అంత్యక్రియలు జరిగాక.. వారానికి తిరిగి వచ్చి .. 

అసలు ఈ కాలంలో ఏం జరుగుతుందో అర్థం అవ్వడం లేదు. ఈ మధ్య చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సీన్లు సినిమాలోనే జరుగుతాయి అనుకుంటాం కానీ ప్రత్యేకంగా చూస్తున్నాం. అదేంటంటే అంత్యక్రీయలు జరిగాక తిరిగివచ్చిన వ్యక్తి. అని.. పడే మీద ఉన్న వ్యక్తి లేచికూర్చున్నాడని. ఇలాంటి వార్తలు చాలా వింటూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి మరో మరొకటి ఉంది. ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..   ఒక వ్యక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడ.. ఒక చోటుకి చేరిన తర్వాత అతనికి ఆరోగ్యం మందగించింది. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.  అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవర్ధన్ ప్రజాపత్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. మూడు రోజులైనా గోవర్ధన్ శవాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతని కుటుంబ సభ్యులు వచ్చారు అతని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా కన్నీరు కార్చారు.  చివరికి అతనికి హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రీయలు జరిపించారు. అంత్యక్రియలు జరిగిన వారం రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు షాకైయ్యారు.  గోవర్ధన్ పొటోలను సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల్లో ప్రచురించిన పోలీసులు గుర్తిస్తే సమాచారం అందించాలని కోరారు. ఇవి చూసిన ఓంకార్‌లాల్ కుటుంబ సభ్యులు మార్చురీకి వెళ్లి శవాన్ని చూసి ఓంకార్‌గా పొరబడ్డారు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియులు నిర్వహించారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఓంకార్‌లాల్ ఇంటికొచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చనిపోయాడనుకున్న కొడుకు ఇంటికి రావడంతో సంతోషంలో  మునిగిపోయారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలో జరిగింది. అతని పేరు ఓంకార్‌లాల్  అతనికి 40  సంవత్సరాలు. 

హే హ‌నుమా.. ఈ గొడ‌వేంటి గోవిందా..

హ‌నుమంతుడు ఎక్క‌డ పుట్టాడు?  తిరుమ‌ల గిరుల్లోనా? క‌ర్ణాట‌క‌లోని కిష్కింధ‌లోనా? అనేదానిపై ఏళ్లుగా వివాదం చెల‌రేగుతూనే ఉంది. విస్తృత ప‌రిశోధ‌న‌లు, ప‌రిశీల‌న‌ల అనంత‌రం.. ఆ రామ‌భ‌క్తుడు తిరుమ‌ల గిరుల్లోనే జ‌న్మించాడంటూ టీటీడీ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. కాదు కాదు.. అంజ‌నీపుత్రుని పుట్టుక క‌ర్ణాట‌క‌లోని కిష్కింధ‌లోనే అంటూ అక్క‌డి సంస్థాన్ వాదిస్తోంది. అందుకే, హ‌నుమ జ‌న్మ‌స్థ‌లంపై క్లారిటీ కోసం తాజాగా ఇరుప‌క్షాలు స‌మావేశ‌మై చ‌ర్చించాయి. అందులోనూ, ఎలాంటి ఏకాభిప్రాయం రాకుండా చ‌ర్చ‌లు అర్థాంత‌రంగా ముగిశాయి. చ‌ర్చ‌లైతే ముగిసాయి కానీ.. ర‌చ్చ మాత్రం ఆగ‌లేదు. టీటీడీపై గోవిందానంద వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌గా.. వాటిని త‌ప్పుబ‌డుతూ.. తిరిగి కౌంట‌ర్ ఇచ్చారు టీటీడీ పండితులు.   తాజాగా, టీటీడీపై గోవిందానంద సరస్వతి మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులేనని తోచిపుచ్చారు. సంపూర్ణ అవగాహన, పరిశోధన చేయకుండా హనుమంతుడి జన్మస్థలాన్ని అసంపూర్ణ జ్ఞానంతో ప్రకటించారని తప్పుబట్టారు. టీటీడీ ప్రమాణంగా చూపిస్తున్న.. వెంకటాచలం మహత్యం సంకలనం తప్పుల తడక అని కొట్టిపారేశారు. వెంకటాచలం మహత్యం బుర్రలేని వారు రాశారని మండిపడ్డారు. ద్వాపరయుగం అంతంలో 5 వేల ఏళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదని గోవిందానంద విమర్శించారు. హనుమంతుడు పుట్టిన శ్లోకంతో తిధికి సంబంధం లేదన్నారు. కలియుగంలో హనుమంతుడు పుట్టినట్టు టీటీడీ పుస్తకం చెబుతోందని, టీటీడీ ప్రకారం హనుమంతుడు రాక్షసుడు.. రామాయణం ప్రకారం అప్సరస బిడ్డ అని తెలిపారు. అంజన హళ్లి ఇంకా పంపా సరోవరం ద‌గ్గ‌ర‌ ఉందని తెలిపారు. రామాయణంలో ఎక్కడా.. తిరుమల గురించి కానీ, వృషాద్రి, శేషాద్రి పర్వతాల గురించి కానీ లేద‌ని చెప్పారు. కొందరు కీర్తి కోసం ఒత్తిడితో హనుమంతుడి జన్మస్థలం తిరుమ‌ల కొండ‌లేనంటూ పండితుల చేత ప్ర‌క‌ట‌న‌ చేయించారని ఆరోపించారు. టీటీడీ పండితులు దారి తప్పారని, తిరుమలను హనుమంతుడి జన్మస్థలం అని ప్రకటించాక.. టీటీడీకి లాయర్ నోటీసులు వెళ్లాయని గోవిందానంద తెలిపారు.

ఏసీబీకి సుప్రీం నోటీసులు.. రేవంత్‌రెడ్డికి ఊర‌ట‌!

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి.. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌పై సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిలిపివేయాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత ధర్మాసనం తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్‌ దొరికింది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. ఏసీబీ చార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు  కనిపించలేదు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో చెప్పారు. టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం మోపింది. ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని పేర్కొంది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. 2015లో వెలుగు చూసిన ఈ కేసులో అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. తాజాగా ఈడీ  దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది ఈడీ. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం. 

రోడ్డు మీద కొత్త జంట.. మందలించిన పోలీసులు.. ఏం జరిగిందో తెలుసా..? 

కరోనా సమయంలో చాలామంది సైలెంట్‌గా పెళ్లిళ్లు చేసుకున్నారు. కరోనా భయంతో ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా అతి తక్కువ మంది అతిథులతో వివాహ వేడుకను జరుపుకున్నారు. అయితే కొత్తగా పెళ్లైన జంటకు ఎంత టైం ఉన్న సరిపోదు. ఇక ఖాళీగా సమయం దొరికితే ఎంతో ఆనందం. లాక్ డౌన్ సమయంలో వివాహం జరిపితే మరింత హ్యాపీ. కొత్త జంటలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కానీ లాక్ డౌన్ లో ఓ కొత్త జంట పోలీసులకు షాక్ ఇచ్చింది. అదేదో స్కిట్ లో ఏ సుబ్బారావు గారు ఏం నడుస్తుంది.. అంటే మీ కంటే ముందు మీ పొట్ట నడుస్తుంది అన్నట్లు. ఇది అసలే కరోనా టైం నడుస్తుంది. ఈ లాక్ డౌన్ టైములో అందరూ బిక్కు బిక్కు మని ఇళ్లలో ఉంటే.. కొత్తగా పెళ్లి అయినా జంట ఇంట్లో ఉంది బోర్ కొట్టిందని రోడ్డు మీదికి వచ్చారు. అది కూడా ఒక కుక్క  పిల్లతో కలిసి కొత్త జంట రోడ్డుపైకి వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటూ గట్టిగా నిలదీశారు. అది సైబరాబాద్. లాక్ డౌన్ కారణంగా గల్లీ గల్లీకి ప్రతి చోట పోలీసులు ఉన్నారు. సరిగ్గా మధ్యాహ్న సమయం. ఓ జంటను పోలీసుల ఆపారు. వారితో పాటు ఓ కుక్క పిల్ల కూడా ఉంది. చెక్ పోస్ట్ నెంబర్ 1 పోలీసులు ఆపిన తర్వాత తాము మెడిసిన్ కోసం వెళ్తున్నామని చెప్పారు . చెక్ పోస్ట్ నెంబర్ 2  దగ్గర మరో  సమాధానం చెప్పారు. ఇలా మూడు నాలుగు చేక్ పోస్ట్ లు దాటిన తర్వాత 5 వ  చెక్‌పోస్టు వద్ద పోలీసులు వారిని గట్టిగా నిలదీశారు. అసలు మీరు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తీసుకురావడానికి వెళ్తున్నారని అడిగారు. దీంతో ఏమి సమాధానం చెప్పాలో తెలియక చివరికి సిల్లీగా కుక్కపిల్లకు జ్వరం వచ్చిందని చెప్పారు. దీంతో పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎక్కడ హాస్పిటల్ తెరిచి లేవని పోలీసులు తేల్చేశారు. దీంతో ఆ కొత్త జంటలో ఆయే మయంలో పడిపోయింది. అనవసరంగా రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారని పోలీసులు వారిని హెచ్చరించారు. దీంతో కొత్తజంట చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ కి గురయ్యారు. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలోనే తమకు వివాహం జరిగిందని, గత నెలరోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నానని , ఇంట్లో ఉండడంతో తమకు బోర్ కొడుతుందని , బయట తిరగాలన్న ఉద్దేశంతో రోడ్డుమీదికి వచ్చామని చెప్పారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొత్తజంట ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయాలి తప్ప బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . అంతేకాకుండా వారిద్దరిని కూడా పోలీసులు ఇంటి వరకు దిగబెట్టి మరొకసారి బయట కనబడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహారాష్టలో  రిజర్వేషన్ రగడ ...

