కమల్ హాసన్  రాజకీయ కథ  ముగిసినట్లేనా ? 

కమల్ హసన్ చాలా గొప్ప నటుడు ... ఒక్క తమిళనాడు ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతదేశ ప్రజలు అభిమానించే నటుడు. సందేహం లేదు. ఆయన నటించిన సినిమాలను ప్రజలు ఆదరించారు. తెర మీద ఆయన బొమ్మ చూసి ఈలలు వేసారు... హరతులిచ్చారు. కానీ, అదే కమల్ రాజకీయ వేషం కడితే, తమిళ ప్రజలే ఛీ’ పొమ్మని చీదరించుకున్నారు. నిజమే, తమిళ రాజకీయాల సినీ పరిశ్రమ ప్రభావం కొంచెం చాలా ఎక్కవే. అన్నాదురై మొదలు ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత వరకు ఇంచుమించుగా ఓ అర్థ దశాబ్దం పై తమిళ రాజకీయాలలో చక్రం తిప్పిన హేమాహేమీలుఅందరూ ఇంట(సినిమా రంగం) గెలిచి, రచ్చ (రాజకీయ) రంగంలో రాణించారు. అయితే, అదే తమిళనాడులో శివాజీ గనేషన్ మొదలు కమల్ హసన్ వరకు చాలా మంది మహా నటులు రాజకీయ యవనికపై, రాణించలేక పోయారు.  కమల్ విషయాన్నే తీసుకుంటే, ఆయన స్థాపించిన, ‘మక్కల్‌ నీధి మయ్యమ్‌’(ఎంఎన్‌ఎం) పార్టీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, చాలా  ఘనంగా ఓడిపోయింది. ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ, జన సేన కంటే కూడా ఘోరంగా ఓడి పోయింది. జన సేనకు కనీసం ఒక్క సీటైన దక్కింది, (సరే ఆ గెలిచిన ఒక్క ఎమ్మెల్ల్యే గోడ దూకేశారు అనుకోండి అది వేరే విషయం)కమల్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదు. చివరకు కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హసన్, బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి కంటే, బీజేపీ చేతిలో ఓడిపోవడం కమల్ హసన్ను, అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుగా  మరింత క్షోభకు గురిచేసిందని, ఆయనే స్వయంగా వాపోయారు.  అదలా ఉంటే, కమల్ పార్టీ కథ, ఎన్నికల తర్వాత చాలా ఇంటరెస్టింగ్’గా సాగుతోంది. పార్టీ నాయకులు వరస పెట్టి, కమల్ సారు వాడికి, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎన్నో ఆశలతో, ఏకంగా ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కన్న కమల్’కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వుంది. ఇప్పటికే, పార్టీ ఉపాధ్యక్ష్డుడు ఆర్ మహేంద్రన్, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు, ప్రముఖ పర్యావరణ కార్యకర్త ప‌ద్మ ప్రియ సహా అనేక మంది ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా, పార్టీ పురుడు పోసుకున్న క్షణం నుంచి కమల్ వెంట ఉన్న,పార్టీ కీలక నేత సీకే కుమార్ వెల్’ సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతే కాదు, ఆయన  పోతూ పోతూ రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన, పనికి రాదని కమల్ వ్యవహార సరళిని తప్పు పడుతూ ఒక చురాక అంటించారు. కమల్ హసన్, ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యూహ బృందం తప్పటడుగులు వేయడంవల్లనే, పార్టీ ఘోరంగా ఓడి పోయిందని మరో వాత పెట్టారు. పార్టీ  ఓటమికి కమలే కారణమని తేల్చి చెప్పి మరీ గుడ్ బై చెప్పారు.  కాగా, ఈ రాజీనామాల పరపర ఇలాగే, కొనసాగితే, కమల్ పార్టీ ‘ఎంఎన్‌ఎం’ కూడా మఘలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన పార్టీల జాబితాలో చేరిపోవదానికి ఎంతో కాలం పట్టదని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాదు ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపక పోయినా మన పవన్ కళ్యాణ్, తమిళ రాజకీయ తెరపై, విజయకాంత్ అప్పుడప్పుడు అలా మెరుస్తూనే ఉన్నారు. కానీ, కమల్ హసన్ ... కథ ముగిసినట్లేనని, విశ్లేషకులు పేర్కొంటున్నారు.  కమల్ కథ ఇలా ఉంటే, కన్నడ సినీ నటుడు ఉపేంద్ర తనకు ముఖ్యమంత్రి అయిపోవాలని మహా కోరికగా ఉందని, తమ మనసులోని మాటను ట్విట్టర్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆయన  ‘చిరు’ కోరిక తీరుతుందా..లేక ఆయన కన్నడ కమల్’ లా మిగిలిపోతారో .. చూడాలి.

బావతో పెళ్లికి నో.. మరదలు ఆత్మహత్య..

వాళ్ళ ఇద్దరు బావ మరదలు.. అనేది విడదీయలేని బంధమనే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో కొన్నీ పదాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భార్య భర్తలు, అన్నాతమ్ముడు.. అక్క చెల్లెలు. అత్తమామలు. బావ మరదలు. ఒకవేల మనుషులు దూరం అవ్వోచ్చేమో గానీ ఈ పదాలను విడదియ్యలేం. ఇదంతా మా కెందుకు అనుకుంటున్నారా..? మనం చదవబోయే మ్యాటర్ పై పదాలతోనే ముడిపడి ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి.. వివరాల్లోకి వెళ్దాం..  అది పఠాన్ చెర్. అమ్మాయి పేరు నాగులపల్లి పూజిత. వయసు 14 సంవత్సరాలు. సంగారెడ్డి గురుకుల హాస్టల్‌లో 8వ తరగతి చదువుతుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల ఇంటి వద్ద ఉంటుంది. పూజితకు మేనబావ ఉన్నాడు. అతని పేరు సాయిబాబా. వాళ్ళు ఇద్దరు మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. జీవితాంతం కలిసి బతుకుదాం అనుకుని ఎన్నో కలలు కన్నారు..వారి విషయం ఇంట్లో తెలిసింది.  వీళ్ళ ఇద్దరి పెళ్ళికి  పూజిత ఇంట్లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అంతే పూజిత కల నెరవేరుతుందనుకుంది. తన మేన బావతో సంతోషంగా ఉండొచ్చు అనుంకుంది. సడెన్ గా ఏమైందో ఏమో.. వాతావరణ శాఖ వాళ్లు సడెన్ గా తుపాన్ అని హెచ్చరించినట్లు. పూజిత తల్లి దండ్రులు ఈ పెళ్లి చెయ్యము అన్నారు. తల్లిదండ్రులు పెళ్లి వద్దు అనడానికి కారణం ఇదే..  ఈ మధ్య తన మేనబావ తాగుడుకు బానిసవడంతో ఇంట్లో వారు అతనితో పెళ్లి రద్దు చేద్దామని నిశ్చయించారు. అప్పటి నుండి పూజిత తనలో తాను బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురైంది. పూజిత ఆవేశం లో తన బావ దక్కడని ఆలోచించింది గాని . తన తల్లిదండ్రులు ఎందుకు వద్దు అంటున్నారు అని ఆలోచించలేకపోయింది. దీంతో ఆదివారం సాయంత్రం ఇంటి ముందు గల స్క్రాప్‌షాప్‌లో ఇనుప రాడ్డుకు తన చున్నీతో ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన పూజిత చెల్లెలు వర్షిని ఇంట్లో వారికి తెలుపగా వెంటనే మృతురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పూజితను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతురాలి అమ్మమ్మ సూర్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్ ప్రసాద్ రావు పేర్కొన్నారు. ప్రేమించడం తప్పు కాదు.. దాని వెనక ఉన్న నిజానిజాలు తెలుసుకోవాలి. ఓపిగ్గా వైట్ చెయ్యాలి.. అవసరం అయితే తల్లి దండ్రులను మళ్ళీ మళ్ళీ ఒప్పించాలి. అంటే గాని ఇలా చనిపోతే ఏం లాభం. అయినా ఆ అమ్మాయిది పెళ్లి చేసుకునే వారు కాదు. అసలు ఆ అమ్మాయి అమ్మానాన్నలను అనాలి. అయినా ఈ కాలం పిల్లలు అనాలి చదువుకునే వయసులో ప్రేమ పెళ్లిళ్లు ఏంటో అర్థం కావడం లేదు. 

