అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదు.. బాబా రాందేవ్ స‌వాల్‌..

త‌గ్గేదే లే.. అంటూ బాబా రాందేవ్ మ‌రింత రెచ్చిపోతున్నారు. త‌న‌ను అరెస్ట్ చేసే ద‌మ్ము, ధైర్యం ఎవ‌రికీ లేవంటూ రెచ్చ‌గొడుతున్నారు. త‌న‌ను టార్గెట్ చేస్తున్న ఇండియ‌న్ మెడిక‌ల్ అసోషియేష‌న్‌కు నేరుగా స‌వాల్ విసురుతున్నారు. దీంతో.. బాబా రాందేవ్ వ‌ర్సెస్ ఐఎంఏ.. ఎపిసోడ్ రాజ‌కీయంగానూ ర‌చ్చ రాజేస్తోంది.    వారం రోజులుగా న‌డుస్తోంది వివాదం. అల్లోపతి అనేది పనికిమాలిన సైన్స్ అంటూ బాబా రాందేవ్ తొలుత అగ్గి రాజేశారు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద శాస్త్రం యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని... అటువంటి ఆయుర్వేదాన్ని కాదని, అల్లోపతి మెడిసిన్ ను ప్రమోట్ చేస్తున్నారని మండిప‌డ్డారు. ఇదంతా దేశంలో క్రిస్టియానిటీని పెంచి పోషించడానికే జరుగుతోందంటూ కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేశారు. బాబా వ్యాఖ్య‌ల‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాందేవ్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ సైతం బాబా రాందేవ్ విమ‌ర్శ‌ల‌ను త‌ప్పుబ‌డుతూ ఘాటుగా లేఖ రాశారు. ఆ వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోమన్నారు. అందుకు అంగీక‌రించిన బాబా.. త‌న కామెంట్ల‌ను విత్‌డ్రా చేసుకున్నారు.  వివాదం అక్క‌డితో ముగియ‌లేదు. అల్లోప‌తి వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ట్విట‌ర్‌లో 25 ప్ర‌శ్న‌లు సంధించారు రాందేవ్‌. మ‌రోవైపు, త‌న‌పై దేశద్రోహం కేసు పెట్టాల‌న్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యాఖ్యలపైనా మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్లు చేశారు.  తనను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవంటూ తొడ‌కొట్ట‌కుండానే స‌వాల్ చేశారు బాబా రాందేవ్‌. ఐఎంఏతో పాటు మోదీ స‌ర్కారు టార్గెట్‌గానే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారంటున్నారు. వాళ్ల బాబులు కూడా తనను అరెస్ట్ చేయలేరని అన్నారు. రాందేవ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజల్లో భయాలను కలిగించేలా రాందేవ్ వ్యవహరి, స్తున్నారని మోదీకి రాసిన లేఖలో ఐఎంఏ తెలిపింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత కూడా దేశంలోని 10 వేల మంది డాక్టర్లు మరణించారంటూ రెండు వీడియోల్లో బాబా రాందేవ్ ఆరోపించారని చెప్పింది. రాందేవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. కరోనా ఫస్ట్ వేవ్ లో 753 డాక్టర్లు, సెకండ్ వేవ్ లో 513 మంది వైద్యులు చనిపోయారని.. వీరెవరూ వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బాబా రాందేవ్ ఘాటుగా స్పందించారు. తనను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదంటూ కాక రేపారు. 

అన్న ఎన్టీఆర్ జీవితంలో పది ముఖ్య ఘటనలు..

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 1923 మే 28వ తేదీన ఆయన జన్మించారు. 33 ఏళ్ల పాటు వెండితెరపై ఎన్నో అద్భుతాలు స్ఫష్టించిన ఎన్టీఆర్.. 13 ఏండ్ల రాజకీయ జీవితంలోనూ సంచలనాలుకు కేరాఫ్ గా నిలిచారు. ప్రజల గుండెల్లో చిరస్మరణియుడిగా నిలిచిపోయారు. అన్న ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ జీవితంలోని పది ఆసక్తికర విషయాలు మీకోసం..  1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్.. ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కోటలను బద్దలు కొడుతూ..తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయి చరిత్ర స్పష్టించారు. ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డుగా చెబుతారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ చేతిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా తారకరాముడు చరిత్రలో నిలిచిపోయారు.  40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు. ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. దేవాలయాలలో పూజారి వృత్తికి మొదటిసారి బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం వచ్చేలా పరీక్ష ద్వారా పదవులను భర్తీ చేయించిన ఘనత ఎన్టీఆర్ ది.  ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయారట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కుడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు హైదరాబాద్ కు సింబల్ గా మారిపోయింది.  'శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' సినిమాలోని ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే… ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి 3 ఏళ్ళ తరువాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు. 1987 హర్యానా ఎన్నికల్లో దేవీ లాల్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకొని హైదరాబాద్ నుంచి రోడ్ దారిన వెళ్లారు. ఆనూహ్యంగా దేవి లాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్య మంత్రి కూడా అయ్యారు. తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా నీళ్లిచ్చి కాళ్లు కడిగించి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు, ఎన్టీఆరే స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారు. ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు.అలా ఎందుకని చాలా మందికి సందేహం ఉండేది, కొందరు ఆయన్నే డైరెక్టుగా అడిగారు కూడా.దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. "మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను" అన్నారట. అవతలివారు ఆశ్చర్యపోయాక అసలు గుట్టు విప్పేవారట ఎన్టీఆర్. సినిమాల్లో తీసే అడ్వెంచర్స్, ఫైటింగుల వల్ల, ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఎన్టీఆర్ కుడిచెయ్యి నాలుగు సార్లు విరిగింది. వరుస ప్రమాదాలతో కుడిచేయి పట్టు తప్పడంతో ఎడమచేత్తోనే దీవెనలు ఇవ్వడం ప్రారంభించారట ఎన్టీఆర్.

TRS లీడర్ ఇంట్లో రేప్? ఓ మైనర్ బాలికకు గర్భం.. 

అతను టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రనిధి. మూర్ఖుడిగా ప్రవర్థించాడు. మానవత్వం మరిచాడు. తానూ ప్రజా ప్రతినిధి అని ఏం చేసిన చెల్లుతుందని అనుకున్నాడు . ఆ అహంకారంతోనే వ్యవహరించాడు. ప్రజలకు ఆదర్శనంగా ఉండాల్సిన నాయకుడు పరమనీచుడు అయ్యాడు. మైనర్ బాలికను తన ఇంట్లో పనిచేయిస్తున్నాడు. బాలకార్మిక వ్యవస్థను ఒక రకంగా కొమ్ము కాస్తున్నట్లే చేశాడు. ఇది అంత ఒక ఎత్తు అయితే.  అది జగిత్యాల జిల్లా. రాయికల్ మండల కేంద్రం. అతను టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధి. అతని ఇంట్లో ఒక  బాలిక పనిచేస్తుంది. ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు. ఆ బాలిక  కుటుంబం సదరు ప్రజా ప్రతినిధి ఇంటి పక్కనే చాలా ఏళ్లుగా నివాసం ఉంటోంది. మొదట బాలిక అక్క అదే ఇంట్లో ఇంటి పని చేసేది. ఆమె తర్వాత ఆమె చెల్లెలు ఆ పని చేస్తోంది. అయితే అమ్మాయి  గర్భం దాల్చింది. ఆ అమ్మాయి గర్భం  దాల్చడం కలకలం రేపుతోంది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో  వైరల్ అవ్వడం తో జగిత్యాల జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారులు సదరు ప్రజాప్రతినిధి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. వెంటనే బాలికను రెస్క్యూ చేశారు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కుటుంబం సదరు ప్రజా ప్రతినిధి ఇంటి పక్కనే చాలా ఏళ్లుగా నివాసం ఉంటోంది. మొదట బాలిక అక్క అదే ఇంట్లో ఇంటి పని చేసేది. ఆమె తర్వాత ఆమె చెల్లెలు ఆ పని చేస్తోంది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడం నేరం. అంతేకాక, ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంట్లో దీనికి ఎవరు కారణం అయి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం డీసీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడెవరో కనిపెట్టే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్ప్రజాప్రతినిధితో పాటు అదే ఇంట్లో ఉంటున్న డ్రైవర్పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు వివరాలను బయటకు చెప్పడం లేదు. అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం చైల్డ్ప్రొటెక్షన్ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఉన్న బాలికను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉంచి ట్రీట్‌మెంట్ఇప్పిస్తున్నారు. పోలీసులు పోక్సో కింద కేసు ఫైల్చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయమై డీఎస్పీ వెంకట రమణను వివరణ కోరగా, ఇది సున్నితమైన కేసు అయినందున ఇప్పుడే వివరాలు బయటకు చెప్పలేమన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరా తీశారు.  

మాస్క్ లేదని మేకులు దించిన పోలీసులు.. అదిరిపోయే ట్విస్ట్‌..