ఓ వంక రాష్ట్రంలో కొవిడ్ కరల నృత్యం కొనసాగుతోంది.దేశం మొత్తంలో కొవిడ్ కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ముందువరసలో వుంది. అదలా ఉంటే, కొవిడ్’ను మించిన మరో చిచ్చుకుకు రాజకీయ  పార్టీలు తెరతీశాయి. విద్యా ఉద్యోగాలు, మరాఠీలకు రాష్ట్ర ప్రభుత్వం కలిపించిన ఐదు శాతం రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లను విచారించిన సర్వోన్నత నాయస్థానం, మే 5 న కోటాను రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది.ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజీపే, అనుబంధ సంస్థలు, బీజేపీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు రిజర్వేషన్ రాజకీయాలకు తెరతీశాయి. బీజేపీ మిత్ర పక్షం అనుబంధ సంస్థ. జూన్ 5 నుంచి ఆందోళనకు పిలుపు నిచ్చింది. మరో వంక రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, గురువారం, రిజర్వేషన్ పరిరక్షణ కోసం మరాఠీలు అందరూ, వీధుల్లోకి వచ్చి, ఆందోళనలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.   అయితే రిజర్వేషన్ అనుకూల, వ్యతిరేక పత్రాలు రెండూ కూడా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలే పోషిస్తున్నాయని, కాంగ్రెస్, పార్టీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా ఈ ఆందోళన, కొవిడ్ మరింత వేగంగా విస్తరిస్తే, అందుకు బీజేపపీనే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటీషన్ దకాహాలు చేసింది బీజేపీ,ఆర్ఎస్ఎస్’ తో సంబంధమున్న సంస్థలైతే, రిజర్వేషన్ల సాధన పేరిట బీజీపీ ఎంపీ,సంబాజీరాజే చత్రపతి, రాజకీయేతత ఆందోళన చెప్పటడం, కాంగ్రెస్ తప్పుపడుతోంది. కాగా, బీజేపీ ఎంపీ, శంబాజీరాజే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా, అధికార మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఏమ్వీఎ)భాగస్వామ్యపక్షాల నాయకులతోను చర్చలు,సంప్రదింపులు జరుపుతున్నారు.   అయితే,మరాఠీల కోటాను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందని , ఏమ్వీఎ ప్రభుత్వం  వాదిస్తోంది, మరోవంక బీజేపీ రిజర్వేషన్  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో బలమైన వాదనలు వినిపించక పోవడం వల్లనే తీర్పు ప్రతికూలంగా వచ్చిందని, ఇప్పటికైనా  రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని డిమాండ్ చేస్డింది. రెవీ పిటీషన్’కు జున 4 వ తేదీ వరకు సమయముందని, అయినా ప్రభుత్వం కదలకపోతే, జూన్ 5 నుంచి ఆందోళన  తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ హెచ్చరించారు. మరోవంక అనేక కుల సంఘాలు జూన్ 5 లోగా రిజర్వేషన్ల పునరుద్దరణ జరగాలని లేదంటే  కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి అయినా  వీధుల్లోకి వచ్చి , ఆందోళన  చేపడతామని హెచ్చరిస్తున్నాయి. అయితే రిజర్వేషన్ మంచి చెడులు ఎలా ఉన్నప్పటికీ, కొవిడ్ మహమ్మారి  ఉదృతి పూర్తిగా తగ్గని ప్రస్తుత పరిస్థితులలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఆందోళనకు పిలుపు ఇవ్వడం మంచిది కాదని, సొంత పార్టీ నేతలే హితవు చెపుతున్నారు. అలాగే, కోర్టులు కూడా సుమోటోగా జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నారు.

మందు సీక్రెట్‌ను కొట్టేసే కుట్ర‌!.. హైకోర్టులో ఆనంద‌య్య పిటిష‌న్‌..

అనుకున్న‌ట్టే అవుతోంది. ఆనంద‌య్య మందు సీక్రెట్‌ను కొట్టేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఈ విష‌యం స్వ‌యంగా ఆనంద‌య్య‌నే చెబుతున్నారు. చెప్ప‌ట‌మే కాదు.. ఏకంగా హైకోర్టును ఆశ్ర‌యించారు. అవును, నిజ‌మే. కొన్ని రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన ఆనంద‌య్య‌.. హ‌ఠాత్తుగా హైకోర్టు పిటిష‌న్ రూపంలో మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చారు. కొవిడ్‌ నివారణ మందు తయారీకి అవసరమైన పదార్థాలతో పాటు ఫార్ములా చెప్పాలని అధికారులు వేధిస్తున్నారని ఆనందయ్య హైకోర్టులో గురువారం వ్యాజ్యం దాఖలు చేశారు. మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నానని.. ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించేలా ఆదేశించాలన్నారు.  ‘‘లోకాయుక్త ఆదేశాల మేరకు మందు విషయంలో వాస్తవాలు తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీ ఆయుష్‌ కమిషనర్‌తో వచ్చి నమూనాలు సేకరించింది. మందుపై ప్రజలు ఎవరూ నెగెటివ్‌గా చెప్పడం లేదని నివేదికలో పేర్కొన్నారు. మందు తయారీకి వాడే ఫార్ములా చెప్పాలని త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు ఆయుష్‌ కమిషనర్‌ ఒత్తిడి చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో భారీగా ఖర్చు చేయలేని సామాన్య ప్రజలను నా మందు ఆకర్షించింది. ప్రస్తుతం నేను మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, అధికార యంత్రాంగం కలిసి దీన్ని కమర్షియలైజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన కలుగుతుంది. అధికరణ 301 ప్రకారం స్వేచ్ఛాయిత వృత్తి, వాణిజ్యం నిర్వహించుకోవచ్చు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నా ఆయుర్వేద వృత్తిలో అధికారుల జోక్యాన్ని నిలువరించండి’’ అని ఆనందయ్య కోరారు.  ఆనంద‌య్య వ్యాజ్యంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం మొద‌లైంది. ఇదంతా ప్ర‌భుత్వ పెద్ద‌లు చేస్తున్న కుట్ర అంటూ జ‌నం మండిప‌డుతున్నారు. రెండు వారాల పాటు స‌జావుగా సాగిన మందు పంపిణీ కార్య‌క్ర‌మం.. ప్ర‌భుత్వ జోక్యంతో స‌డెన్‌గా ఆగిపోయింది. ఆయూష్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చినా.. మందు పంపిణీ మాత్రం ఇంకా మొద‌లు కాలేదు. అప్ప‌టి నుంచీ ఆనంద‌య్య సైతం క‌నుమ‌రుగు. ఆయ‌న్ను ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఉంచి.. పెద్ద ఎత్తున మందును త‌యారు చేయిస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు సాక్షంగా ప‌లు వీడియోలు సైతం వైర‌ల్ అవుతున్నాయి. అధికారుల అండ‌తో.. పాల‌కులు ఆనంద‌య్య మందును ఫార్ములాతో స‌హా కొట్టేసే కుట్ర‌లు, కుతంత్రాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌జ‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 

పొలంలో 3 కోట్ల వ‌జ్రం.. రైతే రాజు.. మ‌ట్టిలో మాణిక్యాలు..