సినీ ఫక్కీలో వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకున్న మంత్రి

అతనో మంత్రి... కాన్వాయ్ లో వెళుతున్నారు.. అతని కళ్లు ముందే ఓ ప్రమాదం జరిగింది.  ఓ బైకును ఢీకొట్టిన వాహనం... ఆగకుండా అలాగే స్పీడుగా వెళుతోంది. ఇది గమనించిన సదరు మంత్రి.. తన వాహనాన్ని స్పీడ్ పెంచాలని డ్రైవర్ ను ఆదేశించారు. సినీ ఫక్కీలో ఆ వాహనాన్ని ఛేజ్ చేశారు. ప్రమాదం చేసి పరారవుతున్న వాహనం డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన బైకిస్టుకు మెరుగైన చికిత్స అందేలా మంత్రి చర్యలు తీసుకున్నారు.  సినీ ఫక్కీలో వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకున్న ఆ మంత్రి.. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.  మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వస్తోంది. రాజాపూర్ సమీపంలో ముదిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బాలానగర్ నుంచి సొంతూరుకు బైక్ పై వస్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళుతున్న బొలెరో వాహనం రాజాపూర్ శివారులో బైక్‌ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు అటుగా వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకుపోమని డ్రైవర్‌ను ఆదేశించారు. బైక్‌ను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిన బొలెరో వాహనాన్ని ఛేజ్ చేసి 3 కిలోమీటర్ల లోపే పట్టుకున్నారు. మంత్రి వాహనాన్ని అడ్డంగా పెట్టి బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం యాక్సిడెంట్ చేసి పరారవుతున్న కర్ణాటకకు చెందిన బొలెరోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్‌ను రాజాపూర్ పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి మహబూబ్ నగర్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు పంపించారు. తన కళ్ల ముందే ప్రమాదాన్ని చూసి వెంటనే మానవత్వంతో స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే బాధితునికి వెంటనే చికిత్స అందింది. తప్పుచేసిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారని స్థానికులు తెలిపారు. మంత్రి సాయానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. 

సీలేరులో రెండు నాటు పడవలు బోల్తా.. 8 మంది గల్లంతు 

విశాఖపట్నం జిల్లా ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు పడవలు నీట మునిగాయి. ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు ఒక చిన్నారి తదేహం లభ్యమైంది.  మరో ముగ్గురు ప్రయాణికులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు పడవల్లో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ వలస కూలీలుగా తెలుస్తోంది.  హైదరాబాద్ కూలి పనులకు వెళ్ళి లాక్‌డౌన్ వల్ల తిరిగి స్వగ్రామలకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన కూలీలది గుంటవాడ, కెందుగుడా గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. మల్కాన్ గిరి జిల్లా కెందుగుడ వద్ద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కరోనా టెస్ట్ చేసుకోని యువకుడికి దేహశుద్ది.. 

కరోనా ఆ పేరు వింటే చాలు. హారర్ సినిమాలో సీన్ కంటే దారుణంగా ఉంది. రోజు ఎంతో మంది. తుపాకీ  చప్పుడు విని చెట్టు మీద పిట్టలు ఎగిరినట్లు కరోనా దెబ్బకు మనుషులు కూడా అలా ఎగిరిపోతున్నాడు. సచ్చినా శవాలను దహనం చేయడానికి స్మశానాలు కాళీ లేవు. వేసుకోవడానికి వ్యాక్సిన్ లేదు. పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేదు. ఇలాంటి పరిస్థితులు చూస్తూకూడా, టైం లో ఎవరి ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. కొంత మంది మాస్కులు పెట్టుకోవడం లేదు.  దేశం లో చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడం లేదు. వ్యాక్సిన్ కూడా దొరకడం లేదు. ఇంకొంత మంది కోవిద్ పాజిటివ్ వచ్చాక ఇతరుల గురించి ఆలోచించకుండా హాస్పిటల్స్ నుండి పారిపోతున్నారు. తాజగా  కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా టెస్టు చేయించుకోలేదని బృహత్​ బెంగళూరు మహానగర పాలక సంస్థ(బీబీఎంపీ) సిబ్బంది ఇద్దరు యువకులను చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. బెంగళూరులోని నాగరత్‌పేట్ టెస్టింగ్ కేంద్రంలో టీకా కోసం వచ్చిన ఇద్దరు యువకులు చాలా సేపు లైన్‌లో వెయిట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత అది టీకా కేంద్రం కాదు, కొవిడ్ పరీక్షా కేంద్రం అని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన బీబీఎంబీ సిబ్బంది.. వారిని టెస్టు చేయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సిబ్బంది.. యువకులను దారుణంగా కొట్టారు. ఈ విషయం కాస్తా పోలీసులకు.. తెలియడంతో యువకులపై చేయి చేసుకున్న అధికారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.  

మొగుడిని లూటీ.. ప్రియుడికి నాటి..   