క‌రోనా స‌మ‌యంలో బ‌య‌ట‌కు రావాలంటే మాస్క్ త‌ప్ప‌నిస‌రి. ముఖానికి మాస్క్ వేసుకోక‌పోతే కొవిడ్ బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌. అందుకే, మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేశాయి ప్ర‌భుత్వాలు. మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తే.. ఫైన్ విధిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీల‌తో నాలుగు త‌గిలించి మ‌రీ హెచ్చ‌రిస్తున్నారు. ఇంత వ‌ర‌కూ ఓకే గానీ.. యూపీ పోలీసులే మ‌రీ ఓవ‌రాక్ష‌న్ చేశారు. మాస్క్ లేద‌ని ఓ యువ‌కుడి చేతులు, కాళ్ల‌కు మేకులు గుచ్చ‌డం సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతోంది.  యూపీలోని బరేలీ జిల్లాలో జ‌రిగిందీ దారుణం. మాస్కు ధరించని ఓ యువకుడిని చితకబాదారు అక్క‌డి పోలీసులు. అంతేకాదు, అతని చేతికి, కాలికి మేకులు కొట్టారు. పోలీసుల అరాచకానికి బలైన యువకుడి పేరు రంజిత్. అతని చేతికి, కాలికి పోలీసులు మేకులు గుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నొప్పి భరించలేక అతను తల్లడిల్లిపోతున్న వీడియో నెటిజెన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఘటనపై బాధితుడి తల్లి శైలజా దేవి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదంతా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న న్యూస్‌. అదే స‌మ‌యంలో మ‌రో వాద‌నా స‌ర్క్యులేట్ అవుతోంది. ఓ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో రంజిత్‌ను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు వెళ్లార‌ట‌. త‌మ‌ నుంచి తప్పించుకోవడానికి రంజిత్ తనకు తానే మేకులు గుచ్చుకున్నాడనేది పోలీసుల వ‌ర్ష‌న్‌. ఇరువైపు వాద‌న‌లు వింటుంటే.. పోలీసులు చెబుతున్న‌దే కాస్త న‌మ్మ‌శ‌క్యంగా ఉందంటూ నెటిజ‌న్లు జ‌డ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ న్యూస్‌తో ఏది నిజ‌మో? ఏది అబ‌ద్ద‌మో? ఒక‌ప‌ట్టాన అర్థం కాని ప‌రిస్థితి. చివ‌రాఖ‌రున మాస్క్ ధరించనందుకు రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేయ‌డం కొస‌మెరుపు. 

విమానంలో రతి క్రీడా.. ఎంజాయ్ చేసిన ప్రేమ జంట.. 

టెక్నాలజీ డెవలప్ అవ్వడమే. సినిమాల ప్రభావమో తెలియదు గాని.. కొంత మంది యువత హద్దులు దాటుతున్నారు. వారి కోరికలు ఇక్కడ అక్కడ అని తేడాలేదు ఎక్కుపెడితే అక్కడే తీర్చుకుంటున్నారు. శృంగారం (sex) ఒకప్పుడు నాలుగు గోడల మధ్య జరిగేది. వాస్తవానికి అలా జరిగితేనే ఆ శృగారం  అందంగా ఉంటుంది. అదే  నలుగురి ముందు జరిగితే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. చాలా  చిరాకుగా కూడా  ఉంటుంది. తాజాగా ఓ జంట తమ కామ క్రీడలను నలుగురు ముందు చేశారు. తోటి ప్రయాణికులకు  చిరాకు తెప్పించారు. చివరికి వారి శృంగారానికి సపోర్ట్ చేసిన ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సివచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ ఘటన కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు వెళుతున్న పీఏ200 విమానంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కి చెందిన ఓ యువజంట కరాచీ నుంచి ఇస్లామాబాద్ కి వెళ్తున్న పీఏ200 విమానంలో ఎక్కారు. విమానం టేక్ అఫ్ కి తీసుకుంది. గాలిలో ఎగురుతుంది. విమానం ఎక్కిన దగ్గరనుండి ఆ జంట శృంగారం మత్తులో  (sex) మునిగిపోయారు. ఒకరికొకరు ముద్దులు పెట్టుకొంటూ, మూతులు నాకుతూ, కౌగిలించుకుంటూ కామక్రీడలు (Romance) కొనసాగించారు. ఇక ఇదంతా గమనిస్తున్న తోటి ప్రయాణికులు వారి ప్రవర్తన గురించి ఎయిర్ హోస్టస్ కి తెలిపారు. వెంటనే ఆమె ఆ జంట వద్దకు వెళ్లి.. విమానంలో ఇలాంటి పనులు చేయడం కుదరదని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని వివరించింది. అయినా, వారు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ రాసలీలలను కొనసాగించారు. ఇక దీంతో ఎయిర్ హోస్టస్ చేసేదేమిలేక వారిద్దరిపై దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. ఇక ఇదంతా గమనిస్తున్న బిలాల్ అనే లాయర్ ముద్దులతో ఆ జంట అంతలా చెలరేగిపోతుంటే.. వారిపై చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి కంప్లైంట్ చేశాడు. దీంతో సివిల్ ఏవియేషన్ అథారిటీ  మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ సీపీఏ వార్నింగ్ ఇవ్వడంతో పాటు సదరు ఎయిర్ హోస్టస్ ని ఉద్యోగం నుండి తొలగించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

యాంటీబాడీ కాక్‌టైల్‌ సూపర్.. రెండు రోజుల్లో కొవిడ్ రోగి డిశ్చార్జ్ 

కరోనా చికిత్స కోసం అందుబాటులోకి వచ్చిన యాంటీబాడీ కాక్‌టైల్‌ ను భారత్ లో తొలిసారి ఉపయోగించారు.  హరియాణాకు చెందిన 82ఏళ్ల కోవిడ్ బాధితుడికి రెండు రోజుల క్రితం తొలి డోస్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గురుగ్రామ్‌లో పేరొందిన మేధాంత హస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నరేష్ థెహాన్ యాంటీబాడీ కాక్‌టైల్‌ చికిత్స వివరాలను వెల్లడించారు. డిశ్చార్జ్‌ అయినప్పటికీ.. ఆ రోగిని ప్రతి రోజూ పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ‘‘కాసిరివిమాబ్‌‌, ఇమ్డెవిమాబ్‌ అనే రెండు రకాల యాంటీబాడీలను కలిపి తొలి దశలోనే కరోనా బాధితులకు ఇచ్చినట్లయితే.. ఇవి వైరస్‌ కణాలను శరీరమంతా వ్యాపించకుండా అడ్డుకుంటాయి. కొవిడ్‌ 19, బి.1.617 రకం వేరియంట్‌పై ఇది సమర్థంగా పనిచేస్తోంది. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ద్వారా రోగులు ఆసుపత్రికి వెళ్లే అవసరం 70శాతం తగ్గిపోతుంది. మన దగ్గర తొలి డోసును హరియాణాకు చెందిన వ్యక్తికి ఇచ్చాం. డోసు తీసుకున్న మరుసటి రోజు ఆయనను డిశ్చార్జ్‌ చేశాం. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. మహమ్మారిపై ఇది మన కొత్త ఆయుధం లాంటిది’’అని డాక్టర్‌ నరేశ్‌ త్రెహాన్‌ వివరించారు.  కొవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే రెండు యాంటీబాడీలను కలిసి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను ఇటీవల రోచ్‌ఇండియా, సిప్లా సంయుక్తంగా భారత మార్కెట్లో విడుదల చేశాయి. దీనిక ధర డోసుకు రూ. 59,750గా పేర్కొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది కరోనా బారిన పడినట్లు ఈ ఔషధాన్ని తీసుకుని వైరస్‌ నుంచి కోలుకున్నారు. తాము తయారు చేసిన మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌‌కు అనుమతివ్వాలని కోరుతూ ఫార్మా కంపెనీ జైడస్‌ క్యాడిలా కోరింది. ఈ మేరకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) కు జైడస్‌ క్యాడిలా దరఖాస్తు చేసింది. దీంతోపాటు అభివృద్ధి చేసిన మోనోక్లోనల్‌ కాక్‌టెయిల్‌కు జైడస్‌ క్యాడిలా ZRC-3308 అనే పేరును కూడా పెట్టింది. తేలికపాటి లక్షణాలున్న కేసుల్లో కాక్‌టెయిల్‌ ప్రధాన చికిత్సల్లో ఒకటిగా మారుతుందని కంపెనీ వెల్లడించింది. తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడేవారికి దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయంటూ వివరించింది. యూఎస్‌, యూరప్‌లో నిర్వహించిన పరిశోధనల్లో తేలికపాటి లక్షణాలున్న రోగుల్లో వైరల్‌ లోడ్‌ తగ్గిందని.. ఆసుపత్రికి వెళ్లే కేసులను ఈ ఔషధం గణనీయంగా తగ్గించేలా చేస్తుందని పేర్కొంది. SARSCoV-2 స్పైక్ ప్రోటీన్‌ను మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్‌ నిర్వీర్యం చేస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా జైడస్‌ క్యాడిలా హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షార్విల్‌ పటేల్‌ మాట్లాడారు. ఈ సమయంలో వైరస్‌పై పోరాడేందుకు సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్సలను అన్వేషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొవిడ్‌ రోగుల బాధను తగ్గించే సామర్థ్యం ZRC-3308కు ఉందని నమ్మతున్నట్లు పటేల్ పేర్కొన్నారు. 