రోజూలానే ఆ రైతు పొలానికి వెళ్లాడు. పొలం ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. నేల‌పై ఓ రాయి త‌ళుక్కున మెరుస్తూ క‌నిపించింది. ఆ రైతుకు అనుమానం వ‌చ్చింది. ఆ రాయిని జేబులో వేసుకొని.. ఓ వ్యాపారి ద‌గ్గ‌రికి వెళ్లాడు. పొలంలో దొరికిన తెల్ల‌ని రాయిని అత‌నికి చూపించాడు. ఎంతిస్తావ్ అని అడిగాడు? వ్యాపారి నుంచి కోటి 20 ల‌క్ష‌లు తీసుకొని సైలెంట్‌గా వెళ్లిపోయాడు ఆ రైతు. అయితే, ఆ రైతు తెచ్చిన‌ రాయి విలువ 3 కోట్లు ఉంటుంద‌ని ఆ వ్యాపారికి మాత్ర‌మే తెలుసు. రైతుకు తెలీదు. ఒక్క రోజులోనే కోటీశ్వ‌రుడైన ఆ రైతు ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆ రాయి మ‌హ‌త్యం అలాంటిది మ‌రి. అది మ‌ట్టిలో మాణిక్యం. ధ‌గ‌ధ‌గ‌మెరిసే పే..ద్ద సైజు వ‌జ్రం. అందరికి అన్నం పెట్టె రైతన్నకు.. పట్టెడు అన్నం దొరకక ఇబ్బందులు. ఓవైపు అప్పుల బాధ.. మరోవైపు దొర‌క‌ని గిట్టుబాటు ధ‌ర‌. ఇలాంటి వార్త‌లు నిత్యం వింటూనే ఉంటాం. అయితే, ఒక్క‌రోజులోనే కోటీశ్వ‌రుడైన రైతుకు సంబంధించిన బ్రేకింగ్‌ న్యూస్ ఇది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంకు చెందిన రైతు పంట పండింది. ఏకంగా మూడు కోట్లు విలువ చేసే వజ్రం సాగు భూమిలో దొరికింది. రహస్యంగా వ్యాపారి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లగా.. అది ఏకంగా 30 క్యారెట్ల బ‌రువున్న పెద్ద సైజు మేలిమి వ‌జ్ర‌మ‌ని తేలింది. రైతుతో బేరసారాలు ఆడి.. కోటి 20 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మార్కెట్లో దీని ధర రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ నేలే అలాంటిది. ఆ ప్రాంతం వ‌జ్రాల గ‌ని. వర్షాలు పడితే చాలు.. ఆ మ‌ట్టిలో వజ్రాలు పండుతాయి. చినుకు చినుకు పడే కొద్దీ మట్టి పొరల్లో దాగిన విలువైన వజ్రాలు.. వ‌ర్షం దాటికి పై పొరల నుండి బయట పడతాయి. అందుకే, అక్క‌డ వజ్రాలను వెతకటానికి వేరే ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున జనాలు అక్కడికి వస్తుంటారు. జొన్నగిరి ప్రాంత‌ చుట్టుపక్క గ్రామాల రైతులు వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉదయం నుండి వజ్రాల వేట కొనసాగిస్తారు. దొరికిన వారు లక్షాధికారి.. దొర‌క‌ని వారి ప్ర‌య‌త్నం మ‌రోసారి.. తాజాగా, తన పొలంలో వెతుకుతున్న రైతుకు కోట్ల విలువ చేసే విజ్రం దొరికింది. పొలంలో మిలమిలా మెరుస్తున్న రాయి తనని బాగా ఆకర్షించింది. వజ్రంగా భావించి వెంటనే ఇంటికి తీసుకువచ్చాడు. స్థానిక వజ్రాల వ్యాపారి పార్థుకు చూపించ‌గా.. అత‌ను ఆ వజ్రాన్ని పరీక్షించాడు. అంతే, ఒక్క‌సారిగా అవాక్క‌య్యాడు. ప్ర‌పంచ మార్కెట్లో భారీ డిమాండ్ ఉండే.. పెద్ద సైజు ఉన్న‌.. 30 క్యారెట్ల వజ్రం కావడంతో వెంటనే బేరం మాట్లాడేశాడు. ఆ వజ్రానికి కోటి 20 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. 30 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం మార్కెట్ ధర రూ.3 కోట్ల వరకు ఉంటుందని ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత ఇతర వ్యాపారులు చెబుతున్నారు. అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు చెప్ప‌లేద‌ని.. వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసారు. చివరకు ఆ నోటా ఈ నోటా పడి బయటపడ్డ విలువైన వజ్రం విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికితే.. స్థానిక వ్యాపారులందరికీ సమాచారమిచ్చి వేలం పాటలో అమ్ముతారు. కాని తొలకరికి ముందే, అదీ.. ఇంత విలువైన వజ్రం దొరకడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కోట్లు విలువ చేసే విలువైన వజ్రాలను అక్కడి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత భారీ మొత్తంలో వజ్రాలు దొరికినా.. రెవెన్యూ అధికారులు ఆ దరిదాపులకి కూడా వెళ్లక‌పోవ‌డం అక్క‌డ సాధార‌ణ విష‌య‌మే. 

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు? వారసుల మధ్య పోరాటం..  

కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు.  ఇటీవల కాలం వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండేవారు. ఇటీవల ఆయన చనిపోవడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయింది. ఇప్పుడా పదవి ఎవరికి ఇవ్వాలనేది పీటముడిగా మారింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి పీఠం కోసం వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి వారసుల మధ్య వైరం ముదురుతోంది. వారసుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది వివాదాస్పదంగా మారింది. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని ఎంపిక చేయాలనేది చిక్కుముడిగా మారింది. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రంగ ప్రవేశం చేసినా ఎంపిక ఇంకా కొలిక్కి రావడం లేదు.  వీరభోగవసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతమ్మ 8 మంది సంతానం. అందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లున్నారు. మొదటి భార్య మృతి చెందడంతో రెండో భార్యను వివాహం చేసుకున్నారు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు. అయితే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత మఠం పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై ఓ వీలునామా రాసి పెట్టారు. అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు రాశారు. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మఠాధిపతి నియామకం కోసం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ఇప్పటికే విచారణ చేపట్టారు. రాణాప్రతాప్‌ సమక్షంలోనే పీఠాధిపతికి అర్హులు నేనంటే నేనంటూ కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రాథమిక విచారణను మధ్యలోనే నిలిపివేశారు రాణాప్రతాప్‌. గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికే ఇవ్వాలని మద్దతు తెలుపుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకు కనుక ఆయనకే ఇవ్వాంటున్నారు. అయితే వీలునామాలో మాత్రం మొదటి భార్య రెండో కుమారుడి పేరు ఉంది. పెద్ద భార్య కిడ్నీ ఫెయిల్ అయిన సమయంలో ఎవరైతే కిడ్నీ ఇస్తారో తదుపరి పీఠాధిపతి వారేనని ప్రకటించారు. అప్పుడు రెండో కుమారుడు ముందుకు వచ్చాడు. దీంతో అతని పేరును వీలునామాలో రాశారు. దీంతో ఆయనకు కొందరు మద్దతు తెలుపుతున్నారు.  మరోవైపు వీలునామాలో తన కుమారుడి పేరు ఉందని, అయితే చిన్నవాడు కావడంతో తానే మఠాధిపత్యాన్ని స్వీకరిస్తానని చెబుతోంది చిన్న భార్య మారుతి లక్ష్మమ్మ. తన భర్త తర్వాత తనకే మఠాధిపత్యం వస్తుందని వీలునామాలో రాశారని వాదిస్తున్నారు. దీంతో అందరి అభిప్రాయాలు తెలుసుకున్న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ప్రాథమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు. బ్రహ్మంగారి పీఠాధిపతి కావాలంటే దానికి కొన్ని అర్హతలుండాలి.. హిందూమతం, వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ధార్మిక గ్రంధాలలో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఙానం తెలిసి ఉండాలి. మఠం శిష్యగణానికి జ్ఞానబోధ, సంప్రదాయాలను నేర్పించే సమర్థత ఉండాలి. క్రమశిక్షణలో, దాన్ని పాటించుటలోనూ నిశ్చయమైన నమ్మకంతో మత ప్రవృత్తి కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారి పేరు ప్రతిపాదించిన తర్వాత దేవాదాయశాఖ కమిషనర్‌తో పాటు నలుగురు సభ్యులు పేరును ప్రతిపాదించి 90 రోజుల్లో దానిపై ధార్మిక పరిషత్‌ ఓ నిర్ణయం తీసుకుంటుంది. అందరి సమక్షంలో బ్రహ్మంగారి పీఠాధిపతి పేరును ప్రకటిస్తుంది.

చీడపురుగుల్లా దోచుకుంటున్నారు.. మీరేం పీ*తున్నారు?