ఓపెన్ చేస్తే.. అది ఖమ్మం జిల్లా. కారేపల్లి గ్రామం. ఆ గ్రామానికి చెందిన శివ ప్రకాష్ . బంగారు తాకట్టు పెట్టుకునే వ్యాపారం చేసేవాడు. అతనికి పెళ్లి అయింది. తన భార్య పేరు అర్చన. వీరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. సంతానం కలిగాక కొంత కాలానికి భార్య, భర్తల మధ్య వివాదాలు వచ్చాయి.  కట్ చేస్తే..  ఈ క్రమంలోనే ఏడాది నుంచి వేరు వేరుగా ఉంటున్నారు. ముగ్గురు పిల్లలను తన వెంటే ఉంచుకున్న అర్చన గుంటూరులోని తన పుట్టినింట్లో ఉంటుంది. ఇదే సమయంలో మాచెర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన బతుల వెంకట కృష్ణ ప్రసాద్‌(27)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ప్రియుడితోనే జీవించాలని నిర్ణయించుకుంది అర్చన. సరిగ్గా ఇదే సమయంలో శివప్రకాశ్ తల్లి మరణించడంతో అంత్యక్రియలకు హాజరైంది.. ఆ తర్వాత భర్త ఇంట్లోనే ఉంది..భర్త కూడా పోనిలే అనుకున్నారు. పిల్లల భవిష్యత్తు ఆలోచించాడు.  అంత బాగానే ఉందనుకునే సమయంలో శివ ప్రకాష్ ఇంట్లో  4న గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి.. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్ దొంగతనానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి మే 5న ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత మే 20న మరోసారి వచ్చిన బాధితుడు మొత్తం 1,330 గ్రాముల బంగారం, 2,330 గ్రాములు వెండి దొంగిలించారని అసలు విషయం చెప్పడంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి చివరకు అసలు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం రూ. 63 లక్షలు విలువ చేసే 1224.890 గ్రాముల బంగారం, 2,340 వెండి, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న వస్తువులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.  ఇంతకీ ఆ దొంగ లేడీనా..? కిలాడీ నా..?   ఆ బంగారం పోయిన ముందు రోజు రాత్రి బతుల వెంకట కృష్ణ ప్రసాద్‌‌ ఇతను ఎవరో గుర్తున్నాడా.. అదే ఈ కథలో హీరోయిన్ లవర్.  అదేనండి సెటప్..  ముందస్తు ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసేందుకు ప్రియుడి సహకారం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మే 3వ తేదిన ప్రియుడిని  కారేపల్లికి పిలిపించింది. ఆ రోజు రాత్రి ప్రియుడు కారేపల్లి రైల్వే స్టేషన్‌లోనే బసచేశాడు. ఆ తర్వాత మే 4న భర్త జేబులో నుంచి లాకర్ తాళాలు తీసుకొని బంగారం, వెండి, ల్యాప్‌టాప్‌ను దొంగిలించి.. ఆ మొత్తాన్ని కృష్ణ ప్రసాద్‌‌కు అప్పగించింది. వాటిని అమ్మి నగదు సిద్ధం చేయామని సూచించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టే నటించసాగింది. కట్ చేస్తే పోలీసులు ఆమె బాగోతాన్ని బయట పెట్టారు. ప్రియుడి మోజులో పడిన తన భార్య అర్చన. తీగలాగితే డొంక అంత కదిలినట్లు. ఆమె వివాహేత‌ర సంబంధం కూడా బయట పడింది.  ప్రియుడితో సుఖంగా బతకాలని భర్తను లూటీ  చేసింది అర్చన. పోలీసుల యాక్షన్ తో సరెండర్ అయి అన్ని సమర్పించేసుకుంది. 

రఘురామపై పోలీసుల నిఘా! గుంటూరు అర్బన్‌ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు..

రాజద్రోహం కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న రఘురామ ఇంకా విడుదల కాలేదు. డిశ్చార్జ్‌ సమ్మరీ సిద్ధం కాకపోవడంతో ఆయన విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రఘురామకు బెయిల్ వచ్చినా ఆయనపై జగన్ సర్కార్ నిఘా పెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. రఘురామ ఆర్మీ హాస్పిటల్ నుంచి విడుదల కాగానే ఏపీకి తీసుకువచ్చేందుకు ఏపీ పోలీసులు స్కెచ్ వేశారని చెబుతున్నారు. ఏపీకి చెందిన కొందరు పోలీసులు సికింద్రాబాద్ ఆస్పత్రి దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది.  ఎంపీ రఘురామ రాజు ఇదే విషయాన్ని తెలుపుతూ సికిింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీకి చెందిన కొందరు పోలీసులు ఆస్పత్రి దగ్గర ఉన్నట్లు తెలుస్తోందని లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నానని, తన కాలి నొప్పి ఇంకా తగ్గలేదని తెలిపారు. బీపీలో కూడా హెచ్చుదల కనిపిస్తోందని చెప్పారు. నోరు కూడా తరచుగా పొడారిపోతోందని లేఖలో రఘురామ వెల్లడించారు. రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలన్నారు. అయినా మీరు డిశ్చార్జ్‌ చేయాలనుకుంటే.. డిశ్చార్జ్‌ సమ్మరీలో తన ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని  కోరారు ఎంపీ రఘురామ రాజు.  మరోవైపు గుంటూరు అర్బన్‌ ఎస్పీకి ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్‌ కోర్టు ధిక్కార నోటీసులు పంపారు. రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే తీసుకురావాలని, ఎస్కార్ట్‌ను ఆదేశించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్‌పై విడుదలైనట్లే.. విడుదలైన 10 రోజులకు బాండ్లను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని న్యాయవాది దుర్గాప్రసాద్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని, ఎస్కార్ట్‌ను పంపడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని ఆయన తెలిపారు. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి గుంటూరు అర్బన్‌ ఎస్పీకి దుర్గాప్రసాద్‌ నోటీసులు పంపారు ఇటీవల రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరైంది. అయితే ఆయన విడుదలలో  జాప్యం జరుగుతోంది. మరో నాలుగు రోజుల వరకు వేచి ఉండక తప్పదని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామన్నారు. డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటిషన్ వేస్తామని చెప్పారు. అప్పటి వరకు బెయిల్‌పై విడుదల వీలుకాదని లక్ష్మీనారాయణ అన్నారు. 

గో కరోనా గో 2.0.. ఓం కరోనా ఫట్ స్వాహా..

గోమూత్రం తాగితే క‌రోనా ద‌రి చేర‌దు. ఆవు పేడ రాసుకున్నా క‌రోనా ముప్పు త‌గ్గుతుంది. గో క‌రోనా గో అంటూ చ‌ప్పుళ్లు చేసినా క‌రోనా పారి పోతుంది. ఇవేవీ వ‌ర్క‌వుట్ కాక‌పోతే.. ఈ స్వామి ద‌గ్గ‌రికి వెళ్లండి. యజ్ఞం చేసి క‌రోనాను త‌రిమేస్తాడు. ‘‘ఓం కరోనా ఫట్​, ఫట్, ఫ‌ట్‌​..​​ స్వాహా’’ అంటూ బిగ్గరగా అరుస్తూ మంత్రాలు చ‌దువుతాడు. దెబ్బ‌కు వైర‌స్ ప‌రార్‌. ఆ బాబా చేసిన య‌జ్ఞం ఇప్పుడు ఇంట‌ర్‌నెట్‌లో తెగ వైర‌ల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే.. అస‌లేమాత్రం నవ్వాపుకోలేరు. ఆ న‌వ్వుకు త‌ట్టుకోలేకైనా.. వైర‌స్ పారిపోవాల్సిందే. సీరియ‌స్‌గా మంత్రాలు చ‌దువుతూ క‌రోనాను త‌రిమేస్తున్న ఆ బాబా వీడియో చూసి తీరాల్సిందే.  దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్​ను ఎలా తరిమికొట్టడమెలా? అని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే.. కొంతమంది బాబాలు మాత్రం వెరైటీ మంత్రాలతో కరోనా కట్టడి చేస్తామంటూ రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ఓ స్వామి వారు.. కరోనాను తరిమికొట్టడానికి ఏకంగా యజ్ఙం నిర్వహించి వార్త‌ల్లో నిలిచాడు. ‘‘ఓం కరోనా ఫట్​, ఫట్..​​ స్వాహా’’ అంటూ బిగ్గరగా అరుస్తూ మంత్రాలు జపించాడు. అతడు చేసిన యజ్ఞం ఇప్పుడు నెట్టింట్లో వైరల్​గా మారుతోంది.  యజ్ఞంతో కరోనా పోవడమేమో కానీ ఆయన మాత్రం ఈ వీడియోతో బాగా పాపులర్​ అయ్యాడు. బాలీవుడ్​ ఫోటో గ్రాఫర్​ వరిందర్​ చావ్లా తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో ఈ వీడియోను షేర్​ చేశాడు. ‘గో కరోనా గో, వెర్షన్​ 2.0’ అనే శీర్షికను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆ బాబా.. ‘ఓం కరోనా భాగ్ స్వాహా’ అంటూ బిగ్గ‌ర‌గా మంత్రాలు జ‌పిస్తూ యజ్ఞం చేస్తున్నట్లు కనిపిస్తుంది.  ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు. ఓ నెటిజన్​ స్పందిస్తూ "దెబ్బకు కరోనా పరుగులు పెట్టింది. మీరు చాలా పవర్​ఫుల్​” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మరొక నెటిజన్​ ‘‘మీ పూజతో ఇక కరోనా జాన్తా నై” అంటూ చమత్కరించాడు. ప్రజలు సైన్స్ కంటే ఇటువంటి బాబాలనే విశ్వసిస్తున్నారని, అందుకే ఇటువంటి వారు ఫేమస్​ అవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి మంత్రాలు ప్రజల వెనుకబాటు తనాన్ని, మూడనమ్మకాల్ని గుర్తుచేస్తున్నాయని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  కేవలం బాబాలు, పూజారులే కాదు కొంత మంది రాజకీయ నాయకులు సైతం ఇలాంటి మంత్రాలు జపిస్తుండటం చర్చనీయాంశమైంది. గతేడాది కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన ‘గో కరోనా గో’ నినాదం ఇంటర్నెట్​లో వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. ఇక, కరోనా తొలినాళ్ల‌లో కొంతమంది గుంపుగా ఏర్పడి.. గో క‌రోనా గో.. కరోనా భాగ్ జా.. అంటూ చేసిన నినాదాలు అప్పట్లో బాగా పాలపుర్​ అయ్యాయి. చాలా కాలం త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ఆ బాబా చేసిన ‘‘ఓం కరోనా ఫట్​, ఫట్, ఫ‌ట్‌​..​​ స్వాహా’’ య‌జ్ఞం ట్రెండింగ్‌గా మారింది. ‘గో కరోనా గో వెర్షన్​ 2.0’ అని గూగుల్ చేయండి.. మీరు కూడా క‌డుపుబ్బా న‌వ్వుకోండి. భ‌లే ఉంది ఆ వీడియో.