గడ్గరీకి పీఎం కిరీటం? కమలదళం కొత్త వ్యూహం? 

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు పూర్తవుతోంది. ఈ ఏడేళ్ళలో ఏమి చేసింది, ఏమి సాధించింది అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రస్త్తుతం అటు ప్రభుత్వం,ఇటు పార్టీ కూడా, ఇంతవరకు ఈ ఏడేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, కొవిడ్ 19, కమల దళానికి, ఊపిరి అందకుండా, ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశంలో చాలా బలంగా వీస్తున్న ప్రతికూల పవనాలకు బీజేపే  ఎదురీదుతోంది. పార్టీలో, సంఘ పరివార్ లో పార్టీ భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్మధనం జరుగుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఏమి చేయడం .. ఈ గండం నుంచి ఎలా బయట పడడం’అనే  విషయంలో అంతర్గతంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.   ఈ పరిస్థితికి కారణం ఏమిటో వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. కొవిడ్ 19 ఫస్ట్ వేవ్’ను సమర్ధవంతంగా ఎదుర్కుని అందరి ప్రశంసలు పొందిన ప్రదాని మోడీ ప్రభుత్వం, సెకండ్ వేవ్’కి సంబంధించి అన్ని వైపులా నుంచి విమర్శలు ఎదుర్కుంటోంది. కొవిడ్ సెకండ్ వేవ్ విషయంలో ప్రభుత్వం ప్రతి అడుగులో తడబాటుకు గురైంది.. తప్పులు చేసింది.సెకండ్ వేవ్ ప్రభావాన్ని గుర్తించడం మొదలు, మందులు, ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సరఫరా ఇలా అన్నిటా.. ప్రభుత్వం ఫెయిల్ అయింది. నిజమే కావచ్చు, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమో, ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ వైఫల్యమోమాత్రమే కాదు. రాష్ట్ర  ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు అందరి తప్పులు ఉన్నాయి. అయితే, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వవైఫ్య, ప్రధాని వైఫల్యం అనే భావన, perception  ప్రజల్లో ఏర్పడింది. బలపడింది. అయినా, ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించి  ప్రధాన మంత్రి నరేంద్ర రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, ప్రజలు డిమాండ్ చేసే వరకు, ప్రభుత్వం జరుగతున్న నష్టాన్ని గుర్తించలేక పోయింది. చివరకు ప్రభుత్వం కళ్ళు తెరిఛి, ఆకులు పట్టుకున్నా, ఫలితం లేక పోయింది. పార్టీ ఇమేజ్, ప్రభుత్వ ఇమేజ్,అన్నిటినీ మించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్, కరోనా  డ్యామేజి చేసింది.ఇప్పుడు ఇటు ప్రభుత్వం, అటు పార్టీ, సంఘ్ పరివార్ డ్యామేజి కంట్రోల్, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టాయి.   పార్టీ భవిష్యత్ వ్యూహం గురించి, పార్టీలో కంటే రాజకీయ వర్గాలు, మీడియాలో చాలా చాలా చర్చ జరుగుతోంది. అనేక ప్రతిపాదనలు, ప్రత్యాన్మాయ విధానాలు చర్చకు వస్తున్నాయి. అందులో, ప్రముఖంగా వినిపిస్తోంది, అధ్యక్ష తరహ పాలన. బీజేపీ అధ్యక్ష తరహ పాలన వైపు మొగ్గుచూపుతోందని, అదికూడా, ప్రస్తుత ఐదేళ్ళ పాలన ముగిసేలోగా, రాజ్యాంగాన్ని సవరించి, అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని, బీజేపీ భావిస్తోందని,అ దిశగా అడుగులు వేస్తోందని ఇలా చాలా కథలు, కథనాలు వచ్చాయి.నిజానికి, అధ్యక్ష తరహ పాలన బీజేపీ అజెండాలో ఎప్పటినుంచో ఉన్నదే. గతంలో పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఈ విషయంగా జాతీయ స్థాయిలో చర్చకు తెర తీశారు. అనేక జాతీయ పత్రికలో వ్యాసాలు రాశారు. అయితే, తర్వాతి కాలంలో ఆ చర్చ తెరమరుగైంది. అదెలా ఉన్నా, రామజన్మ భూమి, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి  వంటి పార్టీ మౌలిక సిద్దాంత అంశాలతో పాటుగా అధ్యక్ష తరహా పాలన విషయంలోనూ పార్టీకి స్పష్టత ఉంది. ఇంతకు ముందే అనుకున్నట్ల్గు ప్రస్తుత ఐదేళ్ళ గడవు ముగిసే లోగా, అధ్యక్ష తరహ పాలనను తీసుకురావాలన్న అలోచనపై, పార్టీలో కొంత చర్చ కూడా జరిగిందని అంటారు. అందులో భాగంగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని పదవి చేపట్టరని, తదుపరి ప్రభుత్వం  మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా కొత్త తరహ పాలన వస్తుందని, కొంత కాలం క్రితం, మీడియాలో చర్చ జరిగింది. అయితే, ఈ విషయంలో బీజేపీ మాత్రం ఎక్కడా కమిట్ కాలేదు.  ఇప్పడు,మోడీ ఇమేజ్ డ్యామేజి అయిన నేపద్యంలో, మళ్ళీ అధ్యక్ష తరహ పాలన అంశం మరోమారు చర్చకు వచ్చింది. అయితే ఈ సారి ప్రధాని పదవికి అమిత్ షా పేరుకు  బదులుగా నితిన్ గడ్గరీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి, ప్రస్తత పరిస్థితిలో రాజ్యాంగ సవరణతో ముడిపడిన అధ్యక్ష తరహ పాలనకు ఆమోదం పొందడం, అయ్యే పనేనా అనేది, ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉందని అంటున్నారు. అయితే, ప్రధాని మోడీ, ఇమేజ్ దెబ్బ తిన్న నేపధ్యంలో అయన స్థానంలో నితిన్ గడ్గరీని ఫ్యూచర్ లీడర్’ గా ప్రొజెక్ట్’ చేసేందుకు సంఘ పరివార్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. నితిన్ గడ్గరీ’ కి ఆర్ఎస్ఎస్  సంపూర్ణ మద్దతు ఉంటుంది.అందులో సందేహం లేదు. అలాగే, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలలో కూడా ఆయన నాయకత్వం పట్ల కొంతలో కొంత సానుకూలత ఉంది. నిజానికి ఒక  సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నితిన్ గడ్గరీని లోక్ సభలో మెచ్చుకున్నారు. మెచ్చుకోవడమే కాదు,  ఆయన్ని ప్రధాని చేయాలని సూచించారు.   ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా, ఊహాగానాలు , వ్యుహాగానాల ఆధారంగా జరుగుతోంది. పరిపాలన విధానం మార్పు, నాయకత్వ మార్పు వంటి సీరియస్ విషయాల్లో బీజేపీ, సంఘ పరివార్ కొంత మంది సూచిస్తున్నట్లుగా, కొంత మంది ఆశిస్తున్న విధంగా, ఇప్పటి కిప్పుడు  నిర్ణయం తీసుకుంటారని అనుకోలేము. పరివార్’ ఏ విషయంలో అయినా ఆచి తూచి అడుగులు వేస్తుందే కానీ, తొందరపాటు నిర్ణయాలు సహజంగా తీసుకోదు. ఇది , అందరికీ తెలిసిన విషయమే.అయితే, నిజంగా, పార్టీలో, పరివార్’లో ప్రస్తుతానికి  ఎలాంటి అలోచన ఉన్నా, అంతిమ నిర్ణయం మాత్రం  వచ్చే సంవత్సం జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే ఉంటుందని బీజేపీ లోతుపాతులు తెలిసిన పరిశీలకులు భావిస్తున్నారు.

తిరుమ‌లలో కిష్కింధ‌కాండ‌.. హ‌నుమ జ‌న్మ‌స్థానంపై ర‌చ్చ‌..