మంత్రి కొడాలి నాని మ‌ళ్లీ మండిప‌డ్డారు. నిత్యం ప్ర‌తిప‌క్షాన్ని బూతులు తిట్టే నాని.. ఈసారి ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌పై విరుచుకుప‌డ్డారు. ఏపీలో కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయంటూ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల్లో చీడపురుగుల్లా దోచుకుంటున్నారని, శవాల మీద డబ్బులు ఏరుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి ఆసుపత్రులను ఉపేక్షించినా, క్షమించినా భవిష్యత్ తరాలకు ద్రోహం తలపెట్టిన వాళ్లమవుతామని వ్యాఖ్యానించారు. కరోనా రోగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం అని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.సెకండ్ వేవ్ లో దయనీయ పరిస్థితులు ఏర్పడగా, కొందరు సంస్కారహీనుల్లా తయారై దోపిడీ చేస్తున్నారని, అలాంటి వారిని అధికారులు గుర్తుంచుకోవాలని తెలిపారు.  రోగులను దోచుకునే ఆసుపత్రుల కథ ముగించేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. మంత్రి గారు భ‌లే మాట్లాడారంటూ అధికారులు చ‌ప్ప‌ట్లు కొడితే.. ఇన్ని రోజుల త‌ర్వాత‌.. ఇంత మంది ప్రాణాలు పోయాక‌.. ఇంత మంది దోపిడీకి గుర‌య్యాక‌.. ఈ విష‌యం ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఏపీలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో బెడ్లు, ఆక్సిజ‌న్‌, మందులకు తీవ్ర కొర‌త ఉండ‌టంతో.. జ‌నాలు ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌లో చేర‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రైవేట్‌లో చికిత్స చేయించుకోవాలంటే.. ఆస్తులు అమ్ముకోవాల్సి వ‌స్తోంది. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఫీజులు వ‌సూలు చేస్తూ.. మంత్రి నాని చెప్పిన‌ట్టే.. చీడ‌పురుగుల్లా దోచుకుంటున్నారు.. శ‌వాల మీద డ‌బ్బులు ఏరుకుంటున్నారు. ఇదైతే వాస్త‌వ‌మే. మ‌రి, ఇంతా తెలిసి ప్ర‌భుత్వం ఏం చేస్తున్న‌ట్టు?  చికిత్స పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు హాస్పిట‌ల్స్‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు?  బూతులు మాట్లాడే మంత్రే.. వారి జోలికి వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారా?  సీఎం జ‌గ‌న్‌రెడ్డి మీవాడే క‌దా.. ఆయ‌న‌తో చెప్పి ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చుగా? అంటూ సోష‌ల్ మీడియాలో నిల‌దీస్తున్నారు.  ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లోనే మంచి స‌దుపాయాలు ఉంటే.. ప్రైవేటుకు ఎందుకు వెళ‌తామంటూ ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. ఏపీలో మెరుగైన వైద్యం అంద‌క‌పోవ‌డం వ‌ల్లే క‌దా.. అంబులెన్సులు వేసుకొని హైద‌రాబాద్ వెళ్తుంటే.. స‌రిహ‌ద్దులో అక్క‌డి పోలీసులు అడ్డుకుని ఇబ్బంది పెట్టింది. అప్పుడు సైతం నోరెత్త‌కుండా మౌనంగా ఉన్నారీ పాల‌కులు. ఉచితంగా ఇస్తున్న ఆనంద‌య్య మందును సైతం ఈ ప్ర‌భుత్వ పెద్ద‌లు అడ్డుకున్నారు. అమ్మ పెట్ట‌దు.. అడుక్కు తిన‌నివ్వ‌దు అన్న‌ట్టు ఉంది ఏపీ స‌ర్కారు తీరు. తాజాగా, స్వ‌యానా మంత్రి కొడాలి నానినే.. ప్రైవేటు ఆసుప‌త్రుల దోపిడీపై ఆగ్ర‌హ‌మైతే వ్య‌క్తం చేశారు కానీ.. మ‌రి, చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 

కమలంలో ఈటల ఇమడగలరా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని తీసుకున్న నిర్ణయం, ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ నియోజక వర్గం నుంచి పోటీచేసేందుకు ఇప్పటికే కర్చీఫ్ వేసుకు కూర్చున్న, మాజీ మంత్రి, మాజీ టీడీపీ నేత పెద్ది రెడ్డి జిల్లా నేతలను సంప్రదించకుండా, రాష్ట్ర నాయకత్వం, ఈటలను ఎలా పార్టీలో చేర్చుకుంటారని, అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న, మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకుని ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని కూడా పెద్ది రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈటలకు వ్యతిరేకంగా పోరాడిన తాను ఇప్పుడు ఆయనతో  కలిసి ఎలా పనిచేస్తానని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అయితే, పార్టీలు మారడం, పార్టీలు మారిన ప్రతి సారీ మాటలు మార్చడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. నిజానికి పెద్ది రెడ్డి కూడా  బీజేపీలో పుట్టి బీజేపీలో  పెరిగిన నాయకుడు కాదు. ఆయన కూడా అనేక  పార్టీలు మారి వచ్చిన వారే. నిజానికి ఈటలకు ఇది తొలి (ఫిరాయింపు) అనుభవం మాత్రమే. పెద్దిరెడ్డికి అయితే నాలుగైదు సార్లయినా గోడ దూకారు. అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి దేవేందర్ గౌడ్ పార్టీ, నవ తెలంగాణ పార్టీలోకి వెళ్లారు, దేవేందర్ గౌడ్  నవ తెలంగాణను చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలో విలీనం చేస్తే, ఆయనతో పాటు ఈయన కూడా ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్ళీ, టీడీపీలోకి  వచ్చారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు ... సో ... ఈ అన్ని మజిలీలలో ఆయన తిట్టిన నోటితో పొగడడం, పొగిడిన నోటితో తిట్టడం చాలా సందర్భాలలో చేసే ఉంటారు. తెలుగు దేశం నుంచి బయటకు వెళ్ళిన సమయంలో ఆయన టీడీపీని, బీజేపీలో చేరక ముందు ఆ పార్టీని, ఆపార్టీ నాయకులను కూడా పెద్దిరెడ్డి విమర్శించారు. ఇప్పుడు కూడా ఆయన  మాజీ మిత్రులను మడత పెడుతూనే ఉన్నారు.    సరే, ఆయన విషయం అలా ఉంటే, అసలు ఈటల బీజేపీలో ఇమడ గలరా, అనేది అన్నిటికంటే కీలక ప్రశ్నగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల రాజకీయ నేపద్యాన్ని గమనిస్తే, ఆయన రాజకీయ జీవితం అతివాద వామపక్ష భావజాలంలో మొగ్గ తొడిగింది. ఆయన కొంత కాలం నక్సల్ ఉద్యమంలోనూ పని చేశారని అంటారు. అలాగే, ప్రాంతీయ ఉద్యమాలలో కీలక పాత్రను పోషించారు. సుమారు 18 సంవత్సరాల పాటు, కేసీఆర్ శిష్యరికం చేశారు. అలాంటి ఈటల బీజేపీ జాతీయ భావజాలం, హిందుత్వ నినాదం, విధానం చట్రంలో ఇమడగలరా? అనేది ఒకకీలక ప్రశ్న. అదీ గాక, ఎంత చెడ్డా తెరాసలో ఆయనకు ఒక స్థానం గుర్తింపు ఉన్నాయి. బీజేపీలో ఆయనకు అంత గుర్తింపు ఉండక పోవచ్చును. ఎందుకంటే, బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గర్భగుడి ప్రవేశం, అంత ఈజీ కాదు. అలాగని,పదవులు ఉండవని కాదు, పదవులు ఉంటాయి ప్రవేశమే ఉండదు. అందుకే, ఇతర పార్టీలలో కీలక పదవులు, బాధ్యతలు పోషించిన వారు, బీజేపీలో  ఎక్కువ కాలం ఉన్న సందర్భాలు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల విషయాన్నే తీసుకుంటే, దగ్గుబాటి వెంకటేశ్వర రావు నుంచి నాగం జనార్ధన రెడ్డి వరకు అనేక మంది  సీనియర్ నాయకులు బీజేపీ చేరినంత  వేగంగా తిరిగి వెళ్ళి పోయారు. అయితే, కేసీఆర్ అష్టదిగ్భంధనంలో చిక్కుకున్న ఈటలకు బీజేపీని కాదనే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం రక్షణ కోసం అయినా ఆయన బీజేపీ చేరక తప్పని పరిస్థితిలో చిక్కుకు పోయారు. అందుకే నువ్వొకందుకు పోస్తుంటే, నేనోకందుకు తాగుతున్నాను అన్నట్లుగా, ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. అయితే, బీజేపీలో ఆయన పయనం ఎందాక .. అంటే ...  చెప్పడం  కొంచెం కష్టమే.

ఒక్క ఇంజెక్షన్‌ తో కోవిడ్‌ పరార్‌! హైదరాబాద్ లోనూ చికిత్స...