నా కారునే అపుతారా.. ఎంత ధైర్యం? పోలీసులపై ఎమ్మెల్యే బంధువు చిందులు 

తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను ఆదేశించారు. సర్కార్ ఆదేశాలతో గత నాలుగు రోజులుగా పోలీసులు అత్యంత కఠినంగా వ్యహరిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. గుంపులుగా తిరుగుతున్నవారిపై లాఠీ ఝుళిపిస్తున్నారు. పోలీసుల చర్యలతో లాక్ డౌన్ పటిష్టంగానే అమలవుతోంది. లాక్ డౌన్ అమలుకు జనాలు సహకరిస్తున్నా... కొందరు నేతలు మాత్రం బరి తెగిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు తమకు రూల్స్ వర్తించవు అన్నట్లుగా ఇష్టమెచ్చినట్లుగా తిరుగుతున్నారు. రూల్స్ పాటించకుండా వెళుతున్న కారును ఆపిన పోలీసులపై... అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బంధువు ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. పోలీసులపై చిందులు వేసిన ఆ నేత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అయితే పెద్దపల్లి వైపు నుంచి వస్తున్న కారును పోలీసులు ఆపి వివరాలు అడిగారు. ఇంకేముంది కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘‘నేను పెళ్లికి వెళ్తున్నాను. నేను ఎవరనుకుంటున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే తమ్ముడిని. నా కారునే అపుతారా.. ఎంత ధైర్యం? మేమిచ్చే డబ్బులతో డ్యూటీ చేస్తూ మేమంటే మీకు లెక్క లేదా’’ అంటూ రెచ్చిపోయాడు.  పోలీసులపై దురుసుగా వ్యవహరించిన ఆ నేత పేరు దాసరి అంజిరెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సమీప బంధువు. తనను ఎవరడ్డుకుంటారన్న ఆలోచనతో డ్యూటీలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ తతంగాన్ని మొత్తం  అక్కడ ఉన్నవారు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు అంజిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను స్థానిక నేతలు ఒత్తిడి మేరకు తొలగించారు. 

ఆక్సిజన్ పెట్టుకొని వంట.. అమ్మ‌కు వంద‌నం..

వంటింట్లో అమ్మ‌. పిల్ల‌ల కోసం చ‌పాతీలు చేస్తోంది. క‌ర్ర‌తో చ‌పాతీలు చేస్తోంది. వాటిని పెనంపై కాలుస్తోంది. ఇంట్లో వాళ్ల‌కి కమ్మ‌గా వండి పెడుతోంది. నిజంగా ఆ అమ్మ చాలా గ్రేట్‌. అదేంటి.. చ‌పాతీలు చేయ‌డం మామూలు విష‌య‌మే క‌దా. చ‌పాతీలు చేయ‌డం గ్రేట్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? చపాతీలు చేయ‌డం మామూలు విష‌య‌మే అయినా.. ఆ అమ్మ ఆరోగ్యం బాగా లేక‌పోయినా.. ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్ పెట్టుకొని మ‌రీ చ‌పాతీలు చేస్తుండ‌ట‌మే ఆ అమ్మ‌ గొప్ప‌త‌నం. కష్టంలో ఉన్న తల్లి వంటింట్లో వంట చేస్తున్న ఫొటో.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ అమ్మ ఎవ‌రో.. అది ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు కానీ.. ఈ ఫోటో మాత్రం అమ్మ‌త‌నానికి మారుపేరుగా నిలుస్తోంది. ట్విటర్‌లో ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. The Great Indian Kitchen పేరుతో ఈ పిక్ ట్విట‌ర్‌లో ట్రెండింగ్ అవుతోంది.  ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ పెట్టుకొని ఓ తల్లి చపాతీలు చేస్తున్న ఫొటో ఇది. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ పెట్టి ఉంది అంటేనే ఆమె ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. అలాంటి సమయంలో ఆమెకు విశ్రాంతి ఇవ్వకుండా.. వంట గదిలో ఎలా పని చేయిస్తారు అని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు. మన దేశంలో తల్లుల పరిస్థితి ఇలా తయారైంది. ఏది ఏమైనా వాళ్లు వంటిట్లోకి వెళ్లాల్సిందే.. వంట చేసి తనవాళ్లకు పెట్టాల్సిందే.. అంటూ అవేద‌న వ్య‌క్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఆమె అంత కష్టపడుతుంటే.. అలా ఫొటో తీస్తూ ఉండకపోతే.. ఆమెను వంటగది నుంచి బయటకు తీసుకొచ్చి సాయం చేయొచ్చు కదా అని ఆ ఫొటో తీసిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు.  The Great Indian Kitchen అని ట్యాగ్‌ చేస్తున్నారు చాలామంది. ఇదో మలయాళ హిట్‌ సినిమా. మహిళలు, తల్లులు చేస్తున్న త్యాగం గురించి వివరించిన సినిమా అది. అందుకే ఈ ఫొటోకు ఆ ట్యాగ్‌ ఇస్తున్నారు. అయితే ఈ ఫొటోను ఫొటోషాప్‌ అంటూ కామెంట్‌ చేసేవాళ్లూ ఉన్నారు. అయితే ఈ ఫొటోలో నిజానిజాలు ఎంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇది నిజమే అయితే కచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఈ ఫొటోలో ఉన్న మహిళ ఆరోగ్య పరిస్థితి ఎవ‌రికీ తెలియదు. వాళ్లింట్లో ఎంతమంది ఉన్నారు.. వారి ఆరోగ్యం ఏంటి అనేది తెలియదు. అందరి పరిస్థితీ ఇలానే ఉన్పప్పుడు ఇలా వంట చేయక తప్పదు కదా అంటున్నారు మ‌రికొందరు. ఎవ‌రి ట్వీట్లు ఎలా ఉన్నా.. ఈ ఫోటోలో ఉన్న అమ్మ‌కు మాత్రం అంతా వంద‌నం చేస్తున్నారు. 