ఆంజ‌నేయుడు చిరంజీవి. పుట్టుకు మాత్ర‌మే ఉంది.. మ‌ర‌ణం లేదు. మ‌రి, ఆ హ‌నుమంతుడు ఎక్క‌డ పుట్టాడు? అనేదానిపై ఏళ్లుగా వివాదం చెల‌రేగుతూనే ఉంది. విస్తృత ప‌రిశోధ‌న‌లు, ప‌రిశీల‌న‌ల అనంత‌రం.. ఆ రామ‌భ‌క్తుడు తిరుమ‌ల గిరుల్లోనే జ‌న్మించాడంటూ టీటీడీ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. కాదు కాదు.. అంజ‌నీపుత్రుని పుట్టుక క‌ర్ణాట‌క‌లోని కిష్కింధ‌లోనే అంటూ అక్క‌డి సంస్థాన్ వాదిస్తోంది. అందుకే, హ‌నుమ జ‌న్మ‌స్థ‌లంపై క్లారిటీ కోసం తాజాగా ఇరుప‌క్షాలు స‌మావేశ‌మై చ‌ర్చించాయి. అందులోనూ, ఎలాంటి ఏకాభిప్రాయం రాకుండా చ‌ర్చ‌లు అర్థాంత‌రంగా ముగిశాయి.   హనుమంతుడి జన్మస్థానంపై నెలకొన్న వివాదాన్ని చర్చించేందుకు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత పీఠంలో హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, టీటీడీ వర్గాలు సమావేశమ‌య్యాయి. అయితే ఈ సమావేశంలో ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండడంతో చర్చ అసంపూర్ణంగా ముగిసింది.  స‌మావేశం తీరుపై కిష్కింధ సంస్థాన్ కు చెందిన హనుమద్ జన్మస్థల తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్పందించారు. హనుమంతుడి జన్మస్థల అంశం ప్రధాన ఇతివృత్తంగా టీటీడీ సంస్కృత విద్యాపీఠంలో చర్చించామని తెలిపారు. తమకు పంపా క్షేత్ర కిష్కింధ ఒక కన్ను అయితే, తిరుమల మరో కన్ను అని వివరించారు. అయితే, సమావేశానికి సంబంధించిన అజెండా బుక్ లెట్ లో ఉన్న అంశాలపై ప్రస్తావనే రాలేదని గోవిందానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంజనేయుడి జన్మ తిథిపై స్పష్టత లేదని అన్నారు. హనుమంతుడి జన్మ తిథి అంటూ మూడు తిథులు ఎలా పెడతారని నిలదీశారు. ఈ అంశంపై టీటీడీ వాళ్లు ఎప్పుడైనా పంపా ప్రాంతానికి వచ్చారా? అసలు, దీనిపై టీటీడీ కమిటీకి అధికారం ఉందా? కమిటీ ఏర్పాటు చేస్తున్నప్పుడు తిరుపతి పెద్దజీయర్ స్వామిని అడిగారా? ఆ కమిటీలో పెద్దజీయర్ స్వామి ఎందుకు లేరు? రామానుజ సంప్రదాయం ప్రకారం ఆంజనేయస్వామి వారికి వివాహం చేస్తారా? ఎన్నో కల్పాలు, మన్వంతరాలు గడిచాక ఈ చర్చ ఏంటి?  అంటూ గోవిందానంద టీటీడీకి ప్రశ్నల వర్షం కురిపించారు. రామాయణం ప్రకారం కిష్కింధనే మారుతి జన్మస్థలం అని ఉద్ఘాటించారు. హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణకు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీకి ప్రామాణికత లేదని అన్నారు. అయినా, ధార్మిక విషయాలను నిర్ణయించాల్సింది ఎవరు? అని గట్టిగా అడిగారు. శృంగేరి శంకరాచార్యులు, కంచి కామకోఠి పీఠాధిపతులు, మధ్యాచార్యులు, తిరుమల పెదజీయర్, చినజీయర్ స్వాముల సమక్షంలో చర్చించాల్సిన అంశాలివి అని స్పష్టం చేశారు. సామాన్య భక్త జనాలను గందరగోళంలోకి నెట్టేలా టీటీడీ వాదనలు ఉన్నాయని గోవిందానంద విమర్శించారు. టీటీడీ తీసుకువచ్చిన బుక్ లెట్ పై తాము జీయర్ స్వాముల వద్దకు వెళతామని వెల్లడించారు. ధర్మం గురించి తేల్చాల్చింది ధర్మాచార్యులేనని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుకు రిలీఫ్.. రేవంత్ రెడ్డికి గండం!

తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్‌ దొరికింది.  సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. ఏసీబీ చార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు  కనిపించలేదు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో చెప్పారు. టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం మోపింది. ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని పేర్కొంది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. 2015లో వెలుగు చూసిన ఈ కేసులో అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. తాజాగా ఈడీ  దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది ఈడీ. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం. 

మోదీ సర్కార్ వ‌ర్సెస్ సోష‌ల్ మీడియా.. కొత్త రూల్స్ లోగుట్టు ఏంటి?

కొత్త డిజిట‌ల్ రూల్స్‌. ఇండియాలో ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌. సోష‌ల్ మీడియాను కంట్రోల్ చేయటానికి కేంద్రం కుట్ర చేస్తోంద‌నేది ఓ ఆరోప‌ణ‌. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం వాటిల్లుతుంద‌నేది మ‌రో వాద‌న‌. అందుకే, అమ‌లుకు గ‌డువు ముగిసినా.. కోర్టు కేసులు, వ‌రుస కౌంట‌ర్ల‌తో మోదీ స‌ర్కారు వ‌ర్సెస్ సోష‌ల్ మీడియా ర‌చ్చ రంజుగా సాగుతోంది.  కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ వాట్సాప్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. వాట్సాప్ కోర్టుకు వెళ్ల‌డాన్ని కేంద్రం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఇది ప్ర‌భుత్వ విధానాల‌ను ధిక్క‌రించ‌డ‌మేనంటూ హూంక‌రించింది. కేంద్రం చెప్పిన‌ట్టు చేస్తే వ్య‌క్తి స్వేచ్ఛ‌ను ఉల్లంఘించిన వారిమి అవుతామంటూ వాట్సాప్ తేల్చి చెప్పింది. అటు, ట్విట‌ర్ సైతం.. ఓకే, బ‌ట్ నాట్ ఓకే అన్న‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న చేసింది. వర్తింపచేయదగిన చట్టానికి లోబడి ఉండటానికి కృషి చేస్తామని ట్విటర్ ప్రకటించింది. అయితే స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా మాట్లాడుకోవడాన్ని అడ్డుకునే నిబంధనలను మార్చాలని కోరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం ప్రకారం, సామాజిక మాధ్యమాల కంపెనీలు భారత దేశంలో కాంప్లియెన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. ఫిర్యాదులపై స్పందించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. చట్టబద్ధమైన ఆదేశం జారీ చేసినప్పటి నుంచి 36 గంటల్లోగా సంబంధిత కంటెంట్‌ను తొలగించాలి. భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే సందేశం సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయినపుడు, దానిని మొదట ఎవరు పోస్ట్ చేశారో చెప్పాలని ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి కంపెనీలకు కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి. అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్ట్‌లు, అత్యాచారాలు వంటి నేరాలను ప్రేరేపించే పోస్ట్‌ల విషయంలో కూడా సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందజేయాలనేది కొత్త రూల్స్ సారాంశం. అయితే, కేంద్రం చెప్పిన‌ట్టు చేస్తే తాము పాటిస్తున్న వ్య‌క్తి గోప్య‌త‌కు భంగం వాటిల్లుతుంద‌నేది వాట్సాప్‌, ట్విట‌ర్‌ల అభ్యంత‌రం.  కొత్త రూల్స్‌కు వ్యతిరేకంగా వాట్సాప్ కోర్టుకు వెళ్ల‌గా.. ట్విటర్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. ట్విటర్ సర్వీస్‌ను అందుబాటులో ఉంచడం కోసం భారతదేశంలో వర్తించే చట్టాలకు అనుగుణంగా పని చేయడానికి కృషి చేస్తామని తెలిపింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా తాము చేస్తున్నట్లుగానే, పారదర్శకతా సూత్రాల మార్గదర్శకత్వంలో కచ్చితంగా పని చేస్తామని, తమ సర్వీస్‌పైగల ప్రతి గళానికి సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉంటామని, చట్టపరమైన నిబంధనల మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని ట్విట‌ర్‌ తెలిపింది.  ప్రస్తుతం, భారతదేశంలో తమ ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనల పట్ల, తాము సేవలందిస్తున్న ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు సంభవించే అవకాశంగల ముప్పు పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. ‘‘మా అంతర్జాతీయ సేవా నిబంధనల అమలుకు ప్రతిస్పందనగా పోలీసులు బెదిరింపు వ్యూహాలను ఉపయోగించడం, అదేవిధంగా కొత్త ఐటీ రూల్స్ మౌలికాంశాలపైనా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలోని పౌర సమాజంలో చాలా మందితో పాటు మాకు కూడా ఆందోళన ఉంది’’ అని తెలిపింది.  స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా, బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఆటంకాలు కల్పించే ఈ నిబంధనల్లో మార్పు కోసం వాదనలు వినిపించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తామని, పరస్పర గౌరవభావం, సహకారంతో కూడిన వైఖరిని అనుసరించడం చాలా ముఖ్యమని నమ్ముతున్నట్లు తెలిపింది. ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన సమష్టి బాధ్యత ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, పరిశ్రమ, పౌర సమాజానికి ఉందని గుర్తు చేసింది.  ‘కాంగ్రెస్ టూల్‌కిట్’పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు ఇటీవ‌ల వెళ్లారు. దీంతో ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సోష‌ల్ మీడియా వ‌ర్సెస్ మోదీ స‌ర్కారు వార్‌లో ఎవ‌రిది పైచేయి అవుతుందో చూడాలి...