కొవిడ్‌ నివారణకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీల’ రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసానిస్తోంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా చేసే మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స కోవిడ్‌ పాజిటివ్‌ వాళ్లకు వరంగా మారనుందని  వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్ బారిన పడినప్పుడు మోనోక్లోనల్‌ యాంటీబాడీలనే ఎక్కించారు. రెండు రోజుల్లోనే ట్రంప్‌ కోలుకున్నారు. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వద్దని ఆప్పట్లో వైద్య నిపుణులకు ఆంక్షలు విధించారు. తగిన సమయంలో ఇవ్వడం ద్వారా వైరస్‌ లోడ్‌ గణనీయంగా తగ్గిపోతుంది. మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో మెరుగైన ఫలితాలు రావడంతో  భారత ప్రభుత్వం ఈ చికిత్సకు అనుమతించింది. మూడు రోజుల క్రితం హర్యానాలో 82 ఏండ్ల వృద్ధుడికి ఈ చికిత్స అందించారు. రెండు రోజుల్లోనే అతను కోలుకున్నాడు.హాస్పిటల్‌కి లక్షల బిల్లు లేకుండా ఒక్క ఇంజెక్షన్‌తోనే కొవిడ్‌ తీవ్రత తగ్గించే ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీ ఇప్పుడు కొవిడ్ రోగులకు బ్రాహ్మాస్తంగా మారింది.  కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధం.. యాంటీబాడీ. మొన్నటివరకూ ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్‌కి యాంటీబాడీ చికిత్స అందించారు. అయితే అది అంత సమర్థవంతమైనది కాదని తేలింది. ఒక ఒకే రకమైన కణాల సమూహం నుంచి తయారైనవి మోనోక్లోనల్‌ యాంటీబాడీలు. వీటిని ఉపయోగించి కోవిడ్‌కి చికిత్స చేయగలమని ఇప్పుడు నిరూపితమైంది. డయాగ్నసిస్‌, ట్రీట్‌మెంట్‌లలో అంటువ్యాధులు కాని వ్యాధుల్లో మోనోక్లోనల్‌ యాంటీబాడీలను వాడుతున్నారు. ఇప్పుడు కోవిడ్ లాంటి అంటువ్యాధికి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో 13 వేల మందిలో ఇది విజయవంతం అయింది. మన దేశంలో 2 లక్షల డోసులను దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రైవేటు ఔషధ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.  మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్స ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఈ చికిత్సను ప్రారంభించారు. ఈ చికిత్సను పొందడం ద్వారా 7-10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి మటుమాయమవుతుంది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇవ్వడం ద్వారా ముప్పు తీవ్రత ఎక్కువ ఉన్న వారికి అధిక ప్రయోజనం చేకూరుతుందనీ, అలా అని విచ్చలవిడిగా వినియోగిస్తే ఔషధ నిల్వలకు కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌, ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. మోనోక్లోనల్‌ చికిత్స  పద్ధతులను ఆయన వివరించారు.మోనోక్లోనల్‌ చికిత్స పొందినవారిలో 70-80 శాతం మంది 3-4 రోజుల్లో కోలుకుంటారు. వారం రోజుల్లో పూర్తిగా నయమవుతుంది. ఈ ఔషధాన్ని పొందినవారి ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లదు. ఈ యాంటీబాడీలు శరీరంలోకి వెళ్లిన తర్వాత.. కోవిడ్‌ స్పైక్‌ ప్రోటీన్‌కు.. శరీర కణాలకు మధ్య ఇవి అడ్డు గోడగా నిలుస్తాయి. ఫలితంగా వైరస్‌ శరీర అంతర్భాగంలోకి ప్రవేశించలేదు. వైరస్‌ తన సంఖ్యను పెంచుకునే అవకాశం సన్నగిల్లుతుంది’’ అని డా. నాగేశ్వరరెడ్డి తెలిపారు. కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ మైల్డ్‌ నుంచి మాడరేట్‌ గా ఉనవాళ్లకు ఈ యాంటీబాడీల చికిత్స ఇస్తే సత్ఫలితాలుంటాయని న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉండి, హాస్పిటల్‌లో చేరి, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరం ఉన్నవాళ్లకు ఈ చికిత్స వల్ల ఉపయోగం లేదు. వీళ్లకు వాడవద్దని సూచించారు. విచక్షణారహితంగా, ఇష్టానుసారంగా వీటిని వాడకూడదు. ఇది వ్యాక్సిన్‌ కాదు. ఏమిటీ ఈ యాంటీబాడీలు.. శరీరంలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి. వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్నే ఉంటాయి. అటువంటి వాటిలో ‘టసిరిబిమాబ్‌, ఇమిడెవిమాబ్‌’ అనే రెండు రకాలున్నాయి. వాటిని సేకరించి కొత్త యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. ఇలా ప్రత్యేకంగా ఒకట్రెండు రకాలను మాత్రమే సేకరించి వృద్ధి చేసే విధానాన్ని మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ అంటారు. ఈ రెండూ ఇంజక్షన్ల రూపంలో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి ఐవీ ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం సుమారు 70వేల వరకూ ఉంటుంది. ప్లాస్మాథెరపీలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి. కానీ మోనోక్లోనల్‌లో రెండే రకాలుంటాయి. 5 ఎంఎల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఇస్తే.. 5 లీటర్ల ప్లాస్మా ఇచ్చిన దానితో సమానం. మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స అంటే… డైరెక్ట్‌గా యాంటీబాడీని మాత్రమే ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వడాన్నే మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స అంటారు. ఇది రెండు రకాలుగా అందుబాటులో ఉంది. అంటే రెండు రకాల యాంటీబాడీ రూపాలను ఒక మందుగా చేసి ఇస్తారు. Casirivimab, Imdivimab అనే రెండు రకాల మోనోక్లోనల్‌ యాంటీబాడీలను కలిపి ఇవ్వడం వల్ల ఒకచోట మిస్ అయినా, ఇంకోచోట మిస్‌ కాకుండా పనిచేస్తాయి. ఇవి నిర్దుష్టంగా వైరస్‌ పైన ఒక్కచోటే టార్గెట్‌ చేసి దాడి చేస్తాయి. అంటే వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ పైనే దాడిచేసి, దాన్ని అతుక్కుని, వైరస్‌ని నిర్వీర్యం చేస్తాయి. అందుకే కొవిడ్‌కి ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ చికిత్సకు 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఎలా ఇస్తారు? మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సను రక్తనాళం ద్వారా ఇస్తారు. అంటే చేతిలోని రక్తనాళం (సిర)లోకి మందును ఇంజెక్ట్‌ చేస్తారన్నమాట. దీన్నే ఇంట్రావీనస్ (ఐవి)గా ఇవ్వడం అంటారు. సబ్‌క్యుటేనియస్‌గా (చర్మం ద్వారా) కూడా ఈ ఇంజెక్షన్‌ను ఇస్తారు. ఒక మోనోక్లోనల్‌ యాంటీబాడీ వయల్‌ని ఇద్దరు పేషెంట్లకు వాడవచ్చు. ఒకరికి వాడిన తర్వాత (అంటే దాన్ని ఓపెన్‌ చేశాక) 36 గంటల సమయంలోగా ఇంకో పేషెంట్‌కి వాడాలి. లేకుంటే వేస్ట్‌ అయిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలంటే… * వైరస్‌ లక్షణాలు కనిపించిన 3-7 రోజుల్లోపు ఈ ఇంజక్షన్‌ ఇవ్వాలి. * ఇంజక్షన్ ఇచ్చిన 7-10 రోజుల్లో వైరస్‌ శరీరం నుంచి మటుమాయమవుతుంది. * వైరస్‌ సోకిన 10 రోజుల తర్వాత ఇస్తే అంత సానుకూల ప్రభావం ఉండదు. ఎందుకంటే అప్పటికే శరీరంలో వైరస్‌ లోడ్‌ బాగా పెరిగిపోయి ఉంటుంది. * ఇంజక్షన్‌ ఇవ్వాలంటే ముందు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేయించాలి. * అందులో ‘సైకిల్‌ త్రెషోల్డ్‌(సీటీ)’ విలువను ప్రామాణికంగా తీసుకోవాలి. * ఎన్ని సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తించారనేది ముఖ్యం. * 15 సైకిల్స్‌లో వైరస్‌ను గుర్తిస్తే.. వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉందని అర్థం. * అదే 30 సైకిల్స్‌లో వైరస్‌ను నిర్ధారిస్తే.. వారిలో లోడ్‌ తక్కువగా ఉందని తెలుస్తుంది. * 15 సీటీ వ్యాల్యూ ఉన్నవారికి వారం తర్వాత 30కి తగ్గితే.. అప్పుడు ఆ ఇంజక్షన్‌ బాగా పనిచేసినట్లుగా గుర్తిస్తారు. ఎవరికి ఇవ్వొద్దంటే… * ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్‌ సాయంతో.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి ఇంజక్షన్ ఇవ్వకూడదు. * బహుళ అవయవాలు దెబ్బతిన్నవారికి.. * గర్భిణులకు ఈ ఇంజక్షన్ ఇవ్వకూడదు. * మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స తీసుకున్నవాళ్లు మూడు నెలల తరువాత మాత్రమే వాక్సిన్‌ వేయించుకోవాలి. అంతకుముందు వాక్సిన్‌ వేయించొద్దు. * కోవిడ్ నుంచి కోలుకున్నవాళ్లకు ఈ చికిత్స అవసరం లేదు. మోనోక్లోనల్‌ చికిత్స ఎలా పనిచేస్తుందిః ఎవరికి ఎక్కువ మేలు? * 65 ఏళ్లు దాటిన వారికి.. * స్థూలకాయులకు అంటే ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ 35 కంటే ఎక్కువగా ఉన్నవారికి.. * దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి పీడితులకు.. * ఎంతోకాలంగా మధుమేహానికి చికిత్స పొందుతున్నవారికి.. * రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వినియోగిస్తున్నవారికి.. ఉదాహరణకు క్యాన్సర్‌ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి. * 55 ఏళ్లు దాటి అధిక రక్తపోటు, గుండెజబ్బు ఉన్న బాధితులకు.. * క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌, ఆస్తమాతో బాధపడుతున్నవారికి.. * పై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముప్పు తీవ్రత ఉంటే 12 ఏళ్లు దాటిన వారికి.. * పాలిచ్చే తల్లులు ఈ చికిత్స తీసుకోవచ్చు. సైడ్‌ ఎఫెక్టులున్నాయా?… మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స వల్ల పెద్దగా దుష్ప్రభావాలేమీ లేవు. అయితే కొందరిలో దురద, వికారంగా ఉండటం, వాంతుల వంటి సమస్యలు రావొచ్చు. కానీ ఇవి కొన్ని రోజులకు తగ్గిపోతాయి.