ఆయుష్ నివేదికే ఫైనల్! ఆనందయ్య మందుకు అనుమతిచ్చే ఛాన్స్... 

నెల్లూరు జిల్లా  కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆనందయ్య మందు   కరోనాపై పనిచేస్తుందా లేదా అనే విషయంపై అధ్యయనం చేసేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందం కృష్ణపట్నం వస్తుందని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. కాని ఎవరూ రాలేదు. ఐసీఎంఆర్ నుంచి ఎవరూ కృష్ణపట్నం రావడం లేదని తెలుస్తోంది. ఐసీఎంఆర్ ఇక్కడికి వస్తే.. ఆనందయ్య మందు వినియోగించాలా వద్దా అనే విషయంపై క్లారిటీ వస్తుందని అంతా ఆశించారు. ఇప్పుడు ఐసీఎంఆర్ పర్యటన రద్దుతో ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్న జనాలు నిరాశ పడ్డారు.  ఆనందయ్య మందుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధ్యయన నివేదికను త్వరగా ఇవ్వాలని ఆయుష్ శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సోమవారమే రాత్రి వరకు ఆయూష్.. ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే ప్రకటించారు. అది ఆయుర్వేద మందు కాదని.. దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని… కాబట్టి ఇది అంత హానికరం కాదని కూడా ఆయుష్ కమిషనర్ స్పష్టం చేశారు. కంటిలో వేసే డ్రాప్స్‌లోనూ సాధారణ పదార్థాలే ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించారు. దీంతో ఆనందయ్య మందుకు ఆయుష్ విభాగం అనుమతి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  నెల్లూరు జిల్లాకు  ఐసీఎంఆర్ అధికారులు రావడం లేదని, ఆయుష్ నివేదికనే ప్రభుత్వం ఫైనల్ చేసే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఆయుష్ నివేదిక రాగానే మందు పంపిణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆనందయ్య మందుపై సర్కార్ నుంచి సానుకూల నిర్ణయమే వచ్చే అవకాశం ఉందన్నారు. మందుకు అనుమతి రాగానే... పంపిణి కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు. జనాలెవరు కృష్ణపట్నం రావొద్దని... కావాల్సిన వారందరికి మందు అందేలా తాము చర్యలు తీసుకుంటామని కాకాణి తెలిపారు.  ఆనందయ్య ఇస్తున్న మందుపై పరిశోధన చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఆయుర్వేద విభాగంలో ఆనందయ్య మందును అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. అనుమతి రాకపోయినా ఇమ్యూనిటీ బూస్టర్లుగా వాడుతామన్నారు. ఆయుష్ శాఖ దీనికి ఆమోదముద్ర వేస్తే నరసింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో దీన్ని తయారుచేయవచ్చునని టీటీడీ ఆయుర్వేదిక్ ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. తమ పరిశీలనలో మందు తయారీకి సంబంధించి ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని ప్రకటించారు. మరోవైపు ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని, ఈ మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేసిందని, దీనివల్ల అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. విచారణకు అనుమతించాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు.

లక్ష కోసం.. అవ్వను చంపి.. 

మనుషులు మరి కరోనా కంటే దారుణంగా తయారు అవుతున్నారు. రోజు రోజుకి మరి కృరుల్లా తయారు అవుతున్నారు. మానవతావన్ని కరోనా శవాలను గంగా నదిలో పడేసినట్లు పడేస్తున్నారు.. డబ్బు కోసం మరి నీచానికి వడికడుతున్నారు.. చివరికికి సొంత వల్లనే వల్లకాటికి పంపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి హత్యలు చాలా జరుగుతున్నాయి. వివరాలలోకి వెళ్ళితే ఇలా..    లక్ష రూపాయల కోసం వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కామారెడ్డి మండలం జగదాంబ తండాలో చోటుచేసుకుంది. తండా వాసులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బుక్యా కపూరి(72) కు ఒక కుమారుడు మోతీరాం ఉన్నాడు. ఆయనకు ఐదుగురు కుమారులు పెంట్యా, శంకర్, రాము, రాజు, శ్రీనివాస్. ఇందులో నలుగురి పెళ్లిళ్లు కాగా శ్రీనివాస్ కు ఈ నెల 21 న వివాహం జరిగింది. అయితే శ్రీనివాస్ వివాహం కోసం రెండు లక్షలు అప్పు తేగా అందులో లక్ష 5 వేలు మిగిలాయి. ఆ డబ్బులు కావాలని కపూరి మనవళ్లు శంకర్, రాజు గత రెండు రోజులుగా అడుగుతుండగా కపూరి ఇవ్వలేదు. దాంతో ఆదివారం అర్ధరాత్రి కపూరి ఇంటి బయట నిద్రిస్తుండగా అదే తండాకు చెందిన తమ స్నేహితుడు గంగావత్ గణేష్తో కలిసి శంకర్, రాజు ముగ్గురు కలిసి కొడవళితో కపూరి గొంతు కోసి హత్య చేశారు. అనంతరం కపూరి వద్ద ఉన్న డబ్బులు తీసుకుని పారిపోయారు. తెల్లవారు జామున చూడగా కపూరి మృతి చెందింది. ఆమె హత్యకు గురైన విషయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు తండాకు చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కామారెడ్డి డీఎస్పీ సోమనాథం తెలిపారు.

వుహాన్ నుంచే కరోనా...? వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం..

ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బాలి తీసుకున్న, కరోనా, ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? అనేది ఇంతవరాకు ఒక మిస్టరీగానే వుంది. అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలు మొదటి నుంచి కూడా, జీవాయుధాల పరిశోధనలు జరుగుతున్న చైనాలోని వుహాన్’ ల్యాబ్ నుంచే, కరోనా వైరస్ లీక్ అయిందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుండు డోనాల్డ్ ట్రంప, అయితే కరోనాను చైనా మహమ్మారి, వుహాన్ వైరస్ అని పేర్కొన్నారు. చైనానే ఈ వైరస్ ను సృష్టించిందనే అనుమానాల బలంగా వ్యక్త పరిచారు.  తాజాగా,ఆ అనుమానాలను బలపరిచే ఆధారాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్’ ఇందుకు సంబంధించి కొన్ని సంచలన  నిజాలను బయట పెట్టింది. ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం, కరోనా అనే పదం ప్రపంచం చెవిన పడడానికి కొన్నినెలల ముందే.. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు పరిశోధకులు 2019 నవంబరులో ఆసుపత్రిలో చేరారని పేర్కొంది. ఇందుకు ఆధారంగా అమెరికా నిఘా వర్గాలు వెల్లడించిన నివేదికను ఉటంకించింది.కరోనా వైరస్ సోకిన పరిశోధకుల వివరాలు, చికిత్స పొందిన ఆసుపత్రుల వివరాలను కూడా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. అంతే కాకుండా, ఇప్పటికైనా కరోనా వైరస్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా లేదా  అనే దానిపై విస్తృత దర్యాప్తు జరగాలని కోరింది. కరోనా  మూలాలపై తదుపరి దశ దర్యాప్తునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయాత్మక విభాగం త్వరలోనే సమావేశం కానున్న సమయంలో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఈ నివేదిక బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుదని అంటున్నారు.  వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఎమిలీ హార్న్ స్పందించడానికి నిరాకరించారు. కానీ, తొలినాళ్లలో కొవిడ్‌ పుట్టుక, చైనాలో దాని మూలాల గురించి బైడెన్ యంత్రాంగం నిరంతరం సీరియస్‌గా పరిశీలిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. కొవిడ్ మూలాలపై దర్యాప్తు విషయంలో రాజకీయాలు చేయకుండా డబ్ల్యూహెచ్ఓ, ఇతర దేశాల నిపుణులతో కలిసి అమెరికా ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు.అదే సమయంలో కరోనా పుట్టుకకు సంబంధించి బయటకు వస్తున్న విషయాలపై సాంకేతికంగా విశ్వసనీయమైన సిద్ధాంతాలను అంతర్జాతీయ నిపుణులు పూర్తిగా అంచనా వేయాలని మేము స్పష్టంగా చెప్పాం, అని ఎమిలీ వ్యాఖ్యానించారు. ల్యాబ్ పరిశోధకుల గురించి ఇంటెలిజెన్స్ ప్రస్తుత, మాజీ అధికారులు... నివేదికలో సాక్ష్యాల బలం గురించి పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారని, పేరు వెల్లడించని మరో అధికారి.. మరింత దర్యాప్తు, అదనపు ధృవీకరణ అవసరమని చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలో కోవిడ్ మూలాల దర్యాప్తుపై అమెరికా, నార్వే, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు మార్చిలో ఆందోళన వ్యక్తం చేశాయి. అంతేకాదు, తదుపరి దశ దర్యాప్తులో మహమ్మారి పుట్టుక, వ్యాప్తి గురించి పూర్తిస్థాయి సమాచారం సేకరించాలని డిమాండ్ చేశాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దర్యాప్తు గురించి చైనా సహకారం, పారదర్శకతను నిర్ధారించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం తక్షణమే దీనిపై స్పందించడానికి నిరాకరించింది. ఫిబ్రవరిలో వైరాలజీ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన తరువాత డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలోని బృందం ల్యాబ్ నుంచి లీక్ అవడం చాలా అరుదు అని చెప్పిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ఆదివారం గుర్తు చేసింది. ల్యాబ్ లీక్ సిద్ధాంతాన్ని అమెరికా హైప్ చేస్తూనే ఉందని చైనా మండిపడింది.

కరోనా వ్యాక్సిన్ అంటే.. జనాలు పరుగులు.. 

కరోనా సెకండ్ వేవ్ ఒక వైపు శవాలను స్మశానం ముందు దహనం కోసం వెయిట్ చేస్తున్నాయి. మరోవైపు కరోనా నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు వాక్సిన్ సెంటర్ల ముందు క్యూ లు కడుతున్నారు. ఇంకొందరు ఆ వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారు. ఇది చాలక మరో వైపు బ్లాక్ ఫంగస్ కూడా  దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశంలో మరో వైపు వ్యాక్సిన్ కొరత చాలా ఎక్కువగా ఉంది. మరో వైపు ఇప్పుడు వస్తున్న బ్లాక్ ఫంగస్ కరోనా ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకే వస్తున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా పై ప్రజలకు ఇప్పటి వరకు సరైన అవగాహనా కల్పించలేదని చెప్పాలి..  కరోనా మహమ్మారిని  కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తలమునకలు అవుతున్నాయి. ఎంతగానో శ్రమిస్తున్నాయి. ఇక ఈ కట్టడిలో భాగంగానే ప్రతి ఒక్కరు తప్పకుండ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేసింది. ఇక ఆ వ్యాక్సిన్ కోసం జనాలు ఆరోగ్య కేంద్రాలు బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్ స్టాక్ లేక టీకా తీసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మాకు టీకా వద్దు.. మమ్మల్ని వదిలేయండి అంటూ యూపీలోని ప్రజలు పరిగెడుతున్నారు. వ్యాక్సిన్ లేక అందరు బాధపడుతుంటే.. అక్కడి గ్రామస్థులు వ్యాక్సిన్ ఉన్నా కాని వేయించుకోవడానికి భయపడి నదిలో దూకి పారిపోయిన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ గ్రామవాసులకు కొవిడ్ టీకాలు వేయడానికి ఆరోగ్యశాఖ అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది. అందరికి కరోనా టీకాలు వేయనున్నట్లు వైద్యులు గ్రామస్థులకు తెలిపారు. ఆ మాట వినడంతో గ్రామస్థులు పరుగు లంకించుకున్నారు.  కొవిడ్ టీకా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి డివిజనల్ మెజిస్ట్రేట్ వివరించి చెప్పి గ్రామస్థులకున్న అపోహలను తొలగించడానికి ప్రయత్నించిన  వారు వినలేదు. ఎక్కడ గ్రామంలోనే ఉంటే  టీకా వేస్తారేమోనని గ్రామా ఒడ్డున ఉన్న సరయూ  నదిలోకి దూకి మరీ పారిపోయారు. ఇంజక్షన్ అంటే విషపూరితమైనదని, దాన్ని తీసుకొంటే చనిపోతామనే భయం గ్రామస్థుల మనసులో నాటుకుపోయిందని  ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. చాలా ప్రయత్నాలు చేసి కష్టపడి  ఆ గ్రామంలో 14మందికి మాత్రం టీకాలు వేశామని తెలిపారు.

12మందికి ఉరిశిక్ష‌.. హైవే కిల్ల‌ర్స్‌ మున్నా గ్యాంగ్ ఖేల్ ఖ‌తం..