పెళ్లి సందడిలో.. మహిళపై 7 మంది గ్యాంగ్ రేప్..

ఓపెన్ చేస్తే.. ఒక ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. బంధువులు అందరు వచ్చారు. ఎవరి పనుల్లో వార్లు ఉన్నారు. ఇల్లు అంత సందడి సందడి.. అనుకున్నట్లుగానే పెళ్లి కూడా జారిపోయింది. పెళ్లి పనులు చేసి అందరు అలిసి పడకుండిపోయారు.. అందులో ఒక మహిళ ఎందుకో తెలియదుగాని ఆ రాత్రిపూట బయటికి వెళ్ళింది. ఇక అంతే..  కట్ చేస్తే..  కొంత మంది ఆమెను ఫాలో అయ్యారు. ఆమె ముఖంపై ముసుగు వేసి, చేతులు కట్టేసి 300 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లారు. అంత నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచారు.  మండపాలలో వినియోగించే వస్త్రాలతో ఆమెను స్తంభానికి కట్టేసినట్టు వివరించారు. బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలకు గురిచేశారు.  సామూహిక అత్యాచారానికి పాల్పడి, వివస్త్రగా ఉన్న బాధితురాలిని రోడ్డు పక్కన ఓ స్తంభానికి వేలాడదీశారు. కదల్లేక, మాట్లాడలేక ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ పరోహి గ్రామానికి చెందిన ఏడుగుర్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని బాధితురాలు గుర్తించినట్టు తెలిపారు. బాధితురాలి (30) ఆడపడుచు వివాహం సోమవారం రాత్రి జరగడంతో అందుకు నిందితులు సప్లయర్స్ సామాన్లు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. వివాహం జరిగిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున ఆమె ఒంటిరిగా బయటకు వెళ్లడం గమనించిన నిందితులు వెంబడించి ఎత్తుకెళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా హింసించడంతో శరీరంపై గాయాలయ్యాయి. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం ఆమె సమస్తీపూర్ సాదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ జిల్లా ఎస్పీ మానవ్‌జీత్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. పరువు పోతుందనే భయంతో బాధిత మహిళ తనపై అత్యాచారం జరగలేదని చెప్పిందన్నారు. కానీ, ఆమెపై అత్యాచారం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోందని, వైద్యుల నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. బాధితురాలిని కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం దలాసింగ్‌సరాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు అక్కడ వైద్యులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దారుణమైన ఘటన బిహార్‌లో సమస్తీపూర్‌ జిల్లా బిభూత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని చఖాబిబ్‌ రుధియా గ్రామంలో మంగళవారం జరిగింది. 

నిద్రపోని రాత్రులు గడిపా.. మహానాడులో చంద్రబాబు బావోద్వేగం 

మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత  చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ తప్పులపై మాట్లాడుతున్న వారిని అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడేవారి నోళ్లను మూయించేలా స్టేట్ టెర్రరిజంకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. చివరకు కోర్టులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారంటే... రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటు పోతోందో అందరూ అర్థం చేసుకోవాలన్నారు చంద్రబాబు. అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన అక్రమ కేసులు.. జనార్దన్ రెడ్డి వరకు కొనసాగించారని చంద్రబాబు అన్నారు. వైద్యుడు సుధాకర్, కోడెల శివప్రసాదరావు సహా ఎంతోమంది ప్రభుత్వ వేధింపులు భరించలేక చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పౌరహక్కులు, మాట్లాడే వాక్ స్వాతంత్ర్యం ఎక్కడుందని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని వెంటాడుతున్నారని, రాష్ట్ర ఉగ్రవాదాన్ని అంతా ఖండించాలని పిలుపు ఇచ్చారు. చేయని తప్పుకు వేధిస్తున్న తెలుగుదేశం శ్రేణుల కుటుంబ సభ్యుల్ని తలచి నిద్రపోని రాత్రులు గడిపానని చంద్రబాబు అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై అక్రమ కేసులు పెట్టి... పోలీసు కస్టడీలో శారీరకంగా హింసించారని చంద్రబాబు మండిపడ్డారు. రఘురాజు విషయంలో స్థానికంగా అంతా మేనేజ్ చేసిన వైసీపీ ప్రభుత్వం... సుప్రీంకోర్టులో మాత్రం అడ్డంగా బుక్కయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.బెయిల్ రాకుండా ఉండేందుకు ఏడేళ్లు పైబడి శిక్షపడే కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పతనం చేసే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తీసుకొచ్చారని చంద్రబాబుఆరోపించారు. కోవిడ్‌తో పెనుమార్పులు వస్తున్నాయని, కరోనాను ఎదుర్కొంటూ పోరాడాలని చంద్రబాబు పిలుపుఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో ప్రజల్ని ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆక్సిజన్ లేక, మందులు కొనలేక ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి పని చేద్దామని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నా బాధ్యత లేకుండా వ్యవహరించారని విమర్శించారు. సలహాలు, సూచనలను ఎగతాళి చేసి పారాసిట్‌మాల్, బ్లీచింగ్‌తో పోతుందని మాట్లాడారన్నారు. కరోనాతో సహజీవనం చేయాలంటూ.. ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని మండిపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయిన వారి సంఖ్యను దాచిపెట్టి అవాస్తవాలు చెప్పారన్నారు. మానవ హక్కుల సంఘం విచారణ చేపడితే 23మందికి పరిహారం ఇస్తామని లెక్క మార్చారన్నారు. ఆనందయ్య వైద్యంపైనా నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆనందయ్య వైద్యంపై తప్పు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా పరామర్శించే టీడీపీ నేతలపై చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తోచిన సాయం చేస్తూ 4 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు శ్రీకారం చుట్టామన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక పండుగలా భావించే మహానాడు కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్ మాధ్యమంగానే జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించి మహానాడును ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర మొదలైందన్నారు. మే 28 యుగపురుషుడు ఎన్టీఆర్ పుట్టినరోజని, ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారని, ప్రపంచంలోని ఏ మూలన చూసినా తెలుగువారు ఉన్నారన్నారు. సమస్యలపై ప్రజా చైతన్యం తీసుకొచ్చేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. సమాజహితం టీడీపీ ధ్యేయమని అన్నారు.తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. ఆయన దారిలోనే ఆత్మగౌరవంతో పాటు, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని తాను సంకల్పించానని తెలిపారు. ఈరోజు తెలుగు జాతికి పండుగరోజు అని చెప్పారు. టీడీపీ అన్ని కులాలు, మతాల ప్రజలకు చెందినదని అన్నారు.తెలుగు జాతీ అంటే దివంగత ఎన్టీ రామారావు గుర్తుకు వస్తారని, సమాజ హితం కోసం  తెలుగుదేశం పనిచేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.   

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. విపక్షాల ఒత్తిడితో వెనక్కి తగ్గిన సర్కార్ 

తెలుగుదేశం పార్టీ సహా విపక్షాల పోరాటానికి జగన్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గింది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను కూడా వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం... జూన్‌ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలన్ని పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పరీక్షలు కూడా రద్దు కావడం జరిగిందన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టు వీడకండా వ్యవహరించింది. షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాడమాడుతుందనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున పరీక్షలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటు న్యాయ పోరాటానికి దిగారు.  ఈ నేపథ్యంలో ఇన్ని రోజులూ పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఎట్టకేలకు  వాయిదా వేసింది. క‌రోనా విజృంభ‌ణ విప‌రీతంగా ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.  ఆ ప‌రీక్ష‌ల తేదీల‌ను క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టాక ప్ర‌క‌టిస్తామని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇప్పుడు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై జులైలో మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై కూడా ఆ నెల‌లోనే ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. దీంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని కూడా చెప్పింది. ఉపాధ్యాయులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించలేదంటూ దాఖలైన అఫిడవిట్‌పై విచారణ ముగించాలని ప్రభుత్వ తరపు లాయర్ హైకోర్టును కోరారు. అయితే పరీక్షల వాయిదా, స్కూళ్లు తెవబోమని అఫిడవిట్ వేయాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది. 

టీడీపీ తొలి మహానాడు ఎలా జరిగిందో తెలుసా? 

