్మార్గమన్నారు. జగన్ పాలనలో వైసీపీ శ్రేణులు తప్ప... ప్రజలెవరూ సుఖశాంతులతో లేరన్నారు కన్నా.

Kurnool TDP leader Bangi Ananthaiah attempts suicide

టిడిపి నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం

చంద్రబాబు వల్లే నష్టపోయానంటూ సూసైడ్‌ నోట్‌ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణంగానే తాను స‌ర్వం కోల్పోయానంటూ సూసైడ్‌ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించారు  టిడిపి సీనియ‌ర్ నేత బంగి అనంత‌య్య‌. క‌ర్నూల్ ప‌ట్ట‌ణంలో సీనియ‌ర్ టిడిపి నేత రాజ‌కీయాల‌పై వైరాగ్యం చెంది ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించారు. కుటుంబ సభ్యులు ఎవ‌రూ లేని సమయంలో బంగి అనంతయ్య ఇంట్లో ఉరి వేసుకున్నారు. అయితే అదే సమయానికి కుటుంబ సభ్యులు రావడంతో ఉరి నుంచి తప్పించి హుటా హుటిన కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య‌ప‌రిస్థితి నిల‌క‌డ‌గా వుంది. అయితే తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను సూసైడ్‌ నోట్‌లో రాశారు. ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కోసం శ్రమించిన త‌న‌కు మాత్రం ఫ‌లితం ద‌క్క‌లేద‌ని నోట్‌లో ఆయ‌న పేర్కొన్నారు. తాను ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయినా చంద్ర‌బాబు త‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని నోట్‌లో బంగి అనంతయ్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు.   జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా తన ఎదుగుదల దెబ్బతీసి తొక్కాశారంటూ సూసైడ్‌ నోట్‌లో బంగి అనంతయ్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Senior journalist Potturi Venkateswara Rao passes away

సీనియర్ జర్నలిస్టు పొత్తూరి కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86)  కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సొంతింట్లోనే తుది శ్వాస విడిచారు. తెలుగు పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా పొత్తూరి సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. పొత్తూరి వెంకటేశ్వరరావు 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలోని పొత్తూరులో జన్మించారు. 1957లో ఆంధ్రజనత పత్రికలో చేరి పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాత ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో పని చేశారు. పొత్తూరి అనేక పుస్తకాలు కూడా రచించారు. 2000 సంవత్సరంలో ఆయన రాసిన 'నాటి పత్రికల మేటి విలువలు' పుస్తకం, 2001లో విడుదలైన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.

No citizenship records available for Haryana CM

పి.ఎం, సి.ఎంల‌కే పౌర‌స‌త్వ ఆధారాలు లేవ‌ట‌!