రెజ్ల‌ర్ సుశీల్‌ దాడి దృశ్యాలు.. వీడియో వైర‌ల్‌..

రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌.. మ‌రో యంగ్‌ రెజ్లర్‌ సాగర్‌ రాణాపై దాడి చేస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. సుశీల్ అరెస్ట్ త‌ర్వాత.. తాజాగా ఆ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుశీల్ అటాక్ వీడియో సోష‌ల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.  అస‌లే ప్ర‌పంచ‌స్థాయి కుస్తీ యోధుడు. అత‌ని కండ‌ల్లో కొండంత బ‌లం. చేతుల‌తో కొడితేనే.. పిండి పిండి అయిపోతాం. అలాంటిది బేస్‌బాల్ స్టిక్‌తో కొడితే ఉంటారా? అదే జ‌రిగింది.. సుశీల్‌కుమార్ కొట్టిన దెబ్బ‌లు తాళ‌లేక‌.. సాగ‌ర్ రాణా చ‌నిపోయాడు. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వెలుగు చూసింది. ఛత్రసాల్‌ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రాణాపై దాడి చేశారు. ఆ వీడియోలో సుశీల్‌ బేస్‌బాల్‌ స్టిక్‌ పట్టుకొని ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్‌ బయటకు రావడంతో.. ఇక సుశీల్ కుమార్ కేసులో మ‌రింతగా చిక్కుకున్న‌ట్టే. శిక్ష నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం త‌క్కువే. రెండు వారాల క్రితం ఛత్రసాల్‌ స్టేడియంలో సాగర్‌రాణాపై సుశీల్‌ బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత సుశీల్‌ ఈ వీడియో తీయించాడు. దానిని రెజ్లింగ్‌ వర్గాలకు పంపించాలనుకున్నాడు. కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణా రెండు రోజుల తర్వాత చనిపోవడంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత సుశీల్ కోసం పోలీసుల గాలింపు.. అత‌ను ప‌రారీలో ఉండ‌టం.. లుక్అవుట్ నోటీసులు జారీ చేయ‌డం.. లక్ష రూపాయల రివార్డు ప్ర‌క‌టించ‌డం.. ముందుస్తు బెయిల్‌ తిరస్కరణ.. ఇలా వ‌రుస ప‌రిణామాల త‌ర్వాత ఎట్ట‌కేళ‌కు ఇటీవ‌లే సుశీల్‌ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. కోర్టు అత‌నికి  రిమాండ్ విధించింది. పోలీసుల ద‌ర్యాప్తున‌కు సుశీల్ అస‌లేమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. అయితే, సాగ‌ర్ రాణా మృతితో పాటు.. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో రెజ్ల‌ర్.. ఢిల్లీ గ్యాంగ్‌స్ట‌ర్ సందీప్‌కు మేన‌ల్లుడు కావ‌డంతో.. అత‌ని నుంచి ప్రాణ‌భ‌యంతో అన్నాళ్లూ త‌ప్పించుకుని తిరిగిన‌ట్టు పోలీసులకు చెప్పాడ‌ని స‌మాచారం. కాగా, సుశీల్‌కుమార్‌ సెల్‌లో రాత్రిళ్లు ఏడుస్తున్నాడ‌ని.. స‌రిగా నిద్ర పోవ‌డం లేద‌ని అంటున్నారు. 

అక్షరాల రూ 46 లక్షలు.. అయినా ప్రాణాలు దక్కలేదు.. 

కరోనా మనుషుల ప్రాణాలు తీయడమే కాదు. కరోనా వచ్చిన కొందరి ఇంట్లో భవిష్యత్ తరానికి ఆస్తులు కూడా మిగలడం లేదు. కరోనా కొందర్ని వెంటాడి వేటాడి మరి ప్రాణాలు తీస్తోంది. కరోనా కారణంగా ఎంతో మంది ఆనాధలు అయ్యారు. మరోవైపు కరొనకి ఎంత ఖర్చుపెట్టిన బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది. లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కడం లేదు. తాజాగా ఓ కుటుంబం కరోనా సోకిన వ్యక్తిని బ్రతికించుకునేందుకు రూ.46 లక్షలు ఖర్చు చేశారు. అయినా ప్రాణాలు దక్కలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే..  అది వరంగల్ జిల్లాలోని 16 డివిజన్ ధర్మారం. అతని పేరు పోలెబోయిన రాజన్ బాబు. అతను వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ లోని కూకట్ పల్లి లి నివాసముంటున్నాడు. రాజన్‌కు కరోనా సోకడంతో ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం మూడు ఆస్పత్రులు మారారు. లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొద్దీ రోజులక్రితం రాజన్ బాబు, భార్య, ఇద్దరు కుమారులకు కరోనా వైరల్ సోకింది. అందరు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే రాజన్ బాబు ఆరోగ్యపరిస్థితి విషమించడంతో అతడిని స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆలా మూడు ఆసుపత్రులు మార్చారు. రోజుకు లక్ష చొప్పున 46 లక్షల రూపాయలను వైద్యం కోసం ఖర్చు చేశారు. చివరకు పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. లక్షలు వెచ్చించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. భార్య, ఇద్దరు కుమారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్లాట్‌ను కూడా అమ్మారు కుటుంబ సభ్యులు. కాగా, ఇటీవల రాజన్‌బాబు తల్లి, సోదరి కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా కాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలికావడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.

సేవ‌చేయ‌డానికే అధికారం.. ఎన్టీఆర్ భావిత‌రాల‌కు దిక్సూచి..

ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆస్తి, వారసత్వమన్నారు టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబునాయుడు. తెలుగుజాతి యుగ‌పురుషుడు నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్ ద‌గ్గ‌ర‌ చంద్రబాబు, టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ నివాళులర్పించారు.  సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిపోతుందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జీవితం ఈ తరానికే కాకుండా భావితరాలకూ దిక్సూచి అని అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించేవరకు రాజీ పడకుండా ముందుకెళ్లిన వ్యక్తి ఆయన అని కొనియాడారు.  సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా మారారని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి అవసరమైన పథకాలు రూపొందించారని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లు తదితర ఎన్నో పథకాలను దూరదృష్టితో ఆలోచించి తీసుకొచ్చారన్నారు.   ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ ఉదయం చంద్రబాబు ట్వీట్ చేశారు. అధికారం అనుభవించడానికి కాదు.. ప్రజలకు సేవచేయడానికి అనే మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి, పాలనలోకి తెచ్చి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆ విశ్వవిఖ్యాతుని ఆదర్శాలు, ఆశయాలను మననం చేసుకుంటూ.. ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదామని..తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిద్దామని ట్వీట్ చేశారు.   అటు, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ యుగపురుషుడు, పేదల పెన్నిదని కొనియాడారు. తన తండ్రి సినిమాలు చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. ఎన్టీఆర్‌పై ఎంతో మంది పుస్తకాలు రాశారని.. అయితే ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకురావాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ తాను అదే డిమాండ్‌ చేస్తున్నానన్నారు.   కరోనా పరిస్థితుల దృష్ట్యా తాము ఈ ఏడాది ఘాట్‌ వద్దకు వెళ్లలేకపోతున్నామని ఎన్టీఆర్‌ తనయుడు, నిర్మాత నందమూరి రామకృష్ణ తెలిపారు. ఇంటి వద్దే తండ్రి ఆశీర్వాదం తీసుకుంటున్నామని చెప్పారు. 

మంత్రులు, ఎమ్మెల్యేల‌కు కేసీఆర్‌ ఫోన్‌.. కార‌ణం అదేనా?