తెలుగు దేశం పార్టీ పండుగలా నిర్వహించే మహనాడు ప్రారంభమైంది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఈసారి డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ లోనే కార్యక్రమాలన్ని జరుగుతున్నాయి. ప్రత్యేక అనుమతులు తీసుకోవడం ద్వారా ఎనిమిది నుంచి పది వేల మంది ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో నమోదు చేసుకొని పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఈసారి మొత్తం 15  తీర్మాణాలు చేయనున్నారు. ఇందులో పది తీర్మానాలు ఆంధ్రప్రదేశ్‌... ఐదు తీర్మానాలు తెలంగాణకు సంబంధించినవి.  తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు పుట్టిన రోజు సందర్భంగా మహానాడు సమావేశాలు నిర్వహించడం టీడీపీలో ఆనవాయితీగా వస్తోంది. తెలుగు దేశం పార్టీ తొలి మహానాడును 1983 మే 26, 27, 28 తేదీల్లో నిర్వహించారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే టీడీపీ తొలి మహానాడు జరగడంతో... ఎంతో అట్టహాసంగా జరిగింది. తెలుగు తమ్ముళ్లు పండుగలా భావించారు. గుంటూరులోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభ జరిగింది. చివరిరోజైన మే 28న భవానీపురం మీదుగా బందర్ రోడ్డు వరకు బ్రహ్మండమైన ఊరేగింపు జరిగింది. తెలుగు తమ్ముళ్ల ర్యాలీతో గుంటూరు మొత్తం పసుపుమయంగా మారిందని చెబుతారు.  అదే రోజు సాయంత్రం శాతవాహన్ నగర్ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.  తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలు అప్పట్లో దేశంలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా క్రేజీ వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు ఆయన కేంద్రంగా మారిపోయారు. అందుకే తెలుగు దేశం మహాసభలకు ఎన్టీఆర్ పిలవగానే.. అప్పటి కాంగ్రెసేయేతర పార్టీల నేతలంతా గుంటూరు వచ్చేశారు. అప్పటి రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు వచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్న, మేనకాగాంధీలు హాజరయ్యారు. ఒక రకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలంతా తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలకు రావడం అప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.  తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం వచ్చిన ప్రతినిధుల కోసం ప్రత్యేక కుటీరాలు నిర్మించారు. మహానాడుకు వచ్చిన జాతీయ నేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ మహానాడులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అప్పటి ప్రముఖ సినీ కళాకారులు వినోద కార్యక్రమాలతో అలరించారు. మొత్తంగా 1983 మే26,27,28 తేదీల్లో గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రధమ మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయని అంటారు. 

కర్ణాటక సీఎం యడ్డీకి ఉద్వాసన?

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఉద్వాసనకు రంగం సిద్దమవుతోందా... అంటే అధికార బీజేపీ వర్గాలు అవుననే అంటున్నాయి. నిజానికి యడియూరప్ప పదవీ గండాన్ని వెంటపెట్టుకునే ప్రమాణ స్వీకారం  చేశారు. అదెలా ఉన్నా, ఇంచుమించుగా సంవత్సర కాలంగా, ఈ ఉద్వాసన వార్త, రిపీటెడ్’గా వినవస్తూనే వుంది. అయితే, ఎప్పటికప్పుడు యడ్డీ ఎదో ఒక విధంగా గండం నుంచి గట్టెక్కుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ...ఇక గండం గట్టెక్కే మార్గం లేదని,అందుకే యడ్డీ కూడా షరతులతో తప్పుకునేందుకు సంసిద్దత వ్యక్త చేశారని అటు ఢిల్లీలో ఇటు బెంగళూరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు సూచిస్తున్నాయి.  చాలా కాలంగా యడ్డీ ఉద్వాసన వార్తలు వినవస్తున్నా ఇంతవరకు ఎవరూ మీడియా ముందుకు వచ్చి నోరు విప్పలేదు. కానీ , ఇప్పుడు కర్ణాటక రెవెన్యూ మంత్రి  ఆర్.అశోక్, బుధవారం , “అవును యడియూరప్పను పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరో వంక యడియూరప్ప తమ పదవిని కాపాడుకునేందుకు పావులు కదుపు తున్నారు, తమ విధేయులను ఢిల్లీకి పంపి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు’’ అని మీడియా ముందు కొచ్చి నిజాన్ని చెప్పేశారు. అలాగే, ‘అవును అసమ్మతి నాయకుల సమావేశాలు జరుగుతున్నాయి. కొందరు మంత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరావుతున్నారు.కొందరు పరోక్షంగా మద్దతు నిస్తున్నారు .ఇవ్వన్నీ నిజం. యడియూరప్పను పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం” అని, అశోక కుండ బద్దలు కొట్టారు. అశోక్ ఓపెన్ స్టేట్మెంట్, అనుమానాలను బద్దలు చేస్తే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన యడ్డీ ఉద్వాసన ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.  హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎన్ అస్వంత్ నారాయణ్ సహా మరో ముగ్గురు నలుగురు మంత్రులు మాత్రం, యడియూరప్ప ఉద్వాసన ఉండదని, అసలు అలాంటి అవకాశమే లేదని ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఏమి జరుగుతుందో ఏమో కానీ, చాలా చాలా కష్టపడి, 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేలను గోడ దూకించి, రాష్టంలో అధికారంలోకి  వచ్చిన బీజేపీ ఇప్పుడు యడ్డీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది, అంతవరకు అయితే ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర లేదు. మంత్రి పదవులు వచ్చినవారు విధేయతను చాటుకుంటుంటే, పదవులు దక్కని ఎమ్మెల్ల్యేలు అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు.  ఇరు వర్గాలు తమ తమ వాదనని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. “కొంతమంది పదవులు దక్కని ఎమ్మెల్ల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుకోవచ్చును, కానీ, అది జరగదు” అని చన్నగిరి ఎమ్మెల్యే మడల్ విరుపాక్ష ధీమా వ్యక్త పరిచారు. అంతే కాదు, యడియూరప్పను తప్పించాలనుకునే ఎమ్మెల్యేలకు  మళ్ళీ ఎన్నికల్లో గెలిచే సీన్  కూడా లేదు,అంటూ చులకన చేసి మాట్లాడుతున్నారు. అంతే కాదు, యడియూరప్పను ఎందుకు తప్పించాలి.. ఆయన చేసిన తప్పేంటి అని విరుపాక్ష ప్రశ్నిస్తున్నారు. అలాగే, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా, పార్టీలో కొన్ని విబేధాలు ఉన్నాయి, అయినా యడియూరప్ప పదవిలో కొనసాగుతారు అని అంటున్నారు. ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, యడ్డీ ఉద్వాసన  ముహూర్తం దగ్గర పడిందని, అనిపిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలున్నాయి, మరోవంక, కొవిడ్ 19 నియత్రణలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు, కాబట్టి ఆయనకు ఎంత త్వరగా  ఉద్వాసన పలికితే రాష్ట్రానికి, ప్రజలకు అంత మంచిందని  సిద్దరామయ్య అన్నారు. ఈ అన్నింటినీ మించి, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా యడ్డీని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే, పార్టీ కేంద్ర నాయకత్వం, అసమ్మతి నాయకులు కోరుతున్న విధంగా అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించేందుకు వచ్చే నెల మొదటివారంలో, శాసన సభ పక్ష సమావేశం  ఏర్పాటు చేయమని యడియూరప్పను కోరినట్లు అసమ్మతి నాయకులు చెపుతున్నారు. అయితే, శాసన సభాపక్ష సమావేశం, అందుకోసమేనా .. యడ్డీకి ఉద్వాసన పలికేందుకేనా ? అనేది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న. కానీ, హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, ముఖ్యమంత్రి యడియూరప్ప  కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేందర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకొని కేంద్ర హోం మంత్రి అమిత్ షా’, బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ అరుయన్ సింగ్ ‘తో సమావేశం కావడం, ఈ సమావేశంలో  ఒకవేళ యడియూరప్ప నిజంగానే తప్పుకోవలసి వస్తే, ఆయనకు ఇష్తమైన, తమ వర్గానికి చెందిన వారికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని షరతులు విధించినట్లు తెలు స్తోంది. అయితే తామోచ్చింది ‘అందుకు’ కాదని, కొవిడ్ సమస్యలు చర్చించేందుకని బొమ్మై చెప్పుకొచ్చారు. అయితే, ఎవరు ఏమి చెప్పినా,యడ్డీ ఉద్వాసన ఈ సారి నిజంగానే తప్పేలా లేదు.  

ఈట‌ల‌కు స‌న్ స్ట్రోక్‌!.. అంతా ఆయ‌నే చేస్తున్నారా?