అవును. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వివాదస్పదంగా మారిన నేపధ్యంలో  దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దేశంలో తొలిసారి కులం ఆధారంగా పౌరసత్వం ఇవ్వబోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు ప్ర‌ధాని మోదీకి, హ‌ర్యానా ముఖ్య‌మంత్రికి పౌర‌స‌త్వ ఆధారాలున్నాయా అంటూ ఆర్ టి ఐ దాఖ‌లైంది. అయితే, ప్ర‌ధాని మోడీ కి పౌరసత్వం ఉందా అని RTI ద్వారా సమాచార ఆడిగితే PMO నుండి వచ్చిన సమాధానం ఆస‌క్తిక‌రంగా వుంది. ఏది క్లియర్ గా చెప్పలేకపోయారు, మోదీకి సంబంధించిన ఆధారాలు రిజిస్ట్రేషన్ అయ్యి లేవు కానీ, ఇండియా లో నే జన్మించారు కాబట్టి పౌరుడే అని స‌మాధానంలో ఆర్ టి ఐ అధికారులు వెల్ల‌డించారు. బీజేపీకి చెందిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌, అతని కేబినెట్ మంత్రుల పౌరసత్వాన్ని నిరూపించే ఆధారాలపై మ‌రో ఆర్ టి ఐ దాఖ‌లైంది. అస్సాంలో మాదిరిగానే హర్యానాలో తమ ప్రభుత్వం ఎన్.ఆర్.సి ని అమలు చేస్తుందని ఇటీవల నేవీ చీఫ్‌ అడ్మిరల్ సునీల్ లాంబ, రిటైర్డ్ హైకోర్ట్ జడ్జీ హెచ్.ఎస్. భల్లాలతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ప్రకటన చేయడంపై విశేషం. ఈ నేప‌థ్యంలో  పానిపట్ కు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త పి.పి కపూర్ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, అతని ప్రభుత్వంలోని మంత్రులు, గవర్నర్ సత్యదేవ్ నారాయణ్‌ ఆర్య ల పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద జనవరి 20 న దరఖాస్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌, అతని కేబినెట్ మంత్రుల పౌరసత్వాన్ని నిరూపించే  ఎలాంటి రికార్డ్స్ లేవని ప్రజా సమాచార అధికారి పూనమ్ రతి స‌మాధానం పంపించారు. అది సంగ‌తి. ఇన్ని రోజులుగా జనం చెప్పేది అదే.  మేమంతా ఇక్కడే పుట్టిపెరిగామని.

jc diwakar reddy shocking comments on vizag airport incident

బాబును చావ‌గొట్టకుండా విడిచిపెట్ట‌డం అదృష్ట‌మేన‌ట‌!

త‌ప్పించుకొని వ‌చ్చినందుకు చంద్ర‌బాబు సంతోష‌ప‌డాలని జేసీ అంటున్నారు. విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేవ‌లం అడ్డుకున్నారు. చెప్పులు విసిరారు. అంత వ‌ర‌కే ఆగిపోయారు. ఇంకా ముందుకు వెళ్ళి చంద్ర‌బాబునాయుడిని కొట్టకపోవటం అదృష్టమే. చంద్ర‌బాబును పోలీసులే కింద పడేసి.. చావగొట్టకపోవటం సంతోషకరమని జేసీ దివాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపుతున్నాయి. నోటి దూల తీర్చుకోవ‌డం జేసీ దివాక‌ర్ రెడ్డికి అల‌వాటే. తాజాగా చంద్ర‌బాబునుదే్ద‌శించి జేసీ కామెంట్స్ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అస‌లు జీసీ చంద్ర‌బాబును పొగుడుతున్నారా?  లేక వ్యంగం ఎక్కువైందా అని టిడిపిలో చ‌ర్చ మొద‌లైంది. చంద్రబాబు విషయంలో మితిమీరిన ఉత్సాహంతో దివాక‌ర్‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నార‌ని టిడిపి నేత‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన భేషుగ్గా వుంద‌ని,  అతనెప్పటికి తమ వాడేనని జేసీ వ్యాఖ్యానించ‌డం టిడిపి శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Garlic can help cure the coronavirus

వెల్లుల్లికి కరోనాను ఎదుర్కొనే శక్తి వుందా?

కరోనా మందు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా! తాజాగా ఉడికించిన వెల్లుల్లితో కరోనాను కంట్రోల్ చేయ‌వ‌చ్చ‌ట‌.  ఓ చైనా వైద్యుడు ఈ చిట్కాను అనేక మంది కరోనా రోగులపై ప్రయోగించి విజయం సాధించినట్టు తెలుస్తోంది . ఈ మందు ఎలా చేసుకోవాలంటే .. ఎనిమిది తరిగిన వెల్లుల్లి , లవంగాలను తీసుకోవాలి. వాటిని ఏడు కప్పుల నీటిలో వేసి మరిగించాలి . బాగా మరిగిన తర్వాత .. ఆ వెల్లుల్లి రెబ్బలను, లవంగాలను తినేయాలి .. వెల్లుల్లి , లవంగాలను మరగపెట్టగా వచ్చిన నీటిని తాగేయాలి. ఇలా ఒక రాత్రి చేస్తే .. తెల్లవారే సరికల్లా కరోనా చాలా మందికి నయమైందని చెబుతున్నారు.