ఉన్న‌ట్టుండి సీఎం నుంచి ఫోన్ వ‌చ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఈ టైమ్‌లో కేసీఆర్ ఫోన్ చేయ‌డం ఏంటి? ఎప్పుడూ లేనిది ఇప్పుడు స‌డెన్‌గా ఆయ‌న నాకెందుకు ఫోన్ చేశారు?  కార‌ణం ఏమై ఉంటుంది? ఏదో పెద్ద విష‌య‌మే ఉండిఉంటుందా?  లేక‌పోతే ఆ పెద్దాయ‌న నాకు ఫోన్ చేయ‌డ‌మేంట‌ని.. వారంతా గుబులు ప‌డ్డారు. భ‌య‌ప‌డుతూనే ఫోన్ లిఫ్ట్ చేశారు. అటునుంచి కేసీఆర్ వాయిస్‌.. హ‌లో అంటే.. ఇదీ విష‌యం... తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీశారు. ఈ నెల 30న మంత్రిమండలి సమావేశం ఉండ‌గా.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు సీఎం స్వయంగా ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మీ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? లాక్‌డౌన్‌ ఎలాంటి ప్రభావం చూపింది? వివిధ వర్గాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఆంక్షలు, సడలింపులను ఎలా చూస్తున్నారు? పోలీసుల పనితీరు ఎలా ఉంది? తదితర వివరాలను సీఎం అడిగారని తెలిసింది. తెలంగాణలో మే 12 నుంచి మొద‌లైన లాక్‌డౌన్‌.. ఈ నెల 30తో ముగియనుంది. అందుకే, లాక్‌డౌన్ పొడిగించాలా? ఆంక్ష‌లు స‌డ‌లించాలా? అనే అంశంపై సీఎం కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలుస్తోంది. 30న జ‌రిగే కేబినెట్ భేటీ ఎజెండాలో లాక్‌డౌన్‌పై ఓ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉండ‌గా.. ఆ మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితుల‌ను ఎంక్వైరీ చేస్తున్నారు. వారు సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సీఎం సూచించారు. అయితే, ఏ నిర్ణ‌య‌మైనా సొంతంగా, ఎవ‌రితో చ‌ర్చించ‌కుండా త‌న‌కుతానే తీసుకునే కేసీఆర్‌.. లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌పై ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఫోన్లు చేసి విష‌యం అడ‌గడం ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్య‌మంత్రిలో ఈ మార్పు ఏంట‌ని నేత‌లే అవాక్క‌వుతున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటల సీజన్‌తో పాటు ప్రజలకు, సూపర్‌ స్ప్రెడర్లకు టీకాల కార్యక్రమం మొదలవుతున్నందున లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయం కీలకమని, ప్రజల మనోభావాల మేరకే ముందుకుసాగుదామని ఈ సందర్భంగా సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ వర్గాలను సైతం రంగంలోకి దింపిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 29కల్లా సీఎం కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మే 30న లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

బాలికపై జీహెచ్ఎంసీ ఉన్మాది.. 

రోజు రోజుకి మనుషులు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. సమాజం క్షమించలేని పనులు చేస్తున్నారు. నీచమైన పనులకు తెర తీస్తున్నారు. గుంటూరులో ఒక మహిళపై యువజన కాంగ్రెస్ నాయకులూ అత్యాచారం చేశారు. మొన్న జగిత్యాలలో టీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో పనిచేస్తున్న 17 ఏళ్ళ అమ్మాయి ని అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్ లో  జీహెచ్ఎంసీ ఉద్యోగి ఓ బాలికపై అత్యాచారం చేశాడు.  వివరాల్లోకి వెళితే..అతని పేరు  భాస్కర్ రావు. షెల్టర్ మేనేజర్ గా గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ ఔట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. జంతువుల సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. బాధిత బాలిక తల్లి రహేమా కాపాలదారుగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రహేమా కూతురుపై భాస్కర్ రావు కన్నేశాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలనుకున్నాడు. అందుకు ఆ అమ్మాయి తల్లి అడ్డు అనుకున్నాడు. ఆమె అక్కడ  ఉంటే అతనికి సందు దొరకదు అనుకున్నాడు. అందుకోసం ఒక పథకం వేశాడు. అందులో భాగంగానే బాలిక తల్లికి ఇతర పని అప్పగించాడు. ఆమె ఆ పని నిమిత్తం వెళ్లగానే.. బాలికపై భాస్కర్ రావు లైంగిక దాడి చేశారు. రహేహా కూతురు బాత్రూమ్ కి వెళ్లగా.. అక్కడే ఉండి అత్యాచారానికి యత్నించాడు భాస్కర్ రావు. అయితే భాస్కర్ రావు దాడిని ఎదురించిన బాలిక..గట్టిగా అరుస్తూ బయటకు వచ్చింది. విషయం తెలియగానే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు.. విచారణ చేపటటారు. బాధితులకు తోటి జిహెచ్ఎంసి సిబ్బంది అండగా నిలిచారు. భాస్కర్ రావు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

పాదాల్లో తీవ్రంగా సెల్‌ డ్యామేజ్‌.. రఘురామ నడవొద్దన్న ఎయిమ్స్ వైద్యులు 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. రఘురామకు సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్‌ డ్యామేజ్‌ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన రెండు కాళ్లకు వైద్యులు పీవోపీ కట్టు కట్టారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు. రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. పరీక్షల అనంతరం ఎయిమ్స్‌ నుంచి అధికారిక నివాసానికి రఘురామకృష్ణరాజు చేరుకున్నారు.  సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామ రాజు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కాలి గాయాలు తగ్గకపోవడం, నొప్పి ఎక్కువగా ఉండడం, బీపీ నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన బుధవారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 

యుగానికి ఒక్కడే.. అది ఎన్టీవోడే..