ఈట‌ల రాజేంద‌ర్‌. అధిప‌త్యంపై పోరాడే యోధుడు. ఆనాడు రాజ్య దుర‌హంకారానికి వ్య‌తిరేకంగా.. ఎర్ర‌జెండా చేత‌ప‌ట్టి న‌క్స‌లిజంతో తుపాకీ రాజ్యం తీసుకురావాల‌ని అన్న‌ల వెంట‌ అడ‌వి బాట ప‌ట్టారు. ఆ త‌ర్వాత‌ ప్ర‌త్యేక రాష్ట్రం కోసం గులాబీ జెండా క‌ప్పుకొని.. కేసీఆర్‌తో చేతులు క‌లిపి.. స్వ‌రాష్ట్ర స్వ‌ప్నం సాకారం చేశారు. రెండు ద‌శాబ్దాల ఆ అనుబంధం.. ఇటీవ‌ల అవ‌మాన‌క‌రంగా ముగిసింది. స్వ‌తంత్ర భావాజాలం అధికంగా ఉండే రాజేంద‌ర్‌.. బాంచెన్ దొర అంటూ సేవ‌కుడిలా అణిగిమ‌నిగి ఉండ‌లేక‌పోయాడు. అందుకే, పార్టీపై రెబెల్ జెండా ఎగ‌రేశారు. మంత్రిమండ‌లి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయ్యారు. ఈట‌ల స్వ‌భావం తెలిసిన వారెవ‌రైనా.. ఆయ‌న‌ సొంత పార్టీ దిశ‌గా అడుగులు వేస్తార‌ని అనుకున్నారు. కొత్త పార్టీతో, బీసీ ఎజెండాతో.. కేసీఆర్‌పై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతార‌ని భావించారు. ఈట‌ల సైతం కొత్త పార్టీతో తెలంగాణ‌లో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ చేసేందుకు క‌స‌ర‌త్తు చేశారు. కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, కోదండ‌రాం, తీన్మార్ మ‌ల్ల‌న్న లాంటి భావ‌స్వారుప్య నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు. కొత్త పార్టీకి జెండా, ఎజెండా ఖ‌రారు అయ్యే స‌మ‌యంలో సీన్ రివ‌ర్స్ అయింది. పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ అమాంతం మారిపోయింది. అందుకు కార‌ణం.. బ‌ల‌మైన బీసీ నాయ‌కుడైన‌ ఈట‌ల రాజేంద‌ర్ కుమారుడు నితిన్‌రెడ్డి. అవును, ఈట‌ల ఒక‌టి త‌లిస్తే.. ఆయ‌న కొడుకు నితిన్‌రెడ్డి మ‌రొక‌లా స్కెచ్ వేశాడు. త‌న‌పై, త‌న తండ్రిపై భూక‌బ్జా కేసులు పెట్టిన కేసీఆర్‌పై కోపంతో ర‌గిలిపోతున్నారు. అన్నేళ్లు త‌న తండ్రి ఉద్య‌మానికి, పార్టీకి అంత సేవ చేస్తే.. ఇంత దారుణంగా కేబినెట్‌లోంచి వెళ్ల‌గొడ‌తారా? ఇంత ఘోరంగా త‌మ భూముల‌పై కేసులు, క‌మిటీలు వేస్తారా? అంటూ నితిన్‌రెడ్డి కాక మీదున్న‌ట్టు తెలుస్తోంది. యంగ్‌స్ట‌ర్ క‌దా.. అందుకే దూకుడుతో పాటు తెలివి కూడా ఎక్కువే. కేసీఆర్‌పై ప‌గ మాత్ర‌మే ఉంటే స‌రిపోద‌ని.. స‌రైన రీతిలో ప్ర‌తీకారం తీర్చుకోవాలంటే.. స‌రైన స‌మ‌యం, స‌రైన స‌పోర్ట్ అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు.  కొండంత కేసీఆర్‌ను ఒంట‌రిగా పిండి చేయ‌డం కంటే.. బ‌ల‌మైన జాతీయ పార్టీతో చేతులు క‌లిపి.. క‌లిసిక‌ట్టుగా క‌ల‌బ‌డితే బెట‌ర్ అంటున్నారు. అందుకే, ఇప్ప‌టికిప్పుడు సొంతంగా పార్టీ పెట్టి.. కేసీఆర్‌పై పోరాడ‌టంకంటే.. బ‌ల‌మైన బీజేపీతో జ‌త క‌ట్ట‌డ‌మే రాజ‌కీయంగా స‌రైన ఎత్తుగ‌డ అంటూ.. తండ్రికి న‌చ్చ‌జెప్పార‌ట ఈట‌ల కుమారుడు. త‌న‌యుడి ఒత్తిడితోనే ఈట‌ల బీజేపీ నేత‌ల‌తో బాగా ట‌చ్‌లోకి వ‌చ్చార‌ట‌.రేపేమాపో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో భేటీ కాబోతున్నార‌ని తెలుస్తోంది. ఈట‌ల‌కు ఇష్టం లేక‌పోయినా.. కుమారుడి ఒత్తిడి మేర‌కు కాషాయ కండువా క‌ప్పుకోవాల‌ని ఈట‌ల ఫిక్స్ అయిపోయార‌ని చెబుతున్నారు.  బీజేపీలో చేరాలా? వద్దా? అనే విషయమై ఈటల తన మద్దతుదారుల అభిప్రాయాల్ని మరోమారు అడిగినట్లు తెలిసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన మద్దతుదారులు ఈటలను శామీర్‌పేటలోని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి నుంచి వస్తున్న ఒత్తిడి గురించి ఈట‌ల వారి ద‌గ్గ‌ర ప్ర‌స్తావించార‌ట‌. నితిన్‌రెడ్డి బీజేపీలో చేరాల‌ని ప్రెజ‌ర్ చేస్తున్నాడ‌ని.. తాను సైతం క‌మ‌ల‌ద‌ళంలో చేరాల‌ని భావిస్తున్నాన‌ని.. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ధీటుగా ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు అడుగులేస్తే బాగుంటుందనే భావనను ఆయన త‌న మ‌ద్ద‌తుదారుల ద‌గ్గ‌ర‌ వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి పలువురు నాయకులు సమ్మతించడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం.     మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మూడు, నాలుగు రోజుల్లోపే బీజేపీలో ఈట‌ల‌ చేరిక ఉంటుందని చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా భాజపాలో చేరనున్నారు. కొద్దిరోజులుగా కమ‌లం పార్టీ కీలక నేతలతో మంతనాలు జరిపిన ఈటల.. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో మరోసారి ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు.బీజేపీలో చేరితే ఈట‌ల‌ పోరాటానికి పార్టీ అండగా ఉంటుందని ఛుగ్‌ చెప్పారు. రాష్ట్రానికి చెందిన ‘సంఘ్‌’ కీలక నేతతోనూ రాజేందర్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈటల బయోడేటాను రాష్ట్ర పార్టీ జేపీ న‌డ్డాకు పంపించిందట‌. అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టే జ‌రిగితే.. ఈ వారంలోనే ఈట‌ల మెడ‌లో కాషాయ కండువా చూడొచ్చు.  ఇక‌ ఈట‌ల‌తో కోదండ‌రాం, కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డిలు స‌మావేశం అవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఈట‌ల‌కు మొద‌టి నుంచీ మ‌ద్ద‌తుగా ఉంటున్న ఈ ముగ్గురు.. ఈట‌ల‌తో పాటే కాషాయ తీర్థం తీసుకుంటారా?  లేక‌, ప్ర‌స్తుతానికి ఈట‌ల ఒక్క‌రే బీజేపీలో చేరుతారా? అనేది ఆస‌క్తిక‌రం. అయితే, ఆ భేటీ త‌ర్వాత కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతానికి కొత్త పార్టీపై తొంద‌రేమీ లేద‌న్న‌ట్టు ప్ర‌క‌టించడం ఆస‌క్తిక‌రం. అంటే, ఈట‌ల నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు అట‌కెక్కిన‌ట్టే అంటున్నారు. ఈట‌ల త‌న‌యుడు నితిన్‌రెడ్డి ఎంట్రీతో.. రాజేంద‌ర్ రాజ‌కీయ ప్ర‌స్థానం అనూహ్య మ‌లుపు తిరిగిందని చెబుతున్నారు.

కిచెన్ లో కరోనా వైద్యం.. 