మున్నా గ్యాంగ్‌. ఇప్పుడు విన‌డానికి కొత్త‌గా ఉన్నా.. ఒక‌ప్పుడు ఫుల్ టెర్ర‌ర్‌. వాళ్లు మ‌నుషులు కాదు. మృగాలు. మ‌హా ఖ‌త‌ర్నాక్‌. న‌ర‌రూప రాక్ష‌సుల్లాంటి దోపిడీ దొంగ‌లు. అత్యంత క్రూరంగా హ‌త్య‌లు చేసిన కిరాత‌కులు. హైవేలే వారి క్రైమ్ స్పాట్‌లు. ఐర‌న్ లోడ్‌తో వెళ్తున్న లారీలే వారి టార్గెట్‌లు.  అర్థ‌రాత్రి హైవేల‌పై ఆయుధాలు చూపించి లారీల‌ను ఆప‌డం.. డ్రైవ‌ర్లు, క్లీన‌ర్ల‌ను దారుణంగా చంప‌డం. శ‌వాలు దొర‌క్కుండా పాతేయ‌డం. లారీతో స‌హా స‌రుకు లూటీ చేయ‌డం. ఐర‌న్ లోడ్‌తో పాటు లారీనీ ముక్క‌లు ముక్క‌లు చేసి అమ్మేయ‌డం వారి ప‌ని. ఇదీ వారు చేసిన నేరాలు-ఘోరాల చ‌రిత్ర‌. ఒక‌రు, ఇద్ద‌రు కాదు.. 7 ఘ‌ట‌న‌ల్లో ఏకంగా 13 మంది డ్రైవ‌ర్లు, క్లీన‌ర్ల‌ను హ‌త్య చేసిన ఆ హంత‌కుల ముఠాకు 13 ఏళ్ల త‌ర్వాత తాజాగా క‌ఠిన శిక్ష ప‌డింది.  హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష ప‌డింది. మ‌రో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వ‌చ్చింది.  ప్ర‌కాశం జిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. ప్రకాశం-నెల్లూరు జిల్లా మధ్య హైవేపై మున్నా గ్యాంగ్ సాగించిన మారణకాండ క్రైమ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ, హ‌త్య‌లు చేసేది మున్నా గ్యాంగ్. హైవేపై వాహనాలు తనిఖీ చేస్తున్నట్టుగా లారీలను ఆపేవారు. మున్నా అధికారి వేషంలో ఉండగా, అతడి పక్కన ఓ వ్యక్తి గన్ మన్ గా మెషీన్ గన్ ప‌ట్టుకొని ఉండడంతో వారు నిజంగానే అధికారులని భావించి లారీ డ్రైవర్లు వాహనాలు ఆపేవారు. చెక్ చేయాలనే నెపంతో లారీ డ్రైవర్లు, క్లీనర్ల గొంతుకలకు తాడు బిగించి దారుణంగా హత్య చేసేవారు. తాము చంపిన డ్రైవర్లు, క్లీనర్ల శవాలను గోతాల్లో కుక్కి హైవే పక్కనే వాగుల్లో పూడ్చిపెట్టేవారు. దోపిడీ చేసిన ఐరన్ లోడును గుంటూరులో అమ్మేవారు. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేశారు. డ్రైవర్, క్లీనర్‌ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు. మరో ఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌ ఉల్లా నుంచి కాంచీపురానికి ఇనుప లోడును తీసుకెళుతుండగా.. తెట్టువద్ద ఆపి డ్రైవర్‌ భూషణ్‌యాదవ్, క్లీనర్‌ చందన్‌ కుమార్‌ మెహతోలను చంపి శవాలను మన్నేరు వాగు వద్ద పూడ్చిపెట్టారు. తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడకు ఇనుప యాంగ్యులర్‌లతో బయల్దేరిన లారీని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నిమ్రా కాలేజీ వద్ద ఆపి డ్రైవర్లు గూడూరి శ్యాంబాబు, గుత్తుల వినోద్‌కుమార్‌లను దారుణంగా హత్యచేసి శవాలను నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చిపెట్టారు. నాగాలాండ్‌కు చెందిన లారీని కూడా ఇదేవిధంగా ఆపి డ్రైవర్‌ను హతమార్చి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలోని గుండ్లకమ్మ ఒడ్డున చిల్లచెట్లలో పూడ్చిపెట్టారు. మాయమైన లారీలు మద్దిపాడు మండలం సీతారామపురం కొష్టాలు వద్ద లీజుకు తీసుకున్న టుబాకోస్‌ వెనుక గోడౌన్‌లో ముక్కలు చేసినట్టు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఒక లారీ యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మున్నా గ్యాంగ్ ఆటకట్టించారు. పాత ఇనుమును కొనే వ్యాపారులపై దృష్టి పెట్టి, మున్నా కదలికలు గుర్తించారు. ఓ దశలో దేశం వదిలి పారిపోవాలన్న ప్రయత్నంలో ఉన్న మున్నాను కర్ణాటకలో ఓ ఫాంహౌస్ ద‌గ్గ‌ర‌ అరెస్ట్ చేశారు. ఆ ఫాంహౌస్ ఓ మాజీ ఎమ్మెల్యేది. మొత్తం నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18మందిపై నేరం రుజువు కావ‌డంతో.. ఏకంగా 12మందికి ఉరిశిక్ష విధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. దారుణ‌మైన హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు కాబ‌ట్టే.. వీరికి ఉరి శిక్ష విధించింది కోర్టు.

రాష్ట్రాలకు యూఎస్ ఫార్మా షాక్! కొవిడ్ వ్యాక్సిన్ కు దారేది...

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్ మరణాలు రోజు 4 వేలకు పైగానే నమోదవుతున్నాయి. కొత్త బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ మాయదారి వైరస్, ఫంగస్ ల నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో దేశంలోనూ వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపట్టేందుకు కేంద్రం కార్యాచరణ ప్రకటించింది. కాని వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. సరిపడా టీకాలు అందుబాటులో లేకపోవడంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దేశంలో ప్రస్తుతం రెండు కొవిడ్ వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. కొవాగ్జిన్ నెలకు కోటీ డోసులు తయారవుతుండగా.. కోవిషీల్డ్ టీకాలు నెలకు ఐదు కోట్ల వరకు ఉత్పత్తి అవుతున్నాయి. మన డిమాండ్ కు ఇవి ఎంత మాత్రం సరిపోవడం లేదు.  ఇటీవల కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు నేరుగా టీకాలు కొనుగోలు చేయవచ్చు. దేశంలో టీకాల కొరత ఉండటంతో పలు రాష్ట్రాలు విదేశీ సంస్థల టీకా కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఐదారు రాష్ట్రాలు కొవిడ్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించాయి. గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 4కోట్ల వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10మిలియన్ డోసులు సేకరించాలని భావించింది. బిడ్‌ల గడువు జూన్‌ 4వరకు గడువు విధించింది. కేవలం ఆరు నెలల్లో 10మిలియన్ డోసులు పంపిణీ చేయాలని కండీషన్‌ కూడా విధించింది. పంజాబ్ ,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.  వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు పిలుస్తున్న రాష్ట్రాలకు షాకిచ్చాయి అమెరికాలోని ఫైజర్, మోడెర్నా ఫార్మా కంపెనీలు. రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు సరఫరా చేయబోమని స్పష్టం చేశాయి. కంపెనీల పాలసీ ప్రకారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తామని క్లారిటీ ఇచ్చాయి. దీంతో గ్లోబల్ టెండర్లకు పిలిచిన పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఫైజర్, మోడెర్నా కంపెనీల నిర్ణయంతో గ్లోబల్ టెండర్లకు వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది బీహార్ ప్రభుత్వం.  ఫైజర్, మోడెర్నా ప్రకటనతో వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని భావించిన రాష్ట్రాల ఆశలపై నీళ్లుచల్లినట్టయింది. వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు కేంద్రం మీదే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం నేరుగా అమెరికా సంస్థలతో మాట్లాడి వ్యాక్సిన్ కోసం ఒప్పందాలు చేసుకుంటేనే టీకాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది కీలకంగా మారింది. లేదంటే దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

జూన్‌లోనూ లాక్‌డౌన్‌? వ్యాక్సిన్ వ‌ర్రీ! అలాగైతేనే కంట్రోల్‌?