మే 28.. ఆ మ‌హానుభావుడు జ‌న్మించిన రోజు... తెలుగు త‌మ్ముళ్ల‌కు పండ‌గ రోజు...  భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు.. గిడుతుంటారు... కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లో శాశ్వ‌తంగా నిలిచిపోతారు.. అలాంటి చిర‌స్మ‌ర‌ణీయుడే నంద‌మూరి తార‌క రామారావు...  ఎన్‌.టి.ఆర్‌... కేవ‌లం మూడు అక్ష‌రాలు మాత్ర‌మే కాదు.. తెలుగుజాతి నిండుగౌర‌వం.. తెలుగుదేశానికి తార‌క‌మంత్రం.  వెండితెర‌పై  విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు..  రాజ‌కీయ తెర‌పై  కొమ్ములు తిరిగిన‌ కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించిన అనిత‌ర సాధ్యుడు.. తెలుగు జాతి స‌త్తా ఢిల్లీకి తెలుసొచ్చేలా చేసిన మొన‌గాడు.. మ‌నంద‌రి అన్న గారు.. వెండితెర ఇల‌వేల్పుగా వెలుగొందుతున్న రోజుల్లోనే.. అనూహ్యంగా ఆ తార‌క‌రాముడు రాజ‌కీయ అరంగేట్రం చేశారు.. తెలుగుదేశం పార్టీ స్థాపించారు.. ఆనాడే ఆయ‌న ఊహించారు అది ఇలా తెలుగునాట వ‌ట‌వృక్షంగా ఎదుగుతుంద‌ని. కొంద‌రిలా కేవ‌లం అంద‌లం ఎక్క‌డానికో.. అడ్డంగా దోచుకోడానికో.. పెట్టిన పార్టీ కాదు.. "ఈ తెలుగుదేశం పార్టీ.. శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది.. కార్మికుడి- కరిగిన కండరాలలో నుంచి వచ్చింది.. రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది.. నిరుపేదల కన్నీటిలో నుంచి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి" అంటూ 1982 మార్చి 29న పార్టీని ప్ర‌క‌టించారు అన్న ఎన్టీఆర్‌.  ఆనాడు ఆ ప్ర‌క‌ట‌న తెలుగునాట ప్ర‌భంజ‌నం సృష్టించింది. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ప్ర‌క‌టించిన‌ ‘తెలుగు దేశం’ పార్టీ.. ఆ త‌ర్వాత తెలుగునేల‌ను ద‌శాబ్దాల పాటు పాలించింది. మొద‌ట ఎన్టీఆర్‌.. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు.. ఇద్ద‌రు అధినేత‌ల‌ చేతిలో పార్టీ పటిష్టంగా, చెక్కుచెద‌ర‌కుండా ఉంది... ఉంటుంది... తెలుగుదేశం పార్టీ స్థాప‌నతో ఢిల్లీ ద‌ద్ద‌రిల్లింది. ఐర‌న్‌లేడీ ఇందిరాగాంధీ గుండెద‌డ పెరిగింది. పాత వ్యానును.. చైత‌న్య‌ర‌థంగా మార్చి అన్న గారు తెలుగువీధుల్లో తిరుగుతుంటే.... నా సామిరంగ‌.... ఆ రాముడే.. ఆ కృష్ణుడే... వెండితెర వీడి మ‌న‌ మ‌ధ్య‌కి వ‌చ్చాడంటూ జ‌నం నీరాజ‌నం ప‌లికారు. ఎన్టీవోడు ఎక్క‌డికెళ్లినా.. ఇసుకేస్తే రాల‌నంత జ‌నం.. ఆకాశానికి చిల్లుప‌డిందా.. భూదేవి ఈనిందా.. అనేంత‌గా.. జ‌న ప్ర‌భంజ‌నం... "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!! అంటూ అన్న గారు పిలుస్తుంటే.. ప్ర‌జ‌లు పూన‌కం వ‌చ్చిన వారిలా చైత‌న్య‌ర‌థం వెంట ప‌రుగులు పెట్టేవారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌లుమూల‌ల్లో టీడీపీ ప్ర‌కంప‌ణ‌లు.. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కంచుకోట‌కు బీట‌లు.. ఫ‌లితం.. పార్టీ స్థాపించిన 9 నెల‌ల్లోనే టీడీపీకి అధికారం.. 199 స్థానాల‌తో తెలుగుదేశం విజ‌య‌కేత‌నం.. అప్ప‌టికి 97 ఏళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యం. 1983 జ‌న‌వ‌రి 9న‌ ముఖ్య‌మంత్రి పీఠం చేప‌ట్టారు రామారావు. అంద‌ల‌మెక్కాక‌.. ఇప్ప‌టి నేత‌ల్లా విర్ర‌వీగ‌లేదు. అధికార బ‌లంతో దౌర్జ‌న్యాల‌కు తెగ‌బ‌డ‌లేదు. ‘పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం’ అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజా క్షేమమనే దీక్ష పూనారు. పాల‌న‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంతో నిరంత‌రాయంగా పోరాడారు. ట్యాంక్‌బండ్ నిర్మాణం, ప్ర‌ముఖుల విగ్రహాల‌తో హైద‌రాబాద్‌కు కొత్త సొగ‌బులు అద్దారు.  ఎవ‌రి దిష్టి త‌గిలిందో కానీ.. కాంగ్రెస్‌, ఇందిరాగాంధీ కుట్ర‌ల‌తో.. నాదెండ్ల భాస్క‌ర్‌రావు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. 1984లో ఆగ‌ష్టు సంక్షోభం తీసుకొచ్చారు. ఎన్టీఆర్ అల్లుడు, త‌న‌ రాజ‌కీయ కుడి భుజ‌మైన చంద్ర‌బాబు స‌హ‌కారంతో రాష్ట్ర‌ప‌తి స్థాయిలో పోరాడి అధికారాన్ని తిరిగి తెచ్చుకున్నారు. ఆ స‌మ‌యంలోనే జాతీయ స్థాయి ప‌ర‌ప‌తి పొందారు. 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. బ‌హ్మాండ‌మైన మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చారు.  పాల‌న‌లో దూకుడు స్వ‌భావంతో 1989 ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత కాలంలో నేష‌న‌ల్ ఫ్రంట్ కూర్పుతో జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పారు ఎన్టీఆర్‌. ప్ర‌తిప‌క్ష నేత‌గా శాస‌న‌స‌భ‌లో ప‌ర‌భ‌వాలు ఎదురైనా.. వెనుదిర‌గ‌లేదు. వెన‌క్కిత‌గ్గ‌లేదు. 1994లో రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో.. అఖండ విజ‌యం సాధించి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠంపై ఆసీనుల‌య్యారు నంద‌మూరి తార‌క రామారావు. ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ.. ఎన్టీఆర్ ప‌ద‌వీచ్యుతుల‌వ‌డం.. ఆయ‌న మ‌ర‌ణం.. అదంతా చ‌రిత్ర‌. నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగుదేశం పార్టీ’ అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన శక్తిగా నిల‌బ‌డిందంటే.. అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులు.. ఆ పునాదుల మీద చంద్ర‌బాబు నిర్మించిన రాజ‌కీయ సౌధ‌మే కార‌ణం. ఎన్టీఆర్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తూ.. చంద్ర‌బాబు సైతం పార్టీని మ‌రింత శిఖ‌రాగ్ర స్థాయికి తీసుకెళ్లారు. తెలుగుదేశాన్ని ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బెట్టారు. అప్పుడు త‌ల్లి కాంగ్రెస్‌తో ఎన్టీఆర్ పోరాడితే.. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్‌తో చంద్ర‌బాబు ఫైట్ చేస్తున్నారు. రాజ్యం ఎన్ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నా.. ఎన్టీఆర్ స్పూర్తితో.. కుట్ర‌లు,కేసుల‌కు ఎదురొడ్డి నిలుస్తున్నారు చంద్ర‌బాబు. తెలుగు త‌మ్ముళ్ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. ఎన్టీఆర్ జ‌న్మ‌దినం మే 28.. సంద‌ర్భంగా మ‌హానాడును ఘ‌నంగా నిర్వ‌హిస్తూ వ‌స్తోంది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడే ప్రారంభ‌మైన ఈ వేడుక‌.. ఇప్ప‌టికీ అదే ఉత్సాహంతో కొన‌సాగుతోంది. ప్రతి ఏడాది మే 27 నుంచి 29 వరకు.. మూడు రోజుల పాటు మహానాడు జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు, వివిధ ఏజెండాలు, ప్ర‌జా సమస్యలపై తీర్మాలను ప్రకటిస్తారు. ఆ కార్య‌క్ర‌మంతా వేడుక‌గా సాగుతుంది. అందుకే, మ‌హానాడు అంటే ప‌సుపు పండుగ‌. తెలుగు త‌మ్ముళ్ల‌ జాత‌ర‌. ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యాన‌.. ఆన్‌లైన్ వేదిక‌గా.. వ‌ర్చువ‌ల్ విధానానికే మ‌హానాడు ప‌రిమిత‌మైంది. మ‌ళ్లీ మంచి రోజులు వ‌స్తాయి.. జ‌న సందోహంతో మ‌హానాడు మ‌రింత‌ వైభ‌వంగా జ‌రిగే రోజులు త‌ప్పక వ‌స్తాయి.. ఆ రోజు కోస‌మే ఎదురుచూస్తూ.. జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం.. జై ఎన్టీఆర్‌.. జై చంద్ర‌బాబు...

కబ్జా లీడర్ మనకెందుకు! బీజేపీలో ఈటల చిచ్చు..

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ వచ్చేస్తోంది. సొంత పార్టీ పెడుతారని ప్రచారం సాగినా... ఇప్పుడు మాత్రం సీన్ మారింది. ఈటల రాజేందర్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేతలతో పాటు తెలంగాణ నాయకులతో ఈటల చర్చలు ఫలవంతం అయ్యాయని చెబుతున్నారు. బీజేపీ  హైకమాండ్ టైం ఇచ్చిన వెంటనే ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి కాషాయ కండువా కప్పుకుంటారని పక్కాగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే సంకేతమిచ్చారు.  కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నా అటు వెళ్లనీయకుండా... కొత్త పార్టీ పెట్టాలని భావించిన ఈటలను తమ పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యామనే సంతోషంలో ఉన్న తెలంగాణ బీజేపీకి.. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఈటల రాజేందర్ చేరిక బీజేపీలో సెగలు రేపుతోంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కమలం నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జిల్లాకు చెందిన తమకు సంప్రదించకుండానే ఈటలను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇంత కాలం రాజేందర్ తో పోరాటం చేస్తున్న తమను పట్టించుకోకుండా హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్. ఆ నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి పెద్ది రెడ్డి... ఇప్పుడు బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన పెద్దిరెడ్డి... హుజురాబాద్ నుంచి పలుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఏడాది క్రితం పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. కమలం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. ఇటీవలే జరిగిన గ్రేటర్ వరంగల్ సహా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు మోశారు. ఎన్నికల తర్వాత కోవిడ్ సోకడంతో తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. హుజురాబాగ్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డిని కూడా ఈటల విషయంలో పార్టీ పెద్దలు సంప్రందించలేదట. ఇదే ఇప్పుడు బీజేపీలో సెగలు రేపుతోంది. సీనియర్ నేత పెద్దిరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈటల కోసం తమ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కామెంట్ చేశారు. అంతేకాదు తాను కబ్జాలు చేయలేదని, ఆలయ భూముల్లో గౌడౌన్లు కట్టలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఈటల టార్గెట్ గానే చెప్పినట్లు భావిస్తున్నారు. ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు కేసీఆర్. ఇప్పుడు బీజేపీ నేత పెద్దిరెడ్డి కూడా ఆ ఆరోపణలే చేయడం కమలనాధుల్లో కలవరం రేపుతోంది. ఈటలకు మాత్రం ఆత్మ గౌరవం ఉంటుందా.. మాకు ఉండదా అంటూ రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు పెద్దిరెడ్డి. పార్టీ నేతల తీరు మారకపోతే తాము కూడా సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెద్దిరెడ్డే కాదు హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.  సీనియర్ నేత పెద్దిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీలో కలవరం  రేపుతున్నాయని అంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను.. అవి తేలకముందే పార్టీలో చేర్చుకోవడం సరికాదనే వాదన మరికొందరు నేతల నుంచి కూడా వస్తుందట. ముఖ్యంగా దేవరయాంజల్ ఆలయ భూములు కబ్జా చేశారనే ఆరోపణలు రాజేందర్ పై ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన భూముల పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన బీజేపీ నేతలు.. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పార్టీలో చేరుకుంచే జనంలోకి రాంగ్ మెసెజ్ వెళ్లే అవకాశం ఉందని కూడా కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారట. మొత్తానికి ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ బీజేపీలో ముసలం ముదురుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.