కరోనా యావత్ ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. ఇంత అభివృద్ధి చెందిన ప్రపంచంలో కరొనకు సరైన వైద్యం అందడంలేదు. మరోవైపు ఎంతో మంది తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఇంకేందో మంది కడుపు  మాడి చేస్తున్నారు. ఇది అంతా ఒక ఎట్టు ఐతే.. ఇప్పటి వరకు అలోపతి లోను కొంత  ఆయుర్వేదం లోను కొంత వరకు కరోనా కట్టడి చేయవచ్చు అన్నింటికంటే.. మార్క్ ప్రజలను కాపాడుతుందని చెప్పాలి. అయితే తాజాగా ఉల్లి పాయి టీ వల్ల కూడా కరొనకు కొత్త వరకు కట్టడి చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అదేంటో ? తయారు చెయ్యాలో చూద్దాం.. దానివల్ల ఎలాంటి ప్రయెజనాలు ఉన్నాయో చూద్దాం.  ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మనం నిత్యం వంటల్లో వేసుకునే ఉల్లితో కరోనా కు చెక్ పెట్టొచ్చు అంటున్నారు. అదెలా అనుకుంటున్నారా..? మీరే చూడండి. మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలన్నీ వేటికవే ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయి. అలాగే వాటిలో టెస్ట్ మాత్రమే కాదు, మనకు తెలియని ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అంటే ఏ చిన్న జబ్బు వచ్చిన ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం గాని, పూర్వము వైద్యం అందుబాటులోకి రాకముందు మన పూర్వీకులు ఇంట్లో ఉండే పదార్థాలతో వ్యాధులను పరిగెత్తించి నయం చేసుకునేవాళ్లు. అలాంటి కోవకు చెందిన పదార్థాల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? అంతేకాదు ఉల్లిపాయతో తయారు చేసిన చాయ్ తాగితే కరోనాను మన దరి చేరనీయదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఔషధాల ఉల్లి చాయ్.. ఎలా చేయాలి? ఉల్లిలో ఉండే ఔషధ గుణాల వల్లే ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు తాజగా ఉల్లి చాయి వాళ్ళ అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మన ఆహారంలో ఉల్లిపాయను ఫ్రై చేసుకోవడం పచ్చివి తినడం భాగమే. కానీ దీనితో చాయ్ తయారు చేయవచ్చు. ఆ తేవియంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ చాయ్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. ఈ కరోనా కాలంలో ఇది చాలా చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు.ఉల్లిపాయను ముక్కలుగా కోసి నీటిలో వేసి బాగా మరగనీయాలి. నీరు కాస్త రంగు మారిన తర్వాత అందులో కాస్త నిమ్మరసం గ్రీన్ టీ బ్యాగ్ ఉంచాలి. చివర్లో కాస్తే తేనెను కలిపి తాగాలి. అలా ఉల్లి చాయ్ ను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే కరోనా వంటి మహమ్మారులను దరిచేరనీయదని అంటున్నారు. ఉల్లి చాయ్  ప్రయోజనాలు ఉల్లి చాయ్ తో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. జలుబు దగ్గు ఫ్లూను దూరం పెడుతుంది. జీర్ణక్రియ మెరగవుతుందిశరీరంలో వాపు నొప్పి ఉండే త్వరగా నయం చేస్తుంది. క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది పై ప్రయోజనాలతో చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ కరోనా కాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి వీలైతే మీరూ ఉల్లిపాయ చాయ్ ని భాగం చేసుకోండి. ఉల్లిలో ఉన్న పుష్కలమైన ఔషధ గుణాలను సొంతం చేసుకొండి.  

తెలంగాణలో మరో ఆనందయ్య.. మందు కోసం జనాల క్యూ

కృష్ణపట్నం ఆనందయ్య మందు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న ఆయుర్వేద వైద్యం ద్వారా కరోనాకు మందు తయారుచేశారు ఆనందయ్య. ఇప్పటి వరకు దాదాపు 80వేల మందికి ఆయుర్వేద ముందును పంపిణీ చేశారు. అయితే ఆనందయ్య మందుకు  శాస్త్రీయత లేదని.. పూర్తి అధ్యయనం తర్వాత అనుమతులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.  కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీని ఆపివేసింది. కరోనా ఆయుర్వేద మందుకు డిమాండ్ పెరగడంతో.. ఆనందయ్యలాగే మరికొందరు కూడా కరోనాకు మందు ఇస్తున్నారు. కృష్ణపట్నం తరహాలోనే రాజమండ్రిలోనూ ఓ వ్యక్తి మందును పంపిణీ చేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ముందునే ఇస్తున్నారు ఓ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రానికి చెందిన బచ్చలి భీమయ్య గతంలో సింగరేణిలో పనిచేశారు. ఆయన పూర్వీకులు ఆయుర్వేద మందులు తయారుచేసి స్థానికులు వైద్యం చేసేవారు. వారి నుంచి వైద్యం నేర్చుకున్న భీమయ్య.. ఇప్పుడు కరోనాకు కూడా మందు తయారుచేశారు. దగ్గు, దమ్ము, ఊపిరితిత్తుల సమస్యలకు 13 రకాల వనమూలికలతో తయారుచేసిన మందు కరోనా పేషంట్లకు బాగా పని చేస్తుందని భీమయ్య అంటున్నారు. పైగా ఈ మందు వేసుకున్న రెండు గంటల్లోనే కరోనా మటుమాయం అవుతుందని చెబుతున్నారు. ఆనందయ్య లాగే ఈ మందుకు ఆయనేం డబ్బులు తీసుకోవడం లేదు. ఉచితంగానే ఇస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి నయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మాస్క్‌ కూడా ధరించకుడా.. కరోనా రోగులను పక్కన కూర్చోబెట్టుకొని, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారను  బచ్చలి భీమయ్య.  ఆనందయ్య లాగే బచ్చలి భీమయ్య వైద్యం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోజు రోజుకూ ఆయన వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏ విధంగా మందును పంపిణీ చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. మందును ఇవ్వకూడదని స్పష్టం చేశారు.  భీమయ్య ఇచ్చే మందుకు గురించి పోలీసులకు తెలిసింది. ఆయన ఇచ్చే మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని, రిస్క్‌ తీసుకోవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు మందమర్రి సీఐ ప్రమోద్‌రావు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రచారాన్ని అసలు నమ్మకూడదని సలహా ఇచ్చారు. స్థానికులు మాత్రం భీమయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కరోనా పేషెంట్లకు ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తానని భీమయ్య కూడా చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతివ్వాలే కానీ కరోనా బాధితుడిని రెండు గంటల్లో నయం చేస్తానంటున్నారు.  ఆనందయ్య నాటుమందు పాపులర్‌ కావడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా నాటువైద్యులు పుట్టుకొస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో ఇద్దరు నాటు వైద్యులు దుకాణం తెరిచారు. కరోనా నియంత్రణకు పసరు మందు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. అంతే వారి ఇంటి జనం బారులు తీరడం మొదలుపెట్టారు. కరోనా నియంత్రణకి ఉచితంగానే ఈ పసరు మందు అందిస్తున్నామని మందు తయారీదారులు చెబుతున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో 3 లక్షల మందికి పసరు మందు అందించామని… ఎవరికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నందిని సుబ్రహ్మణ్యం అనే నాటు వైద్యుడు మందును పంపిణీ చేస్తున్నాడు. గోపాలపురం మండలంలోని చిట్యాల గ్రామంలో సుబ్రహ్మణ్యం ఇస్తున్న మందు కోసం జనం బారులు తీరుతున్నారు. ఈ పసరు మందును కళ్లలో కూడా వేస్తున్నాడాయన.  

ఆంజనేయుడు మావాడే? కర్ణాటకతో టీటీడీ చర్చ.. 

ఆంజనేయుడు ఎవరివాడు? మారుతి జన్మస్థలం ఏదీ? ఎంతో కాలంగా వివాదంలో ఉన్న ఈ అంశాన్ని తేల్చేందుకు తిరుమల తిరుపతి దేవ స్థానం.. కర్ణాటక సర్కార్ తో తేల్చుకోబోతోంది. హనుమంతుడి జన్మస్థానం ఏదో తేల్చేందుకు ఇరు పక్షాలు తిరుపతిలో చర్చకు సిద్ధమయ్యాయి. తిరుమల సంస్కృత విద్యాపీఠంలో జరగనున్న భేటీలో.. రెండు రాష్ట్రాలకు చెందిన పండితులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలూ.. తమ వద్ద ఉన్న ఆధారాలను బయట పెట్టనున్నాయి. దీంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. హనుమంతుడు ఎవరి వాడు అన్న విషయం ఇప్పుడైనా తేలుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.  మారుతి జన్మస్థలంపై ఎంతో కాలంగా వివాదం తేలకుండా ఉంది. ఆంజనేయుడు ఆంధ్రప్రదేశ్ లోనే జన్మించాడంటూ శ్రీరామనవమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమల ఏడు కొండల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థానమని టీటీడీ స్పష్టం చేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో ఆంజనేయుడు జన్మించాడని ప్రకటించింది. టీటీడీ ప్రకటనపై కర్నాటకు నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మారుతి తమ ప్రాంతానికి చెందిన వాడని దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని కర్నాటక తెలిపింది. కర్నాటక రాష్ట్రంలోని హంపి సమీపంలో ఉన్న ఆంజనేయాద్రి కొండ హనుమంతుడి జన్మస్థలమని ప్రకటించింది. ఈ విషయం రామాయణంలోనూ స్పష్టంగా ఉందని  కర్నాటక సర్కారు చెప్పింది. ఆ తర్వాత కర్నాటక రాష్ట్రానికి చెందిన హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్రంగా స్పందిస్తూ.. ఘాటు లేఖ కూడా టీటీడీకి రాసింది. బహిరంగ చర్చకు రావాలని కోరింది. కర్నాటక రాష్ట్రానికి చెందిన హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖకు టీటీడీ కూడా బదులిచ్చింది. ఆంజనేయుడు జన్మస్థానానికి సంబంధించి తమ దగ్గర అన్ని అధారాలు ఉన్నాయని తెలిపింది. బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించింది. ఆ నేపథ్యంలో హనుమంతుడి జన్మస్థానంపై తేల్చేందుకు చర్చకు సిద్ధమయ్యారు.