చంద్ర‌బాబు కుటుంబం హత్యకు వైసీపీ కుట్ర!!

చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులను అంతమొందించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇటీవలే విశాఖలో చంద్రబాబు, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. చంద్రబాబు, లేకేష్‌ను లేకుండా చేస్తే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై లోకేశ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే పోలీసులకు బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు, లోకేశ్‌కు భద్రత తగ్గింపుపై కేంద్రానికి లేఖ రాస్తామని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 

బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి

ప‌బ్‌లో గ్యాంగ్ వార్‌   ఎమ్మెల్యే సోద‌రుడి గ్యాంగ్‌తో త‌ల‌ప‌డ్డ రాహుల్ గ్యాంగ్‌ బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్బులో దాడి జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్  ఎంజాయ్ చేస్తూ  ఇబ్బందుల్లో ప‌డ్డాడు.   అదే ప‌బ్‌లో కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి ని చూసి కామెంట్లు చేస్తూ అస‌భ్య‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయాడు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అంతే ఇరు ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. సినిమా షూటింగ్‌ను త‌ల‌పించేలా అర‌గంట సేపు గ్యాంగ్ వార్ న‌డిచింది. ఈ గొడ‌వ‌లో కొంత మంది యువ‌కులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాహుల్ చికిత్స పొందుతున్నాడు. 

జీసస్ శిలువ తొలగింపుపై దుమారం.. దేవనహళ్లిలో ఉద్రిక్త‌త‌

బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారంటూ ఏసుక్రీస్తు విగ్రహం, కొన్ని శిలువలను స్థానిక మున్సిపల్ అధికారులు తొలగించారు. స్థానిక క్రైస్తవులు అడ్డుపడ్డారు. అధికారులు విగ్రహం, శిలువలను ధ్వంసం చేశారు. జీసస్ విగ్రహాన్ని, శిలువలను నేలమట్టం చేశారు. శిథిలాలను ట్రక్కులో తరించారు.  దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు ఎలాంటి నోటీసులను కూడా ఇవ్వకుండా విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ  క్రైస్తవ మత పెద్దలు నిల‌దీసినా అధికారులు ప‌ట్టించుకోలేద‌ట‌. ప్రభుత్వం స్మశాన వాటిక కోసం క్రైస్తవ సంఘాలకు కేటాయించిన 4.20 ఎకరాల స్థలంలోనే తాము విగ్రహాన్ని నిర్మించామని క్రైస్తవ మత పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంత మంది క్రిస్టియ‌న్లు అక్కడ జీసస్ విగ్రహాన్ని, శిలువను నిర్మించారంటూ స్థానిక భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ కార్యకర్తలు ఫిర్యాదు చేయ‌డంతో తాము పోలీసుల సహాయంతో చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అధికారులు చెబుతున్నారు. 

బీసీలను నమ్మించి మోసం చేస్తారా?

బీసీ కోటాపై సుప్రీంకు వెళ్ళండి! ప్రభుత్వం తరఫున ఎస్‌ఎల్‌పీ వేయండి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయండి సి.ఎం. జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌ బీసీల రిజర్వేషన్‌ పరిరక్షణ కోసం తక్షణం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయకుండా.. వారికి 24 శాతం రిజర్వేషన్‌తోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకోవడం పై ఆయ‌న తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.   బీసీల రిజర్వేషన్ పై అఖిల పక్ష సమావేశం పిలవకుండా, బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని చంద్ర‌బాబు త‌ప్పుప‌డుతూ  ముఖ్యమంత్రికి  చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌, బీసీ సబ్‌ప్లాన్‌ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు తగ్గించి వెన్నుముక విరిచేయడం, బీసీలను నమ్మించి మోసం చేయడమేన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.