రెండు వారాలుగా తెలంగాణ‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. రోజులో 20 గంట‌ల పాటు స‌క‌లం బంద్‌. సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో లాక్‌డౌన్ నిబంద‌న‌ల‌ను పోలీస్ శాఖ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తోంది. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పై వాహ‌నం క‌నిపిస్తే జ‌ప్తు చేస్తున్నారు. భారీగా ఫైన్లు విధిస్తున్నారు. లాఠీల‌కూ ప‌ని చెబుతున్నారు. ఇంత చేస్తున్నా.. తెలంగాణ‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్యలో పెద్ద‌గా మార్పు రావ‌డం లేదు. నిత్యం 3 వేల‌కు కాస్త అటూ ఇటూగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ లాక్‌డౌన్ కంటిన్యూ కానుంది. ఆ త‌ర్వాత నిబంధ‌న‌లు స‌డ‌లిస్తే ఎలా? ఓవైపు కేసులు పెద్ద‌గా త‌గ్గ‌కున్నా.. లాక్‌డౌన్ ఎత్తేయ‌డం ఏమాత్రం శ్రేయ‌స్క‌రం కాద‌నే ఆలోచ‌న‌లో ఉంది స‌ర్కారు. అందుకే, మ‌రింత కాలం లాక్‌డౌన్ పొడిగించే దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తోంది.  తెలంగాణలో లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగించక తప్పదని వైద్యశాఖ భావిస్తోంది. ఇప్పటికే వాణిజ్య, ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు తెలియవచ్చింది. లాక్ డౌన్ కరోనా నియంత్రణపై ఈనెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యశాఖ అభిప్రాయం మేరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగించాలనేది స‌ర్కారు ఆలోచ‌న‌గా తెలుస్తోంది.  ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. కేంద్రం నుంచి స‌ర‌ఫ‌రా త‌గ్గ‌డం.. ఉన్న వ్యాక్సిన్ల‌నూ ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌కుండా స‌ర్కారు వ్యాక్సినేష‌న్‌ను నిలిపివేయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు, వ్యాక్సిన్ల సేక‌ర‌ణ‌కు తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే గ్లోబల్ టెండర్లకు ఆహ్వానించింది. దానిపై క్లారిటీ వ‌చ్చేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నుంది.  ఇక‌, జూన్ మొదటి వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద మొత్తంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సినేష‌న్ ఊపందుకున్నాకే తెలంగాణ కాస్త సుర‌క్షితంగా మారుతుంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కూ కేసుల సంఖ్య మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌కుండా ఉండాలంటే.. జూన్‌లోనూ మ‌రికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తే మంచిద‌నే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. జూన్‌లోనూ కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. 

ఎల్లో ఫంగ‌స్‌.. మ‌రింత డేంజ‌ర‌స్‌.. ఫంగ‌స్‌ల‌తో ఫ‌స‌క్‌..

క‌రోనాతో కొత్త‌, పాత రోగాలు వ‌రుస పెట్టి చుట్టుముట్టుతున్నాయి. మునుపెన్న‌డూ విన‌ని కొత్త కొత్త రోగాల పేర్లు వినిపిస్తున్నాయి. క‌రోనా సోకి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే దేశంలో 5వేల‌కు పైగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఓవైపు బ్లాక్ ఫంగ‌స్‌తో బెదురుతుంటే.. దానికి పోటీగా వైట్ ఫంగ‌స్ సైతం విజృంభిస్తోంది. ఇది బ్లాక్ ఫంగ‌స్ కంటే మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫంగ‌స్‌ల దండ‌యాత్ర స‌రిపోన‌ట్టు.. తాజాగా, ఎల్లో ఫంగ‌స్ అనే మ‌రోర‌కం ఫంగ‌స్ వ్యాధి ముదురుతోంది. ఇది.. ఆ రెండు ఫంగ‌స్‌ల కంటే డేంజ‌ర‌స్ అని చెబుతుండ‌టం ఆందోళ‌న‌క‌రం.  దేశంలో కొత్తగా మరో ఫంగస్ బయటపడింది. తాజాగా ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదు అయింది. ఎల్లో ఫంగస్ బారిన పడిన తొలి రోగి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్‌టీ డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.  ఎల్లో ఫంగస్ వ్యాధి ఉన్నవారిలో నీరసం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్లో ఫంగస్‌కు యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్‌తో చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు. ఎల్లో ఫంగస్ ప్రధానంగా పరిశుభ్రత లేకపోవడం వల్లే వ్యాపిస్తుంది. ఇంటి లోపల, బయట వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు ఫంగస్ పెరుగుదలకు దోహదపడుతాయి. కావున వీలైనంత వరకు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ఇంట్లో తేమ శాతం ఎక్కువ ఉన్నా.. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుతాయి. కావున తేమ స్థాయి 30 నుంచి 40 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగ‌స్‌లో కొవిడ్ నుంచి కోలుకున్న వారిని మ‌ళ్లీ అనారోగ్యం బారిన ప‌డేస్తున్నాయి. ఇవి, క‌రోనా వైర‌స్ కంటే మ‌రింత‌ ఖ‌త‌ర్నాక్‌గా ఉన్నాయి. ఫంగ‌స్‌ సోకి.. ప్రాణాల‌తో బ‌య‌ట‌బ‌డిన వాళ్ల సంఖ్య త‌క్కువే. అందుకే, బీ అల‌ర్ట్‌. బీ కేర్‌ఫుల్‌. 

గుర్రం అంత్యక్రియలకు వేలసంఖ్యలో జనం..  

ప్రపంచంలో కరోనా విలయం అంత ఇంత కాదు. ఇక మన దేశంలో అయితే చెప్పనక్కర్లేదు. మరణాలు చెట్టు మీద పిట్టల ఎగిరిపోతున్నాయి. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో మరణాలు విపరీతంగా నమోదు అవుతున్నాయి. కరోనా మరణాలు ఒక వైపు అయితే.. ఆ శవాలను పట్టుకోవడానికి సొంతవారు కూడా ఇష్టపడడం లేదు.  కుటుంబ స‌భ్యుల‌ అంత్యక్రియ‌ల‌కు కూడా రాలేక‌పోతోన్న రోజులివి. అది అందరికి అందుకని అనుకుంటున్నారా..? సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ల కరోనాతో  మ‌నుషులు చ‌నిపోతే అతి త‌క్కువ మందితోనే అంత్య‌క్రియ‌లు పూర్తి చేసేందుకు అనుమ‌తి ఉంది. మరోవైపు కరోనాతో చనిపోయిన శవాలను తగలబెట్టడానికి స్మశానాలు కూడా కాళీ లేవు. కానీ అటువంటిది ఓ గుర్రం చ‌నిపోతే వంద‌లాది మంది కదిలి వచ్చారు. అది కూడా కరోనా టైం లో లోక్ డౌన్ నిబంధనలు పక్కన పెట్టి మరి వచ్చారు. ఇంతకీ ఆ గుర్రానికి ఉన్న స్పెషల్ ఏంటి..?  క‌లిసి క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా అంత్య‌క్రియ‌లు చెయ్యడమంటే మాములు విషయం కాదు.  క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావిలోని మ‌రాడిమ‌ట్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై క‌ర్ణాట‌క హోం శాఖ మంత్రి బ‌స‌వ‌రాజ్ స్పందిస్తూ... జిల్లా అధికారులు ఈ విష‌యంపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నార‌ని, నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. కాగా, బెళ‌గావిలోని మ‌రాడిమ‌ట్ ప్రాంతంలోని ఓ ఆశ్ర‌మంలో సిద్ధేశ్వ‌ర మ‌ఠానికి చెందిన ఆ గుర్రాన్ని దేవ‌తా అశ్వంగా గ్రామ‌స్థులు భావిస్తారు. ఈ నేప‌థ్యంలోనే దాని అంత్య‌క్రియ‌ల‌కు పెద్ద ఎత్తున స్థానికులు త‌ర‌లివ‌చ్చారు.